భారత్‌లోనే కోవిడ్‌-19 మరణాలు ఎక్కువ.. ఖండించిన కేం‍ద్రం | Centre Rejects Study Claims India Was 8 Times More Deaths During Covid Pandemic | Sakshi

భారత్‌లోనే కోవిడ్‌-19 మరణాలు ఎక్కువ.. ఖండించిన కేం‍ద్రం

Jul 21 2024 1:36 PM | Updated on Jul 21 2024 1:48 PM

Centre Rejects Study Claims India Was 8 Times More Deaths During Covid Pandemic

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 సమయంలో భారత్‌లో అధిక మరణాలు సంభవించాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం తెలిపింది. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో పేర్కొన్న అధ్యయనాన్ని కేంద్రం కొట్టిపారేసింది.  

భారత్‌లో అధికారిక కోవిడ్‌-19 మరణాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల కంటే 1.5 రెట్లు ఎక్కువ అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నివేదించారు.  

సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, అధిక-ఆదాయ దేశాలలో కనిపించే నమూనాలతో పోలిస్తే, మహమ్మారి సమయంలో మహిళల కంటే పురుషులలో అధిక మరణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.  

అయితే,ఆ రిపోర్ట్‌పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. సైన్స్ అడ్వాన్సెస్ పేపర్‌లో నివేదించబడిన అదనపు మరణాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. జర్నల్స్‌ లోపభూయిష్టంగా ఉందని, ఆమోదయోగ్యం కాని ఫలితాలను చూపుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement