బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి | - | Sakshi
Sakshi News home page

బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి

Apr 14 2025 1:13 AM | Updated on Apr 14 2025 1:13 AM

బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి

బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి

గీసుకొండ: కేంద్రంలోని బీజేపీ కుట్రలు, ఆ పార్టీ సర్కారు తీరు కారణంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ నగరం 16వ డివిజన్‌ ఆదివారం కాంగ్రెస్‌ నాయకుడు దుపాకి సంతోష్‌ నిర్వహించిన ‘జై బాపు, జై అంబేడ్కర్‌, జై సంవిధాన్‌’ ర్యాలీలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా బీజేపీ రాజ్యాంగాన్ని అవమానపర్చిందని ఆరోపించారు. బీజేపీ తీరుపై ప్రజలకు అవగాహన కలిగించడానికి గ్రామ గ్రామాన కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బీజేపీ మతాల మధ్య చిచ్చుపెడుతూ, లౌకికవాదానికి తూట్లు పొడుస్తోందన్నారు. గరీబ్‌నగర్‌, కీర్తినగర్‌లో నిర్వహించిన ర్యాలీల్లో ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరె డ్డి, కొ ండేటి కొమురారెడ్డి, సాల్మన్‌, గోదాసి చిన్న, దా సారపు సారయ్య, జానీ, హుజూర్‌, చెక్క రమేశ్‌, మ హ్మద్‌ ఆఫ్రీన్‌, శైలజ, లలిత, శోభారాణి ఉన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement