వైట్‌ హౌస్‌ సదస్సులో వరంగల్‌ వాసి | - | Sakshi
Sakshi News home page

వైట్‌ హౌస్‌ సదస్సులో వరంగల్‌ వాసి

May 31 2025 1:00 AM | Updated on May 31 2025 3:57 PM

వైట్‌ హౌస్‌ సదస్సులో వరంగల్‌ వాసి

వైట్‌ హౌస్‌ సదస్సులో వరంగల్‌ వాసి

ఖిలా వరంగల్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారిక నివాసం వైట్‌ హౌస్‌లో గురువారం జరిగిన ఏషియన్‌ అమెరికన్‌ పసిఫిక్‌ ఐస్లాండ్‌ హెరిటేజ్‌ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 50 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. 

ఇందులో వరంగల్‌ నగరానికి చెందిన ఒయాసిస్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ జేఎస్‌ పరంజ్యోతి కుమారుడైన యూనివర్సిటీ సౌత్‌ ఫ్లోరిడా అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ జన్ను చిరంజీవి భరత్‌కు ఆహ్వానం అందింది. ఈమేరకు గురువారం హాజరై భారతీయ వారసత్వ సంపదపై పలు అంశాలను ప్రతినిధులకు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement