WHO
-
ఓవర్ ఆయిల్ వద్దన్నమోదీ : ఎవరెంత వాడాలో తెలుసా?
ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఊబకాయం (obesity)పై మన దేశ ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మాట్లాడుతూ 10 శాతం వంట నూనెల వాడకం తగ్గించాలన్నారు. దీంతో ఆయిల్ వాడకం వల్ల లాభనష్టాల మాట మళ్లీ చర్చకి వచ్చింది. మనం ఎలాంటి నూనెలు వాడితే మంచిది? ఏ వయసువాళ్లు ఎంత నూనె వాడాలి? మహిళలు, పురుషులు వారి ఆరోగ్య రీత్యా వాడే నూనెలలో తేడాలుండాలా.. ఈ అంశాల గురించిన వివరణ. ప్రపంచంలో 250 కోట్ల మంది అధికబరువుతో ఉన్నారని, ఆహారంలో నూనెల వాడకం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతోందని మోదీ డబ్ల్యూహెచ్ఓ డేటాని ఉటంకిస్తూ రోజువారి ఆహారంలో తక్కువ నూనె వాడకం ప్రాముఖ్యతను వివరించారు.కుటుంబ బాధ్యతవంటల్లో నూనెని తగ్గిస్తే ఊబకాయం నుంచి బయటపడొచ్చు. వంటల్లో నూనె తగ్గించడాన్ని కుటుంబం పట్ల బాధ్యతగా తీసుకోవాలి. ఎక్కువ నూనె వాడితే గుండె సమస్యలు, షుగర్, బీపి వంటివి వస్తాయి. అలాంటి వాటి నుంచి తప్పించుకునేందుకు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసి హెల్దీగా, ఫిట్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండొచ్చు. ప్రమాదకరమైనవివంట నూనెల్లో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారం ఊబకాయానికి కారణమవుతుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. నూనెలోని కొవ్వు చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయులను పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి. అధిక రక్త΄ోటు ప్రమాదం పెరుగుతుంది. చదవండి: Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?తగ్గించాలంటే... పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, సమతుల ఆహారం తీసుకోవాలి. రోజూ కనీసం గంటసేపు వ్యాయామం చేయాలి. ఊబకాయం గురించి అవగాహన కల్పించడానికి మోదీ పదిమంది సెలబ్రిటీలను నామినేట్ చేశారు. వారిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, నటులు ఆర్.మాధవన్, దినేష్ లాల్ యాదవ్ నిరాహువా, మోహన్ లాల్, స్పోర్ట్స్ షూటర్ మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, గాయని శ్రేయా ఘోషల్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఉన్నారు. అధికంగా తీసుకుంటే నష్టాలుగ్రాము నూనెలో 9 క్యాలరీలు ఉంటాయి. అధికంగా తీసుకుంటే శరీర బరువు పెరుగుతుంది. కొవ్వు అధికంగా కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు రావచ్చు.ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న నూనెలు హాని చేస్తాయి.అసమతుల్యమైన నూనెలు తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి, గుడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది.అధిక నూనె వాడకం ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.ఏ నూనెలు వాడాలి? సమతుల కొవ్వులు ఉండే నూనెలను వాడాలి. ముఖ్యంగా ప్రాసెసింగ్ తక్కువగా చేసిన (కోల్డ్ ప్రెస్డ్) నూనెలు ఆరోగ్యానికి మంచివి.సురక్షితమైన, ఆరోగ్యకరమైనవి: సన్ఫ్లవర్, వేరుశనగ, ఒమేగా, మొక్కజొన్న నూనె, ఆలివ్ ఆయిల్, అవిసె నూనె, కోల్డ్ ఫ్రెస్డ్ ఆయిల్లలో ప్రాసెసింగ్ తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువ. చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్తక్కువగా వాడవలసినవి: పామ్ ఆయిల్ (Palm oil) ) – అధికంగా ప్రాసెస్ అవుతుంది.వనస్పతి – ట్రాన్స్ ఫాట్స్ ఎక్కువ స్నాక్స్ తయారీలో ఒకసారి ఉపయోగించినవి, తిరిగి వాడుతుంటారు. వీటి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. సరైన పరిమితిలో తగిన రకాల నూనెలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలే చేస్తుంది.నూనెలు మంచి క్యాలరీ సోర్స్గా పనిచేస్తాయి. వీటిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్) ఉంటాయి.ఒమేగా–3, ఒమేగా–6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.కొన్ని నూనెలలో విటమిన్–ఇ, కె, శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం, కేశాల ఆరోగ్యానికి మంచిది.కొవ్వులు శరీరంలోని వివిధ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైనవి.ఎవరు ఎంత ఆయిల్ పిల్లలు (6–19 ఏళ్లు) రోజుకు 4 – 5 టీస్పూన్లు (20–25ఎం.ఎల్) ఆడ–మగ ఇద్దరికీ. ముఖ్యంగా కొబ్బరి, ఆలివ్ ఆయిల్, కనోలా, నెయ్యి వంటి ఆరోగ్యకరమైన నూనెలు వాడాలి. 20 – 59 ఏళ్ల వరకు : రోజుకు 5 – 6 టీస్పూన్లు (25–30ఎం.ఎల్) ఆడ–మగ ఇద్దరికీ. ఆలివ్, కనోలా, అవకాడో, వేరుశనగ, సన్ఫ్లవర్, రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్స్. కొబ్బరినూనె, అవిసె నూనె రోజుకు60 ఏళ్ల.. అంతకు మించి...రోజుకు 4 – 5 టీస్పూన్లు (20–25ఎం.ఎల్.) ఆడ–మగ ఇద్దరికీ. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆలివ్, అవిసె, కనోలా నూనెలను వాడాలి. గర్భవతులు మాత్రం రోజూ 6–7 టీ స్పూన్ల ఆరోగ్యకరమైన నూనె వాడాలి. వాటిలో ఆలివ్, అవకాడో, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్స్ (ఒమెగా 3 ఉన్న నూనెలు) వాడాలి. -డా. జానకి, పోషకాహార నిపుణులు – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఆయిల్ -
ఆరోగ్యానికి అశనిపాతం
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ తొలి రోజున తీసుకున్న అనేక నిర్ణయాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి వైదొలగడం ఒకటి. దీని ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాదు. ప్రపంచ ఆరోగ్య భద్రతపై కూడా తీవ్రంగానే ఉండనుంది. కోవిడ్–19 పరిస్థితులను సక్రమంగా నియంత్రించలేకపోవడం, అత్యవసరమైన సంస్కరణలను చేపట్టడంలో విఫలమైన కారణంగా తామీ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తెలిపింది. సభ్యదేశాల అనవసర రాజకీయ జోక్యాన్ని నివారించడంలోనూ డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. అమెరికా ఇతర దేశాలతో పోలిస్తే, మరీ ముఖ్యంగా చైనా కంటే ఎక్కువగా డబ్ల్యూహెచ్ఓకు మద్దతిస్తోందనీ, 140 కోట్లకు పైగా జనాభా ఉన్న చైనా చాలా చిన్న మొత్తం మాత్రమే తన వంతుగా ఇస్తోందనీ కూడా ఈ ఆర్డర్లో పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ చేసింది ఎంతో!ప్రస్తుతం డబ్ల్యూహెచ్ఓ మొత్తం బడ్జెట్లో 18 శాతం అమెరికా నుంచే వస్తోంది. 2024, 2025 సంవత్సరాలకుగాను ఈ సంస్థ బడ్జెట్ సుమా రుగా 680 కోట్ల డాలర్లు! రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, వ్యాధి సంబంధిత విషయాలను పర్యవేక్షించేందుకుగాను ఐక్యరాజ్య సమితి ప్రత్యేక విభాగంగా డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటైంది. అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, ఆరోగ్య సంబంధిత విధానాలను రూపొందించేవారి నెట్వర్క్గా, ఒక టెక్నికల్ ఏజెన్సీగా వ్యవహరించాలన్నది దీని ఏర్పాటు లక్ష్యం. అలాగే పేద దేశాలకు సాంకేతిక పరి జ్ఞానానికి సంబంధించి సహకారం అందించడం; తద్వారా ఆ యా దేశాలు ఆరోగ్య సమస్యలను సొంతంగా ఎదుర్కొనేందుకు తగిన మానవ వనరులు, సామర్థ్యాలను సంపాదించుకునేలా చేయడం మరో లక్ష్యం.కొన్ని దశాబ్దాల కాలంలో ఈ సంస్థ మశూచితో పాటు, యాస్(చర్మరోగం), ఎల్లో ఫీవర్, కుష్టు, పోలియో వంటి ఎన్నో మహ మ్మారులను సమర్థంగా కట్టడి చేయగలిగింది. యూఎన్ ఎయిడ్స్ ద్వారా హెచ్ఐవీ/ ఎయిడ్స్పై అంతర్జాతీయ స్థాయి పోరు సాగించింది. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి మొత్తం క్షయ వ్యాధి నిర్మూలనపై ఉంది. అయితే, సార్స్ వంటి కొత్త వ్యాధులు పుట్టుకొచ్చినప్పుడు, పాత వ్యాధులు తిరగబెట్టిన సందర్భాల్లోనూ ఈ సంస్థ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికాకూ నష్టమే!డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగడం వల్ల సభ్యదేశాలకు అందించే వ్యాధుల సమాచారం అమెరికాకు అందకుండా పోతుంది. ‘డబ్ల్యూహెచ్ఓ పాండెమిక్ ఇన్ ఫ్లుయెంజా ప్రిపేర్డ్నెస్ ఫ్రేమ్వర్క్’ ఆధారంగానే పలు అమెరికన్ ఫార్మా కంపెనీలు టీకా తయారీకి సంబంధించి కొత్త రకం వైరస్ నమూనాలు పొందుతూంటాయి. ఇకపై ఈ వివరాలు అందకపోవడం వల్ల ఫ్లూ వైరస్ నిరోధక టీకాపై ప్రభావం పడనుంది. కోవిడ్ లాంటి మహమ్మారుల నియంత్రణకు చేపట్టాల్సిన అంశాలపై ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ చర్చల నుంచి కూడా అమెరికా వైదొలిగే అవకాశం ఉంది. అలాగే ఇప్పటివరకూ డబ్ల్యూహెచ్ఓలో పని చేస్తున్న పలువురు అమెరికన్ నిపుణులను వెనక్కి పిలిపిస్తారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అనే రెండు అమెరికన్ సంస్థలతో డబ్ల్యూహెచ్ఓ ఇప్పటి వరకూ ఏర్పాటు చేసుకున్న భాగస్వామ్యం ఇకపై ఉండదు. ఇది ఇరువర్గాలకూ చేటు చేసేదే. షరతుల విరాళాలతో సమస్యఅమెరికా నిర్ణయం వల్ల డబ్ల్యూహెచ్ఓకు జరిగే నష్టం గురించి ఆలోచిస్తే... ఆర్థికంగా ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఇతర సభ్యదేశాలు ఇస్తున్న మొత్తాలు కూడా తక్కువైపోతున్న తరుణంలో అతిపెద్ద దాత వైదొలగడం గమనార్హం. అమెరికా తరువాత అంత పెద్ద స్థాయిలో ఆర్థిక సాయం అందించే దేశం జర్మనీ మాత్రమే. డబ్ల్యూహెచ్ఓ వార్షిక బడ్జెట్లో సుమారు మూడు శాతాన్ని ఈ దేశం భరిస్తోంది. అయితే ప్రభుత్వాలకు అతీతంగా అందుతున్న విరాళాలు ఇటీవలి కాలంలో గణనీయంగా పెరగడం కొంత ఊరటనిచ్చే అంశం. ఉదాహరణకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ , యూరోపియన్ కమిషన్ , ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు భారీ మొత్తాలను అందిస్తున్నాయి. గేట్స్ ఫౌండేషన్ ప్రధానంగా పోలియో నిర్మూలన, టీకా తయారీలకు మద్దతిస్తోంది. అమెరికా వైదొలగుతున్న నేపథ్యంలో ఆర్థిక వనరుల కోసం గేట్స్ ఫౌండేషన్ వంటి వాటిపై డబ్ల్యూహెచ్ఓ ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఐక్యరాజ్య సమితి విభాగానికి ఇలాంటి పరిస్థితి రావడం ఏమంత శ్రేయస్కరమైంది కాదు. ప్రైవేట్ సంస్థలు ఇచ్చే విరాళాలు కొన్ని షరతులతో వస్తాయని, ఇవి కాస్తా ఆరోగ్య అజెండాపై ప్రభావం చూపుతాయని విమర్శకుల వాదన. డబ్ల్యూహెచ్ఓ మరింత సమర్థంగా, పారదర్శకంగా పనిచేసేందుకు తగిన సంస్కరణలు చేపట్టా లన్న వాదన సబబే. కోవిడ్ సమయంలో భారత్ కూడా జీ20, బ్రిక్స్ వంటి వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తింది. కొన్ని ఇతర దేశాలు కూడా డబ్ల్యూహెచ్ఓ సంస్కరణలపై డిమాండ్ చేశాయి. అయితే ఈ రకమైన విమర్శలపై చర్చకు సంస్థ కూడా సిద్ధంగా ఉంది. అయితే నిధులు నిలిపివేయడం, తప్పు కోవడం పరిష్కారం కాదన్నది అమెరికా గుర్తిస్తే మేలు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు!
అమెరికా అధ్యక్ష బాధ్యత స్వీకరిస్తూ తొలినాడే డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) 26 కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. ఇవి సమాఖ్య ప్రభుత్వ నిర్వహణకు అధ్యక్షుని ఆదేశాలు. రాజ్యాంగంలోని 2వ అధికరణ అధ్యక్షునికి ఈ అధికారమిచ్చింది. ఈ ఆదేశాలకు చట్టసభ (కాంగ్రెస్) ఆమోదం అక్కర్లేదు. వీటికి అవసరమైన నిధుల కోతలు వంటి చర్యల ద్వారా కాంగ్రెస్ వీటిని అడ్డుకోవచ్చు. రాజ్యాంగ విరుద్ధాలని తేలితే రద్దు చేయవచ్చు. నిజానికి ఈ ఆదేశాల్లో అత్యధికం రాజ్యాంగ విరుద్ధమైనవీ, అధికార దుర్వినియోగానికి దారితీసేవే.రాజ్యాంగ 14వ సవరణ సెక్షన్ 1 అమెరికాలో పుట్టిన వారందరికీ పౌరసత్వ హక్కునిచ్చింది. కోర్టు ఈ ట్రంప్ ఆదేశాన్ని తిరస్కరించవచ్చు. దేశ భద్రత సాకుతో అమెరికా–మెక్సికో సరిహద్దుల్లోకి సైన్యాన్ని పంపడానికి, సైనిక నిధుల మళ్ళింపునకు, 2017లో ఈ సరిహద్దుల్లో మొదలుపెట్టిన గోడ నిర్మాణాన్ని పూర్తిచేయడానికి దక్షిణ సరిహద్దుల్లో జాతీయ అత్యవసరస్థితి విధించే ఆదేశం జారీచేశారు ట్రంప్. ఈ ఆదేశం అధ్యక్షునికి నిరంకుశ అధికారాలను కట్టబెట్టే రాజ్యాంగ విరుద్ధ చర్య. అలాగే జాతీయ ఇంధన అత్యవసర స్థితిని ప్రకటించడం.. సౌర, వాయు ఇంధన పథకాలను ఆపే ఎత్తుగడ. దక్షిణ అమెరికా (South America) మత్తుపదార్థాల వ్యాపార వేదికలపై ఉగ్రవాద సంస్థలుగా ముద్రవేయడం ద్వారా మెక్సికోలో చొరబాటుకు వీలు చేసుకుంటున్నారు ట్రంప్. పనామా కాలువపై (Panama Canal) తిరిగి ఆధిపత్యం నెలకొల్పుకుంటామనడమూ ఉద్రిక్తతలు పెంచే నిర్ణయమే!ట్రంప్ 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన తర్వాత తన అనుచరులను కేపిటల్ హిల్పై దాడికి పురమాయించడం, దాడిలో పాల్గొన్న వారికి శిక్షలు పడటం తెలిసిందే. ఈ నేరంపై శిక్ష అనుభవిస్తున్న 1,500 మందితోపాటు 700 మంది ఇతర నేరస్థులకు ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు. ఇది అనైతికం. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నుండి, ‘ప్యారిస్ పర్యావరణ కాలుష్య నియంత్రణ ఒప్పందం’ నుండి అమెరికా వైదొలగుతున్నట్లు ప్రకటించడం ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. చదవండి: నివాళులు అర్పించడం ఇలాగేనా?అంతర్జాతీయ మెక్సికో గల్ఫ్ను ‘అమెరికా గల్ఫ్’గా మార్చారు. అంతర్జాతీయ జలాశయాల పేర్లను అమెరికా చట్టాలు మార్చలేవు. ‘తొలిరోజే నియంతనవుతా’నని ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించిన ట్రంప్ అన్నంత పనీ చేశారు. ఇప్పుడు శ్రామిక, పౌరహక్కుల, మహిళా, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ట్రంప్ వ్యతిరేక సమ్మెకూ; దాదాపు 200 సంస్థలు న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి.– సంగిరెడ్డి హనుమంత రెడ్డి, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
డబ్ల్యుహెచ్ఓ ఫార్ములాతో ఓఆర్ఎస్ తయారీ
ఆదాయం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్యూర్-ప్లే కన్స్యూమర్ హెల్త్ కంపెనీ, ఓఆర్ఎస్ఎల్ (ORSL) ఎలక్ట్రోలైట్ పానీయాల తయారీదారు కెన్వ్యూ (Kenvue), నేడు డీహైడ్రేషన్ ఉన్న రోగుల కోసం రెడీ టు డ్రింక్ (RTD) ఫార్మాట్లో WHO ORSను ప్రారంభించింది.ఓఆర్ఎస్ఎల్.. భారతదేశంలోనే నెంబర్ 1 రెడీ-టు-డ్రింక్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ బ్రాండ్. ఇది గత 20 సంవత్సరాలుగా.. ఎలక్ట్రోలైట్లతో మనిషి నీరసించిన సమయంలో శక్తి కోసం ఉపయోగించే ద్రవాలను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దాని వారసత్వంగా తమ రెడీ-టు-డ్రింక్ (RTD) రీహైడ్రేషన్ పోర్ట్ఫోలియోను విస్తరిస్తున్నారు. ఇది అతిసార వల్ల కలిగే డీహైడ్రేషన్తో బాధపడుతున్న రోగులను లక్ష్యంగా చేసుకుని ORS - WHO ఆమోదించిన ఫార్ములా ప్రారంభించింది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. ప్రతి సంవత్సరం దాదాపు 1.7 బిలియన్ల మంది విరేచనాల వల్ల అతిసారతో బాధపడుతున్నట్లు సమాచారం. ముక్యంగా భారతదేశంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో మరణానికి అతిసార మూడవ ప్రధాన కారణంగా ఉంది. దీనిని నివారించడానికి ఓఆర్ఎస్ ఉపయోగపడుతోంది.రెడీ టు డ్రింక్ ఓఆర్ఎస్ అనేది రోగులకు ఉపయోగపడే విధంగా డబ్ల్యుహెచ్ఓ మార్గదర్శకాలను పాటిస్తూ తయారైంది. రెడీ టు డ్రింక్ ఫార్మాట్లో తీసుకోవడం సులభం.. అంతే కాకుండా విరేచనాలతో పోరాడటానికి రీహైడ్రేషన్ను అందిస్తుంది. ఓఆర్ఎస్ మాత్రమే విరేచనాల వల్ల 93 శాతం మరణాలను నివారించగలదని అంచనా. కొత్త డబ్ల్యుహెచ్ఓ ఓఆర్ఎస్ కొత్త ఉత్పత్తి ఆపిల్ & ఆరెంజ్ అనే రెండు రుచికరమైన రుచులలో లభిస్తుంది. -
హెచ్ఎంపీవీ విభృంభణ.. ధృవీకరించిన చైనా!
చైనాలో HMPV పేరిట కరోనా తరహాలో ఓ కొత్త వైరస్ విజృంభిస్తోందన్న వార్తలు ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేశాయి. అయితే.. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో తమ దేశ ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది. ప్రపంచాన్ని మరో మహమ్మారి వణికించడం ఖాయమని పరిశోధకుల హెచ్చరికల వేళ.. డ్రాగన్ కంట్రీ కొత్త వైరస్ విజృంభణను ధృవీకరించినట్లు కథనాలు వెలువడుతుండడం గమనార్హం. అయితే..కేవలం చైనా ఉత్తర భాగంలోనే హెచ్ఎంపీవీ విజృంభణ కొనసాగుతోందని అటు చైనా ఆరోగ్య శాఖ.. ఇటు చైనా అంటువ్యాధుల నియంత్రణ మండలి(China CDC) ప్రకటించాయి. అన్ని వయసులవాళ్లపై ఈ వైరస్ ప్రభావం చూపుతోందని.. ముఖ్యంగా పిల్లల్లో, వయసు పైబడినవాళ్లలో త్వరగా వ్యాపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం కేసులను ట్రేస్ చేసే పనిలో ఉన్నట్లు చెబుతున్నాయి. అలాగే మాస్కులు ధరించాలని, శుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలని మార్గదర్శకాలను విడుదల చేసినట్లు తెలిపాయి. అయితే.. ఇది ప్రాణాంతకమేనా? అనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.👉ఒకవైపు చైనాలో నిజంగానే అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అత్యవసర పరిస్థితి(Emergency) విధించారా? అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటిల్లో వాస్తవమెంత? అనేది తేలాల్సి ఉంది.👉మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ పరిణామంపై స్పందించాల్సి ఉంది. 👉ఇంకోవైపు.. చైనా చుట్టుపక్కల దేశాల్లో కొత్త వైరస్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే జపాన్లో ఫ్లూ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుండగా.. HMPV కేసులేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హంకాంగ్లోనూ ఈ వైరస్ కేసులు నమోదు అయినట్లు సమాచారం.ఏమిటీ హెచ్ఎంపీవీ వైరస్?హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్.. ఆర్ఎన్ఏ వైరస్. క్షీరదాలు, పక్షుల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్ని కలగజేసే Pneumoviridae Metapneumovirusకి చెందింది. అయితే హెచ్ఎంపీవీ కొత్తదేం కాదు. చైనాకు 20 ఏళ్లుగా పరిచయం ఉన్న వైరస్సే. 2021లో తొలిసారిగా ఈ వైరస్ ఆనవాళ్లను శ్వాసకోశ సంబంధిత సమ్యలతో బాధపడుతున్న చిన్నపిల్లల్లో డచ్ పరిశోధకులు గుర్తించారు. అయితే ఎలా సోకుతుందని(వ్యాధికారకం) విషయం గుర్తించలేకపోగా.. ఇప్పటిదాకా దీనికి వ్యాక్సిన్, మందులు సైతం కనిపెట్టలేకపోయారు. మరోవైపు.. సెరోలాజికల్ అధ్యయనాల ప్రకారం ఈ వైరస్ 60 ఏళ్లు భూమ్మీద సజీవంగానే ఉండి తన ప్రభావం చూపిస్తుందని తేలింది. ఇదీ చదవండి: HMPV Virus : ఆందోళన అవసరంలేదంటున్నభారత హెల్త్ ఏజెన్సీ లక్షణాలు, చికిత్సకరోనా తరహాలోనే వేగంగా వ్యాపించే ఈ వైరస్.. పిల్లలు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లపై ప్రభావం చూపెడుతుందని తెలుస్తోంది. జలుబుతో పాటు దగ్గు, ముక్కు దిబ్బడ, జ్వరం ఈ వైరస్ లక్షణాలు. అయితే పరిస్థితి తీవ్రమైతే గనుక న్యూమోనియా, బ్రాంకైటిస్కు దారి తీయొచ్చు. వ్యాక్సిన్, మందులు లేకపోవడంతో లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నారు.ఇక హెచ్ఎంపీవీతో మరణాలు సంభవిస్తాయా? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. 2021లో ఈ వైరస్ డాటా ఆధారంగా లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ఓ కథనం ప్రచురించింది. అందులో.. ఐదేండ్ల లోపు పిల్లల్లో ఒక శాతం మరణాలు సంభవించిన విషయాన్ని ప్రస్తావించింది. -
ఇజ్రాయెల్ బాంబు దాడి.. త్రుటిలో తప్పించుకున్న WHO చీఫ్ గుటేరస్
యెమెన్: పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ గ్యాబ్రియాసిస్(Tedros Adhanom Ghebreyesus)పై చూపించింది. బాంబు దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ షాకింగ్ ఘటన యెమెన్ దేశంలో చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడి నుంచి ఆయన అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.వివరాల ప్రకారం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ గురువారం యెమెన్ దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదల, యెమెన్లో పరిస్థితులపై చర్చించేందుకు అక్కడికి వెళ్లారు. చర్చల అనంతరం ఆయన యెమెన్ నుంచి బయలుదేరుతున్న క్రమంలో వైమానిక బాంబు దాడి జరిగింది. సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరోగ్య సంస్థకు చెందిన అధికారులు వేచి ఉన్న సమయంలో బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదంలో టెడ్రోస్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా.. ఇద్దరు మృతిచెందారు. ఇక, ఈ దాడిని ఐక్యరాజ్యసమితి సైతం తీవ్రంగా ఖండించింది.అనంతరం, ఈ దాడి ఘటనపై టెడ్రోస్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. టెడ్రోస్ ట్విట్టర్లో..‘ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదలపై చర్చలు, యెమెన్లో ఆరోగ్యం, మానవతా పరిస్థితులను అంచనా వేసేందుకు అక్కడికి వెళ్లాం. ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని మేము పిలుపునిచ్చాం. సనాలో విమానం ఎక్కేందుకు వేచిఉండగా బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. విమానంలోని ఓ సిబ్బంది గాయాలపాలయ్యారు. ఘటన జరిగిన ప్రాంతానికి, మాకు కొన్ని మీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియచేస్తున్నాం’ అని కామెంట్స్ చేశారు.Our mission to negotiate the release of @UN staff detainees and to assess the health and humanitarian situation in #Yemen concluded today. We continue to call for the detainees' immediate release.As we were about to board our flight from Sana’a, about two hours ago, the airport… pic.twitter.com/riZayWHkvf— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) December 26, 2024ఈ దాడిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ (Antonio Guterres) ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఇటీవల యెమెన్, ఇజ్రాయెల్ల మధ్య దాడులు తీవ్రతరం అయ్యాయి. సనా అంతర్జాతీయ విమనాశ్రయంతో సహా ఎర్రసముద్రం, ఓడరేవులు, యెమెన్లో పవర్ స్టేషన్లపై వైమానిక దాడులు ఆందోళనకరంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలన్నారు. పౌరులు, కార్మికులే లక్ష్యంగా దాడులు చేయకూడదన్నారు. మరోవైపు. యెమెన్లోని సనా విమానాశ్రయం, ఇతర నౌకాశ్రయాలపై, పలు విద్యుత్కేంద్రాలపై గురువారం ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు మృతి చెందారు. Israeli terrorism spreads to Yemen 🇾🇪🇮🇱Innocent civilians are forced to flee after Israel targets the airport in Sanaa. Israel's record of attacking unarmed women and children continues unabated. pic.twitter.com/DcnALJN8Nh— Robert Carter (@Bob_cart124) December 26, 2024 -
క్షయ నిర్మూలన ఓ అత్యవసరం!
క్షయ (టీబీ) వ్యాధిని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ వ్యాధిపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. టీబీ నిర్మూలనలో మన దేశం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, రోగులు పూర్తిగా కోలుకునేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్పీవై)ని అమలుచేస్తోంది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి, స్వల్పకాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకూ అనుమతి ఇవ్వడం విశేషం.దేశం నుంచి క్షయ (టీబీ)ని పారదోలాలని గౌరవ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు నిచ్చారు. ఆయన నాయకత్వంలో టీబీని నిర్మూలించేందుకు వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్సల్లో మార్పు తీసుకువచ్చేందుకు గత కొన్నేళ్లుగా వినూత్న విధానాలను భారత్ అవలంబిస్తోంది. డబ్ల్యూహెచ్వో విడుదల చేసిన ‘ప్రపంచ టీబీ నివేదిక – 2024’లో ఇప్పటి వరకు దేశంలో అవలంబిస్తున్న విధానాలను ప్రస్తావించింది. దేశంలో 2015 నుంచి 2023 వరకు 17.7 శాతం మేర టీబీ వ్యాప్తి తగ్గింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాధి క్షీణత రేటు విషయంలో ఇది రెట్టింపు. అలాగే దేశ వ్యాప్తంగా 25.1 లక్షల మంది టీబీ రోగులను గుర్తించారు. ఫలితంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకునేవారి శాతం 2015లో ఉన్న 59 నుంచి 2023 నాటికి 85 గణనీయంగా పెరిగింది. ప్రధానమంత్రి దార్శనిక స్ఫూర్తితో టీబీని పూర్తిగా నిర్మూలించే వ్యూహంలో భాగంగా డిసెంబర్ 7న మరో పరివర్తనాత్మక కార్యక్రమం భారత్లో ప్రారంభమైంది. క్షయపై పోరాటాన్ని వేగవంతం చేసేందుకు, ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న 347 జిల్లాలను కలుపుకొని ప్రభుత్వం జాతీయ స్థాయిలో 100 రోజుల విస్తృత ప్రచార కార్య క్రమాన్ని పంచకుల నుంచి ప్రారంభించింది. వ్యాధి తొలిదశలో ఉండగానే క్షయ రోగులందరినీ గుర్తించి వారికి సకాలంలో అవస రమైన, నాణ్యమైన చికిత్సను అందించాలనే మా సంకల్పాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది. ‘జన్ భగీదారి’ స్ఫూర్తితో మనమంతా– ప్రజాప్రతినిధులు, ఆరోగ్య నిపుణులు, పౌరసమాజం, కార్పొరేట్ సంస్థలు, సంఘాల–సంయుక్తంగా ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలా కృషి చేద్దాం.భారత్ నుంచి టీబీని తరిమేసే ప్రయాణంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందిస్తున్న చురుకైన భాగస్వామ్యం... ఈ కార్యక్రమం మరో మైలురాయిగా నిలుస్తుందనే భరోసాను ఇచ్చింది. టీబీ నిర్మూలనలో మన దేశ సామాజిక విధానం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, టీబీ రోగులు పూర్తిగా కోలుకొనేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం... ‘ని–క్షయ పోషణ యోజన’ (ఎన్పీవై)ని భారత్ అమలుచేస్తోంది. ఏప్రిల్ 2018 నుంచి 1.16 కోట్ల మంది లబ్ధి దారులకు ఎన్పీవై పథకం ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రూ. 3,295 కోట్లు అందించారు. ఈ పథకం ద్వారా నెలవారీగా అందించే ఆర్థిక సాయం గత నవంబర్ నుంచి రూ. 500 నుంచి రూ. 1000కి పెంచడం క్షయ నిర్మూలనలో భారత్ నిబద్ధతను సూచించే మరో అంశం.మరో కీలక అంశం... పోషకాహర సమస్యను పరిష్కరించడంతో పాటు సమాజ భాగస్వామ్యం పెరిగేలా ‘టీబీ ముక్త భారత్ అభియాన్’ తోడ్పడింది. అలాగే సమాజంలో వివిధ వర్గాలను ఏకం చేసి అవగాహన పెంచడానికి, టీబీ రోగులకు పోషకాహారం, వృత్తిపరంగా, మానసికంగా సాయం అందించే దిశగా సామూహిక ఉద్య మాన్ని సృష్టించింది. జన్ భగీదారి స్ఫూర్తితో ప్రభుత్వ – పౌర భాగ స్వామ్యంతో చేపట్టిన ఈ ఉద్యమం 1.75 లక్షల మంది ని–క్షయ మిత్రల ద్వారా దేశవ్యాప్తంగా 21 లక్షల ఆహార కిట్లను సరఫరా చేసేందుకు స్ఫూర్తినిచ్చింది.టీబీని రూపుమాపడానికి వినూత్న విధానంఅనేక సంవత్సరాలుగా చికిత్స సఫలతా రేటును పెంపొందించేందుకు బెడాక్విలైన్, డెలామనిడ్ వంటి సరికొత్త ఔషధాలను భారత్ ప్రవేశపెట్టింది. ఔషధాలకు లొంగని వేరియంట్ సోకిన రోగులకు చికిత్సలో ఎదురయ్యే సవాళ్లను పరిగణించి స్వల్ప కాలిక చికిత్సా విధానమైన బీపీఏఎల్ఎంకు అనుమతి నిచ్చాం. ఇప్పటికే ఉన్న చికిత్సా విధానాలతో పోలిస్తే ఇది మరింత ప్రభావ వంతంగా ఉంటుంది. ప్రస్తుతం మనకు 19 నుంచి 20 నెలల పాటు సాగే సంప్రదాయ చికిత్సా విధానంతో పాటు 9 నుంచి 11 నెలల పాటు సాగే చికిత్సా విధానం కూడా మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ బీపీఏఎల్ఎమ్ విధానంతో రోగులు ఆరు నెలల్లోనే చికిత్సను పూర్తి చేసుకోవచ్చు. క్షేత్ర స్థాయిలో రోగులందరినీ గుర్తించి సత్వరమే చికిత్స అందించడడానికి వీలుగా అందుబాటులో అధునాతన పరికరాలు ఉండేలా నిరంతర కృషి చేస్తున్నాం. దీని కోసమే సమర్థవంతమైన, కచ్చితమైన పరీక్షా పద్ధతులను ప్రవేశపెట్టాం. అవే జీవ పరమాణు పరీక్షలు (మాలిక్యులర్ టెస్ట్స్). 2014 –15లో కొన్ని వందల సంఖ్యలో మాత్రమే ఉన్న వ్యాధి నిర్ధారణ పరికరాల సంఖ్య ప్రస్తుతం 8,293 కు చేరుకున్నాయి. ఈ పరికరాలు అన్ని జిల్లాల్లోనూ అందుబాటులో ఉన్నాయి.‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమ స్ఫూర్తితో స్వదేశీ జీవ పరమాణు పరీక్షలను క్షేత్రస్థాయిలో పరీక్షించి రూపొందించిన పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. తద్వారా జిల్లా, బ్లాకు స్థాయిల్లో టీబీ నిర్ధారణకు వెచ్చించే సమయాన్ని తగ్గించడంతో పాటు రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించగలిగాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన మన స్వదేశీ మాలిక్యులర్ పరీక్షలను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఈ కార్యక్రమాలు టీబీ నిర్మూలనలో భారత్ను అగ్రస్థానంలో నిలిపాయి.2018 నుంచి టీబీ పరిశోధనలపై అధికంగా నిధులు వెచ్చిస్తున్న అగ్ర సంస్థల్లో ఒకటిగా భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) స్థిరంగా నిలవడం మనందరికీ గర్వకారణం. రోగులకు అతి చేరువలోనే సమర్థవంతమైన వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో సహా మరిన్ని నూతన సాధనాలను త్వరిత గతిన అభివృద్ధి చేసేందుకు పెట్టుబడులు కొనసాగిస్తాం. భవిష్యత్తు వైపు దృష్టి సారిస్తూ...వివిధ రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, నిరూపి తమైన సాంకేతికతలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడం... టీబీ నిర్మూలనా దిశలో భారత్ నాయకత్వానికి నిదర్శనాలు. అధు నాతన రోగ నిర్ధారణ, చికిత్సలకు దారితీసే మార్గదర్శక పరిశోధనల నుంచి సార్వత్రిక సామాజిక తోడ్పాటును అందించే నియమాలను ప్రవేశ పెట్టేవరకూ... టీబీని పారదోలడంలో మన దేశం ముందంజలో ఉంది. టీబీని గుర్తించడం, నిర్ధారించడం, చికిత్స, నివారణలో సామాన్య ప్రజలను భాగస్వాములను చేయడం ఈ సమయంలో అత్యవసరం. 100 రోజుల పాటు ఉద్ధృతంగా సాగే ప్రచారం టీబీని రూపుమాపడంలో సామూహిక నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. గౌరవనీయులైన ప్రధానమంత్రి నాయకత్వంలో అందరి భాగస్వా మ్యంతో, మానవాళికి పెద్ద శత్రువుగా ఉన్న టీబీని ఓడించి, ఆరోగ్య కరమైన భవిష్యత్తును కల్పిస్తామని నేను విశ్వసిస్తున్నాను.జగత్ ప్రకాశ్ నడ్డా వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి -
Disease X: ఆ ప్రాణాంతక మహమ్మారి ఇదేనా?
అంతుచిక్కని వ్యాధి మధ్య ఆఫ్రికా దేశం కాంగోను వణికిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ఇప్పటిదాకా ఓ అంచనాకి రాలేకపోయింది. ఇప్పటిదాకా ఈ వ్యాధి బారినపడి 31 మంది చనిపోగా.. అందులో పిల్లలే ఎక్కువమంది ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. ఫ్లూ తరహాలో విజృంభిస్తూ.. శ్వాసకోశ సమస్యలతో మరణాలకు కారణమవుతోందని ఈ వ్యాధిపై వైద్య నిపుణులు ఓ అంచనాకు వచ్చారు.మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టికి ఈ అంతుచిక్కని వ్యాధి విషయం చేరింది. నవంబర్ 29వ తేదీన కాంగో ఆరోగ్య శాఖ.. డబ్ల్యూహెచ్వోకి ఈ వ్యాధి గురించి నివేదిక ఇచ్చింది. ఇప్పటికే దర్యాప్తు నడుస్తోంది. దర్యాప్తులో ఆఫ్రికా సీడీసీ(వ్యాధుల నియంత్రణ &నిర్మూలన) కూడా భాగమైంది. అయితే ఇన్నిరోజులు గడిచినా వ్యాప్తికి గల కారణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీంతో ఈ వ్యాధిని డిసీజ్ (Disease X)గా పరిగణిస్తున్నారు.ఏమిటీ డిసీజ్ ఎక్స్కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరో మహమ్మారి విజృంభణ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గత కొంతకాలంగా అంచనా వేస్తోంది. శరవేగంగా వ్యాపిస్తూ మనుషులకు ప్రాణాంతకంగా(హైరిస్క్ రేటు) మారవచ్చని అభిప్రాయపడుతోంది. ఈ క్రమంలోనే ఆ ముందస్తు మహమ్మారికి ‘డిసీజ్ ఎక్స్’గా నామకరణం చేసింది. ఆపై దానిని ఎబోలా, జికా వైరస్ సరసన జాబితాలో చేర్చింది.అయితే.. డిసీజ్ ఎక్స్కు ఏ వైరస్ కారణం కావొచ్చనే దానిపై డబ్ల్యూహెచ్వో ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ, కోవిడ్ తరహాలోనే శ్వాసకోశ సంబంధమైనదే అయ్యి ఉండొచ్చని మాత్రం నిపుణులు అంచనా వేస్తున్నారు.సంబంధిత వార్త: డిసీజ్ ఎక్స్ ప్రభావం కరోనా కంటే ఎన్ని రేట్లంటే..ఆలోపు వ్యాక్సిన్ సిద్ధం!డిసీజ్ ఎక్స్పై ఓవైపు ఆందోళనలు నెలకొంటున్న వేళ.. మరోవైపు వ్యాక్సిన్ను తయారు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆక్స్ఫర్ట్ యూనివర్సిటీ కోవిడ్-19 వ్యాక్సిన్లోనే మార్పులు చేస్తోందని తెలుస్తోంది. అలాగే.. భవిష్యత్తులో రాబోయే మహమ్మారి కోసం మరిన్ని వ్యాక్సిన్లను సిద్ధం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.కాంగోలో విజృంభిస్తోంది ఏంటి?మారుమూల కువాంగో(Kwango) నుంచి అంతుచిక్కని వ్యాధి విజృంభణ మొదలైందని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటిదాకా 406 కేసులు నమోదుకాగా.. 31 మంది చనిపోయారు. మృతుల్లో పిల్లలు ఎక్కువగా ఉన్నారు. అయితే పాతికేళ్లలోపు వాళ్లలోనే లక్షణాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. అయితే ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాంగో కొత్త వ్యాధి లక్షణాలుజ్వరంతలనొప్పిదగ్గు,జలుబుఒళ్లు నొప్పులుఅయితే.. కాంగోలో అంతుచిక్కని వ్యాధి రికార్డుల్లోని తీవ్రస్థాయిలో కేసులను పరిశీలించిన డబ్ల్యూహెచ్వో నిపుణుల బృందం.. పౌష్టికాహార లోపాన్ని గుర్తించినట్లు చెబుతోంది. చనిపోతున్నవాళ్లలో శ్వాసకోశ ఇబ్బందులు, రక్తహీనత సమస్యలను గుర్తించినట్లు వెల్లడించింది. అలాగే వ్యాధి వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో ఆహార కొరత, తక్కువ వ్యాక్సినేషన్ నమోదు, పరీక్షలకు.. వైద్యానికి సరైన వసతులు లేకపోవడం కూడా గుర్తించినట్లు ఓ నివేదిక ఇచ్చింది. అయితే కాంగోలో విజృంభిస్తోందని డిసీజ్ ఎక్స్ యేనా? దాని తీవ్రత ఏంటి? వ్యాప్తి రేటు తదితర అంశాలపై ల్యాబోరేటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ఆ తర్వాతనే(అదీ దశలవారీగా) ఈ వ్యాధి విజృంభణకు గల కారణాలపై కచ్చితమైన నిర్దారణకు రాగలమని ఆ బృందం స్పష్టత ఇచ్చింది. -
ఈ మోతాదులో ఉప్పు తీసుకుంటే గుండె, కిడ్నీ వ్యాధులను నివారించొచ్చు..!
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని మోడలింగ్ అధ్యయనం పేర్కొంది. ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన మోతాదులో ఉప్పు తీసుకోవడం వల్ల పదేళ్లలో గుండె, మూత్రపిండాలకు సంబంధించిన దీర్ఘకాలికి వ్యాధుల కారణంగా సంభవించే..దాదాపు మూడు లక్షల మరణాలను నివారించొచ్చని పేర్కొంది. అధిక స్థాయి సోడియం అనేది ప్రధాన ఆహార ప్రమాదాల్లో ఒకటి. అధిక ఆదాయ దేశాల్లో సోడియంకి సంబంధించిన ప్యాక్ చేసిన ఆహారాలు ప్రధాన వనరు. ఇక తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో వీటి వినియోగం మరింత ఎక్కువగా ఉండటం బాధకరం. ముఖ్యంగా భారతదేశంలో ఉప్పు తగ్గించి తీసుకునేలా సరైన జాతీయ వ్యూహం లేదని హైదరాబాద్లోని ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన ఉప్పు ఒక టీ స్పూన్ లేదా ఐదు గ్రాముల కంటే తక్కువగా ఉంటుందని మోడలింగ్ అధ్యయనం పేర్కొంది. ఈ మోతాదులోనే ప్రతి రోజూ వినియోగించినట్లయైతే దాదాపు 17 లక్షల కార్డియోవాస్కులర్ సంఘటనలు, గుండెపోటులు, స్ట్రోక్లతో సహా క్రానిక్ కిడ్న వ్యాధులను నివారించడమే గాక గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందగలమని పరిశోధన వెల్లడించింది. ముఖ్యంగా భారతదేశంలో పూర్తిస్థాయిలో ఇది అమలవ్వాలని పేర్కొంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా ప్యాక్ చేసిన ఆహారాలను ఉపయోగిస్తున్నట్లు పరిశోధన వెల్లడించింది. ఈవిషయమై ఆహార తయారీదారులకు అవగాహన కల్పించడం, పాటించేలా చేయడం అత్యంత ముఖ్యమని తెలిపింది. కాగా, అధిక స్థాయిలో సోడియం తీసుకోవడం తగ్గించేలా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018 నుంచి అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం మాత్రం ఈట్ రైట్ ఇండియా అనే జాతీయ కార్యక్రమం ద్వారా సోడియంను తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని పరిశోధకులు తెలిపారు.(చదవండి: వాట్ ఏ రికార్డ్!..గుమ్మడికాయ పడవతో 26 గంటలు..) -
అమోదయోగ్యమైన నడక ఎంత?
అన్ని వయసుల వారికీ వాకింగ్ నిర్ద్వంద్వంగా అందరికీ మేలు చేసే వ్యాయామం. పైగా అది ఎవరైనా చేయగలిగే చాలా తేలికైన ఎక్సర్సైజ్. పైగా దీనికి ఎలాంటి వ్యాయామం ఉపకరణాలూ, పరికరాలూ అక్కర్లేదు. వ్యాయామం చేయగలిగే ఏ వయసు వారైనా అలాగే మహిళలైనా, పురుషులైనా వాకింగ్ చేయాల్సిన సగటు దూరమెంతో, ఎంత నడిస్తే దేహం మీద దాని ప్రభావం పడి, మంచి ఆరోగ్యం సమకూరుతుందో లెక్కలు వేశారు యూఎస్కు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వారి సిఫార్సుల ప్రకారం రోజుకు ఎనిమిది కిలోమీటర్లు మంచిదని చెబుతున్నారు. (వాళ్ల లెక్కల ప్రకారం 5 మైళ్లు). ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్న ప్రకారం వారానికి 150 నిమిషాల పాటు నడక గానీ లేదా ఏరోబిక్స్గానీ చేయడం మంచిది. నడర అయితే రోజుకు 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తూ వారంలో కనీసం ఐదు రోజుల పాటైనా ఈ వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే రోజులో కనీసం 4 నుంచి 5 కిలోమీటర్లు నడవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలన్నది డబ్ల్యూహెచ్వో లెక్క. ఏ లెక్కలు ఎలా ఉన్నా... ఎత్తుకు తగినట్లుగా బరువు తగ్గి, మంచి ఫిట్నెస్ సాధించడం కోసం అందరూ రోజూ ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడవాలని పలు ఆరోగ్య సంస్థల అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల గరిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయన్నది ఆ అధ్యయనాల మాట. ఇది అందరి లెక్క అయినప్పుడు అందరూ ఇన్ని దూరాలు నడవగలరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా... దీనికి సమాధానమిస్తూ టీనేజ్లో ఉన్న పిల్లలు, యువత చాలా వేగంగా ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు దూరాలు నడవాలనీ, అయితే మధ్యవయస్కులు మొదలు కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారు నెమ్మదిగా నడవాలని సూచిస్తున్నారు. మరీ ఎక్కువ వయసుతో వృద్ధాప్యంలో ఉన్నవారు మాత్రం రోజూ 2 నుంచి 4 కిలోమీటర్లు నడిస్తే చాలన్నది ఆ అధ్యయన సంస్థల సూచన. ఇక ఆరు నుంచి పదిహేడేళ్ల వరకు ఉన్న చిన్నారులు రోజుకు కనీసం 60 నిమిషాల పాటైనా వేగంతో కూడిన నడక లేదా కాస్త శ్రమ కలిగించే వ్యాయామాలు చేయాలంటున్నారు.అసలు ఎందుకు నడవాలి?ఈ ప్రశ్న వచ్చినప్పుడు నడక వల్ల కలిగే వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలే సమాధానాలుగా నిలుస్తాయంటున్నాయి ఆరోగ్య పరిశోధక సంస్థలు. నడక వల్ల ఒత్తిడి తగ్గడం, మూడ్స్ మెరుగుపడటం, శక్తిసామర్థ్యాలు పెరగడం, బరువు తగ్గడం, కండరాలు బలంగా మారడం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వాటికి అవసరమైన పోషకాలు అందడం, వాటి ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. -
జలగండం!
సాక్షి, అమరావతి: జలసంక్షోభం ముంచుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తలసరి నీటి లభ్యత గణనీయంగా తగ్గుతోంది. మన దేశంలో 1951 నాటికి తలసరి నీటి లభ్యత 5,177 క్యూబిక్ మీటర్లుŠ(ఒక క్యూబిక్ మీటర్కు వెయ్యి లీటర్లు) ఉంటే... ప్రస్తుతం అది 1,486 క్యూబిక్ మీటర్లకు తగ్గింది. ఇది 2031 నాటికి 1,367 క్యూబిక్ మీటర్లకు... 2051 నాటికి 1,228 క్యూబిక్ మీటర్లకు తగ్గుతుందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి లభ్యత పెరగకపోవడం వల్లే తలసరి నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోందని వెల్లడించింది. సముద్రం పాలవుతున్న నదీ జలాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవడం, భూగర్భ జలాలను సంరక్షించుకోవడం, వ్యర్థ జలాలను శుద్ధిచేసి మళ్లీ వినియోగించుకోవడం ద్వారా తలసరి నీటి లభ్యతను పెంచుకోవచ్చని సూచించింది. సీడబ్ల్యూసీ అధ్యయన నివేదికలో ప్రధాన అంశాలు... » ప్రపంచంలో భూమిపై ఉన్న నీటిలో 97.5 శాతం ఉప్పునీరు. 2.5 శాతం మాత్రమే మంచినీరు. భూమిపై ఉన్న మంచినీటిలో 68.9 శాతం హిమానీనదాలు(గ్లేసియర్లు)లో ఉండగా, భూగర్భజలాలు, భూమిలో తేమ రూపంలో 30.8 శాతం, నదులు, సరస్సులలో 0.3 శాతం ఉంది. » మన దేశ భౌగోళిక విస్తీర్ణం 328.75 మిలియన్ హెక్టార్లు. ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంలో మన దేశ విస్తీర్ణం వాటా 2.44 శాతం. దేశంలో సగటున ఏటా 1,170 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. వర్షపాతం వల్ల ఏటా 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్లు(బీసీఎం) నీరు లభిస్తుంది. ఇందులో 1,999.2 బీసీఎంల నీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 1,139.18 బీసీఎంల నీటిని వినియోగించుకుంటున్నాం. » ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ప్రమాణాల ప్రకారం తలసరి నీటి లభ్యత 5 వేల క్యూబిక్ లీటర్లు ఉండాలి. ఆ ప్రమాణాల మేరకు మన దేశంలో 1951లో మాత్రమే నీటి లభ్యత ఉంది. ఆ తర్వాత క్రమేణా జనాభా పెరుగుతూ ఉండటం, దానికి అనుగుణంగా నీటి లభ్యతను పెంచుకోకపోవడం వల్లే తలసరి నీటి లభ్యత తగ్గిపోతోంది. » ఏ దేశంలో అయినా తలసరి నీటి లభ్యత 1,700 క్యూబిక్ లీటర్లు ఉంటే... ఆ దేశంలో నీటి కొరత తీవ్రంగా ఉన్నట్లు. ప్రస్తుతం మన దేశంలో తలసరి నీటి లభ్యత 1,486 క్యూబిక్ మీటర్లు ఉంది. ఈ లెక్కన మన దేశంలో తీవ్ర నీటి కొరత ఉన్నట్లు స్పష్టమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2051 నాటికి దేశంలో తీవ్ర జలసంక్షోభం తలెత్తడం ఖాయమని సీడబ్ల్యూసీ ఆందోళన వ్యక్తంచేసింది.ప్రపంచంలో భూమిపై ఉన్న నీటిలో ఉప్పు నీరు: 97.5 శాతంమంచి నీరు: 2.5 శాతంప్రపంచంలో భూమిపై ఉన్న మంచినీటి విస్తరణ ఇలా.. హిమానీనదాలలో: 68.9 శాతం భూగర్భజలాలు, భూమిలో తేమ రూపంలో: 30.8 శాతం నదులు, సరస్సులలో: 0.3 శాతం -
ఈ బద్ధకం వదిలేద్దాం!
ఆరోగ్యమే మహాభాగ్యమంటాం. ఆరోగ్యంగా ఉండేందుకు కనీసపాటి శ్రమైనా చేస్తున్నామా? శారీరక శ్రమ, క్రమం తప్పని కదలికల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిసినా, భారతీయులు బద్ధకపు జీవనశైలినే అనుసరిస్తున్నారట. క్రియాశీలక జీవనవిధానానికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొన్ని మార్గదర్శకాలు పేర్కొంది. కానీ, మన దేశం నుంచి 20 కోట్ల మంది (15.5 కోట్ల మంది వయోజనులు, 4.5 కోట్ల మంది కౌమార వయస్కులు) వాటిని పాటించడంలో విఫలమవుతున్నారు. డాల్బెర్గ్ వారి ‘స్టేట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ’ (సాపా) నివేదిక తాజాగా ఈ సంగతి వెల్లడించింది. ఈ నివేదిక ఆందోళన కలిగించడమే కాక, ఆటలు, వ్యాయామం విషయంలో భారతీయులు శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. నిజానికి, ఇలాంటి జాతీయ స్థాయి సర్వే జరగడం ఇదే తొలిసారి. మేధావుల బృందమైన ‘డాల్ బెర్గ్ అడ్వైజర్స్’, స్వచ్ఛంద సంస్థ ‘స్పోర్ట్స్ అండ్ సొసైటీ యాక్సలరేటర్’ సంయుక్తంగా జరిపిన ఈ అధ్యయనం అనేక ఆందోళనకరమైన ధోరణులను వెల్లడించింది. మన దేశంలో వయోజనుల్లోని కాస్తంత పెద్దవారిలో 48 శాతం మంది ఆటల లాంటి శారీరక శ్రమ చేసేందుకు తమ వయసు మీద పడింది అనేస్తున్నారట. ఇంకా చిత్రం ఆటలు ఆడపిల్లలకు సురక్షితం కాదన్న అభిప్రాయంలో 45 శాతం మంది ఉన్నారట. అలాగే, శారీరక శ్రమ చేయడం ఋతుస్రావ మహిళలకు నష్టదాయకమనీ, ఒంటికి దెబ్బలు తగిలితే వివాహ అవకాశాలు దెబ్బ తింటాయనీ, భౌతిక శ్రమ వల్ల పెళ్ళయిన అమ్మాయిలకు గర్భస్రావం అవుతుందనీ... ఇలా రకరకాల దురభిప్రాయాలు నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో... అలాగే పురుషులతో పోలిస్తే మహిళల్లో శారీరక శ్రమ బాగా తక్కువవడం గమనార్హం. దీనికి కారణాలు లేకపోలేదు. శారీరక శ్రమ చేసేందుకు అనుకూలంగా ఉద్యానాలు, మైదానాల లాంటి బహిరంగ ప్రదేశాలు పట్టణాల్లో కరవై పోయాయి.అందువల్ల గ్రామాలతో పోల్చి చూసినప్పుడు పట్టణాల్లో శారీరక శ్రమ రాహిత్యం రెట్టింపు ఉంటోంది. నగర జనాభా మరీ అతి సున్నితంగా తయారైంది. ఇక, మన భారతీయ మహిళల్లో... నూటికి 75 మందికి రకరకాల ఇంటిపనుల్లోనే సమయమంతా గడిచిపోతుంది. ఫలితంగా వారికి వ్యాయామం చేసేందుకు తీరిక దొరకని పరిస్థితి. ఈ కారణాలన్నీ కలిసి కొంప ముంచుతున్నాయి. జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్నాయి. చాలామంది రోజూ నడుస్తున్నామంటారు. నడక వల్ల ప్రయోజనాలు ఉన్నాయి కానీ, ఆరోగ్యవంతమైన శరీరానికి అదొక్కటే సరిపోదని నిపుణుల ఉవాచ. తాజా సర్వే ఒక్కటే కాదు... ప్రతిష్ఠాత్మక ‘లాన్సెట్’ పత్రికలో ఇటీవలే ప్రచురితమైన మరో అధ్యయనం సైతం భారతీయ వయోజనుల్లో నూటికి 50 మంది శారీరకంగా తగినంత శ్రమ చేయట్లేదని పేర్కొంది. అంతంత మాత్రపు శారీరక శ్రమతోనే వయోజనులు సరిపెట్టుకొంటున్న ధోరణి ఉన్నతాదాయాలుండే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తోంది. ఆ తరువాత రెండోస్థానంలో దక్షిణాసియా ప్రాంతం నిలిచింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహా పలువురు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం చెబుతున్న మాట. ఆందోళనకరమైన అంశం ఏమిటంటే... మన దేశంలోని వయోజనుల (కనీసం 18 ఏళ్ళు, ఆపైన ఉన్నవారి)లో పెద్దగా శారీరక శ్రమ చేయని సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2000 నాటికి అలాంటివారు 22 శాతం పైచిలుకు ఉంటే, 2010 నాటికి వారు 34 శాతం దాకా పెరిగారు. 2022 నాటికి 50 శాతం దాకా చేరారు. ఇలాగే కొనసాగితే... 2030 నాటికల్లా ఇలాంటివాళ్ళు ఏకంగా 60 శాతానికి చేరతారని అంచనా. ఇది శారీరక, మానసిక ఆరోగ్యపరంగానే కాదు... సామాజికంగానూ ప్రమాదఘంటికే!రోజూ బద్ధకంగా, శారీరక శ్రమ లేకుండా గడిపేస్తుంటే... మధుమేహం, గుండెజబ్బు వచ్చే ముప్పుంది. నిజానికి, ఎంతసేపూ కదలకుండా కూర్చొనే జీవనశైలి, శారీరక శ్రమ అంతకంతకూ తగ్గిపోవడం వల్ల ప్రపంచమంతటా ఈ జబ్బుల బారినపడుతున్నవారు పెరుగుతున్నారు. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భారం పడుతోందని డబ్ల్యూహెచ్ఓ మాట. అంతేకాదు... ఈ బద్ధకపు జీవన విధానం వల్ల మన దేశంలో దాదాపు 25.4 కోట్లమందికి పైగా స్థూలకాయంతో, 18.5 కోట్ల మంది దాకా ‘చెడు కొలెస్ట్రాల్’తో బాధపడుతున్నట్టు వెల్లడైంది. ఆరోగ్యానికే కాదు... దేశ ఆర్థిక బలిమికీ శారీరకంగా చురుకుదనం అత్యంత కీలకం. మన దేశ జనాభా మొత్తం శ్రమకు నడుంబిగిస్తే, 2047 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తి రూ. 15 ట్రిలియన్లు దాటిపోతుందని అంచనా. స్థూలకాయం, లాంటి జబ్బులు తగ్గడమే కాదు, వాటి కోసం ఖర్చు చేస్తున్న రూ. 30 ట్రిలియన్లు ఆదా అవుతాయి. లెక్కతీస్తే, ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు మంది తగిన శారీరక శ్రమ చేయక చెరుపు చేస్తున్నారు, చేసుకుంటున్నారు. ఇక, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల్ని బట్టి చూసినా శారీరక శ్రమరాహిత్యం అత్యధికంగా ఉన్న 195 దేశాల్లో భారత్ 12వ స్థానంలో నిలిచిందని ‘లాన్సెట్’ అధ్యయనం. రోజువారీ వ్యాయామంతో సమయం వృథా అనీ, ర్యాంకుల చదువులతోనే జీవితంలో పైకి వస్తామనీ, ఆటలు అందుకు ఆటంకమనీ భావించే తల్లితండ్రుల ఆలోచనా ధోరణి ఇకనైనా మారాల్సి ఉంది. మనమైనా, మన దేశమైనా పైకి రావాలంటే... మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యమే కీలకం. ప్రభుత్వాలు అది గుర్తించి ఆటలతో మేళవించిన విద్యా ప్రణాళికను తప్పనిసరి చేయాలి. పౌరుల కోసం వ్యాయామ కేంద్రాల వసతులూ పెంచాలి. ఎందుకంటే, జీవన సౌంద ర్యమే కాదు... జగమంతటినీ లక్ష్మీనివాసంగా మార్చే మహత్తూ శ్రమశక్తిదే మరి! -
భారత్లో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదు
భారత్లో తొలి మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసు నమోదైందనే వార్తలు కలకలం రేపుతుంది. ఆ వార్తలపై కేంద్రం స్పందించింది. ఇటీవల విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన ఓ వ్యక్తిలో ఎంపాక్స్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.ఆ వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మంకీ పాక్స్ వైరస్ లక్షణాలు అతనిలో ఉన్నాయా? లేవా అని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొంది. Suspected #Mpox case under investigation; patient put under isolation, no cause for alarmA young male patient, who recently travelled from a country currently experiencing Mpox (monkeypox) transmission, has been identified as a suspect case of Mpox. The patient has been…— PIB India (@PIB_India) September 8, 2024ఏర్పాటు చేసిన ప్రోటోకాల్లకు అనుగుణంగా సదరు వ్యక్తిపై పరీక్షలు జరుగుతున్నాయని, వైరస్ మూలాలను గుర్తించడానికి, కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతుందని చెప్పింది. ఎంపాక్స్ విషయంలో అనవసర ఆందోళన చెందవద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. -
స్మార్ట్ఫోన్ యూజర్లకు ఊరట: బ్రెయిన్ కేన్సర్తో సంబంధం లేదు!
స్మార్ట్ఫోన్ వాడకంతో బ్రెయిన్ కేన్సర్ వస్తుందని ఇప్పటిదాకా చాలా భయపడ్డాం. సెల్ఫోన్ రేడియేషన్ దుష్ర్పభావానికి సంబంధించి పలువురు నిపుణులు హెచ్చరించారు కూడా. అయితే తాజా అధ్యయనం మాత్రం స్మార్ట్ఫోన్లకు, బ్రెయిన్ కేన్సర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. సాధారణంగా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడినా, ముఖ్యంగా పడుకునేటపుడు దిండుకింద మొబైల్ పెట్టుకుని పడుకున్నా, పసిపిల్లలకు దగ్గరగా ఉంచి, రేడియేషన్ ప్రభావం ఉంటుందిని, తీవ్రమైన ప్రమాదకరమైన జబ్బులొస్తాయనే ఆందోళన ఇప్పటివరకు ఉండేది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్ వినియోగానికి, మెదడు కేన్సర్ ప్రమాదానికి ఎటువంటి సంబంధం లేదని వెల్లడింది. వైర్లెస్ టెక్నాలజీ వినియోగంలో భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, మెదడు కేన్సర్లో పెరుగుదల లేదని మంగళవారం ప్రచురించిన ఒక రివ్యూలో తెలిపింది. సుదీర్ఘ ఫోన్ కాల్స్ చేసే వ్యక్తులకు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం పాటు మొబైల్ ఫోన్లను ఉపయోగించిన వారికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రచురితమైన అనేక రీసెర్చ్ పేపర్లను సైతం అధ్యయనం చేసి ఈ విషయం వెల్లడించినట్లు అధ్యయనం పేర్కొంది. కాగా డబ్ల్యూహెచ్ఓ , ఇతర అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు మొబైల్ ఫోన్లు ఉపయోగించే రేడియేషన్ నుంచి వచ్చే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలకు ఖచ్చితమైన ఆధారాలు లేవని గతంలో చెప్పాయి, అయితే మరింత పరిశోధన కోసం పిలుపునిచ్చాయి. ఈ నేపత్యంలో తాజా స్టడీ ఆసక్తికరంగా మారింది. -
మాయరోగం... మరోసారి!
అవును... మళ్ళీ మరో మాయరోగం బయటకొచ్చింది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ (ఎంపాక్స్) తాజాగా విజృంభించింది. స్వీడన్ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ దాకా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఫలితంగా, ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. దీన్ని ఆందోళన చెందా ల్సిన అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా రెండేళ్ళలోనే రెండోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించాల్సొచ్చింది. భారత్ సైతం ఎయిర్పోర్ట్లు, ఆస్పత్రుల్ని అప్రమత్తం చేసి, కాంగో సహా మధ్య ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల ఆరోగ్యంపై కన్నేసింది. మాస్కుల ధారణ, చేతుల పరిశుభ్రత, గుంపుల్లో తిరగకపోవడం లాంటి ముందుజాగ్రత్తలే శ్రీరామ రక్ష అని మంకీపాక్స్ మరోసారి గుర్తుతెచ్చింది. తరచూ తలెత్తుతున్న ఈ వైరస్ల రీత్యా ఔషధ పరి శోధన, ఆరోగ్య వసతుల కల్పనపై మరింత పెట్టుబడి పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ప్రపంచంపై ఎంపాక్స్ పంజా విసరడం ఇప్పటికిది మూడోసారి. అసలు 15 నెలల పైచిలుకు క్రితం ఇది ఇక ఆందోళన చెందాల్సినది కాదని డబ్ల్యూహెచ్ఓ తేల్చింది. తీరా ఇటీవల కొద్ది వారాలుగా వైరస్ పునర్ విజృంభణతో ఆగస్ట్ 14న మరోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సి వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు.2023 సెప్టెంబర్ నుంచి కేసులు పెరుగుతున్నాయి. పైగా గతంలో 2022–23లో ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పటితో పోలిస్తే, ఈసారి జన్యుపరంగా విభిన్నమైన వైరస్ (క్లాడ్ 1బి వేరియంట్) దీనికి కారణమవుతోంది. ఈ సాంక్రమిక వ్యాధి గతంలో ఒకరి నుంచి మరొకరికి లైంగిక సంపర్కం ద్వారానే వ్యాపించేది. కొత్త వేరియంట్ ఇప్పుడు రోగితో స్పర్శ, దగ్గరగా మాట్లాడడం, రోగి వాడిన దుస్తులు, దుప్పట్లు వాడడం ద్వారా కూడా వ్యాపిస్తున్నట్టు నిపుణుల మాట. మరణాల రేటూ మునుపటి కన్నా పెరిగింది. ఈ ఒక్క ఏడాదే 116కి పైగా దేశాల్లో 15,600కి పైగా కేసులు నమోదయ్యాయి. 500 పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్రికాలో నిరుటితో పోలిస్తే ఇప్పుడు మరణాలు 160 శాతం పెరిగాయి. ప్రపంచంలో దాదాపు 70 లక్షల మందికి పైగా మరణానికి కారణమైన కోవిడ్ లానే మంకీపాక్స్కూ జనం భయపడుతున్నది అందుకే!ఏడాది ౖక్రితం అత్యవసర పరిస్థితిని ఎత్తివేసినప్పుడే ఎంపాక్స్పై దీర్ఘకాలిక నిఘా, నియంత్రణ ప్రణాళికలు అవసరమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వ్యాధి సాంక్రమిక రోగ విజ్ఞానంపై ఇంకా పూర్తిగా అవగాహన లేదంటూ ప్రజారోగ్య నిపుణులు, వైరస్ శాస్త్రవేత్తలు సైతం హెచ్చరించారు. అయినా సరే ఈ రోగాన్ని కనిపెట్టే పరీక్షల్ని మెరుగుపరచడం, టీకాలు – యాంటీ వైరల్ మందులకు సంబంధించి క్లినికల్ పరీక్షలపై దృష్టి పెట్టడం, టీకాల తయారీని విస్తరించడం లాంటి చర్యలేవీ ఆచరణలో పెట్టలేదు. ఈ అంతర్జాతీయ నిర్లక్ష్యమే ఇప్పుడు శాపమైంది. ఇవాళ్టికీ మంకీపాక్స్కు టీకాల సరఫరా పరిమితం. నియంత్రణకు కోటి డోసుల అవసరం ఉంటే, 2.1 లక్షల డోసులే తక్షణం అందుబాటులో ఉన్నాయట. డోసులు దానం చేస్తామని యూరోపియన్ యూనియన్, అమెరికాలు వాగ్దానం చేశాయి కానీ, వ్యాక్సిన్లపై ఇప్పటికీ కొన్ని అధికాదాయ దేశాల గుత్తాధిపత్యమే సాగుతోంది. అత్యవసరంలో ఉన్న అనేక దేశాలకు అది పెద్ద దెబ్బ. ఆఫ్రికాలో అవసరమున్నా యూరోపియన్ దేశాల్లోనే టీకాలను మోహరించడమే అందుకు ఉదాహరణ. కోవిడ్ కాలంలో లానే ఇప్పుడూ పేదదేశాలకు సాంకేతికత బదలాయింపు జరగట్లేదు. టీకాలకై పెనగులాట తప్పట్లేదు. మహమ్మా రుల కట్టడికి ఒక సమానత్వ ఒప్పందంపై ప్రపంచ దేశాలు విఫలమైతే దెబ్బతినేది ప్రజారోగ్యమే!మన దేశంలోనూ ఈ ఏడాది మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులేవీ లేవనీ, మన దగ్గర ఇది పెద్దయెత్తున రాకపోవచ్చనీ అంచనా. అయినా అప్రమత్తత తప్పదు. కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిపి, చర్యలు ప్రారంభించింది. రోగ నిర్ధారణ వసతు లతో పాటు, ఆరోగ్య బృందాల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. అక్కడితో ఆగకుండా ప్రజల్లో చైతన్యం కల్పించాలి. రాష్ట్రాలతో అన్ని రకాల కీలక సమాచారాన్ని పంచుకోవాలి. నిజానికి, ఇలాంటి వైరస్ల విజృంభణ వేళ వ్యవహరించాల్సిన తీరుపై కోవిడ్ విలువైన పాఠాలే నేర్పింది. ఇన్ఫెక్షన్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అలాగే, కేసుల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ప్రాథమిక అంశాలే అనిపించినా, ఇవే అతి ముఖ్యం. కోవిడ్లో లాగా కాక ఈసారైనా రోగ నిర్ధారణ కిట్లు, టీకాలు వర్ధమాన దేశాలకు సక్రమంగా చేరితేనే ఉపయోగం. సరిహద్దులు దాటి సులభంగా విస్తరించే ఇలాంటి మాయదారి రోగాలను కట్టడి చేయాలంటే అన్నిచోట్లా సమస్థాయిలో ప్రయత్నాలు జరగడం కీలకం. వ్యాధి సోకిన, సోకే అవకాశం ఉన్న వర్గాలన్నిటికీ టీకాలు అందుబాటులో ఉంచి, సంరక్షణ చేపట్టేలా ఆర్థిక, విధానపరమైన అండదండలు కావాలి. సత్వర, కీలక చర్యలు చేపట్టడమే ముఖ్యమనేది కోవిడ్ నేర్పింది. అందులోనూ ఇలాంటి మాయరోగాలకు ముకుతాడు వేయాలంటే, తొలి 100 రోజుల్లోని ఆచరణే అతి ముఖ్యం. ఎప్పటికప్పుడు స్వరూప స్వభావాల్ని మార్చుకుంటున్న ఎంపాక్స్ ఆఫ్రికా సమస్య, కేసులు బయట పడ్డ కొన్ని దేశాల తలనొప్పి అనుకుంటే పొరపాటు. ఇది ప్రపంచానికే ముప్పు అని ముందు గుర్తించాలి. ‘ఇది మరో కరోనా కాదు’ అంటూ డబ్ల్యూహెచ్ఓ అంటున్నా, వైరస్ విజృంభణ ధోరణులు భయపెడుతున్నాయి. టీకాలు, చికిత్సలు లేకుండా ఆఫ్రికా దేశాలను వాటి ఖర్మానికి వదిలేయడం దుస్సహం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ సమన్వయంతో కట్టడికి కృషి చేయాలి. అత్యవసర ఆరోగ్య పరిస్థితి అని ప్రకటించడంలోని అసలు ఉద్దేశం అదే! జంతుజాల వైరస్లు పదే పదే ఎందుకు తలెత్తుతున్నాయో దృష్టి పెట్టాల్సి ఉంది. విస్మరిస్తే మనకే కష్టం, నష్టం. పారాహుషార్! -
అనుమానం ఉంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేయండి.. మంకీపాక్స్పై కేంద్రం ఆదేశాలు
ఢిల్లీ : కాంగో సహా ఆఫ్రికాలోని పలు దేశాలలో విస్తరిస్తున్న ప్రాణాంతకమైన ఎంపాక్స్ (మంకీపాక్స్) వ్యాధి తీవ్రతను గమనించి అంతర్జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ఓ). ఈ తరుణంలో ఎంపాక్స్పై భారత్ అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ వార్డులను సిద్ధం చేయడం, విమానాశ్రయాల్లో తనిఖీలు చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని మూడు నోడల్ ఆసుపత్రులు సఫ్దర్జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్,రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ఎంపిక చేసింది. అనుమానిత రోగులపై ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేసినట్లు సమాచారం. భారత్లో ఇప్పటి వరకు ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదు. అయితే ఆగస్ట్ 16న యూఏఈ నుంచి దేశానికి వచ్చిన ముగ్గురు రోగుల్ని పాకిస్థాన్ గుర్తించింది. అంతకుముందు, స్వీడన్, ఆఫ్రికా వెలుపల మొదటి పాక్స్ కేసును నిర్ధారించాయి. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల రెండేళ్లలో రెండవ సారి ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎంపాక్స్ ప్రమాదకరంగా మారిందని తెలిపింది. అదే సమయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. -
మంకీపాక్స్పై WHO హెచ్చరికలు.. అప్రమత్తమైన కేంద్రం
కరోనా తర్వాత ఇప్పుడు ప్రపంచ దేశాల్ని కలవర పెడుతున్న మంకీపాక్స్పై కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీపాక్స్ (ఎంపాక్స్)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మంకీ పాక్స్ ఆఫ్రికా నుంచి పొరుగుదేశమైన పాకిస్థాన్కు చేరడంతో మోదీ తక్షణ చర్యలకు సిద్ధమయ్యారు.ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్ట్18) మంకీ పాక్స్పై ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. వ్యాధిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు పీకే మిశ్రా జారీ చేశారు. మంకీ పాక్స్ను ఎదుర్కొనే అంశంతో పాటు ముందుగానే రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబులు ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ సూచించారని చెప్పారు.మంకీపాక్స్ సోకిన రోగుల సంఖ్యఆఫ్రికా దేశాల్లో ఈ ఏడాది మంకీపాక్స్ సోకిన రోగుల సంఖ్య 18,737కి చేరింది. ఈ ఒక్క వారంలోనే 1200 కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ప్రాణాంతకమైన క్లాడ్-1తో పాటు అన్నీ రకాల వైరస్లతో కలిపి ఈ గణాంకాలు విడుదల చేసినట్లు పేర్కొంది. మొత్తంగా 545 మరణాలు సంభవించాయి. ఆఫ్రికా ఖండంలో 97 శాతం కేసులు, మరణాల కేసులో కాంగోలో నమోదవుతుండగా..ఈ ఒక్క వారంలో 202 కేసులు నిర్ధారణ కాగా.. 24 మంది మృత్యువాత పడ్డారు. 12 ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ కేసుల్ని గుర్తించగా..మరణాల రేటు 8.2శాతంగా ఉంది. కాంగో సరిహద్దు దేశం బురుండిలో ఈ వారంలో 39కేసులు నిర్ధారణయ్యాయి. ఆఫ్రికా వెలుపల పాకిస్థాన్లలో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి.డబ్ల్యూహెచ్ఓ అత్యవసర స్థితిమంకీపాక్స్ విజృంభణ వేళ డబ్ల్యూహెచ్ఓ ఇప్పటికే అంతర్జాతీయంగా ఆందోళనలతో కూడిన అత్యవసర స్థితిని ప్రకటించింది. విపత్తుపై అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది. తొలిదశలో ఆ కమిటీ సిఫార్స్లను ప్రచురిస్తామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఎన్జీవోలతో కలిసి టీకా ఉత్పత్తులను వేగవంతం చేయాలని పిలుపునిచ్చింది. అటు దక్షిణాఫ్రికాలో సమావేశమైన దక్షిణాఫ్రికా డెవలప్మెంట్ దేశాల ప్రతినిధులు ఖండంలో కోరలు చాస్తున్న ఎంపాక్స్పై చర్చించారు. డబ్ల్యూహెచ్ఓతో పాటు పలు దేశాలు వ్యాధి నియంత్రణా సంస్థలు అంతర్జాతీయ భాగస్వాములు, మంకీపాక్స్ నివారణకు కృషి చేయాలని అభ్యర్ధించారు. ప్రభావ దేశాలకు సంఘీభావం, మద్దతును ప్రకటించారు. -
మంకీపాక్స్ లక్షణాలు ఇవే.. చికిత్స గురించి తెలుసా?
ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీ పాక్స్ (ఎంపాక్స్) మహమ్మారిని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఎంపాక్స్ సుమారు 70 దేశాలకు పాకింది. ఇప్పటివరకు 100 మంది ఎంపాక్స్తో మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే..సుమారు 17 వేలకుపైగా అనుమానిత కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎంపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గత రెండేళ్లలో డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటించడం ఇది రెండోసారి. కాంగోలో మంకీ పాక్స్ వైరల్ ఇన్ఫెక్షన్ విజృంభించడం సహా ఇతర చుట్టు పక్కల 12 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.ఎంపాక్స్ను మంకీపాక్స్ అని కూడా అంటారు. 1958లో కోతులలో పాక్స్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు దీనిని తొలిసారిగా గుర్తించారు. ఇటీవలి మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో సోకిన జంతువులతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తులలో ఎంపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి.మంకీపాక్స్ బాధితుల్లో కూడా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి. దద్దుర్లు నొప్పిని కలుగజేస్తాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే అంతమైన మంకీపాక్స్ వ్యాధి.. స్వలింగ సంపర్గం వల్లే ఇతర దేశాలకు వ్యాపించి ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి. మంకీపాక్స్ గురించి ప్రపంచదేశాలకు దశాబ్దాలుగా తెలుసు. దీని విరుగుడుకు వ్యాక్సిన్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. స్మాల్పాక్స్ (మశూచి) వ్యాక్సిన్నే మంకీపాక్స్ బాధితులకు ఇస్తున్నారు. అది ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైంది. డెన్మార్క్కు చెందిన బవారియన్ నోర్డిక్ కంపెనీ మాత్రమే మంకీపాక్స్ నివారణకు వ్యాక్సిన్ను తయారు చేస్తోంది. -
విజృంభిస్తున్న మంకీఫాక్స్..డబ్లుహెచ్ఓ మరోసారి హెల్త్ ఎమర్జెన్సీ!
ప్రపంచవ్యాప్తంగా మంకీ ఫ్యాక్స్ వేగంగ విజృంభిస్తోంది. కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాదు ఈ వ్యాప్తి విషయమై ఓ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిది కూడా. డబ్ల్యూహెచ్ఓ ఇలా ప్రకటించడం రెండేళ్లలో ఇది రెండోసారి. ఈ వ్యాధి సాధారణ ప్లూ వంటి తేలికపాటి లక్షణాలలో మొదలవుతుంది. ఒక్కోసారి అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకంగా మారి శరీరంపై చీముతో నిండిన గాయాలను కలిగిస్తుంది. కాంగోలో ఈ వ్యాధి క్లాడ్I తో ప్రారంభమై.. క్లాడ్Ibగా రూపాంతరం చెందినట్లు అధికారులు తెలిపారు. ఇది ఇంతవరకు లైంగిక సంపర్కం వల్ల వస్తుందని అనుకున్నారు. కానీ తర్వాత సన్నిహిత పరిచయం ఉన్నవాళ్ల నుంచి కూడా సక్రమిస్తున్నట్లు కొన్ని కేసుల ద్వారా తేలింది. అలా ఇప్పటి వరకు కాంగో నుంచి బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాతో సహా పొరుగ దేశాలకు వ్యాపించినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ నేపథ్యలోనే డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేయడమే గాక అంతర్జాతీయంగా ప్రజారోగ్య చర్యలను వేగవంతం చేయాలని కోరింది. అలాగే నిధులు సమకూర్చి వ్యాధిని అరికట్టేలా సహకరించాలని విజ్ఞప్తి చేసింది. దీంతోపాటు ప్రజల ప్రాణాలను కాపాడేలా అంతర్జాతీయ స్థాయిలో సమన్వయంతో కూడిన ప్రతిస్పందన కూడా అవసరమని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ అన్నారు. కాగా, ఆఫ్రికా ఖండంలో ఇప్పటివరకు 17,000 అనుమానిత మంకీఫాక్స్ కేసులు, 517 మరణాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 160% కేసులు పెరిగాయని ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. మొత్తంగా 13 దేశాల్లో కేసులు నమోదయ్యాయి.(చదవండి: పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ లుక్ వేరేలెవెల్!) -
భారత్లోనే కోవిడ్-19 మరణాలు ఎక్కువ.. ఖండించిన కేంద్రం
న్యూఢిల్లీ: కోవిడ్-19 సమయంలో భారత్లో అధిక మరణాలు సంభవించాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం తెలిపింది. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో పేర్కొన్న అధ్యయనాన్ని కేంద్రం కొట్టిపారేసింది. భారత్లో అధికారిక కోవిడ్-19 మరణాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల కంటే 1.5 రెట్లు ఎక్కువ అని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నివేదించారు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, అధిక-ఆదాయ దేశాలలో కనిపించే నమూనాలతో పోలిస్తే, మహమ్మారి సమయంలో మహిళల కంటే పురుషులలో అధిక మరణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. అయితే,ఆ రిపోర్ట్పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. సైన్స్ అడ్వాన్సెస్ పేపర్లో నివేదించబడిన అదనపు మరణాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. జర్నల్స్ లోపభూయిష్టంగా ఉందని, ఆమోదయోగ్యం కాని ఫలితాలను చూపుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
2020లో భారత్లో కరోనాతో... 11లక్షల అధిక మరణాలు
న్యూఢిల్లీ: కరోనా వల్ల 2020లో భారత్లో కేంద్రం చెప్పిన వాటికంటే ఏకంగా 11.9 లక్షల అధిక మరణాలు సంభవించినట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి పేర్కొంది. ఇది భారత్ అధికారిక గణాంకాల కంటే 8 రెట్లు, డబ్ల్యూహెచ్ఓ అంచనాల కంటే ఒకటిన్నర రెట్లు అధికం! 2019తో పోలిస్తే ఈ మరణాలు 17 శాతం అధికమని అధ్యయనం పేర్కొంది. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్, మరికొన్ని విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందుకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 గణాంకాలను పరిగణనలోకి తీసుకున్నారు. 2019 నుంచి 2020 దాకా దేశవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా బాధితుల డేటాను సైతం పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కోవిడ్–19 సంబంధిత మరణాల్లో మూడింట ఒక వంతు మరణాలు ఇండియాలోనే చోటుచేసుకున్నాయని వెల్లడించారు. కోవిడ్–19 ప్రభావం వల్ల ప్రజల సగటు ఆయుర్దాయం 2.6 ఏళ్లు తగ్గినట్లు తెలిపారు. మహిళల ఆయుర్దాయం 3.1 ఏళ్లు, పురుషుల ఆయుర్దాయం 2.1 ఏళ్లు తగ్గినట్లు గుర్తించారు. అధ్యయనం వివరాలను ‘సైన్స్ అడ్వాన్సెస్’ పత్రికలో ప్రచురించారు.అవన్నీ కరోనా మరణాలు కాదు అధ్యయనం గణాంకాలపై కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అధ్యయనం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆక్షేపించింది. ఈ గణాంకాల్లో వాస్తవం లేదని, అవన్నీ కరోనా మరణాలు కావని పేర్కొంది. -
రక్తం కాదు.. ప్రాణం ఇచ్చినట్టే!
ఏదైనా ప్రమాదం జరిగింది, లేకుంటే ఏదో అత్యవసర సర్జరీ జరిగింది.. ట్రీట్మెంట్ కోసం రక్తం కావాలి. అప్పటికప్పుడు ఎవరైనా దాత దొరికితేనో, బ్లడ్ బ్యాంకుల్లో స్టాక్ ఉంటేనో సరి. లేకుంటే ఎంతో విలువైన ప్రాణాలు గాలిలో కలసిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలోనే రక్తదానంపై అవగాహన కల్పించడం, రక్తదానంపై ఉన్న అపోహలు, వదంతులకు చెక్ పెట్టడం లక్ష్యంగాఏటా జూన్ 14న ‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’ను నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..జూన్ 14నే ఎందుకు?ఒకప్పుడు ఒకరి రక్తాన్ని మరొకరికి ఎక్కించడమనే చికిత్సే లేదు. ఒకవేళ అలా చేసినా.. బాధితులు బతికేవారు కాదు. దానికి కారణం మన రక్తం వేర్వేరుగా ఉండటమేనని ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ లాండ్స్టీనర్ 1990వ దశకంలో గుర్తించారు. రక్తాన్ని ఏ, బీ, ఓ గ్రూపులుగా వర్గీకరించారు. ఆయన పుట్టినరోజు అయిన జూన్ 14వ తేదీని ‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’కోసం ఎంపిక చేశారు.రక్తదానంపై అవగాహన పెంచేందుకు.. ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రమాదాల బాధితులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు సరైన సమయానికి రక్తం అందక ప్రాణాలు వదులుతున్నారు. ఈ క్రమంలో రక్తదానంపై అవగాహన పెంచేందుకు ప్రఖ్యాత సంస్థలు నడుం బిగించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్ సొసైటీస్ (ఐఎఫ్ఆర్సీఎస్), అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్స్ (ఐఎఫ్బీడీఓ), అంతర్జాతీయ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ (ఐఎస్బీటీ) సంస్థలు కలసి తొలిసారిగా 2004 జూన్ 14వ తేదీ నుంచి ‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’ను నిర్వహించడం మొదలుపెట్టాయి. దీనికి ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తవుతుండటంతో.. ‘20 ఏళ్ల రక్తదానం. దాతలకు కృతజ్ఞతలు’అనే థీమ్తో నిర్వహిస్తున్నారు.పేదరికానికి ‘రక్తం’ లింకు..ప్రమాదాల్లో గాయపడ్డవారు, సర్జరీలు చేయించుకునేవారికే కాదు తలసేమియా, హీమోఫీలియా, ఎనీమియా వంటి వాటితో బాధపడుతున్నవారికి కూడా తరచూ రక్తం ఎక్కించడం అవసరం. ముఖ్యంగా నిరుపేద దేశాల్లో చిన్నపిల్లలు వివిధ వ్యాధులకు లోనవడం, పోషకాహార లోపం వంటివాటితో.. రక్తం ఎక్కించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటోంది.– ప్రపంచవ్యాప్తంగా చూస్తే ధనిక దేశాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రమాదాలు, సర్జరీలు, వయసు మీదపడటం వల్ల వచ్చిన సమస్యల బాధితులకు రక్తం ఎక్కువగా ఎక్కిస్తున్నారు.– పేద దేశాల్లో రక్త హీనత, వివిధ వ్యాధులు, పోషకాహార లోపం వంటి వాటితో బాధపడుతున్న చిన్నారులు, మహిళలకు రక్తం ఎక్కువగా అవసరం పడుతోంది. దానం చేస్తే.. మనకూ ఆరోగ్యం! రక్తదానం చేయడం వల్ల అవతలివారి ప్రాణాలను కాపాడటమేకాదు.. మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్లమూ అవుతామని వైద్య నిపుణులు చెప్తున్నారు. రక్తదానం వల్ల మన శరీరంలో ఐరన్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయని.. కొత్త రక్తం ఉత్పత్తి, రక్త ప్రసరణ తీరు మెరుగుపడతాయని అంటున్నారు. ఇది గుండె సంబంధిత వ్యాధుల ముప్పును అరికడుతుందని, బరువు తగ్గేందుకూ తోడ్పడుతుందని వివరిస్తున్నారు. మొత్తంగా రక్తదాత శారీరక, మానసిక ఆరోగ్యానికి దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు. రక్తంలో ఏభాగాన్ని ఎన్నిసార్లు దానం చేయొచ్చు?పూర్తిస్థాయి రక్తమైతే.. 90 రోజులకోసారి ప్లాస్మా ఒకటే అయితే.. 28 రోజులకోసారి ప్లేట్ లెట్లు మాత్రమే అయితే.. 14 రోజులకోసారి ఎర్ర రక్తకణాలు మాత్రమే అయితే 112 రోజులకోసారి భారతదేశంలో రక్తదానం పరిస్థితి ఇదీ.. ఏటా అవసరమైన రక్తం 5 కోట్ల యూనిట్లు ఎవరెవరు రక్తదానం చేయొచ్చు?– పురుషులు 3 నెలలకు ఒకసారి.. మహిళలు 4 నెలలకు ఒకసారి – వయస్సు పరిమితి18 – 65 ఏళ్ల మధ్య – కనీసం ఉండాల్సిన బరువు 45 కిలోలు – దగ్గు, జలుబు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు ఏవీ ఉండకూడదు. – ఏవైనా వ్యాక్సిన్లు వేసుకున్నవారు కనీసం 15 రోజులనుంచి నెలరోజుల్లోపు రక్తదానం చేయవద్దు. – రక్తదానం చేసినవారు రెండు రోజుల పాటు నీళ్లు, పళ్లరసాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. తీవ్ర శారీరక శ్రమకు దూరంగా ఉండాలి. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం..– రక్తదాతల నుంచి అందుతున్నది 2.5 కోట్ల యూనిట్లు – దాత నుంచి సేకరించే రక్తం350 మిల్లీలీటర్లు – ఇందుకుపట్టే సమయం15 నిమిషాలు– ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి 2 సెకన్లలో ఒకరికి రక్తం అవసరం పడుతోంది. – ఏటా ప్రపంచవ్యాప్తంగా రక్తదానాలు 11.85 కోట్లు– అందులో ధనిక దేశాల నుంచి వస్తున్నవే 40%– పేద దేశాల్లో రక్తం ఎక్కిస్తున్న వారిలో ఐదేళ్లలోపు పిల్లలే 54%– ధనిక దేశాల్లో రక్తం ఎక్కిస్తున్నవారిలో 60 ఏళ్లు పైబడిన వారు76% -
భారత్లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్ఫ్లూ
న్యూఢిల్లీ : భారత్లో బర్డ్ ఫ్లూ కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కీలక ప్రకటన చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన నాలుగేళ్ల బాలుడికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారించింది. బాలుడిలో h9n2బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు వెల్లడించింది. బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు వెలుగులోకి రావడంతో బాలుడిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చేరిన తర్వాత బాలుడికి శ్వాసకోస సంబంధిత సమస్యలు తలెత్తాయని, ప్రస్తుతం ఐసీయూ వార్డ్లో ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.భారత్లో ఇది రెండో కేసుభారత్లో H9N2 బర్డ్ఫ్లూను మనుషుల్లో గుర్తించడం ఇది రెండోసారి. 2019లో ఒకరు దీని బారినపడ్డారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. రెండున్నరేళ్ల చిన్నారిలో భారత్లో పర్యటించిన జూన్7న ఆస్ట్రేలియాలో రెండున్నరేళ్ల చిన్నారిలో h5n2 బర్డ్ఫ్లూ లక్షణాలు కనిపించాయి. అంతకుముందే ఆ చిన్నారి భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వచ్చినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. బర్డ్ఫ్లూ లక్షణాలు డబ్ల్యూహెచ్ఓ మేరకు..బర్డ్ఫ్లూ వైరస్ సోకితే వ్యాధిగ్రస్తుల్లో కండ్లకలక, కడుపులో అసౌకర్యం, పొత్తికడుపు తిమ్మిరి, వికారం, వాంతులు, గుండెల్లో మంట,మెదడు వాపు,అనాక్సిక్ ఎన్సెఫలోపతి : కార్డియాక్ అరెస్ట్ లేదా మెదడుకు ఆక్సిజన్/ప్రసరణ కోల్పోవడంతో పాటు ఇతర లక్షణాలు ఉత్పన్నమై ప్రాణంతంగా మారుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. బర్డ్ఫ్లూ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు బర్డ్ఫ్లూ సోకకుండా ఉండేందుకు ముందుగా మూగజీవాలకు దూరంగా ఉండాలి. మూగజీవాల ద్వారా వైరస్లు ప్రభావితమయ్యే ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని తెలిపింది.ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మూగజీవాలు ఉన్న ప్రాంతాలను సందర్శించే ముందు, తర్వాత తప్పని సరిగా సబ్బులతో చేతుల్ని శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది. -
బర్డ్ఫ్లూ వేరియంట్తో తొలిమరణం.. డబ్ల్యూహెచ్ఓ యూటర్న్
బర్డ్ఫ్లూ హెచ్5ఎన్2 వేరియంట్తో ఓ వ్యక్తి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అంతలోనే యూటర్న్ తీసుకుంది. మరణించిన సదరు వ్యక్తిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించి, త్వరలో స్పష్టత ఇస్తామని వెల్లడించింది.ఇటీవల హెచ్5ఎన్2 బర్డ్ఫ్లూ వేరియంట్తో మెక్సికోకు చెందిన ఓ వ్యక్తి మరణించారని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఈ వైరస్ వల్ల ప్రపంచంలో నమోదైన తొలి మరణం ఇదే అని తెలిపింది.అయితే, మెక్సికో ఆరోగ్య మంత్రిత్వ శాఖ 59 ఏళ్ల వ్యక్తికి దీర్ఘకాలిక కిడ్నీ సమస్య, టైప్ 2 డయాబెటిస్, దీర్ఘకాలిక రక్తపోటు సమస్య ఉందని అధికారిక ప్రకటన చేసింది.బాధితుడిలో ఇతర అనారోగ్య సమస్యలు ఏప్రిల్ 17న జ్వరం, శ్వాస ఆడకపోవడం, విరేచనాలు, వికారం, సాధారణ అస్వస్థత వంటి తీవ్రమైన లక్షణాలు కనిపించడానికి మూడు వారాల ముందు అనారోగ్యానికి గురయ్యాడు. అత్యవసర చికిత్స కోసం బాధితుడిని ఏప్రిల్ 24న మెక్సికోలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రోజు మరణించాడు.బర్డ్ ఫ్లూ మరణం కాదుఈ తరుణంలో శుక్రవారం జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి క్రిస్టియన్ లిండ్మీర్ మాట్లాడుతూ..ఈ మరణం పలు రకాల అనారోగ్య సమస్యల వల్ల మరణించారని, హెచ్5ఎన్2కి సంబంధించిన మరణం కాదని చెప్పారు. బర్డ్ఫ్లూ గుర్తించాం.. అంతేవైద్యం నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన వైద్యులు బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్ల కోసం పరీక్షలు చేయగా.. బాధితుడిలో హెచ్5 ఎన్2 వేరియంట్ గుర్తించామని లిండ్మీర్ చెప్పారు. అతనితో పరిచయం ఉన్న 17 మందికి టెస్ట్లు చేయగా నెగిటివ్గా తేలిందిత్వరలోనే స్పష్టత ఇస్తాంపరిశోధనలు కొనసాగుతున్నాయి. సెరోలజీ కొనసాగుతోంది. అంటే ముందుగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూడటానికి రక్త పరీక్ష అని లిండ్మీర్ చెప్పారు. అతనిలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని, పూర్తి స్థాయిలో నిర్ధారించిన వెంటనే.. మరణంపై స్పష్టత ఇస్తామని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి లిండ్మీర్ పేర్కొన్నారు. -
చెడు అలవాట్లతో 'మెదడుకు చేటు'..
సాక్షి, అమరావతి: ఆధునిక జీవనశైలి, దురలవాట్ల కారణంగా మెదడు సంబంధిత జబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో వయోభారం, బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం తదితర కారణాలతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుండేది. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో 25–30 శాతం కేసుల్లో బాధితుల వయస్సు 20–45 ఏళ్ల లోపే ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజీ విభాగం వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం ఏడాది కాలంలో 300 మంది స్ట్రోక్తో అడ్మిట్ కాగా.. 25 శాతం మంది 21–45 ఏళ్ల వయస్సు వారేనని తేలింది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటిమంది ఈ స్ట్రోక్ బారినపడుతుండగా, వీరిలో సగం మంది మృత్యువాత పడుతున్నారు. మిగిలిన వారు శాశ్వత వికలాంగులుగా మిగిలిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇటీవల వెల్లడించింది. దురలవాట్లతో చేటు..ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు మెదడుకు చేటుచేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాట్లను మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడంలేదు. బ్రిటీష్ మెడికల్ జర్నల్ 2021లో వెల్లడించిన ఒక అధ్యయనం ప్రకారం.. ధూమపానం, మద్యపానం అలవాట్లున్న వ్యక్తులు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడటానికి 80 శాతం ఎక్కువ అవకాశాలున్నాయి. గుండె జబ్బులకు దారితీసే ప్రధాన కారకాల్లో ధూమపానం ఒకటి. గుండెపోటు కేసుల్లో 25 శాతం వరకూ ఇదే ప్రధాన కారణంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే, పొగాకులోని నికోటిన్, విషతుల్యాలు రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తాయి. దీంతో రక్తనాళ గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి పూడిక ఏర్పడుతుంది. పూడిక చిట్లిపోతే హఠాత్తుగా రక్తం గడ్డకట్టి నాళం పూర్తిగా మూసుకుపోవచ్చు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అదే విధంగా మెదడు రక్తనాళాల్లో పూడికలతో స్ట్రోక్ సంభవిస్తుంది. ఏటా కేసుల పెరుగుదల..బ్రెయిన్ స్ట్రోక్, ఇతర న్యూరో సంబంధిత కేసులు ఏటా పెరుగుతున్నాయి. ఇందుకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద అందించిన చికిత్సలే నిదర్శనంగా ఉంటున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద న్యూరో, న్యూరో సర్జరీ విభాగాల్లో చికిత్స పొందిన రోగుల సంఖ్య గడిచిన ఐదేళ్లలో ఏటా వృద్ధి చెందుతూ వచ్చింది. 2019–20లో 26,023 మంది చికిత్స పొందారు. 2022–23 నాటికి ఈ సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ఆ ఏడాది 40 వేల మందికి ప్రభుత్వం ఉచితంగా చికిత్సలు అందించింది. ఇక 2023–24లోను చికిత్స పొందిన వారి సంఖ్య 40 వేలు దాటింది. యువతలో బ్రెయిన్ స్ట్రోక్కు కారణాలు..⇒ బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం.. ఊబకాయం ఉండటం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 25 శాతం మంది బీపీ, షుగర్తో బాధపడుతున్నారు.⇒ కొందరిలో బీపీ, షుగర్ సమస్యలు ఉన్నప్పటికీ సంబంధిత లక్షణాలు లేకపోవడంతో బయటకు తెలీడంలేదు. కానీ లోలోపల జరగాల్సిన నష్టం జరుగుతోంది.⇒ మహిళలు నెలసరిని వాయిదా వేయడం, అధిక రక్తస్రావాన్ని నియంత్రించుకోవడం కోసం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా మందులు వాడటం..⇒ ఊబకాయం కూడా బ్రెయిన్ స్ట్రోక్కు దారి తీస్తోంది. ⇒ శారీరక శ్రమ లేకపోవడం.తీసుకోవాల్సిన జాగ్రత్తలు..⇒ రోజుకు 45 నిమిషాలు నడవాలి, ఇతర వ్యాయామాలు చేయాలి.⇒ ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్ను పూర్తిగా నియంత్రించాలి.⇒ శరీర బరువును నియంత్రించుకోవాలి. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే తరుచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.⇒ తీవ్ర ఒత్తిడికి లోనవ్వకుండా ఉండాలి. ఆరు గంటలు నిద్రపోవాలి.జీవనశైలి మార్పుపై దృష్టిపెట్టాలి..గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈ మధ్య కాలంలో యంగ్ ఏజ్ స్ట్రోక్ కేసులు ఎక్కువగా చూస్తున్నాం. సాధారణంగా 55 ఏళ్లు పైబడిన వారిలోనే స్ట్రోక్ ఎక్కువగా వస్తుంది. అయితే, ప్రస్తుతం అందుకు భిన్నంగా కేసులు వస్తున్నాయి. 25 ఏళ్లు, అంతకంటే చిన్న వయస్సు వాళ్లు బ్రెయిన్ స్ట్రోక్ బారినపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఆధునిక జీవనశైలి. యువతలో కొందరు ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు అలవాటుపడుతున్నారు. ఇది కొందరిలో వ్యసనంగా మారుతోంది. ఇలాంటి వారిలో ఐదేళ్ల అనంతరం స్ట్రోక్ రావడానికి అవకాశముంది. ఈ క్రమంలో ప్రజలు జీవనశైలి మార్పు చేసుకోవడంతో పాటు బీపీ, షుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై దృష్టిపెట్టాలి. మరోవైపు.. స్ట్రోక్ బాధితులను గోల్డెన్ హవర్లో ఆస్పత్రికి తీసుకొస్తే ప్రాణాపాయం నుంచి రక్షించడానికి ఆస్కారం ఉంటుంది. – డాక్టర్ ఎన్. వెంకటసుందరాచారి, న్యూరాలజిస్ట్, మచిలీపట్నం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ -
ఉప్పు తగ్గించండిరా బాబోయ్! ఏటా 25 లక్షలమందికి ముప్పు
ప్రపంచవ్యాప్తంగా మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుకుంటారు. హైబీపీ అనేది సెలంట్ కిల్లర్ లాంటిది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా ఉప్పువల్లే ముప్పు ఏర్పడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కువ ఉప్పు వాడకం కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. రోజుకు ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే లక్షల మందిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని కూడా పేర్కొంది.పెద్దలు సగటున రోజుకు 4310 మిల్లీ గ్రాములు (సుమారు 10.78 గ్రాముల ఉప్పుకు సమానం) సోడియం తీసుకుంటున్నారని, ఇది సిఫారసు చేసిన పరిమితి 2000 mg (సుమారు 5 గ్రాముల ఉప్పు) కంటే ఇది రెండింతలు ఎక్కువని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. దీని వల్ల హృదయ సంబంధ వ్యాధులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, మెనియర్స్ వ్యాధి ,మూత్రపిండాల వ్యాధితో సహా వివిధ ఆరోగ్య సమస్యలొస్తాయని తెలిపింది. దీని వల్ల ఏటా 1.89 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.డైనింగ్ టేబుల్ నుంచి ఉప్పు తీసేయండిప్రాసెస్ చేసిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలనీ, తాజా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచించింది.నకు బదులుగా సుగంధ ద్రవ్యాలు, వన మూలికలను వాడమని సూచించింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్కు ప్రతిగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది. అంతేకాదు డైనింగ్ టేబుల్ నుండి తొలగించాలంటూ సలహా ఇచ్చింది. కమర్షియల్ సాస్లు, ఫుడ్స్ తగ్గించాలని కూడా కోరింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్కు , బదులుగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వివరించింది. -
ప్రపంచానికి పొంచివున్న మరో మహమ్మారి ముప్పు: డిసీజ్ ‘ఎక్స్’
కోవిడ్-19 మహమ్మారితో అల్లాడిపోయిన ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కోవిడ్-19 కంటే 20 రెట్లు ప్రాణాంతకం కావచ్చట. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీనికి ఇచ్చిన పేరు డిసీజ్ ‘ఎక్స్’ (Disease X). నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాధి X ఎప్పుడైనా ,ఎక్కడైనా పెరుగుతుంది. లేదా ఇప్పటికే ప్రస్తుతం ఎక్కడో పెరుగుతూ ఉండవచ్చు లేదా ఇప్పటికే పెరిగి ఉండవచ్చు. దీని ఆవిర్భావాన్ని అంచనా వేయడం అంత తేలిక కాదని, మరో విధంగా చెప్పాలంటే డిసీజ్ X తో మానవజాతి అంతం కావచ్చేనే అంచనాలు కూడా ఉన్నాయి. డిసీజ్ ఎక్స్ రూపంలో ప్రపంచానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని వారు జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీలో సీనియర్ స్కాలర్ అమేష్ అడాల్జా ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్ను ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇది కొత్తది కాదని 2018 నుండి ఎక్స్ వ్యాధి గురించి చర్చ ఉందని అమేష్ అడాల్జా తెలిపారు. వైరస్ ద్వారా రావచ్చు. లేదా ఒక జంతు జాతి నుండి మానవునికి వ్యాపించి కొత్త లక్షణాలను అభివృద్ధి చేసే మహమ్మారిగా మారవచ్చు అని అంచనావేశారు. 90 శాతం సాధారణ జలుబు లేదా న్యుమోనియాగా ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. టీకాలు, యాంటీవైరల్లు, మోనోక్లోనల్ యాంటీ బాడీలు, డయాగ్నస్టిక్ సెంటర్లు ఎంత వేగంగా అందుబాటులో ఉంటే మహమ్మారిని నిలువరించడం అంత సులభం అవుతుందన్నారు. ముఖ్యంగా డబ్ల్యూహెచ్వో, సీడీసీ, యూరోపియన్ సీడీడీ, యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఏజెన్సీలు సంసిద్ధంగా ఉండాలన్నారు. అలాగే కరోనామహమ్మారి తరహాలో డిసీజ్ ఎక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తుందని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న డేమ్ కేట్ బింగ్ హామ్ ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న అనేక వైరస్లు వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, అయితే వాటినన్నింటిని ప్రమాద కరమైనవిగా పరిగణించలేమని, వాటిలో కొన్ని ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
గరళ కంఠ భారతం
ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అంటూ రొమ్ము విరుచుకుంటున్న మనకు ఇప్పుడు పెద్ద అపకీర్తి కిరీటమూ దక్కింది. ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత దేశాల్లో భారతదేశం ఒకటని తాజాగా తేలింది. స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ మొత్తం 134 దేశాలు, ప్రాంతాల్లోని 7,812 నగరాలలో 30 వేలకు పైగా వాయు నాణ్యతా పర్యవేక్షక కేంద్రాల నుంచి డేటా సేకరించి ఈ నివేదికను అందించింది. వారి ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక ప్రకారం అత్యంత కాలుష్యదేశాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ల తర్వాత మూడో స్థానం భారత్దే. 2022లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్ ఒక్క ఏడాది కాలంలో కాలుష్యంలో మూడో ర్యాంకుకు చేరడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత రాజధాని అనే దుష్కీర్తి వరుసగా రెండో ఏడాది కూడా మన ఢిల్లీకే దక్కింది. అవి చాలదన్నట్టు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా బెగూసరాయ్ నిలవడం దిమ్మ తిరిగేలా చేస్తోంది. ప్రపంచంలో గత ఏడాది ఎదురైన ఆరోగ్య విపత్తు వాయు కాలుష్యమని నిపుణుల మాట. మన దేశంలో శిలాజ ఇంధనాల వినియోగం ప్రధాన కాలుష్యకారకం కాగా, ఉత్తరాదిన ఖరీఫ్ సీజన్లో పంట వ్యర్థాల్ని కాల్చే అలవాటుకు సరైన ప్రత్యామ్నాయం చూపడంలో పాలకుల వైఫల్యాలు సైతం ఢిల్లీ దుఃస్థితికి కారణమై వెక్కిరిస్తున్నాయి. అయితే, మెట్రోలు, గౌహతి – పాట్నా లాంటి ద్వితీయ శ్రేణి నగరాలే కాదు... బిహార్లోని బెగూసరాయ్, హర్యానాలోని రోహ్తక్, యూపీలోని మీరట్ లాంటి చిన్న పట్నాలు సైతం వాయు గరళంతో నిండిపోతున్నాయని నివేదిక తేల్చింది. ఐక్యూ ఎయిర్ జాబితాలోని 83 భారతీయ నగరాల్లో చాలావాటిలో కాలుష్య కారకాలు ఏమిటనే సమాచారం లేదు. అలాగే, బెగూసరాయ్ లాంటి చోట ఏడాది తిరగక ముందే కాలుష్యం 6 రెట్లు ఎలా పెరిగిందనేది కనిపెట్టాల్సి ఉంది. కారణాల్ని అంచనా వేస్తూనే, ముంచుకొచ్చిన ఈ ముప్పును విధానపరమైన పరిష్కారాలతో సమర్థంగా ఎదుర్కోవడం పాలకుల ముందున్న సవాలు. గాలిలో ధూళికణాల (పీఎం) సాంద్రత ఏ మేరకున్నదనే దాన్ని బట్టి వాయుకాలుష్య ర్యాంకులు నిర్ణయిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం క్యూబిక్ మీటర్కు 5 మైక్రోగ్రాములు ఫరవాలేదు. అలాకాక, ధూళికణాలు 2.5 మైక్రాన్లు లేదా అంతకన్నా తక్కువ వ్యాసం (పీఎం 2.5) ఉన్నప్పుడు ఊపిరితిత్తుల, గుండె జబ్బులు, క్యాన్సర్, చిన్న వయసులోనే మర ణాలు సంభవిస్తాయి. కాబట్టి అది ప్రమాదఘంటికకు కొలమానం. 2023లో భారత్లో వార్షిక సగటు పీఎం2.5 సాంద్రత క్యూబిక్ మీటర్కు 54.4 మైక్రోగ్రాములుగా రికార్డయింది. అలా భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక, క్యూబిక్ మీటర్కు 79.9 మైక్రోగ్రాములతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో, క్యూబిక్ మీటర్కు 73.3 మైక్రోగ్రాములతో పాకిస్తాన్ రెండోస్థానంలో ఉన్నాయి. నిజానికి, మిగతా రెండు దేశాలతో పోలిస్తే, భారత్ పీఎం2.5 సాంద్రత 2021 నాటి నుంచి తగ్గింది. అప్పట్లో భారత్లో క్యూబిక్ మీటర్కు 58.1 మైక్రోగ్రాములు ఉండేది. ఇప్పుడది 54.4కు తగ్గిందన్న మాటే కానీ ఇవాళ్టికీ ప్రపంచ టాప్ 50 కాలుష్య నగరాల్లో 42 మన దేశంలోవే కావడం కలతపరిచే అంశం. దేశ జనాభాలో కొద్ది మంది మినహా దాదాపు 136 కోట్లమంది నిత్యం డబ్ల్యూహెచ్ఓ మార్గ దర్శకాలను మించి పీఎం2.5 ధూళికణ సాంద్రతకు లోనవుతున్నవారే! మరీ ముఖ్యంగా, మన దేశంలోని పట్టణప్రాంతాల్లో అధిక శాతం మంది ఇలా నిత్యం కాలుష్యం కోరల బారిన పడుతూ, శ్వాస కోశ సమస్యలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతుండడం తరచూ కంటి ముందు కనిపిస్తున్న కథే. మిగిలి నవి అటుంచితే, భారత్లో ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తిలో 70 శాతం థర్మల్ విద్యుత్తే అన్నది గమనార్హం. ఇప్పటికీ మనం పునరుత్పాదక శక్తి వనరుల మార్గం పట్టలేదు. పైపెచ్చు, దేశ ఆర్థిక వృద్ధి మరింత వేగవంతమయ్యేకొద్దీ ఇది పెను సవాలు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇంటి పైకప్పులపై సౌరవిద్యుత్ ఫలకాల ఏర్పాటు లాంటి భారీ ప్రణాళికలు ప్రకటించింది. అయితే, ఇవన్నీ ఆచరణ లోకొచ్చి, ప్రభావం చూపడానికి మరికొంత సమయం పడుతుంది. ఇలాంటి ప్రయత్నాలు గణనీ యంగా ప్రభావం చూపాలంటే, మన విద్యుత్ విధానాలను సమూలంగా మార్చడం ముఖ్యం. అసలు ‘స్వచ్ఛమైన గాలి’ కూడా ప్రాథమిక జీవనహక్కే. కోర్టులు ఆ సంగతి పదేపదే చెప్పాయి. బరిలోకి దిగక తప్పని పరిస్థితిని ప్రభుత్వాలకు కల్పించాయి. అయితే, పౌర రవాణాలో సీఎన్జీ, మెట్రో వ్యవస్థ, ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ లాంటివి తీసుకొచ్చినా ఢిల్లీ లాంటి చోట్ల కాలుష్యం కోరలు చాస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు సమస్య అవగాహన, పరిష్కారానికై శాస్త్ర విజ్ఞానాన్ని ఆశ్రయించాలి. అలాగే, కాలుష్య నియంత్రణకు అవసరమైన రీతిలో జనజీవితంలో అలవాట్లు మారేలా ప్రోత్సాహకాలు, అతిక్రమిస్తే జరిమానాల పద్ధతి తేవాలి. సర్వజన శ్రేయస్సు కోసం పార్టీలన్నీ కాలుష్యంపై పోరును రాజకీయ అంశంగా తీసుకొని, ఎన్నికల మేనిఫెస్టోల్లో చోటివ్వాలి. నిజానికి, జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని పటిష్ఠం చేస్తామంటూ 2019లో కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల వాగ్దానపత్రంలో పేర్కొన్నాయి. ఇది కేవలం కేంద్రం పనే కాదని గుర్తించి, రాష్ట్రాల నుంచి మునిసిపాలిటీల దాకా అన్నీ తమ వంతుగా కాలుష్యంపై పోరులో చేతులు కలపాలి. వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యమే కాక, దరిమిలా సంక్లిష్టమైన పర్యావరణ ప్రక్రియలతో పుడమి వాతావరణమే దెబ్బతింటుందని శాస్త్రవేత్తల మాట. అందుకని ఈ విషానికి విరుగుడు కనిపెట్టడం అన్ని విధాలా అత్యవసరం. ఈ క్రమంలో తాజా ఐక్యూ ఎయిర్ నివేదిక మనకు మరో మేలుకొలుపు. -
రంజాన్ ఉపవాసాలపై డబ్యూహెచ్ఓ మార్గదర్శకాలు!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లీంలకు అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి ఈ రంజాన్ మాసం. ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్లో తొమ్మిదవ నెల ఈ మాసం. ఈ రంజాన్ మాసం భారత్లో మార్చి 12( మంగళవారం) నుంచి ప్రారంభమవుతోంది. ఈ మాసంలో ముస్లీం సోదరులంతా ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. ఈ పవిత్ర మాసం ప్రారంభమయ్యేది సరిగ్గా వేసవికాలం. ఈ నేపథ్యంలో ఆ ఉపవాసలు చేసే సమయంలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఏడాదిలోనే ఈ రంజాన్ మాసంలో కూడా కొన్ని మార్గదర్శకాలను అందించింది. ఉపవాసాలు చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకునే యత్నం చేయమని కోరింది. ఈ ఉపవాస సమయాల్లో సమతుల్య ఆహారం తీసుకోవాలిన సూచించింది. ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుంది కాబట్టి డీ హైడ్రేట్ అయ్యి అలిసిపోకుండా ఉండేలా బలవర్థకమైన ఆహారం తీసుకోమని సూచించింది. తీసుకునే ఆహారంలో ఉప్పు మితంగా ఉండేలా చూసుకోమని సూచించింది. అలాగే ఈ ఉపవాస సమయాల్లో బేకింగ్తో చేసిన పదార్థాలను అస్సలు తీసుకోవద్దని చెబుతోంది. అలాగే డీప్ ఫ్రై చేసే వంటకాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. సాధ్యమైనంత వరకు ఆవిరిపై ఉడికించినవి, కాల్చిన పదార్థాలను తీసుకోవడం ఉత్తమని చెబుతోంది. అలాగే కాస్త వ్యాయామం చేయమని చెబుతోంది. ఎందుకంటే ఉపవాసం విరమించాక ఎక్కువ మొత్తంలో తెలియకుండా ఆహారం తీసుకుంటాం కాబట్టి ఫిట్గా ఉండేలా చూసుకోవడం ముఖ్యం అని సూచించింది. అలాగే పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండమని ఆరోగ్య సంస్థ కోరింది. ఆహ్లాద భరితంగా ఈ రంజాన్ మాసాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తోపాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుకోమని సూచించింది. (చదవండి: ఇవాళ నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు..ఆ దేశాల్లో మాత్రం..!) -
యూరప్ దేశాలను వణికిస్తున్న పారెట్ ఫీవర్
యూరప్లోని అనేక దేశాల్లో పారెట్ ఫీవర్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందారు. పారెట్ ఫీవర్ను సిటాకోసిస్ అని కూడా అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పారెట్ ఫీవర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించింది. యూరప్ దేశాల్లో నివసించే వారిపై పారెట్ ఫీవర్ తీవ్ర ప్రభావం చూపుతోంది. 2023 ప్రారంభంలో విధ్వంసం సృష్టించిన ఈ వ్యాధి.. ఇప్పుడు 2024 ప్రారంభంలో ఐదుగురి ప్రాణాలను బలిగొంది. గత ఏడాది ఆస్ట్రియాలో 14 పారెట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 27 నాటికి డెన్మార్క్లో ఈ అంటువ్యాధికి సంబంధించిన 23 కేసులు నిర్ధారితమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. డెన్మార్క్లో ఒక వ్యక్తిలో ఈ వ్యాధి కనిపించింది. ఈ ఏడాది ఇప్పటికే జర్మనీలో ఐదు కేసులు నమోదయ్యాయి. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం పెంపుడు జంతువులు లేదా అడవి పక్షులతో అనుబంధం కలిగిన వారే అధికంగా ఈ వ్యాధి బారి పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పారెట్ ఫీవర్ అనేది క్లామిడియా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. ఇది వివిధ రకాల అడవి జంతువులు, పెంపుడు పక్షులు, కోళ్లలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు అనారోగ్యంగా కనిపించకపోవచ్చు. కానీ అవి శ్వాస లేదా మలవిసర్జన చేసినప్పుడు బ్యాక్టీరియాను విడుదల చేస్తాయి. ఇదే వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే రెండవ చిన్న ఖండమైన యూరప్లో 50 వరకూ సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. -
కోవిడ్ను మించిన వ్యాధి మనల్ని కబళిస్తుందా?
మొన్నటి వరకూ ప్రపంచాన్ని కోవిడ్-19 వణికించింది. దీని నుంచి కాస్త దూరవుతున్నామనేంతలోనే ఇప్పుడు మరొక ప్రాణాంతక వ్యాధి సమస్త మానవాళిని చుట్టుముట్టేలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా త్వరగా వ్యాపించగల ఈ కొత్త వ్యాధికి ‘డిసీజ్ ఎక్స్’ అనే పేరు పెట్టారు. కరోనా మాదిరిగానే ఈ వ్యాధి కూడా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ప్రాణాలను కూడా మింగేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016లోనే ఈ వ్యాధి పేరును మొదటిసారి ప్రకటించింది. భవిష్యత్తుకు ముప్పుగామారిన ఈ వ్యాధి విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తీవ్రంగా హెచ్చరించింది. 2019లో కోవిడ్-19 వేగంగా వ్యాపించడం వల్ల అనేక దేశాలలో బాధితులకు సహాయం చేయడానికి తగినంత మంది వైద్యులు, నర్సులు, మందులు, పరికరాలు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ కోవిడ్-19 ప్రపంచానికి పెద్ద సమస్యగానే ఉంది. కొందరు శాస్త్రవేత్తలు డిసీజ్ ఎక్స్ వ్యాధి నుంచి మానవాళిని రక్షించేందుకు వ్యాక్సిన్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. కోయలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ అనే గ్రూప్ వ్యాక్సిన్ తయారీకి కృషిచేస్తోంది. ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. ఈ కొత్త వ్యాధి గురించి సమగ్రంగా తెలుసుకున్న తర్వాత వ్యాక్సిన్లను తయారీ సులభమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంచనాలకు అందని డిసీజ్ ఎక్స్ డిసీజ్ ఎక్స్ ఎంత ఘోరంగా ఉండనుందో ఇప్పటికీ శాస్త్రవేత్తలు అంచనావేయలేకపోతున్నారు. ఇది తేలికపాటి జలుబు మాదిరిగా ఉండవచ్చు లేదా కోవిడ్-19 కంటే చాలా ప్రాణాంతకం కావచ్చని వారు భావిస్తున్నారు. ఏ సూక్ష్మక్రిమి దీనికి కారణంగా నిలుస్తున్నదో, దానిని ఏ విధంగా కనుగొనాలో, ఎటువంటి చికిత్స అందించాలో వైద్యులకు కూడా అంతుచిక్కడం లేదు. అందుకే ఈ వ్యాధి విషయంలో అప్రమత్తత అవసరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. డిసీజ్ ఎక్స్ వ్యాధి సోకిన బాధితుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆ డ్రాప్స్ ద్వారా వ్యాధి వ్యాపించవచ్చు. బాధితుడు తాకిన వస్తువులపై నిలిచిన సూక్ష్మక్రిములు ద్వారానూ ఈ వ్యాధి సంక్రమించవచ్చు. ఈ వ్యాధి క్రిములను మోసే కీటకాల నుంచి కూడా వ్యాప్తి చెందవచ్చంటున్నారు వైద్య శాస్త్రవేత్తలు. జంతువుల నుంచి.. డిసీజ్ ఎక్స్ అనేది కోతులు, కుక్కలు తదితర జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఒక ఊహాజనిత వ్యాధి. దీని కారణంగా ప్రపంచం మొత్తం మీద తీవ్రమైన అంటువ్యాధులు సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. రాబోయే కాలంలో జంతువుల నుంచి మానవులకు సోకే పలు రకాల వ్యాధుల్లో ఇదీ ఒకటి కానుంది. అంటువ్యాధులను వ్యాప్తి చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెబుతోంది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న పలు వైరస్లు గతంలో కంటే వేగంగా రూపాంతరం చెందుతున్నాయని, ఇవి మనుషులపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. వాటిలో ఏదైనా వైరస్ మహమ్మారిగా రూపాంతరం చెందవచ్చని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డిసీజ్ ఎక్స్ సోకినపుడు బాధితునికి జ్వరం, నరాల తిమ్మిరి, మెడ నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, వికారం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ వ్యాధి వ్యాపిస్తే కోవిడ్ను మించిన ప్రమాదం వాటిల్లవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అందుకే ప్రతీఒక్కరూ పరిశుభ్రత, పోషకాహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. -
డిసెంబరులో కరోనాతో 10 వేలమంది మృతి!
కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్నాయి ప్రత్యేకించి కరోనా జెఎన్.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సింగపూర్, అమెరికాలో కరోనా వేవ్ అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భారతదేశంలో కూడా గడచిన 50 రోజుల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలోనే పెరిగాయి. ఇటీవలి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల్లో జనం జాగ్రత్తలు పాటించకపోవడంవల్ల ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ మరింతగా విస్తరించిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్ఓ) డైరెక్టర్ జనరల్గా టెడ్రోస్ అధనామ్ తెలిపారు. గత డిసెంబర్లో కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేలమంది మరణించారని పేర్కొన్నారు. 50 దేశాల నుంచి అందిన డేటా ప్రకారం ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య కూడా 42 శాతం మేరకు పెరిగిందన్నారు. భారతదేశంలో కూడా కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని, ప్రతిరోజూ సగటున 600 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 514 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,422. దీనికిముందు అంటే బుధవారం కొత్తగా 605 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కారణంగా రోజుకు సగటున ఐదుగురు మృత్యువాత పడుతున్నారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. -
అలెర్ట్, కోవిడ్-19 అడ్వాన్స్ విత్డ్రాపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం?!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) మనీ విత్ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వ్యాప్తి సమయంలో చందాదారుల ఆరోగ్య అవసరాల్ని తీర్చేలా కోవిడ్ అడ్వాన్స్ అనే ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు ఆ ఆప్షన్ను ఈపీఎఫ్ఓ త్వరలో తొలగించనుంది. దీంతో కోవిడ్ అడ్వాన్స్ పేరుతో రిటైర్మెంట్ సేవింగ్ ఫండ్ను ఉపసంహరించుకోవడం అసాధ్యం. వారం రోజుల క్రితం రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. అనంతరం ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని సంబంధిత అధికారులు అనధికారికంగా వెల్లడించారు. కోవిడ్ అడ్వాన్స్ పేరుతో ఇందులో ప్రముఖంగా భారత్లో తొలిసారి కరోనా విజృంభణ మొదలైన సమయంలో ఈపీఎఫ్ఓ మనీ విత్ డ్రాలో మార్పులు చేసింది. చేసిన మార్పులకు అనుగుణంగా చందారులు కరోనా చికిత్సతో పాటు సంబంధిత అనారోగ్య సమస్యలకు చికిత్స పొందేందుకు వీలుగా కోవిడ్ అడ్వాన్స్ ఆప్షన్ ద్వారా ఈపీఎఫ్ఓ అకౌంట్లో ఉన్న కొంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. అవసరాల్ని తీర్చుకోవచ్చు. ప్రాణాల్ని కాపాడింది ఈ నిర్ణయం సబ్స్క్రైబర్లు కోవిడ్ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు సహాయ పడింది. పలువురు కోవిడ్కు చికిత్స చేయించుకుని ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. అయితే సుమారు ఏడెనిమిది నెలల క్రితం కోవిడ్-19పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) విధించిన పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ నిర్ణయంతో ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ప్రకటనతో ఈపీఎఫ్ఓ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో రీటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ నుంచి కోవిడ్ అడ్వాన్స్ తీసుకునే సదుపాయన్ని తొలగించనుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ, సాఫ్ట్వేర్లో నాన్ రిఫండబుల్ కోవిడ్ అడ్వాన్స్ నిబంధనను నిలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తద్వారా చందాదారులు ఇకపై దరఖాస్తు చేసుకోలేరని అధికారి తెలిపారు. ఈ పని ఎప్పుడో చేయాల్సింది కాగా, కొవిడ్ అడ్వాన్స్ పేరుతో తీసుకున్న నగదుతో అనవసరైమన కొనుగోళ్లు, ఇతర అవసరాలకు వినియోగించుకునే వారికి ఈపీఎఫ్ఓ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపునుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సి ఉండేదని, ఇప్పటికే ఆలస్యం అయిందని అంటున్నారు. రిటైర్మెంట్ పొదుపు నుంచి కోవిడ్ అడ్వాన్స్ పేరుతో తీసుకున్న నగదును ఆరోగ్యం కోసం కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారని తెలిసినప్పటికీ కోవిడ్ ఉపసంహరణను ముగించడానికి వారికి ఇంత సమయం పట్టిందని ఆర్థికవేత్త కేఆర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఏ ఏడాది ఎంత విత్డ్రా చేశారంటే ఈపీఎఫ్ 2020-21లో 6.92 మిలియన్ల మంది చందాదారులకు రూ .17,106.17 కోట్లు, 2021-22 లో 9.16 మిలియన్ల లబ్ధిదారులకు రూ .19,126.29 కోట్లు, 2022-2023లో 6.20 మిలియన్ల మంది లబ్ధిదారులకు రూ .11,843.23 కోట్ల నగదను అందించింది. 4 రోజుల్లో 6లక్షలు విత్డ్రా మార్చి 28, 2020 నుండి కోవిడ్ అడ్వాన్స్ నిబంధన అమల్లోకి వచ్చింది. 2020 ఆర్థిక సంవత్సరం చివరి వరకు (మార్చి 31, 2020) నాలుగు రోజుల్లో 33 మంది లబ్ధిదారులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. 6 లక్షల్ని విత్ డ్రా చేసుకున్నారు. కోవిడ్ అడ్వాన్స్ రూ.48,075 కోట్లు 2022-23 ఈపీఎఫ్ఓ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం.. 2020-21 నుండి మూడు ఆర్థిక సంవత్సరాల్లో 22 మిలియన్లకు పైగా చందాదారులు కోవిడ్ అడ్వాన్స్ పొందారు. ఈ మొత్తం విలువ రూ .48,075.75 కోట్లు. -
జేఎన్.1పై WHO కీలక ప్రకటన
జెనీవా: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ జేఎన్.1 గురించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో.. జేఎన్.1ను ‘‘వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వర్గీకరించింది. అయితే ఈ వేరియెంట్తో జనాలకు పెద్దగా ముప్పు లేదని తెలిపింది. ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ప్రకారం.. జేఎన్.1తో ప్రపంచానికి పెద్ద ప్రమాదంలేదని డబ్ల్యూహెచ్వో అంచనా వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో జేఎన్.1 వేరియెంట్తో పాటు వేర్వేరు కొవిడ్ వేరియెంట్ల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని వెల్లడించింది. జేఎన్.1 వేరియెంట్ను మొదటిసారి అమెరికాలో సెప్టెంబర్ నెలలో గుర్తించారు. గత వారం చైనాలో కూడా 7 కేసుల నమోదయాయి. డిసెంబర్ 8 నాటికి అమెరికాలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 15 శాతం నుంచి 29 శాతం జేఎన్.1 వేరియెంట్ కేసులేనని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అంచనా వేసింది. అయితే ఇతర వేరియంట్లతో పోల్చితే జేఎన్.1 ప్రజారోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని సీడీసీ ఇంతకు ముందే చెప్పింది. వేరియెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే.. మరింత ఆందోళన కలిగించేది అని అర్థం. అంటే.. ఆ వేరియెంట్కు త్వరగా వ్యాప్తి చెందడం, చికిత్సకు కష్టతరం కావడం, లక్షణాలు తీవ్రంగా ఉండడం ఈ కేటగిరీ కిందకు వస్తుంది. ఈ కేటగిరీలో చేర్చడం ద్వారా.. డెల్టా, ఒమిక్రాన్లాగా ఇది గ్రీకు భాష ద్వారా ఓ కొత్త పేరు పెట్టడానికి వీలుంటుంది. అయితే జేఎన్.1 ఈ కేటగిరీ కిందకే వచ్చినా.. ప్రాణాంతకమైంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిన సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నాలుగు వేరియెంట్లను(ఆల్ఫా, బీటా, గామా, డెల్టా) వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్గా గుర్తించింది. తర్వాతి కాలంలో విజృంభిస్తున్న వేరియెంట్లను వేరియంట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటగిరీ కింద డబ్ల్యూచ్వో మానిటరింగ్ చేస్తూ వస్తోంది. ఇదీ చదవండి: భారత్లో కరోనా: జేఎన్.1 వేరియెంట్ లక్షణాలేంటి? -
ఇండియాలోనే రోడ్డు ప్రమాదాలు ఎందుకు ఎక్కువ? డబ్ల్యూహెచ్ఓ నివేదిక ఏం చెప్పింది?
రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నా ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన తాజా నివేదికలో తెలిపింది. 2010–2021 మధ్య రోడ్డు ట్రాఫిక్ దుర్ఘటనలు ఏటా 5 శాతం (లక్షా 19 వేలు) తగ్గాయి. ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో సభ్యత్వం ఉన్న 108 దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిపోతుండగా, భారత్లో మాత్రం 15 శాతం పెరిగాయని ఈ నివేదిక వివరించింది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఇండియాలో 2010లో 1.34 లక్షలు సంభవించగా, 2021లో వాటి సంఖ్య 1.54 లక్షలకు పెరిగింది. రోడ్డు భద్రతలో ప్రపంచ పరిస్థితి–2023 అనే పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నార్వే, డెన్మార్క్, జపాన్, రష్యా సహా పది దేశాల్లో రోడ్డు దుర్ఘటనల మరణాలు 50 శాతం తగ్గించగలిగారు. మరో 35 దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 30 నుంచి 50 శాతం వరకూ తగ్గిపోయాయి. 2019 నాటికి ప్రపంచంలో ఐదు నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, యువతీయువకుల మరణాలకు ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలని, అన్ని వయసులవారి హఠాన్మరణాలకు 12వ ప్రధాన కారణం రోడ్డు దుర్ఘటనలేనని ఈ నివేదిక వివరించింది. రోడ్డు ప్రమాదాల్లో మూడింట రెండు వంతుల మరణాలు పనిచేసే వయసులో ఉన్న వారికే సంభవించాయి. గడచిన దశాబ్దంలో ప్రపంచ జనాభా 140 కోట్లు (13%) పెరగింది. కాని, విశ్వవ్యాప్తంగా రోడ్డు దుర్ఘటనల్లో మొత్తం మరణాలు ఐదు శాతం తగ్గిపోయాయి. పదేళ్ల కాలంలో మోటారు వాహనాల సంఖ్య 160 శాతం పెరిగింది. 2010–2021 సంవత్సరాల మధ్య ప్రపంచంలో మోటారు వాహనాల సంఖ్య 160 శాతం పెరిగింది. కాగా, ప్రతి లక్ష వాహనాలకు ఏటా ప్రమాదాల్లో సంభవించే మరణాల రేటు 79 నుంచి 47కు తగ్గింది. అంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారి సంఖ్య 41% తగ్గినట్టు లెక్క. ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాల మరణాలు 28 శాతం ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో సంభవించాయి. 25% రోడ్డు చావులు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో, 19% ఆఫ్రికా ప్రాంతంలో, అమెరికా ఖండాల్లో 12%, తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంత దేశాల్లో 11%, ఐరోపా ప్రాంతంలో కేవలం ఐదు శాతం రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. పేద, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లోనే రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువ. మోటారు వాహనాలకు రహదారులపై జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవించేది పేద, మధ్య స్థాయి ఆదాయాలు ఉన్న దేశాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రతి పది మరణాల్లో తొమ్మిది ఈ పేద దేశాల్లోనే జరిగే రోడ్డు దుర్ఘటనల్లో సంభవిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమంటే–పేద, మధ్య స్థాయి ఆదాయాలున్న దేశాల్లో జనం వాడే మోటారు వాహనాలు సంఖ్య తక్కువ. అలాగే, ఈ దేశాల్లో ఉన్న రహదారుల సంఖ్య కూడా బాగా తక్కువ. రోడ్ల నాణ్యత కూడా అభిలషణీయ స్థాయిలో ఉండదు. సరైన మౌలిక సౌకర్యాలు, అవసరమైనన్ని మోటారు వాహనాలు లేని ఈ దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవించే అవకాశం ధనిక దేశాలతో పోల్చితే బాగా ఎక్కువ. ఈ బడుగు దేశాల్లో మోటారు వాహనాల సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పటికీ పేదరికం, సరైన రోడ్లు లేకపోవడం, డ్రైవింగ్ నిర్లక్ష్యంగా చేయడం వంటి కారణాల వల్ల అక్కడ జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు. వాస్తవానికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో రోడ్లపై తిరిగే మొత్తం మోటారు వాహనాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే తక్కువ ఆదాయ దేశాల్లో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక తెలపింది. ఈ నివేదిక వివరాలను ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక శుక్రవారం ప్రచురించింది. రోడ్డు ప్రమాదాల్లో యువకులు, చిన్న పిల్లల మరణాల వల్ల ఏ దేశంలోనైనా ఆర్థిక ప్రగతిపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. రోడ్లపై మోటారు వాహనాల ప్రమాదాలు అరిక్టడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో మద్యం తాగి వాహనాలు నడిపినా, మరణాలకు కారకులైనా పెద్ద శిక్షలు వేయడం ఎప్పటి నుంచో అమలులో ఉన్న విధానం. ఇండియాలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో చావుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది. వెస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి -
నుమోనియా కేసుల వ్యాప్తిపై చైనా కీలక ప్రకటన
బీజింగ్: చైనాలో ఇటీవల నమోదైన శ్వాససంబంధ అనారోగ్య కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. చిన్నపిల్లలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందిన ఈ నుమోనియా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందన ఆ దేశ వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.‘దేశంలోని అన్ని ఆస్పత్రుల్లో నుమోనియా కేసులు రావడం ఒక్కసారిగా తగ్గిపోయింది’అని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ చీఫ్ మీ ఫెంగ్ మీడియాకు తెలిపారు. నుమోనియా కేసుల నమోదు ఒక్కసారిగా పడిపోయిందని చైనా వెల్లడించడకంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది. కొవిడ్ భయాలు ఇంకా తొలగిపోని నేపథ్యంలో చైనాలో శ్వాససంబంధిత అనారోగ్య కేసులు మళ్లీ వ్యాప్తి చెందుతున్నాయన్న వార్తలు రావడంతో అన్ని దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. భారత్లోనూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఈ విషయంలో ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. కాగా, దేశంలో నుమోనియా తరహా శ్వాసకోశ అనారోగ్య కేసుల నమోదు ఒక్కసారిగా పెరుగుతోందని గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చైనా తెలిపింది. అయితే కేసుల నమోదుకు కొత్త వైరస్ కారణం కాదని వెల్లడించింది.కేసుల వ్యాప్తి వేగంగా ఉండటానికి కొవిడ్ ఆంక్షలు ఎత్తివేయడమే కారణమని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఇదీచదవండి..దాడులతో చెలరేగిన ఇజ్రాయెల్ -
పిల్లల పెరుగుదల: సరైన పోషకాల స్వీకరణ, ప్రాముఖ్యత
పిల్లల్లో పోషకాహార లోపం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రజారోగ్య సమస్య. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మిలియన్ల మంది పిల్లలు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారు. బాల్యం వేగవంతమైన వృద్ధి దశలో పిల్లల ఎత్తు బరువు వంటి కీలక మైలురాళ్లు. పిల్లల్లో ఎదుగుదల పోషకాహార లోపం, ఆహారపు అలవాట్లు , శారీరక శ్రమ, వివిధ జీవనశైలి కారకాలతో ముడిపడి ఉంటుంది. స్టన్నింగ్ (వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం) అండర్ వెయిట్ (వయసుకు తగ్గ బరువులేకపోవడం) వేస్టింగ్ (ఎత్తుకు తగ్గ బరువు తక్కువ) లాంటివి కీలక అంశాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022 నివేదిక ప్రకారం, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 149 మిలియన్ల మంది పిల్లలు వయసు తగ్గ ఎత్తు ఎదగలేదు. భారతదేశంలో వీరి వాటా దాదాపు మూడింట ఒక వంతు. ఐదేళ్లలోపు వయస్సున్న 40.6 మిలియన్ల మంది పిల్లలు స్టన్నింగ్ కేటగిరీలో నమోదైనారు. సరియైన విజ్ఞానం లేకపోవడం, విద్యాపరమైన విజయాలు, ఉత్పాదకత కోల్పోవడం లాంటివి మొత్తం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలతో పాటు, ఎదుగుదలపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది. ఇది పిల్లల జీవితంలో వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోకుండా నిరోధిస్తుంది. పోషకాహార లోపాలు రోగనిరోధక శక్తి క్షీణించడం, ప్రవర్తనా సమస్యలు, ఎముకల ఆరోగ్యం క్షీణించడం, కండరాల్లో శక్తి లేకపోవడం లాంటి ప్రమాదాలకు దారితీయవచ్చు. పిల్లలు ఎదగడానికి, నేర్చుకోవడానికి, అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన మైలురాళ్లను చేరుకోవడానికి సరైన పోషకాహారం అవసరమైన పునాదులేస్తాయి. పిల్లలకు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు,కొవ్వుతో పాటు కాల్షియం, విటమిన్ D, విటమిన్ K, అర్జినిన్ వంటి సూక్ష్మపోషకాలతో సహా సరైన మొత్తంలో మాక్రోన్యూట్రియెంట్లు అవసరం. పిల్లల వృద్ధి, ఎగుదలలో పోషకాహార జోక్యం కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ గణేష్ కధే, మెడికల్ అండ్ సైంటిఫిక్ అఫైర్స్, అబోట్ న్యూట్రిషన్ బిజినెస్ తెలిపారు. తల్లిదండ్రులు వివిధ స్థూల పోషకాలు, సూక్ష్మపోషకాలతో కూడిన సమతుల్య పోషకాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. అబాట్, పోషకాహార లోపం పరిష్కారాల కోసం అబాట్ సెంటర్ను ప్రారంభించడంతోపాటు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కృషి చేయనుంది. నిపుణులు, భాగస్వాముల సహకారంతో, పిల్లలతో సహా, ఇతర జనాభా కోసం పోషకాహార లోపాన్ని గుర్తించడం, చికిత్స , నివారించడంపై దృష్టి ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్రొఫెసర్ పెడ్రో అలార్కోన్ దీనిపై మరిన్ని వివరాలు అందిస్తూ స్టంటింగ్ పై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పోషకాహారం పాత్రను అర్థం చేసుకొని తల్లిదండ్రులు ఓవర్ నూట్రిషన్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. పోషకాహార సప్లిమెంట్ పానీయాలను సేవించడం ద్వారా పోషకాహార లోపాన్ని పూరించు కోవచ్చు. అవసరమైన విటమిన్లు, ఖనిజాల స్వీకరణలో కూడా దోహద పడతాయి. ఇది పోషకాల స్వీకరణ సామర్థ్యాన్ని పెంచడం లాంటిదే. దీంతో తీసుకున్న ఆహారంలోని శక్తిని పిల్లల శరీరాలు సంపూర్ణంగా స్వీకరిస్తాయని వివరించారు. పిల్లల ఎదుగుదలకు ప్రోటీన్లు, విటమిన్లు మినరల్స్ కీలకం, అయితే కొన్నిసార్లు కాల్షియం, ఐరన్ జింక్ వంటి 50శాతం పోషకాలు మాత్రమే పిల్లవాడు తినే ఆహారం నుండి లభిస్తాయి. కనుక ఈ విషయంలో పోషకాహార సప్లిమెంట్లు ద్వంద్వ పాత్రను పోషిస్తాయి. ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాల శోషణను మెరుగుపరుస్తాయి. ఇటీవలి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సర్వేలో పట్టణ ప్రాంతాల్లో 33.8శాతం మంది పిల్లలు ఉన్నారని తేలిందని సికింద్రాబాద్, యశోద హాస్పిటల్స్ పీడియాట్రిక్స్, నియోనాటాలజీ విభాగాధిపతి DNB పీడియాట్రిక్స్ ప్రోగ్రాం హెడ్ డాక్టర్ డీరమేష్ తెలిపారు. గ్రామీణ తెలంగాణలో 33 శాతం మంది సరైన ఎదుగుదలకు తోడ్పడటానికి, పిల్లలకు ఐదు ఆహార సమూహాల నుండి వచ్చే స్థూల మరియు సూక్ష్మ పోషకాల మంచి మిశ్రమం కూరగాయలు, పండ్లు, ప్రోటీన్, పాల ఉత్పత్తులు, ఇంకా తృణధాన్యాలు వల్ల ఆరోగ్యకరమైన సంపూర్ణ ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పిల్లలకు అందేలా తల్లిదండ్రులు ఆహారాన్ని అందించాలి. సమతుల్య ఆహారం, అవసరమైనప్పుడు పోషకాహార సప్లిమెంట్ డ్రింక్స్ లాంటి ఆకర్షణీయమైన కలయికతో పిల్లల అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం తోపాటు, పూర్తి సామర్థ్యాన్ని స్వీకరించే శక్తినిస్తుందని పేర్కొన్నారు. -
మళ్లీ కరోనా రిపీటా? చైనాలో మిస్టీరియస్ న్యూమోనియా కలకలం..
కరోనా మహమ్మారి సృష్టించిన విలయం గురించి తెలిసిందే. ఆ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టుకోస్తోంది ప్రజల్లో. అలాంటిది మళ్లీ కరోనా రీపిట్ అంటేనే బెంబేలెత్తిపోతున్నారు జనాలు. అందులో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా కరోన పుట్టినిల్లు అయినా చైనా సంగతి చెప్పనక్కర్లేదు. ఎక్కువ కాలం నిర్బంధంలో ఉన్న దేశం అది. పైగా చాలా ఏళ్ల పాటు కరోనా మహమ్మారి ఆ దేశాన్ని ఓ పట్టాన వదల్లేదు. కానీ ఇప్పుడూ తాజాగా మళ్లీ కరోనా మాదిరి అంతు చిక్కని వ్యాధులు చైనాలో విజృంభిస్తున్నట్లు వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. సాక్షాత్తూ చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారులే విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేగాక ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు కూడా నివేదించారు. దీంతో ఒక్కసారిగా అందరిలోనూ తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చైనాలో శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన ఇన్ఫ్లుఎంజా లాంటి వైరల్ వ్యాధి ప్రభలంగా ఉంది. ఈ వ్యాధి బారిన అధికంగా చిన్నారులే పడుతున్నట్లు సమాచారం. అక్కడ ఆస్పత్రులన్నీ ఈ అనారోగ్యం బారిన పడిన పిల్లలతోనే నిండిపోయాయని చెబుతున్నారు. పిల్లలంతా అంతుచిక్కని న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సాధారణ ఔట్ పేషంట్ క్లినిక్లు లేవని జబ్బు పడిన పిల్లలతోనే ఆస్ప్రుత్రులన్ని కిక్కిరిసి ఉన్నాయని చెబుతున్నారు. కరోనా ఆంక్షాలను తొలగించాక దేశంలో శ్వాసకోశ వ్యాధులు అధికమైనట్లు డబ్ల్యూహెచ్ఓకి వెల్లడించారు. ఈ శ్వాసకోశ వ్యాధుల తీవ్రం కాకుండా ఉండేలా తక్షణమే చర్యలు తీసుకోమని డబ్ల్యూహెచ్ఓ చైనా అధికారులను కోరింది. కోవిడ్-19 రూపాంతరం సార్క్ కోవిడ్-2.. ఇన్ఫ్లుఎంజా, మైక్రోప్లాస్మా న్యుమోనియా వంటి వ్యాధులకు దారితీస్తున్నట్లు కరోనా మహమ్మారి ప్రారంభంలోనే డబ్ల్యూహచ్ఓ హెచ్చరించింది. ఇప్పుడూ చైనా పిల్లల్లో అలాంటి వ్యాధుల సంక్రమణే ఎక్కువగా ఉండటంతో చైనా అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్యూహెచ్ఓ) ఆ వ్యాధుల పరిస్థితి, తీవ్రతకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదించమని చైనా అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా ఉత్తర చైనాలో గత మూడు ఏళ్లలో సరిగ్గా ఇదే టైంలో సుమారు అక్టోబర్ మధ్య కాలంలో ఈ ఇన్ఫ్లుఎంజా వంటి వైరల్ అనారోగ్యాలు అధికమైనట్లు డబ్బ్యూహెచ్వో పేర్కొంది. ఇలాంటి అనారోగ్యం బారిన పడిన వారిని దూరంగా ఉంచడం, టీకాలు వేయించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం మాస్క్లు వంటివి ధరించడం తదితర చర్యలు తీసుకోవాలని చైనా ప్రజలకు సూచించింది డబ్ల్యూహెచ్ఓ. భారత్లోనూ పెరుగుతున్న అంతు చిక్కని జ్వరాలు.. తమిళనాడులోకి కోయంబత్తూరులో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అక్కడ జ్వరానికి సంబంధించిన కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో అధికారులు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వైరల్ ఫీవర్లు అధికమైనట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ వైరల్ ఫీవర్లు బారిన పిల్లలు, పెద్దలు పడటమే గాక అనూహ్యంగా కేసులు పెరుగుతుండటంతో కోవిడ్ మాదిరిగానే జాగ్రత్తలు పాటించమని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: ఉద్దానంలోని మరణాలకు గల కారణాన్ని కనిపెట్టిన పరిశోధకులు! చాలా మరణాలు..) -
Israel-Hamas war: అల్–షిఫా నుంచి 31 మంది శిశువుల తరలింపు
ఖాన్ యూనిస్: అల్–షిఫా ఆసుపత్రిలోని హృదయ విదారక దృశ్యాలు ప్రపంచాన్ని కదిలించాయి. ఇజ్రాయెల్ నిర్బంధంలో ఉన్న ఆ ఆసుపత్రిలో శిశువుల దీన స్థితిని చూసి ప్రజలు చలించిపోయారు. వారి ప్రాణాలు కాపాడాలని ఇజ్రాయెల్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇజ్రాయెల్ సానుకూలంగా స్పందించింది. శిశువుల తరలింపునకు అంగీకరించింది. నెలలు నిండకుండా పుట్టిన 31 మంది శిశువులను అల్–షిఫా హాస్పిటల్ నుంచి దక్షిణ గాజాలోని మరో ఆసుపత్రికి తరలించారు. వారిని పొరుగు దేశమైన ఈజిప్టుకు చేర్చి, మెరుగైన చికిత్స అందించనున్నట్లు గాజా ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ఇంకా చాలామంది రోగులు, క్షతగాత్రులు, సామాన్య జనం ఇంకా అల్–షిఫా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇజ్రాయెల్ సైన్యం వారిని బయటకు వెళ్లనివ్వడం లేదు. ఇక్కడ ప్రాణాధార ఔషధాలు, ఆహారం, నీరు, విద్యుత్ లేకబాధితులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అత్యవసర చికిత్స అవసరమైన శిశువులను అల్–షిఫా నుంచి అంబులెన్స్ల్లో దక్షిణ గాజాలోని రఫా హాస్పిటల్కు తరలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ చెప్పారు. జబాలియా శరణార్థి శిబిరంపై క్షిపణుల వర్షం గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అల్–షిఫా ఆసుపత్రిని పూర్తిగా దిగ్బంధించింది. సాధారణ జనావాసాలతోపాటు పాఠశాలలు, శరణార్థి శిబిరాలపైనా క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై శనివారం అర్ధరాత్రి నుంచి దాడులు కొనసాగించింది. పదుల సంఖ్యలో జనం మరణించినట్లు తెలుస్తోంది. ఉత్తర గాజా నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం పదేపదే హెచ్చరిస్తోంది. హమాస్ మిలిటెంట్ల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నామని, సాధారణ ప్రజలకు నష్టం వాటిల్లకూడదన్నదే తమ ఉద్దేశమని వెల్లడించింది. ఉత్తర గాజాలో ప్రస్తుతం తమ దళాలు చాలా క్రియాశీలకంగా పని చేస్తున్నాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో గాజాలో ఇప్పటిదాకా 12,000 మందికిపైగా మృతిచెందారు. మరో 2,700 మంది శిథిలాల కింద గల్లంతయ్యారు. బందీల విడుదలకు యత్నాలు గాజాలో హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలుగా ఉన్నారు. వారిలో ఇప్పటిదాకా నలుగురి బందీలను మిలిటెంట్లు విడుదల చేశారు. మరో ఇద్దరు బందీల మృతదేహాలు ఇటీవల్ అల్–షిఫా ఆసుపత్రి సమీపంలో లభ్యమయ్యాయి. మిగిలిన బందీల విడుదలకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ విషయంలో ఇజ్రాయెల్, అమెరికాతోపాటు పర్షియన్ గల్ఫ్ దేశమైన ఖతార్ చొరవ తీసుకుంటున్నాయి. ఖతార్ ప్రతినిధులు హమాస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. బందీలను క్షేమంగా విడుదల చేయాలని కోరుతున్నాయి. -
భారత్లోనే టీబీ కేసులు అత్యధికం!: డబ్ల్యూహెచ్ఓ నివేదిక
దేశాల్లో క్షయ వ్యాధి కేసులు పెరుగుతున్నాయంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేప్(డబ్ల్యూహెచ్ఓ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ మేరకు దేశాల వారిగా పెరుగుతున్న క్షయ వ్యాధి కేసుల, మరణాల సంఖ్యను నివేదికలో వెల్లడించింది. 2022లో ప్రపంచంలోనే అత్యధిక టీబీ కేసులు భారత్లోనే నమోదైనట్లు తన నివేదికలో వెల్లడించింది. సుమారు 30 దేశాల్లో దాదాపు 87 శాతం కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలోని మొత్తం టీబీ కేసుల్లో దేశంలోనే దాదాపు 28 లక్షలకు పైగా కేసులు నమోదయ్యయని వారిలో సుమారు మూడు లక్షల మంది ఈ వ్యాధి కారణంగా చనిపోయినట్లు పేర్కొంది. మంగళవారం(నవంబర్ 07న) డబ్యూహెచ్వో అందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. భారత్ తర్వాత ఇండోనేషియా(10%), చైనా(7.1%), పాకిస్తాన్(5.7), నైజీరియా(4.5%), బంగ్లాదేశ్(3.6%) డిమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(3.0%) కేసులు ఉన్నట్లు తెలిపింది. ఐతే భారత్ ఈ టీబీ కేసులను తగ్గించడంలో కూడా పురోగతి సాధించనట్లు నివేదిక వెల్లడించింది. ఇదిలా ఉండగా, 2015లో ఒక లక్ష మందిలో సుమారు 258 రోగులు ఉండగా అది కాస్తా 2022లో 199కి పడిపోయింది. కానీ ఈ రేటు ఇప్పటికి ప్రపంచ సగటు ప్రతీ ఒక లక్ష మందికి 133తో పోలిస్తే చాలా అత్యధికంగా ఉందని పేర్కొంది. ఇక క్షయ వ్యాధి కారణంగా భారత్ మరణాలు 12%(అంటే ప్రతి వంద మందికి 12 మంది ఈ వ్యాధితో మరణించారు) మరణాలు సంభవించాయి. ఈ సంఖ్య ప్రపంచ సగటు 5.8 కంటే ఎక్కువుగా ఉంది. కాగా, సింగపూర్లో అత్యల్పంగా మరణాలు సంభవించగా చైనా మాత్రం 4% మరణాలతో 14వ స్థానంలో నిలిచింది. నిజానికి ఈ క్షయ వ్యాధి నయం చేయగలిగనప్పటికి, నిర్థారించడంలో ఆలస్యమైతే మరణాలు సంభవించే అవకాశం ఎక్కువ. ఈ పరిస్థితి కోవిడ్ మహమ్మారి తర్వాత మరింత ఎక్కువైంది. అంతేగాదు దాదాపు 192 దేశాల్లో సుమారు 75 లక్షల మందికి పైగా ప్రజలు టీబీతో బాధపడుతున్నారంటూ డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. (చదవండి: ఫైర్ డిటెక్షన్ పరికరాన్ని కనిపెట్టిన భారత సంతతి విద్యార్థి!) -
ఏటా కొత్త వ్యాధికారకం!
సాక్షి, హైదరాబాద్: మానవాళికి అంటువ్యాధుల ముప్పు క్రమంగా పెరుగుతోంది. కోవిడ్–19 వైరస్ వ్యాప్తి కారణంగా యావత్ ప్రపంచమంతా దాదాపు మూడేళ్లపాటు అతలాకుతలమైంది. వందల ఏళ్లుగా ఈ వ్యాధికారకాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రస్తుతం వాటి సంఖ్య మరింత ఎక్కువవుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెబుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఏకంగా 30 రకాల వ్యాధికారకాలు ఉద్భవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పరిశోధనలో తేలింది. ఈ లెక్కన ఏటా సగటున ఒక వ్యాధికారకం వెలుగులోకి వచ్చి ంది. అయితే ఈ వ్యాధికారకాల ఉద్భవంలో అత్యధికం జంతువుల నుంచే కావడం గమనార్హం. అడవుల నరికివేత, జంతువుల వలసలు... అంటువ్యాధుల కారకాలపై డబ్ల్యూహెచ్వో ఎప్పటి కప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉంది. ప్రధానంగా జంతువుల నుంచే వ్యాపిస్తున్నవి 60 శాతంగా ఉంటున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత వల్ల జంతువుల వలసలు పెరగడంతోపాటు అటవీ జంతువులను ఆహారంగా మార్చు కోవడం, జంతు ఉత్పత్తుల వాడకంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నట్లు డబ్ల్యూహెచ్వో గుర్తించింది. మనుషుల ఆహార జాబితాలో గతంలో శాకాహార జంతువులే ఉండగా క్రమంగా మాంసాహార జంతువులూ చేరాయి. శాకాహార జంతువులతో పోలిస్తే మాంసాహార జంతువుల జీర్ణవ్యవస్థ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆహార అరుగుదల కోసం ఉపయోగపడే బ్యాక్టీరియా, ఇతరత్రా మానవ శరీరానికి ప్రమాదకారిగా మారుతున్న సందర్భాలున్నాయి. కోవిడ్–19 వైరస్ ఇదే తరహాలో ఉద్భవించిందనే వాదనలు సైతం ఉన్నాయి. ఎబోలా, రేబిస్ మొదలైన వైరస్లు ఈ కోవకు చెందినవే. కట్టడి కోసం ‘వన్ హెల్త్’.. డబ్ల్యూహెచ్వో గణాంకాల ప్రకారం 2003 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల కారణంగా కోటిన్నరకుపైగా మరణాలు సంభవించాయి. అలాగే ప్రపంచ దేశాలు 4 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. జంతువుల నుంచి వచ్చే వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు, వాటిని నిలువరించేందుకు డబ్ల్యూహెచ్వో వన్హెల్త్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ, జంతు సంరక్షణ సంస్థలు, వైద్య నిపుణులు, వెటర్నరీ నిపుణులు కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాల వల్ల జంతు వ్యాధికారకాలను నిలువరించవచ్చని డబ్ల్యూహెచ్వో చెబుతోంది. అంతేకాకుండా ఆర్థికపరమైన భారం కూడా తగ్గుతుందని భావిస్తోంది. కోవిడ్పై పోరులో 28 విభాగాల కృషి కోవిడ్–19 వ్యాప్తి తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ద పెరిగింది. కోవిడ్ టీకాల కోసం దేశంలో 28 విభాగాలు సమన్వయంతో పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాయి. పర్యావరణం, మొక్కలు, జంతువులు, మానవాళి మధ్య సంబంధాల్లో సమతౌల్యం ఎప్పుడూ పాటించాలి. దాని ఆమలుకు సంబంధించినదే వన్ హెల్త్ విధానం. డబ్ల్యూహెచ్వో రూపొందించిన ఈ విధానం వల్ల ఆర్థికంగా కలసిరావడంతో పాటు ఎక్కువ ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ అంశం అన్ని దేశాలు పూర్తిస్థాయిలో అమలు చేసే స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నా. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కమిటీ కన్వినర్ -
కడుపు కోతకు చెక్..!
సాక్షి, రాజమహేంద్రవరం: బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. అదీ సహజ పద్ధతిలో జరిగితే తల్లీ, బిడ్డ అత్యంత సురక్షితం. పుట్టే బిడ్డకూ ఎలాంటి ఆపద ఉండదు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ధనదాహం అమ్మ కడుపును కోసేస్తోంది.. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా.. దోపిడీయే పరమావధిగా సిజేరియన్లు యథేచ్ఛగా చేసేస్తున్నారు. గర్భిణి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే శస్త్ర చికిత్స తప్పుకాదు. కానీ ఇది సాకుగా చూపి పైసలే పరమావధిగా శ్రస్త్ర చికిత్సలనే ప్రోత్సహిస్తున్నారు. సిజేరియన్కు రూ.40 వేల నుంచి రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. జిప్ పద్ధతి(కోత కనబడని శస్త్ర చికిత్స) పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. కాన్పుల కోసం ప్రైవేటు ఆస్పత్రుతలకు వెళ్లే వారిలో 80 శాతం మందికి శస్త్ర చికిత్సలే చేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి దయనీయ దుస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు వైద్య శాఖ సన్నద్ధం అవుతోంది. అవసరం లేని సిజేరియన్ల వల్ల కలిగే అనర్ధాలు, సహ ప్రసవాలతో జరిగే మేలును గర్భిణులకు వివరించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. సహజ ప్రసవాలు పోత్రహించేందుకు ‘సీ–సేఫ్’ విధానాన్ని రూపకల్పన చేసి అమలుకు శ్రీకారం సన్నద్ధమవుతోంది. ఇదీ సంగతి జిల్లా వ్యాప్తంగా ప్రసూతి సేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులు సుమారు 300కి పైగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా రాజమహేంద్రవరం జీజీహెచ్, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు, కడియం పీహెచ్సీల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లా వైద్య శాఖ గణాంకాల ప్రకారం 50 శాతం వరకు సిజేరియన్లు జరుగుతున్నాయి. వీటిలో 80 శాతం శస్త్రచికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం శస్త్రచికిత్సలు 10–15 శాతం లోపే ఉండాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే 50 శాతానికి పైగా అపరేషన్లు జరుగుతున్నాయి. అవసరం లేకపోయినా డబ్బులు దండుకునేందుకు సిజేరియన్లు చేస్తుండటంతో బాలింతలకు ఆరోగ్య పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని అరికట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 22 నుంచి మార్చి 22 వరకు అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 22,648 ప్రసవాలు జరిగాయి. అందులో ప్రైవేటులో అత్యధికంగా 15,804, అందులో 10,433 సిజేరియన్లు జరిగాయి. 5,370 సాధారణ ప్రసవాలు మాత్రమే జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6,844 జరగ్గా.. కేవలం 3,552 శస్త్ర చికిత్సలు మాత్రమే చేశారు. అదీ హైరిస్క్ కేసులు మాత్రమే ఉంటున్నాయి. 3,763 సాధారణ ప్రసవాలు జరిగాయి. నర్సులకు శిక్షణ సహజ ప్రసవాలు పెంచే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని నర్సులకు నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్ వైఫరీ(ఎన్పీఎం) కోర్సులో శిక్షణ అందించారు. బ్యాచ్కు 30 మంది చొప్పున శిక్షణ ఇచ్చారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళలకు అవసరమైన వైద్యం ఎలా అందజేయాలో వివరించారు. హైరిస్క్లో ఉన్న గర్భిణులను గుర్తించడం, వారికి అందించాల్సిన వైద్యం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం వీరికి నర్సింగ్ బోర్డులో పరీక్ష నిర్వహించారు. ఉత్తీర్ణులైన వారికి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమించనున్నారు. సీ–సేఫ్ అంటే.. అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియనుల చేయాలన్నదే ‘సీ–సేఫ్’ ఉద్దేశం. దీనిపై వైద్యులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తారు. సిజేరియన్ విధానాలతో మాతృశిశు మరణాలు రాకుండా చర్యలు తీసుకుంటారు. ఆపరేషన్ చేసే సమయంలో అత్యంత సురక్షిత పద్ధతులు పాటించాలని సూచిస్తారు. ఈ విధానానికి యునిసెఫ్ సైతం సహకారం అందిస్తుంది. సాధారణ కాన్పులే మేలు నవమాసాలు మోస్తున్న గర్భిణులు ప్రసవ సమయంలో శస్త్రచికిత్సలను ప్రోత్సహించడం తగదని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. నార్మల్ డెలివరీ జరిగిన మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. కాన్పు జరిగిన రెండో రోజు నుంచే పనులు చేసుకుంటారు. పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శస్త్ర చికిత్స ద్వారా బిడ్డకు జన్మనిస్తే మహిళ శారీరక పరిస్థితిని బట్టి రెండు వారాల వరకు విశ్రాంతి అవసరం. ప్రసవ సమయంలో 9 మాసాలు పూర్తయినా కొందరు మహిళలకు నొప్పులు రావు. ఇలాంటి సందర్భంలోనూ శస్త్ర చికిత్స చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న వైద్యులు సిజేరియన్ను ప్రోత్సహిస్తున్నారు. వైద్యుల్లో సైతం వేచి చూసే ధోరణి ఉండాలి. రోగుల ఒత్తిడి మేరకు శస్త్ర చికిత్సలను ప్రోత్సహించడం తగదు. గర్భం దాల్చినప్పటి నుంచి తేలికపాటి వ్యాయామాలు చేస్తే కాన్పు సమయంలో ఇబ్బందులు పడాల్సి అవసరం ఉండదని సూచిస్తున్నారు. జిల్లాలో మూడు నెలలుగా శస్త్ర చికిత్సలు, నార్మల్ డెలివరీలు ఇలా.. ఆస్పత్రి నెల సిజేరియన్లు నార్మల్ డెలివరీ ప్రభుత్వ జనవరి 236 251 ఫిబ్రవరి 253 250 మార్చి 215 244 ప్రైవేటు జనవరి 916 389 ఫిబ్రవరి 631 345 మార్చి 599 292 గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మాతృ మరణాల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అవసరం లేకుండా చేపట్టే జిసేరియన్లు నియంత్రించడంపై దృష్టి సారిస్తున్నాం. ఇందుకు గాను ప్రతి పీహెచ్సీ, గ్రామాల్లో గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నా.ం ఈ క్రమంలో సీ–సేఫ్ ప్రణాళిక రచించాం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే సిజేరియన్లను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం... – డాక్టర్.కె. వెంకటేశ్వరరావు,జిల్లా వైద్య శాఖాధికారి -
పారాహుషార్!
అజ్ఞానం అనేక విధాల అపాయకరం. ఆరోగ్యం విషయంలో అది మరీ ప్రమాదకరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక ఆ సంగతి మన భారతీయులందరికీ మరోసారి గుర్తుచేసింది. మన దేశ జనాభాలో 18.83 కోట్ల మంది దాకా అధిక రక్తపోటు (హై బీపీ)తో బాధపడుతున్నారనీ, అయితే వారిలో కేవలం 37 శాతం మందికే తమ ఆరోగ్య పరిస్థితి గురించి అవగాహన ఉందనీ వెల్లడించింది. అధిక రక్తపోటు ఉందని తేలినవారిలో నూటికి 30 మందే మందులు వాడుతున్నారనీ, వారిలోనూ 15 మందే దాన్ని నియంత్రణలో ఉంచుకుంటు న్నారనీ పేర్కొంది. బీపీ ఉన్నవారిలో కనీసం సగం మంది దాన్ని నియంత్రణలో ఉంచుకోగలిగినా... వచ్చే 2040 నాటికి గుండెపోటు, పక్షవాతం వల్ల సంభవించే 46 లక్షల మరణాలను మన దేశంలో నివారించవచ్చు. డబ్ల్యూహెచ్ఓ చెబుతున్న ఈ మాటలు భారత్లో ‘హై బీపీ’ పట్ల పేరుకున్న అశ్రద్ధను గుర్తుచేస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణలోని ఈ లోటుపాట్లపై ప్రజలు, వారితో పాటు ప్రభుత్వం కూడా తక్షణం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్త హైపర్టెన్షన్ ప్రభావంపై డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన తొట్టతొలి నివేదిక ఇదే! 2019 నాటి డేటా ఆధారంగా ఈ ప్రపంచ సంస్థ చేసిన నిర్ధారణలు ఆలోచింపజేస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక బీపీతో బాధపడుతున్నారట! వారిలోనూ ప్రతి అయిదుగురిలో నలుగురు దాన్ని అదుపులో ఉంచుకోవట్లేదట! జీవనశైలిలో అనూహ్య మార్పుల వల్ల 1990 నుంచి 2019కి వచ్చేసరికల్లా బీపీ బాధితుల సంఖ్య 65 కోట్ల నుంచి రెట్టింపై, 130 కోట్లకు చేరింది. పైకి లక్షణాలేవీ ప్రత్యేకంగా కనిపించని ‘సైలెంట్ కిల్లర్’ ఇది. అందుకే, గుండె జబ్బు, కిడ్నీలు దెబ్బ తినడం లాంటి ఇతర సమస్యలు తలెత్తినప్పుడు గానీ ఈ అధిక బీపీని పలువురు గుర్తించడం లేదని వైద్యులు వాపోతున్నారు. బీపీ ఉన్నట్టు తెలిసినా సరిగ్గా మందులు వాడక అశ్రద్ధ చేసి తల మీదకు తెచ్చుకుంటున్నవారు అనేకులు. భారత్లో గుండెపోటు, స్ట్రోక్లతో మరణిస్తున్న వారిలో నూటికి 52 మంది అనియంత్రిత అధిక బీపీ (140/90కి పైన)కి బలి అవుతున్నవారే! చౌకగా మందులతో అదుపు చేయవచ్చని తెలిసినా, పలు దేశాల్లో ఈ పెను ప్రమాదకారిపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని తమ పౌరులందరికీ పరీక్షలు జరిపి, ఉచితంగా చికిత్స అంది స్తున్నాయి. అయితే, అల్పాదాయ దేశాల్లో అలాంటి పరిస్థితి లేదు. నిజానికి, మనదేశంలో ప్రజల్లో అధిక బీపీ దుష్ఫలితాల్ని నియంత్రించేందుకు ‘ఇండియా హైపర్టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్’ (ఐహెచ్సీఐ)ను 2017 నవంబర్లోనే కేంద్ర ఆరోగ్య శాఖ చేపట్టింది. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ స్థాయిలోనే అసాంక్రమిక వ్యాధుల పరీక్షలు జరిపి, చికిత్స, మందులిచ్చి, 2025 నాటి కల్లా దేశంలో 7.5 కోట్ల మందికి బీపీ, షుగర్ల నుంచి సంరక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదట 5 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొద్ది జిల్లాల్లో మొదలైన ఈ ఆరోగ్య యజ్ఞం క్రమంగా 155 జిల్లాలకు విస్తరించింది. అయితే, ఈ ఏడాది జూన్ నాటికి 27 రాష్ట్రాల్లో దాదాపు 58 లక్షల మంది బీపీ రోగులకు మాత్రం చికిత్స అందించగలిగింది. నిరుడు ఇది ఐరాస అవార్డును అందుకున్న ప్రశంసనీయ ప్రయత్నం. కానీ, బీపీ బాధితుల సంఖ్య కోట్లలో ఉన్న దేశంలో చెరువు నీటిని చెంబుతో తోడితే సరిపోదు. డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదిక సైతం ముందుగా ప్రజల్లో చైతన్యం పెంచాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతోంది. సమాజంలోని పేదవర్గాల్లో పలువురు అధిక బీపీ బాధితులు కొంతకాలం పాటు మందులు వాడి, పరిస్థితి కొద్దిగా కుదుటపడగానే మానేస్తున్నారట! కొన్ని అధ్యయనాలు వెల్లడించిన ఈ చేదు నిజం ఆందోళన రేపుతోంది. బీపీకి చికిత్స, మందులు మధ్యలో ఆపడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని భారతీయ ఆరోగ్య సంరక్షణ మార్గదర్శకాలు ఎప్పటి నుంచో చెబుతున్నదే! అయినా మనం పెడచెవిన పెడుతున్నాం. ఈ ధోరణి మారాలి. 30 ఏళ్ళ వయసు నుంచే బీపీ చూపించు కోవాలనీ, 50వ పడిలో పడ్డాక తరచూ పరీక్ష చేయించుకోవడం తప్పనిసరనీ వైద్యులిస్తున్న సలహాను పాటించడం మంచిది. అలాగే, రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సిఫార్సున్నా, భారత్లో 8 గ్రాముల దాకా తీసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి తాజా నివేదిక సైతం హెచ్చరిస్తోంది. ఉప్పు తగ్గించడం, ధూమపానం, మద్యపానం మానే యడం, శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన ఆహారం, కంటి నిండా నిద్ర లాంటి జీవనశైలి మార్పులతో, జీవితాంతం బీపీ మందులు మానకుండా వాడడం శ్రేయస్కరం. గణాంకాలు గమనిస్తే, గత 15 ఏళ్ళలో దేశంలోని చిన్న పట్నాలు, గ్రామీణ ప్రాంతాలకు సైతం బీపీ సమస్య విస్తరించింది. ఆరోగ్య సంరక్షణ వసతుల్లోని లోటు సైతం అక్కడి సమస్యను పెంచు తోంది. మచ్చుకు, గ్రామీణ బిహార్ లాంటి చోట్ల ఆరోగ్య సేవకుల్లో మూడోవంతు మందికి మాత్రమే సరైన బీపీ చికిత్స తెలుసట! అంతర్జాతీయ పరిశోధకుల సర్వే నిరుడు తేల్చిన దిగ్భ్రాంతికరమైన నిజమిది. జిల్లా, గ్రామస్థాయుల్లో ప్రజారోగ్య సేవకుల నైపుణ్యం పెంచి, డాక్టర్ల, నర్సుల కొరతను అధిగమించడం ద్వారా ప్రభుత్వ బీపీ కార్యక్రమాన్ని మెరుగుపరచవచ్చని నిపుణుల సూచన. ఏమైనా, డబ్ల్యూహెచ్ఓ తాజా నివేదిక ఇస్తున్న సందేశాన్ని మన విధాన నిర్ణేతలు వెంటనే చెవి కెక్కించుకోవాలి. ఎందుకంటే, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి పంథా మార్చి, కొత్త వ్యూహాలను అనుసరించడమే ఏ సమస్యకైనా అసలైన ఔషధం. -
Disease X: కరోనాను మించిన వైరస్
కరోనా తాలూకు కల్లోలం నుంచి మనమింకా పూర్తిగా తేరుకొనే లేదు. డిసీజ్ ఎక్స్గా పేర్కొంటున్న మరో ప్రాణాంతక వైరస్ అతి త్వరలో ప్రపంచాన్ని మరోసారి అతలాకుతలం చేయనుందట. సాక్షాత్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థే చేస్తున్న హెచ్చరిక ఇది! 2019లో వెలుగు చూసినా కరోనా డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కనీసం 70 లక్షల ప్రాణాలు తీసింది. కానీ కొత్త రోగం హీనపక్షం 5 కోట్ల మందిని కబళించవచ్చన్న అంచనాలు ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. పైగా డిసీజ్ ఎక్స్ ఇప్పటికే తన ప్రభావం మొదలుపెట్టి ఉండొచ్చని కూడా డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులను ఉటంకిస్తూ డైలీ మెయిల్ పేర్కొంది. ఆ ఊహే భయానకంగా ఉంది కదా! కరోనా. ఈ పేరు వింటే చాలు ఇంకా ఉలిక్కిపడుతూనే ఉంది ప్రపంచం. ఆధునిక ప్రపంచ చరిత్ర ఒక రకంగా కరోనాకు ముందు, తర్వాత అన్నట్టుగా తయారైంది. మరి కోవిడ్ను మించిన వైరస్ మరోసారి ప్రపంచం మీదికి వచి్చపడితే? కానీ అది అతి త్వరలో నిజమయ్యే ఆస్కారం చాలా ఉందని స్వయానా ప్రపంచ ఆరోగ్య సంస్థే అంటోంది! ప్రస్తుతానికి ఎక్స్గా పిలుస్తున్న సదరు ప్రాణాంతక వైరస్ మన ఉసురు తీయడం ఖాయమట. తీవ్రతలో కోవిడ్ కంటే ఇది ఏడు రెట్లు ఎక్కువని డబ్ల్యూహెచ్ఓ పేర్కొనడం ఆందోళనలను మరింతగా పెంచుతోంది. ప్రస్తుతానికి ఎక్స్గా పిలుస్తున్న ఈ పేరు పెట్టని వైరస్ ప్రపంచవ్యాప్తంగా హీనపక్షం 5 కోట్ల మందిని బలి తీసుకోవడం ఖాయమని సైంటిస్టులను ఉటంకిస్తూ హెచ్చరిస్తోంది. అంత డేంజరస్ కరోనా కూడా నిజానికి మున్ముందు మానవాళిని కబళించబోయే మహా మహమ్మారులకు ట్రెయిలర్ మాత్రమేనని జోస్యం చెబుతోంది...! తెలిసిన వైరస్ నుంచే..? డిసీజ్ ఎక్స్ మనకిప్పటికే తెలిసిన వైరస్ నుంచే పుట్టుకొచ్చి ఉంటుందని బ్రిటన్ వాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డేమ్ కేట్ బిన్ హామ్ చెబుతున్నారు. వినడానికి కఠోరంగా ఉన్నా, మనకు ముందున్నది కష్ట కాలమేనన్నది అంగీకరించాల్సిన నిజమని ఆమె అన్నారు! ‘1918–19 మధ్య ఫ్లూ కేవలం ఒక్క ఏడాదిలోనే ఏకంగా 5 కోట్ల మందికి పైగా బలి తీసుకుంది. ఇప్పుడు కూడా మనకు ఆల్రెడీ తెలిసిన వైరస్లలోనే ఒకటి కనీవినీ ఎరగని రీతిలో భయానకంగా మారి అలాంటి మహోత్పాతానికే దారి తీయవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అసంఖ్యాకమైన వైరస్లు పరస్పరం పరివర్తనాలు చెందుతూ రూపు మార్చుకుంటున్నాయి. ఊహాతీత వేగంతో విస్తరిస్తున్నాయి. పైగా వీటి సంఖ్య ప్రస్తుతం భూమి మీద ఉన్న ఇతర అన్ని జీవరాశుల మొత్తం సంఖ్య కంటే కూడా చాలా ఎక్కువ‘ అని చెప్పుకొచ్చారు! ‘వాటిలో అన్నీ మనకు అంతగా చేటు చేసేవి కాకున్నా కొన్ని మాత్రం చాలా డేంజరస్‘ అని వివరించారు. లోతుగా పర్యవేక్షణ జీవ రసాయన సైంటిస్టులు ప్రస్తుతం కనీసం 25 వైరస్ కుటుంబాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. వీటిలో ఒక్కో దాంట్లో వేలాది విడి వైరస్లు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి విపరీతమైన పరివర్తనాలకు లోనై మహా మహమ్మారిగా రూపుదాల్చే ప్రమాదం పొంచి ఉందట! పైగా జంతువుల నుంచి మనుషులకు సోకగల వైరస్ లను అధ్యయనంలో భాగంగా చేయలేదు. వాటినీ కలిపి చూస్తే మానవాళికి ముప్పు మరింత పెరుగుతుందని డేమ్ హెచ్చరిస్తున్నారు. అప్పుడే వ్యాక్సిన్ తయారీ! ఇంకా కొత్త రోగం పేరైనా తెలియదు. ఒక్కరిలో కూడా దాన్ని గుర్తించలేదు. అప్పుడే దానికి వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో బ్రిటన్ సైంటిస్టులు తలమునకలుగా ఉన్నారు. ఏకంగా 200 మందితో కూడిన బృందం ఈ పనిలో తలమునకలుగా ఉందట! జంతువుల నుంచి ఎలుకల ద్వారా మనుషులకు సోకే, శరవేగంగా వ్యాపించే స్వభావమున్న బర్డ్ ఫ్లూ, మంకీ పాక్స్, హంట్ వైరస్లనే ప్రస్తుతానికి లక్ష్యంగా పెట్టుకున్నట్టు బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ ప్రొఫెసర్ డేమ్ జెన్నీ హారిస్ తెలిపారు. అయితే, పర్యావరణ మార్పుల వంటి మానవకృత విపత్తులకు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తే ఎన్నో వైరస్లను కూడా అరికట్టినవాళ్లం అవుతామంటూ ఆయన ముక్తాయించారు! మున్ముందు మన పాలిట ప్రాణాంతకంగా మారే భయంకరమైన మహమ్మారులకు కరోనా కేవలం ఒక దారుణమైన ఆరంభం మాత్రమేనని సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్నారు! అవును.. మరిన్ని మహమ్మారులు! ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి చైనా ‘బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం కోవిడ్ తరహా మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని చైనా ’బ్యాట్ ఉమన్’ షీ జెంగ్ లీ జోస్యం చెప్పారు. చైనాలో బెస్ట్ వైరాలజిస్ట్గా చెప్పే ఆమె జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి మనుషులకు సోకే వైరస్లపై అపారమైన రీసెర్చ్ చేసినందుకు బ్యాట్ ఉమన్గా పేరుబడ్డారు. కరోనాకు పుట్టిల్లుగా నేటికీ ప్రపంచమంతా నమ్ముతున్న చైనాలోని వుహాన్ వైరాలజీ ఇన్స్టిట్యూట్లో లీ బృందం 40 కరోనా జాతులపై లోతుగా అధ్యయనం చేసింది. వాటిలో సగానికి సగం మానవాళికి చాలా ప్రమాదకరమైనవని తేలి్చంది. వీటిలో ఆరు ఇప్పటికే మనకు సోకాయని లీ చెప్పారు! గత జూలైలో ఇంగ్లిష్ జర్నల్ ఎమర్జింగ్ మైక్రోబ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ లో పబ్లిష్ అయిన ఈ అధ్యయనం ఇటీవలే ప్రాచుర్యంలోకి వచి్చంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ మరింత అప్రమత్తంగా ఉండాలని చైనాకు చెందిన మరికొందరు ప్రముఖ వైరాలజిస్టులు కూడా సూచిస్తున్నారు. గబ్బిలాలు, ఎలుకల నుంచి ఒంటెలు, పంగోలిన్లు, పందుల వంటి జంతువుల ద్వారా సమీప భవిష్యత్తులో ఇవి మనకు మరింతగా సోకే ప్రమాదం చాలావరకు ఉందని వారు హెచ్చరిస్తున్నారు! డిసీజ్ ఎక్స్తో పోలిస్తే కరోనా ప్రమాదకరమైనది కానే కాదని చెప్పాలి. ఎందుకంటే కరోనాకు ఇప్పుడు దాదాపుగా అంతా ఇమ్యూన్గా మారాం. కానీ కొత్త వైరస్ తట్టు అంత శరవేగంగా వ్యాపించే అంటురోగానికి కారణమైతే? సోకిన ప్రతి 100లో ఏకంగా 67 మందిని బలి తీసుకున్న ఎబోలా అంతటి ప్రాణాంతకంగా మారితే? ఇదే ఇప్పుడు సైంటిస్టులను తీవ్రంగా కలవర పెడుతున్న అంశం! ప్రపంచంలో ఏదో ఇక మారుమూలలో అదిప్పటికే సడీచప్పుడూ లేకుండా ప్రాణం పోసుకునే ఉంటుంది. అతి త్వరలో ఉనికిని చాటుకుంటుంది. ఇక అప్పటి నుంచీ నిత్య కల్లోలమే! – డేమ్ కేట్ బిన్ హామ్, బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ చీఫ్ -
మందులకు భారీగా వ్యయం
సాక్షి,అమరావతి: వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రోగులకు సరఫరా చేసే మందుల విషయంలోనూ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచడంపై ప్రత్యేక దృష్టిసారించింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన నాటి నుంచి ఇప్పటివరకు మందుల సరఫరాకే ఏకంగా రూ.2,230 కోట్లను ఖర్చుచేసింది. గ్రామాల్లోని డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) ప్రమాణాలుగల మందులను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రుల్లో మందులకు తీవ్ర కటకట ఉండేది. ఆ పరిస్థితులకు చెక్ పెడుతూ సరఫరా విధానంలో సమూల మార్పులు తీసుకురావడంతో పాటు, మందుల బడ్జెట్ కేటాయింపులను ప్రస్తుత ప్రభుత్వం పెంచింది. దీంతో ఆస్పత్రుల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు ఎంతో మెరుగుపడ్డాయి. రూ.200 కోట్ల నుంచి రూ.500కోట్లకు పెంపు.. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రులకు మందుల సరఫరా కోసం ఏటా సుమారు రూ.200 కోట్లు మాత్రమే ఖర్చుచేసేవారు. ఆస్పత్రుల్లో రోగుల తాకిడికి సరిపడా మందుల బడ్జెట్ ఉండేది కాదు. కేవలం 229 రకాల మందులను మాత్రమే అరకొరగా సరఫరా చేసేవారు. దీంతో ఆస్పత్రుల్లో మందులకు తీవ్ర దుర్భర పరిస్థితులు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ఈ క్రమంలో.. ఆస్పత్రుల్లో మందుల కోసం బడ్జెట్ను పెంచింది. ఏటా రూ.500 కోట్ల మేర బడ్జెట్ను కేవలం మందుల సరఫరాకే వె చ్చిస్తోంది. అంతేకాక.. మందుల సంఖ్యను 608కు పెంచింది. ఇలా 2019 నుంచి ఇప్పటివరకూ కేవలం మందుల సరఫరాకే రూ.2,230 కోట్ల మేర ఖర్చుచేశారు. దీన్నిబట్టి పరిశీలిస్తే గత టీడీపీ ప్రభుత్వం కంటే రెట్టింపునకు పైగా ఈ ప్రభుత్వం మందుల కోసం ఖర్చుచేసినట్లు స్పష్టమవుతోంది. విలేజ్ క్లినిక్స్లో 105, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 172, సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో 362, బోధనాస్పత్రుల్లో 608 రకాల మందులను ఏపీఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13 సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పీహెచ్సీలు, విలేజ్ క్లినిక్స్కు మూడు నెలలకు సరిపడా మందులను ముందే పంపిణీ చేస్తున్నారు. ఇక మిగిలిన పెద్ద ఆస్పత్రులకు అక్కడి అవసరాలకు అనుగుణంగా నిరంతరం సరఫరా చేస్తున్నారు. గ్రామ స్థాయిలోనే 105 రకాల మందులు.. ఇక గ్రామస్థాయిలోనే 105 రకాల మందులను విలేజ్ క్లినిక్స్లో అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేకూరుస్తోంది. గత టీడీపీ హయాంలో జ్వరం, దగ్గు, తలనొప్పి వస్తే డోలో, పారాసెటిమాల్ కూడా లభించని దుస్థితి గ్రామాల్లో ఉండేది. ఈ పరిస్థితులకు చెక్పెడుతూ ఏకంగా గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ రూపంలో మినీసైజ్ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. వీటిలో 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, ఏకంగా 105 రకాల మందులు ఉంటున్నాయి. దీంతో థైరాయిడ్, యాంటి థైరాయిడ్, రక్తంలో కొలె్రస్టాల్ సాంద్రతను తగ్గించే మెడిసిన్, హృదయనాళ సంబంధిత సమస్యలకు వాడే మందులు, యాంటి టీబీ మెడిసిన్, యాంటి లెప్రసీ మెడిసిన్, యాంటి ఎపిలెప్సీ మెడిసిన్, ఇతర ఔషధాలు గ్రామస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి రెండు వారాలకు ఒకసారి వైద్యులు వెళ్తున్నారు. మరోవైపు.. టెలీ మెడిసిన్ విధానంలో గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ ఫిజీషియన్ కన్సల్టేషన్లు ఇక్కడే లభిస్తున్నాయి. ఈ వైద్యుల ప్రి్రస్కిప్షన్ మేరకు విలేజ్ క్లినిక్స్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఉచితంగా ప్రజలకు మందులు అందిస్తున్నారు. -
ఆడుతూ, పాడుతూ ‘అమ్మ’
వీఏవీ రంగాచార్యులు, సాక్షి సెంట్రల్ డెస్క్ : మాతృత్వంలోని కమ్మదనం గురించి ‘అమ్మ’కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అయితే బిడ్డకు జన్మనిచ్చి తల్లి అవ్వడం అనేది ఆ ‘అమ్మ’కు పునర్జన్మేనని చెప్పవచ్చు. అంటే ఓ మహిళ గర్భం దాల్చి.. తొమ్మిది నెలలపాటు శిశువును మోయడం ఒక ఎత్తు అయితే, ఆ బిడ్డను బాహ్య ప్రపంచంలోకి తీసుకురావడం మరోఎత్తు. ఈ క్రమంలో ఆ చివరి రోజు ఆ మహిళ పడే కష్టం, బాధ వర్ణణాతీతం. ఈ బాధ భరించలేక చాలా మంది సిజేరియన్ (ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయడం) చేయించుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఎక్కువ ఫీజు వస్తుందని మారు మాట్లాడకుండా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది సరికాదని, ఇతరత్రా ఎలాంటి సమస్యలు లేకపోతే నార్మల్ డెలివరీ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గట్టిగా చెబుతోంది. దీంతో చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, పీహెచ్సీల్లో నార్మల్ డెలివరీకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రిస్క్ తీసుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులు సిద్ధంగా లేనందున అనవసర సిజేరియన్లు కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తూనే ఉంది. ఎపిడ్యూరల్ విధానం ఒక వరం అభివృద్ధి చెందిన దేశాల్లో, మన దేశంలో ఎగువ మధ్య తరగతి, ధనికులు ఇప్పుడిప్పుడే ఈ విధానం ద్వారా సుఖ ప్రసవం అయ్యేలా దృష్టి సారిస్తున్నారు. ఎపిడ్యూరల్ అంటే ఇదొక రకమైన అనస్థీషియా. మామూలుగా శరీరంలో ఒక భాగానికి నొప్పి తెలియకుండా ఉండేందుకు స్పైన్ (వెన్ను)కు మత్తు మందు ఇచ్చినప్పుడు ఆ భాగం నుంచి మెదడుకు నొప్పి సంకేతాలు వెళ్లవు. అదే సమయంలో మెదడు నుంచి మోటార్ సిగ్నల్స్ రావు. అప్పుడు ఆ భాగానికి సంబంధించి కండరాలు వదులవుతాయి. సిజేరియన్ కోసమైతే ఇలా చేయాలి. నొప్పి తెలియకుండా నార్మల్ డెలివరీ చేయాలంటే ఇందులో ఒకదాన్ని ఆపి, మరొకదాన్ని పని చేయించాలి. వైద్యులతో ముందే చర్చించాలి కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే వారిలో చాలా మంది నొప్పి తట్టుకోలేక సిజేరియన్ చేసేయండని అడుగుతున్నారని, ఇలాంటి సమయంలో ఎపిడ్యూరల్ విధానం పాటించాలని డబ్ల్యూహెచ్వో సూచిస్తోంది. ఈ విధానానికి నిపుణుడైన అనెస్థీషియాలజిస్ట్ మాత్రమే అదనంగా అవసరం. అందువల్ల దాదాపు సిజేరియన్కు అయ్చే ఖర్చే అవుతుంది. ఇప్పటికే ఈ విధానం గురించి తెలిసిన వారు చాలా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యులతో ముందుగానే చర్చించి తగిన శ్రద్ధ తీసుకుంటున్నారు. వారి సూచనల మేరకు నిత్యం వ్యాయామం చేస్తూ ఆడుతూ, పాడుతూ గడుపుతున్నారు. పురుటి నొప్పులు మొదలవుతాయనడానికి ముందుగానే ఆస్పత్రిలో చేరుతున్నారు. వీరికి యాక్టివ్ లేబర్ కంటే (తీవ్రమైన నొప్పులు) ముందు నుంచే పెలి్వక్ (కండరాలు వదులయ్యేలా) ఎక్సర్సైజ్లు చేయిస్తారు. ఆ సమయంలో వేడి నీళ్లలో తడిపిన టవల్ ద్వారా ఒత్తిడి తేవడం, కొన్ని ఎక్సర్సైజ్ల ద్వారా సుఖ ప్రసవం అయ్యేలా చూస్తారు. ఇటీవల సినీ నటుడు రామ్చరణ్ సతీమణి ఉపాసన ఈ విధానంలోనే బిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. కొన్ని ఆస్పత్రుల్లో ఐవీ అనాల్జీషియా, ఎంటొనాక్స్ (మాస్క్ ద్వారా గ్యాస్ ఇవ్వడం) తదితర పద్దతుల్లో కూడా నొప్పి లేకుండా ప్రసవాలు చేస్తున్నప్పటికీ ఎపిడ్యూరల్ మాత్రమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. సిజేరియన్ కంటే ఇదే మేలు కాబట్టి, దీని గురించి అందరికీ తెలియాలని డబ్ల్యూహెచ్వో కోరుకుంటోంది. స్పైన్ పై భాగంలోనే మత్తు స్పైన్లోపలికి కాకుండా పై భాగంలో ఉన్న పొరలోకి మత్తు మందును తక్కువ మోతాదులో ఇంజెక్ట్ చేస్తారు. ఇలా చేస్తే అనాల్జీషియా (నొప్పి లేకపోవడం) మాత్రమే పని చేస్తుంది. అంటే మెదడుకు ఆ భాగం నుంచి నొప్పి సంకేతాలు వెళ్లనందున నొప్పి తెలియదు. మెదడు నుంచి యథావిధిగా మోటార్ సిగ్నల్స్ వస్తూనే ఉంటాయి. అందువల్ల ఆ భాగంలో కండరాలు యథావిధిగా పని చేస్తాయి. దీంతో గర్భసంచి చుట్టూ ఒత్తిడి పెరిగి, కొద్ది కొద్దిగా బేబీ బయటకు వస్తుంది. ఇందుకోసం సర్జరీలకు వాడేంత డోస్ కాకుండా తక్కువ డోసులో మత్తు మందు వాడతారు. అన్ని అనెస్థీషియాల్లాగే దీనికీ కొంత సైడ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి రాదు. మామూలుగా కంటే ఓ గంట సమయం ఎక్కువ పడుతుంది. మంచి బెనిఫిట్ ఉంటుంది ఎపిడ్యూరల్ వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెయిన్ను బాగా తగ్గించవచ్చు. బెనిఫిట్ చాలా బావుంటుంది. చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే విధానం కొనసాగుతోంది. పూర్వపు రోజుల్లో ఈ విధానం పట్ల మన దేశంలో కొంత అపోహ ఉండేది. ఇప్పుడు విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఆ అపోహలు తొలగిపోయాయి. లేబర్లో మూడు దశలు ఉంటాయి. రెండవ దశ నుంచి ఇది స్టార్ట్ చేయాలి. కొంచెం బీపీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతకు మించి పెద్ద సమస్యలు ఉత్పన్నం కావు. కాకపోతే తొమ్మిదవ నెల నుంచే గర్భిణిని ఇందుకు సమాయత్తం చేయాల్సి ఉంటుంది. ఈ విధానంపై కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పరిశోధన కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పీజీ అనెస్థీసియా విద్యార్థులు పలు పేపర్లు కూడా ప్రెజెంట్ చేశారు. యువతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఖర్చు కూడా తక్కువే. ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. గర్భిణికి అవగాహన ఉండి కోరితేనే చేస్తున్నారు. – ఎస్.మాణిక్యరావు, గైనకాలజీ హెచ్ఓడి, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి -
'ఆయుష్మాన్ భారత్' అద్భుతం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్
గాంధీనగర్: గుజరాత్ లోని గాంధీనగర్లో జరిగిన జీ20 సదస్సు ఆరోగ్య శాఖ మంత్రల సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డా.టెడ్రోస్ అధనం ఘెబ్రేయేసుస్ భారత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కొనియాడారు. జీ20 సదస్సు ప్రారంభోత్సవం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సును ఇంతటి స్థాయిలో నిర్వహిస్తున్నందుకు ముందుగా భారత్కు కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆరోగ్యం విషయంలో భారత దేశం అనుసరిస్తోన్న విధానాలను కొనియాడుతూ ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రశంసలు కురిపించారు. నేనొక హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కి వెళ్లాను. అక్కడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ద్వారా కనీసం వెయ్యి గృహాల వరకు సేవలందిస్తుండడం చూసి ఆశ్చర్యపోయాను. గుజరాత్ లోని టెలి మెడిసిన్ సౌకర్యం కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వైద్య రంగంలో డిజిటల్ సేవలు ఒక విప్లవాత్మక మార్పని చెబుతూ జీ20 సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుఖ్ మందవియా మాట్లాడుతూ ఈ సమావేశాలకు సుమారు 70 దేశాల నుండి ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. జీ20 ప్రెసిడెన్సీ సదస్సు ద్వారా భారత దేశంలో మేము అవలంబిస్తున్న ఆరోగ్య విధానాల గురించి ప్రజలకు తెలియజేశామని మోదీ ప్రభుత్వం ఆరోగ్యానికి ఏ స్థాయిలో ప్రాధాన్యతనిచ్చిందో చెప్పే ప్రయత్నం చేశారు. ఆగస్టు 17న మొదలైన ఈ సమావేశాలు ఈరోజు వరకు విజయవంతంగా జరిగాయి. ఈ సమావేశం ప్రధానంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అత్యవసర ఆరోగ్యసమస్యలు నివారణ, యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిస్థితుట్లకు తగట్టుగా స్పందించి సిద్దపడటం.. సురక్షితమైన, ప్రభావవంతమైన,నాణ్యమైన సేవలందించే విధంగా ఫార్మసీ రంగాన్ని బలోపేతం చేయడం గురించి ప్రస్తావించినట్లు తెలిపారు కేంద్ర మంత్రి. ఇది కూడా చదవండి: మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి.. -
హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కోవిడ్ 19 మహమ్మారి ఎదుర్కున్న తీరులో విఫలమైన నేపథ్యంలో రాబోయే మహమ్మారి పట్ల మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలని భావిస్తూ, తనకు అధికారాలు కావాలని కోరుతోంది. ప్రపంచ దేశాలను నిర్దేశించడానికి తనకు అధికారాలు పెంచడానికి అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు (ఐహెచ్ఆర్), ప్రపంచ మహమ్మారి ఒప్పందం హెచ్ఈఆర్పీ గురించి తన సభ్య దేశాలతో చర్చల ప్రక్రియను ప్రారంభించింది. ఈ మూడు దారుల ద్వారా తన అధికారాలరను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్యం మీద తన గుత్తాధిపత్యం స్థాపించుకోవడానికి, కొనసాగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మే 2024 కల్లా పూర్తి కావాలని భావిస్తోంది. వీటి ద్వారా అన్ని దేశాలలో ఆరోగ్యంపై జాతీయ ప్రణాళికలను శాసించే విధంగా ఈ ఒప్పందాలను తయారు చేస్తున్నారు. ముసాయీదా ఒప్పందాల గురించి చర్చించడం ప్రారంభించారు. అయితే, ఇది కేవలం ఆరోగ్య రంగం కాకుండా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆహారం తదితర రంగాలకు కూడా తన ‘ప్రభావం’ విస్తరించే ప్రయత్నంలో డబ్ల్యూహెచ్ఓ ఉంది. దీని వెనుక ఉన్న శక్తులు బిల్ గేట్స్, క్లాస్ శ్వాబ్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ) వంటి ప్రముఖులు ఉన్నారు. ఒక ప్రపంచ ప్రభుత్వాన్ని, ఒక కొత్త ప్రాపంచిక వ్యవస్థను స్థాపించడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. భారత దేశం కూడా ఈ చర్చలలో పాల్గొంటోంది. కానీ మన దేశంలో, పార్లమెంటులో దీనిపై చర్చ లేదు. కనీసం ప్రస్తావన కూడా చాల తక్కువ. పైగా చాలా మంది ప్రజలకు అసలు ఈ విషయం కూడా తెలియదు. ఈ విషయం మీద అవగాహన పెంచాల్సిన అవసరం మాత్రం ఉంది. భారత ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఒక సమావేశం నిర్వహిస్తున్నారు అధికారులు. రౌండ్ టేబుల్ సమావేశం : డబ్యూహెచ్ఓ ప్రపంచ మహమ్మారి ఒప్పందం (Global Pandemic Accord): దేశ సార్వభౌమత్వానికి , పౌరుల హక్కులకు పొంచి ఉన్న విపత్తు తేదీ : 09-08-2023 సమయం : ఉదయం 10 - 2 గంటలకు ప్రదేశం : ఆడిటోరియం సెమినార్ హాల్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ & సోషల్ స్టడీస్ ( సెస్ ) బేగంపేట్, హైదరాబాద్ వక్తలు : ప్రొఫెసర్ కోదండరాం, డా. దొంతి నర్సింహ రెడ్డి, సరస్వతి కవుల ప్రెజెంటేషన్ తర్వాత ఓపెన్ ఫోరమ్ చర్చ. (చదవండి: మళ్లీ మహమ్మారి కొత్త వేరియంట్ కలకలం..భయం గుప్పెట్లో దేశాలు!) -
మళ్లీ విరుచుకుపడుతున్న మహమ్మారి..డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్!
మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి పూర్తిగా బయటపడ్డాం అని అనుకుంటున్న సమయంలో మరో వేరియంటే చాపకింద నీరులా వచ్చేస్తుంది. ఇంకా నేను ఉన్నానంటూ..మరో కొత్త వేరియంట్ రూపంలో భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఆ మహమ్మారి మొదలైన సమయంలో ఎదుర్కొన్న కష్టాలు అంత ఈజీగా మర్చిపోలేం. అందర్నీ ఇంట్లో బందీలుగా చేసింది. ఇప్పుడూ మళ్లీ మరో రూపంలో ఆ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ సైతం అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఏంటీ కొత్త వేరియంటే..ఎక్కడ వ్యాపించింది? ఇంతవరకు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి, దాని తాలుకా కేసులు చూశాం. ఇప్పుడు అది ఒమిక్రాన్ నుంచి మరో కొత్త వేరియంట్ 'ఈజీ.5.1'గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా విజృంభిచడం ప్రారంభించింది. యూకేలో కరోనా కొత్త వేరియంట్ 'ఎరిస్' అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని ఇంగ్లాండ్లోని హెల్త్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి దేశంలో దాదాపు 14.6% కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఈ మహమ్మారికి సంబంధించి..ఇప్పటి వరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్లలో ఇది ఒకటని యూకే ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. ఈ వారంలో ఆ కొత్త వేరియంట్కి సంబంధించి..సుమారు నాలుగువేల కేసు వచ్చాయిని చెప్పారు. ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కొత్త వేరియంట్కి జులై 31న "ఎరిస్" అనే పేరుతో వేరియంట్గా వర్గీకరించారు. తొలిసారిగా జూలై 3, 2023న దీని తాలుకా కేసులను గుర్తించారు. అది కాస్త నెమ్మదిగగా పెరగడంతో ఆరోగ్య అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా వృద్ధులు ఆస్పత్రిలో చేరే రేటు పెరగుతున్నట్లు తెలిపారు. మొత్తంగా చూస్తే ఆస్పత్రిలో చేరే పరిస్థితులు తక్కువుగానే ఉన్నాయని, అలాగే ఐసీయూలో అడ్మిట్ అవుతున్న కేసులు పెద్దగా పెరగలేదని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(యూకేహెచ్ఎస్ఏ) పేర్కొంది. ఏది ఏమైనా ఈ మహామ్మారీ కేసులు పెరగక ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదన్నారు ఇయూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ హెడ్ డాక్టర్ మేరి రామ్సే. ప్రజలంతా ఈ వైరస్ల బారిన పడకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, అలానే శ్వాసకోస సంబంధ సమస్యలు ఉన్నవారికి దూరంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం ఈ కొత్త వేరింట్ కేసులను ట్రాక్ చేయడం ప్రారంభించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ..ప్రజలంతా ముందస్తు జాగ్రత్తగా వ్యాక్సిన్లు, సంరక్షణ పద్దతులను అవలంబించాలని సూచించారు. అలాగే అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండటమేగాక తమ రక్షణను వదులుకోవద్దని చెప్పారు. కాగా యూకేలో నెమ్మదిగా పెరుగుతున్న ఈ కొత్త వేరియంట్ కేసులపై నిపుణలు, అధికారలు పరిశోధనలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో ప్రజలు ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని గట్టిగా హెచ్చరించారు అధికారులు. (చదవండి: అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి!) -
'ఆ దగ్గు మందు కలుషితం.'. భారత్లో తయారైన సిరప్పై WHO అలర్ట్
భారత్లో తయారై.. ఇరాక్లో అమ్ముతున్న కోల్డ్ అవుట్ (Cold Out) దగ్గు మందు సిరప్లో కలుషితమైన ఔదాలున్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలిందంటూ బ్లూమ్బెర్గ్ నివేదిక తెలిపింది. అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ ల్యాబరేటరీ సంస్థ వాలిసూర్ ల్యాబ్ ఈ ఏడాది మార్చిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్కు చెందిన ఓ ఫార్మసీలో కొనుగోలు చేసిన కోల్డ్ అవుట్ సిరప్పై రీసెర్చ్ చేసింది. వాలిసూర్ పరిశోధనల్లో భారత్లో తయారైన ఈ దగ్గుమందులో 2.1% ఇథలీన్ గ్లైకాల్ (ఈజీ) నమూనాలు ఉన్నట్లు తేలింది. ఇది వినియోగించాల్సిన శాతం కంటే 21 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. తద్వారా సిరప్ వినియోగంతో ప్రాణాల్ని ఫణంగా పెట్టాల్సి ఉంటుంది. గత ఏడాది మైడెన్ ఫార్మా తయారు చేసిన జలుబు, దగ్గుమందు సిరప్లలో ఇథలీన్ గ్లైకాల్ ఉంది. ఈ సిరప్ తాగి 70 మంది చిన్నారులు మరణించారు. అదే ఇథలీన్ గ్లైకాన్ తాజా వాలిసూర్ పరిశోధనలు జరిపిన సిరప్లో ఉన్నట్లు గుర్తించింది. జూలై 8న బ్లూమ్బెర్గ్ ఈ పరీక్ష ఫలితాలను డబ్ల్యూహెచ్వోతో పాటు, ఇరాక్, భారత అధికారులకు సమాచారం అందించింది.ఇక, డబ్ల్యూహెచ్వో సైతం వాలిసూర్ ఫలితాలపై అలెర్ట్ అయ్యింది. వాలిమర్ రీసెర్చ్ ఆమోదయోగ్యంగా ఉన్నాయని, ఇరాక్ ప్రభుత్వం ఈ సిరప్లను విక్రయిస్తే హెచ్చరికలు జారీ చేస్తామని వెల్లడించింది. సిరప్ ఫలితాలపై ఇరాక్ ఓ ఇంటర్వ్యూలో, సిరప్ ఫలితాలపై ఇరాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ అల్ బాడర్ మాట్లాడుతూ.. ఔషధాల దిగుమతి, అమ్మకం, పంపిణీకి మంత్రిత్వ శాఖ కఠినమైన నిబంధనలను కలిగి ఉన్నాయని అన్నారు. కానీ ఇండియన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన సిరప్ ఫలితాలపై స్పందించేందుకు నిరాకరించారు. ఇరాక్లో లభ్యమైన వాలిసూర్ ల్యాబ్ కొనుగోలు చేసిన ఈ సిరప్లను చైన్నైకి చెందిన ఫోర్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ సంస్థ జర్మనీ, కెనడాతో సహా 50 కంటే ఎక్కువ దేశాలకు సరఫరా చేస్తుంది. అయితే, ఆ సిరప్ తయారీని సంస్థ పుదుచ్చేరికి చెందిన షారున్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని సమాచారం. ఈ సంస్థ గురించి, కోల్డ్ అవుట్ సిరప్ గురించి పూర్తి స్థాయిలో సమాచారం తెలియాల్సి ఉంది. ఆ దగ్గు మందుల్లో ఎలాంటి లోపం లేదు. గత ఏడాది భారత్ హరియాణాలోని సొనెపట్ కేంద్రంగా.. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్లు వినియోగించి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 70 మంది చిన్నారులు గతేడాది మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. పిల్లల మరణాలకు సిరప్లలోని ఇథిలీన్ గ్లైకాల్ కారణమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. తాజాగా, భారత ఫార్మా కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. మైడెన్ ఫార్మా తయారు చేసిన దగ్గు,జలుబు మందు సిరప్లపై వివిధ రకాల తనిఖీలు నిర్వహించింది. ఆ పరీక్షలన్నింటిలోనూ ఎలాంటి లోపాలు వెలుగు చూడలేదని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. గాంబియా ప్రభుత్వం సంప్రదిస్తే మా నివేదిక ప్రకారం బదులిస్తామని వెల్లడించారు. చదవండి👉 కొంపముంచుతున్న ‘AI’.. ప్రమాదంలో మహిళా ఉద్యోగులు, సంచలన నివేదికలో -
ఎవరు?
నటుడు, దర్శక–నిర్మాత జేడీ చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో తీసిన తాజా చిత్రం ‘హూ’. ఇందులో శుభరక్ష, నిత్య హీరోయిన్స్ గా నటించారు. రెడ్డెమ్మ బాలాజీ.కె నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా రెడ్డెమ్మ బాలాజీ.కె మాట్లాడుతూ–‘‘ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన చిత్రం ‘హూ’. ఈ మూవీలో జేడీ చక్రవర్తి నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: ఈశ్వర్ చంద్. -
షాకింగ్.. ఇదే జరిగితే కోకాకోల కథ కంచికే!
ప్రపంచ వ్యాప్తంగా కోకాకోలా గురించి తెలియని వారు ఉండరు అంటే ఏ మాత్రమే అతిశయోక్తి కాదు. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కోక్ అంటే చాలు ఎగబడిపోతారు. గతంలో ఈ శీతల పానీయాలు చాలా ప్రమాదమంటూ కొన్ని వార్తలు తెరకెక్కాయి, కానీ అవన్నీ బలంగా నిలువలేకపోయాయి. అయితే ఇప్పుడు ఈ సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కోకాకోలా (CocaCola)లో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్ ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దారించనుంది. ఆస్పర్టేమ్ అనే స్వీటెనర్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ఉత్పత్తులలో విరివిగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్వీటెనర్ వల్ల భవిష్యత్తులో క్యానర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన క్యాన్సర్ పరిశోధనల విభాగం ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) ఈ స్వీటెనర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిర్దారించింది. ఈ కారణంగా కోకాకోలా క్యాన్సర్ కారకం అవుతుందని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. (ఇదీ చదవండి: దంపతులిద్దరికీ అదే సమస్య.. వారికొచ్చిన ఐడియా ధనవంతులను చేసిందిలా!) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ అధికారిక ప్రకటన జులై నెలలో వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రపంచంలోని చాలా దేశాలు దీని వినియోగాన్ని నిషేధిస్తాయి, మరికొన్ని దేశాలు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అయితే ఐఏఆర్సీ ఈ ఆస్పర్టేమ్ ఎంత మోతాదులో తీసుకుంటే మంచిది, ఎంత మోతాదు దాటితే ప్రమాదం అనే దానికి సంబంధించిన వివరణ ఇవ్వలేదు. 1984లో వెలువడిన కొన్ని నివేదికలు ఆస్పర్టేమ్ తక్కువ మోతాదులో ప్రతి రోజూ తీసుకున్న ఎటువంటి ప్రమాదం లేదని వెల్లడించాయి. ఇన్ని రోజులూ వీటినే అనేక దేశాలు ఉదాహరణలుగా చెబుతూ ముందుకు సాగాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది క్యాసర్ కారకం అని ప్రకటిస్తే.. ఆ తరువాత పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయి. -
కాటేస్తున్న కాలుష్యం
సాక్షి, అమరావతి : ప్రపంచవ్యాప్తంగా 99 శాతం మంది ప్రజలు కలుషితమైన గాలిని పీలుస్తున్నారు. ఒక్క ఏడాదిలో 66.67 లక్షల మంది శ్వాసకోశ వ్యాధుల బారిన పడి మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం అత్యధికంగా ఉన్న 20 నగరాల్లో మన దేశానికి చెందిన 14 నగరాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నివేదిక వెల్లడించింది. అవన్నీ ఉత్తర భారత దేశ నగరాలే కావడం గమనార్హం. గాలి కాలుష్యంపై డబ్ల్యూహెచ్వో 2022లో నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డబ్ల్యూహెచ్వో ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్ గాలిలో కలుషిత పదార్థాలు 2.5 మైక్రో గ్రాములకు మించకూడదు. అయితే అన్ని దేశాల్లో గాలిలో కలుషిత పదార్థాల తీవ్రత నిర్దేశించిన ప్రమాణాల కంటే నాలుగైదు రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. కలుషితమైన గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడి తీవ్రమైన రక్తపోటుతో 2019లో ఏకంగా 66.67 లక్షల మంది మరణించినట్లు వెల్లడైంది. పట్టణాల్లో ప్రమాదకర స్థాయిలో.. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాలు, నగరాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. ప్రపంచంలో గాలి కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న నగరాల్లో పాకిస్తాన్లోని లాహోర్ మొదటి స్థానంలో నిలవగా చైనాలోని హటన్ రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ ఆళ్వార్ జిల్లాలోని బివాడీ కాలుష్య తీవ్రత అత్యధికంగా ఉన్న నగరాల్లో మూడో స్థానంలో నిలిచింది. కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాల్లో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉండగా న్యూఢిల్లీ తొమ్మిదో స్థానంలో ఉంది. పరిశ్రమలు, వాహనాల పొగ.. గడ్డి కాల్చివేతతో వాహనాల రద్దీ అధికంగా ఉండటం వల్ల వాటి నుంచి వెలువడే పొగ... ప్రమాణాలు పాటించని పరిశ్రమలు... వ్యర్థాలను అడ్డగోలుగా కాల్చేయడం... నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేయడం.. పంట కోతల తర్వాత గడ్డిని పొలాల్లోనే కాల్చేయడం వల్ల ఓజోన్ పొరకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాౖMð్సడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి విష వాయువుల విడుదలతో గాలి కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్నట్లు డబ్ల్యూహెచ్వో పేర్కొంది. -
ప్రపంచంలో 230 కోట్ల మందికి వంటగ్యాస్ లేదు
ఐక్యరాజ్యసమితి: నేటి ఆధునిక యుగంలోనూ విద్యుత్ వెలుగులు చూడనివారు, వంటగ్యాస్ అందుబాటులో లేనివారు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఉన్నారు. ఈ మేరకు ఐదు అంతర్జాతీయ సంస్థలు.. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎజెన్సీ, ఐక్యరాజ్యసమితి గణాంక విభాగం, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ఒక నివేదిక విడుదల చేశాయి. ప్రపంచంలో దాదాపు 230 కోట్ల మంది వంటచెరుకుగా కట్టెలు, పిడకల వంటివి ఉపయోగిస్తున్నారని వెల్లడించాయి. 67.50 కోట్ల మందికి ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదని తెలియజేశాయి. ♦ 2030 నాటికి కరెంటు లేని వారి సంఖ్య 66 కోట్లకు, వంట గ్యాస్ లేని వారి సంఖ్య 190 కోట్లకు తగ్గిపోతుంది. ♦ 2010లో ప్రపంచంలో 84 శాతం మందికి విద్యుత్ సౌకర్యం ఉంది. 2021 నాటికి ఇది 91 శాతానికి చేరింది. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి వల్ల 2019–21లో ఈ వృద్ది కొంత మందగించింది. ♦ కరెంటు సౌకర్యం లేనివారిలో 80 శాతం మంది (56.7 కోట్లు) సబ్ సహారన్ ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ♦ ఇంధన వనరుల విషయంలో ప్రపంచ దేశాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ♦ వంట గ్యాస్ లేకపోవడంతో కట్టెలు, పిడకలు వంటి కాలుష్యకారక ఇంధనాల వాడకం, దానివల్ల వాయు కాలుష్యం కారణంగా ప్రపంచంలో ప్రతిఏటా దాదాపు 32 లక్షల మంది చనిపోతున్నారని అంచనా. -
ఫైనల్ బెర్త్ ఎవరిది..
-
ఫైనల్ కి వెళ్ళేది ఏవరు.. ప్రెజర్ లో GT జోష్ లో MI
-
WHO: మరో మహమ్మారి పొంచి ఉంది, సిద్ధంగా ఉండండి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధిపతి టెడ్రోస్ అధనామ్ ఓ కీలక ప్రకటన చేశారు. కోవిడ్-19 కంటే ప్రాణాంతకమైన మరో మహమ్మారి పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కోవిడ్-19 ముగిసిందంటే ప్రపంచానికి ఆరోగ్య ముప్పు తొలగినట్టు కాదని టెడ్రోస్ చెప్పారు. 76వ ప్రపంచ ఆరోగ్య సభలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి ఆ మహమ్మారి వ్యాప్తి చెందుతూ.. తొలుత ప్రాణాంతకంగా మారిన తదనంతరం తన ఉనికిని వివిధ వేరియంట్లగా మార్చుకుంటూ మనం ఎదుర్కునే తీవ్రత గల ముప్పుగా పరిణిమించడం నెమ్మదించిందన్నారు. అయినప్పటికీ ఇది మనకు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా..సాధ్యమైనంత త్వరగా ప్రతిస్పందించేలా ప్రభావవంతమైన ప్రపంచ యంత్రాగాల అవసరాన్ని గురించి నొక్కి చెప్పిందన్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీలు) కింద ఆరోగ్య సంబంధిత లక్ష్యాలు 2030ని మరింతగా అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను ఈ కోవిడ్ 19 మహమ్మారి తెలియజెప్పిందన్నారు టెడ్రోస్. ఈ మహమ్మారి 2017 ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీని ప్రకటించిన ట్రిపుల్ బిలయన్ లక్ష్యాల పురోగతిని కూడా ప్రభావితం చేసిందన్నారు. ఒకరకంగా ఈ మహమ్మారి మనల్ని ఘోరంగా దెబ్బతీసి.. సస్టెనబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీ)ని నిర్వీర్యం చేసినప్పటికీ ఇలాంటి మహమ్మారీలను ఎదుర్కొనే అవశ్యకత తోపాటు భవిష్యత్తులో వీటి పట్ల ఎలా సన్నద్ధంగా ఉండాలో మనకు ఒక పాఠం నేర్పిందన్నారు డబ్ల్యూహెచ్ చీఫ్ టెడ్రోస్. (చదవండి: అలాంటివి మేము అంగీకరించం.. చర్యలు తీసుకుంటాం! భారత్కి హామీ) -
కరోనా పీడ విరగడైంది: డబ్యూహెచ్వో
జెనీవా: కరోనా మహమ్మారి పీడ దాదాపుగా విరగడైనట్టే. గత మూడున్నరేళ్లుగా ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ దశను దాటేసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కోవిడ్–19 అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ఇకపై చూడాల్సిన అవసరం లేదని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధ్నామ్ వెల్లడించారు. కనీవినీ ఎరుగని రీతిలో లాక్డౌన్లతో నాలుగ్గోడల మధ్య ప్రజలు బందీగా ఉండడం, ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోవడం వంటి వాటితో కరోనా కలకలం రేపింది. ఈ వైరస్ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వైరస్ బలహీనపడిపోయినప్పటికీ ఇంకా ముగింపు దశకు చేరుకోలేదని టెడ్రోస్ చెప్పారు. ఇప్పటికీ ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్య దేశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయని, ప్రతీ వారం కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. 2020 జనవరి 30 డబ్ల్యూహెచ్ఓ కోవిడ్–19ను అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. -
‘భౌ’బోయ్.. కరుస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 82 శాతం మంది ప్రజలు నిత్యం వీధి, పెంపుడు శునకాలతో దాడి ముప్పు పొంచి ఉందని భయపడుతున్నారట. ఇందులో 61 శాతం మంది ఇలాంటి దాడులు సర్వ సాధారణమని చెప్పగా.. ఇది గతంతో పోలిస్తే 31 శాతం పెరుగుదలను చూపిస్తోంది. లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్తంగా 326 జిల్లాల్లో 53 వేల మందికిపైగా ప్రజల నుంచి ప్రతి స్పందనలు స్వీకరించింది. వీరిలో 67 శాతం పురుషులు, 33 శాతం మహిళలు ఉన్నారు. ప్రతి 10 మందిలో 8 మంది కుక్కల బెడదను తొలగించడంలో అధికారుల సహకారం దూరమైందని అభిప్రాయపడ్డారు. వీధి కుక్కల నియంత్రణ, పెంపుడు కుక్కల డేటా సేకరణలోనూ నిర్లక్ష్యంగా ఉన్నట్టు సర్వే తెలిపింది. కేవలం 10 శాతం మంది మాత్రమే అధికార యంత్రాంగంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 71 శాతం మంది ప్రజలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద విచ్చలవిడి జంతు నిర్వహణకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం విశేషం. 36 శాతం రేబిస్ మరణాలు భారత్లోనే! దేశంలో జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం–1960 ప్రకారం జంతువులను హింసించడం, చంపడం చట్టవిరుద్ధం. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్–2001 ప్రకారం.. వాటి జనాభాను తగ్గించడానికి వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేయాల్సి ఉంటుంది. అయితే, చాలా రాష్ట్రాల్లో నిధుల కొరతతో వీధి కుక్కలకు టీకాలు వేయడంలో విఫలమవుతున్నట్టు సర్వే చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాలలో 36 శాతం భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే 18వేల నుంచి 20వేల మరణాలు సంభవిస్తున్నాయి. 30నుంచి 60 శాతం మృతుల్లో 15 ఏళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. వీధి శునకాలకు వేటాడే స్వభావం వీధి శునకాలకు విచ్చలవిడిగా వేటాడే స్వభావం ఉంటుందని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవి సంచరిస్తున్న ప్రదేశంలో ఆహారం లభించకుంటే చిన్నచిన్న జంతువులను చంపి తింటాయని.. ఆ ప్రక్రియ వాటి మానసిక ప్రవృత్తిని ప్రభావితం చేస్తోందని వాదిస్తున్నారు. ఏటా ఆడ శునకం 20 పిల్లలకు జన్మనిస్తుంది. ఒక్కసారి కారు, బైక్ ప్రమాదంలో శునకం పిల్ల చనిపోతే ఆ వాహనాన్ని శత్రువుగా భావిస్తుంది. అలాంటి వాహనాలు వస్తే దూకుడుగా వెంబడించడం.. దాడి చేయటం వాటికి అలవాటుగా మారుతుందంటున్నారు. గతేడాది మహారాష్ట్రలో అత్యధికంగా 3,46,318 శునకాల దాడుల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 3,30,264 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో 1,69,378, ఉత్తరాఖండ్లో 1,62,422, కర్ణాటకలో 1,46,094, గుజరాత్లో 1,44,855, బీహార్లో 1,18,354 కేసులొచ్చాయి. -
రాష్ట్రంలోనే కడుపు ‘కోత’లెక్కువ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమ్మకు కడుపు ‘కోత’తప్పడంలేదు! దేశంలోకెల్లా తెలంగాణలోనే సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఎంఐఎస్) తాజా నివేదికలో వెల్లడైంది. దీని ప్రకారం 2021–22లో సిజేరియన్ల జాతీయ సగటు 23.29 శాతంగా ఉండగా రాష్ట్రంలో అది ఏకంగా 54.09 శాతంగా నమోదైంది. అంటే జాతీయ సగటు కంటే రెట్టింపునకుపైగా ఉండటం గమనార్హం. అయితే తెలంగాణకన్నా ఎంతో వెనుకబడిన బిహార్లో మాత్రం అత్యంత తక్కువగా 5.66 శాతం సిజేరియన్లే జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. ఆ తర్వాత జార్ఖండ్లో 9.13 శాతం, యూపీలో 9.51 శాతం, మధ్యప్రదేశ్లో 12.97 శాతం సిజేరియన్లు మాత్రమే జరుగుతున్నాయి. తెలంగాణ తరహాలో జమ్మూకశీ్మర్లో 48.97 శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలోకెల్లా పదో స్థానంలో నిలిచింది. నివేదికలోని ముఖ్యాంశాలు.. ♦ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సూచనల ప్రకారం మొత్తం కాన్పుల్లో సిజేరియన్లు 10 శాతం నుంచి 15 శాతానికి మించకూడదు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో అంతకు ఐదు రెట్లు ఎక్కువగా సిజేరియన్లు జరుగుతున్నాయి. ♦ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్ల జాతీయ సగటు 15.48 శాతం ఉండగా ప్రైవేటులో అది 37.95 శాతం ఉంది. ♦ తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 47.13 శాతం సిజేరియన్లు కాగా ప్రైవేటు ఆసుపత్రుల్లో 61.08 శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ♦ బిహార్లో అత్యంత తక్కువగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1.86 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ♦ 2021–22లో పుట్టిన శిశువుల్లో వివిధ కారణాల వల్ల తెలంగాణలో 2,171 మంది చనిపోయారు. ♦బాలికలకు శానిటరీ నాప్కిన్స్ సరఫరాలో తెలంగాణ వెనుకబడి ఉంది. దేశవ్యాప్తంగా ఆ ఏడాది 4.21 కోట్లు సరఫరా చేయగా, అత్యధికంగా తమిళనాడులో కోటిన్నర, తర్వాత ఆంధ్రప్రదేశ్లో 1.16 కోట్లు సరఫరా చేశారు. తెలంగాణలో కేవలం 1,552 మాత్రమే సరఫరా చేశారు. ♦ 2021–22లో తెలంగాణలో 6.06 లక్షల మంది శిశువులు జన్మించారు. అందులో రెండున్నర కేజీల బరువుతో పుట్టినవారు 37,792 మంది ఉన్నారు. 4.89 లక్షల మంది గంటలోపు తల్లిపాలు తాగారు. ♦ 2021–22లోతెలంగాణలో 46.70 లక్షల కండోమ్లు పంపిణీ అయ్యాయి. -
భారత్లో తయారైన ఆ దగ్గుమందు కలుషితం.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ
2022లో గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో భారత్లో తయారైన కలుషిత దగ్గు మందు తీసుకోవడం వల్ల దాదాపు 300 మంది చిన్నారులు మరణించారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తమైంది. తాజాగా, మార్షల్ దీవులు, మైక్రోనేషియాలలో భారత్కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేసిన దగ్గు మందు కలుషితమైనట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అయితే దగ్గు మందు సేవించడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యారా? లేదా? అనే విషయాల్ని డబ్ల్యూహెచ్ఓ తెలపలేదు. ఈ దగ్గు మందులో గుయిఫెనెసిన్ సిరప్ టీజీ సిరఫ్లో డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్తో మోతాదుకు మించి ఉన్నట్లు చెప్పింది. ఈ దగ్గు మందు వినియోగంతో ప్రాణాలు పోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా రెగ్యులరేటరీ థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ సైతం తెలిపింది. పంజాబ్కు చెందిన క్యూపీ ఫార్మాకెమ్ లిమిటెడ్ తయారు చేసిన ఈ దగ్గుమందును ట్రిలియం ఫార్మా మార్కెటింగ్ చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. ఇక క్యూపీ ఫార్మాకెమ్ తయారు చేసిన దగ్గు మందును ఏప్రిల్ 6న పరిశీలించగా.. అవి కలుషితమైనట్లు గుర్తించినట్లు తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలపై క్యూపీ ఫార్మాకెమ్ మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ పాఠక్ స్పందించారు. భారత ప్రభుత్వం అనుమతితో 18వేల సిరప్ బాటిళ్లను కాంబోడియాకు ఎగుమతి చేయగా.. దేశంలో సైతం పంపిణీ చేశామని అన్నారు. అయితే ఇప్పటి వరకు సిరప్లోని లోపాలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై అటు తయారీ సంస్థ క్యూపీ ఫార్మా కెమ్ లిమిటెడ్, ఇటు మార్కెటింగ్ సంస్థ ట్రిలియం ఫార్మాలు స్పందించలేదు. -
Sudan Conflict: 400 మందికి పైగా మృతి.. వేల మందికి గాయాలు
న్యూయార్క్: సూడాన్ అంతర్యుద్ధంలో 413 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(RSF)కు నడుమ అక్కడ భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంతర్యుద్ధంలో చిన్నారులే ఎక్కువగా బాధితులవుతున్నట్లు ఐరాస మరో విభాగం యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్వో ప్రతినిధి మార్గరేట్ హ్యారిస్ మీడియాతో మాట్లాడుతూ.. సూడాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అంతర్యుద్ధంలో 413 మంది సాధారణ పౌరులు మృతి చెందారని, అలాగే 3,551 మంది గాయపడ్డారని వెల్లడించారు. అలాగే.. అక్కడి ఆరోగ్య కేంద్రాలపైనా దాడులు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. ఇదే సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ మాట్లాడుతూ.. ఈ పోరులో పిల్లలే ఎక్కువగా బాధితులైనట్లు వెల్లడించారు. తొమ్మిది మంది చిన్నారులు మరణించారు, 50 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించారాయన. అలాగే.. చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారని, చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకపోయాయని తెలిపారు. ఆహారం, మంచి నీరు, మందులు లేక వాళ్లు అల్లలాడుతున్నారని, మరోవైపు చికిత్స అందించాల్సిన ఆస్పత్రులే నాశనం అవుతున్నాయంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సూడాన్ ప్రపంచంలోనే పిల్లలో పోహకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రస్తుత పరిస్థితులతో యాభై వేలకు పైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడిందని తెలిపింది. సూడాన్లో 2021 అక్టోబర్ నుంచి ప్రభుత్వం లేకుండానే ఎమర్జెన్సీలో నడుస్తోంది. మిలిటరీ అప్పటి ప్రధాని అబ్దల్లా హందోక్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. గత శనివారం నుంచి సూడాన్ రాజధాని ఖార్తోమ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్కు నడుమ పోరాటం నడుస్తోంది. అధికార దాహం నుంచి పుట్టిందే ఈ అంతర్యుద్ధం -
అత్యంత ‘వేడి’ సంవత్సరం ఏదంటే..! ఆ నివేదిక ఏం చెబుతోంది?
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. పారిశ్రామిక విప్లవ కాలం(1850–1900) ముందు నాటి ఉష్ణోగ్రత కంటే 2022లో ప్రపంచ ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యింది. 2022 సంవత్సరం ఇప్పటిదాకా ఆరో అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుకెక్కిందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) వెల్లడించింది. ఈ మేరకు ‘స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్–2022’ నివేదికను శుక్రవారం విడుదల చేసింది. నివేదికలో ఏం వెల్లడించారంటే.. ► 2015 నుంచి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తద్వారా కార్బన్ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు పెరిగాయి. ఈ గ్రీన్హౌజ్ వాయువులు 2021లో రికార్డు స్థాయిలో వెలువడ్డాయి. ► అంటార్కిటికాలో, యూరప్ల్లో హిమానీనదాలు కరిగిపోతున్నాయి. ► 2013 నుంచి 2022 దాకా సముద్రాల నీటిమట్టం ప్రతిఏటా సగటున 4.62 మిల్లీమీటర్ల చొప్పున పెరిగింది. 1993– 2022 మధ్య రెట్టింపైంది. ► 2022లో అధిక ఉష్ణోగ్రతల వల్ల భారత్లో పంటల ఉత్పత్తి పడిపోయింది. పలు రాష్ట్రాల్లో అడవుల్లో కార్చిచ్చు వ్యాప్తించింది. ► పంటల ఉత్పత్తి పడిపోవడం, అదే సమయంలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభం కావడంతో భారత్ నుంచి గోధుమలు, బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించాల్సి వచ్చింది. దీనివల్ల చాలా దేశాలు ఇబ్బందులు తీవ్ర ఎదుర్కొన్నాయి. ► వాతావరణ మార్పుల వల్ల భారత్లో గతేడాది వరదలు కొండ చరియలు విరిగిపడడం వల్ల 700 మంది మరణించారు. వివిధ రాష్ట్రాల్లో పిడుగుపాటుకు 900 మంది బలయ్యారు. ► అస్సాంలో వరదల వల్ల 6.63 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ళీ గ్రీన్హౌజ్ వాయువుల ఉద్గారాలు పెరుగుతున్న కొద్దీ వాతావరణంలో ప్రతికూల మార్పులు కొనసాగుతూనే ఉంటాయని, అవి భూగోళంపై మానవళికి ముప్పుగా పరిణమిస్తాయని డబ్ల్యూఎంఓ సెక్రెటరీ జనరల్ ప్రొఫెసర్ పెటిరీ తలాస్ చెప్పారు. ► కరువు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను తట్టుకొనే శక్తి ప్రపంచంలో 100కుపైగా దేశాలకు ఏమాత్రం లేదని అధ్యయనంతో తేలింది. -
దోమ.. ప్రాణాంతకం! లాలాజలంలో వైరల్ ఆర్ఎన్ఏ గుర్తింపు
సాక్షి, అమరావతి: దోమ.. చూడటానికి చిన్నప్రాణే. కానీ.. ప్రపంచాన్ని వణికిస్తోంది. దోమను ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ప్రాణిగా వర్జీనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. రోగాలను మోసుకు రావడంలో ముందుండే దోమలు ఇప్పుడు మనిషి రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు వెల్లడించారు. దోమ లాలాజలంలోని ఆర్ఎన్ఏ మానవ రోగ నిరోధక(ఇమ్యూనిటీ) వ్యవస్థను తీవ్రంగా నాశనం చేస్తున్నట్టు అధ్యయనంలో గుర్తించారు. సరికొత్త చికిత్సకు మార్గం దోమల ద్వారా సంక్రమించే వ్యాధులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 7.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో మలేరియాతో మరణించే వారి సంఖ్య 6 లక్షలు ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక డెంగీ వ్యాధి బారిన పడుతున్న వారు 400 మిలియన్ల మంది ఉంటున్నారు. తీవ్రమైన జ్వరం, వాంతులు, చర్మంపై మచ్చలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కొన్ని సందర్భాలలో అంతర్గత రక్తస్రావంతో పాటు కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. డెంగీ వైరస్కు పూర్తిస్థాయిలో చికిత్స అందుబాటులోకి రాలేదని, డెంగీ లక్షణాలను తగ్గించే వైద్య పద్ధతులను మాత్రమే అనుసరిస్తున్నట్టు వర్జీనియా శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ప్రస్తుత అధ్యయనం ద్వారా డెంగీ చికిత్సకు, ఔషధాల తయారీకి కొత్త మార్గం లభించినట్టయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. వెలుగులోకి కొత్త విషయాలు ఇటీవల వర్జీనియా శాస్త్రవేత్తలు డెంగీ వైరస్పై పరిశోధనలు చేయగా.. కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దోమల లాలాజలంలోని వైరల్ ఆర్ఎన్ఏ మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను అడ్డుకుంటున్నట్టు తేలింది. వర్జీనియా విశ్వవిద్యాలయానికి చెందిన బయోకెమిస్ట్ తానియా స్ట్రిలెట్స్ నేతృత్వంలోని బృందం మూడు వేర్వేరు విశ్లేషణ పద్ధతుల ద్వారా దోమ సెలైవా(లాలాజలం)పై అధ్యయనం చేశారు. ఇందులో నిర్దిష్ట రకమైన వైరల్ ఆర్ఎన్ఏ (రిబోన్యూక్లియిక్ యాసిడ్)ను గుర్తించారు. ఇందులో ‘ఎక్స్ట్రా సెల్యులర్ వెసికిల్స్’ అని పిలిచే మెంబ్రేన్ (పొర) కంపార్ట్మెంట్లలో సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏ (ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ) ద్వారా డెంగీ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని గుర్తించారు. వైరస్ ఇన్ఫెక్షన్ స్థాయిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ పెంచిందని బృందం ధ్రువీకరించింది. ఇది దోమ లాలాజలంలో ఉంటుందని, మనిషి రోగ నిరోధక శక్తిని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ శక్తివంతంగా అడ్డుకుంటోందని తానియా స్ట్రిలెట్స్ వెల్లడించారు. ఈ సబ్ జెనోమిక్ ఫ్లేవివైరల్ ఆర్ఎన్ఏను కీటకాల ద్వారా సంక్రమించే జికా, ఎల్లో ఫీవర్ వంటి రోగాల్లో కూడా గుర్తించారు. దోమ కుట్టినప్పుడు డెంగీ ఉన్న లాలాజలాన్ని శరీరంలోకి చొప్పిస్తుందని, దాన్ని అడ్డుకునేందుకు మానవ శరీరంలో ఉండే రోగనిరోధక వ్యవస్థ చేసే దాడిని లాలాజలంలోని ఎస్ఎఫ్ ఆర్ఎన్ఏ అడ్డుకుంటోందని తేల్చారు. -
మానవాళికి డెంగీ ముప్పు!
సాక్షి, అమరావతి : ప్రపంచవ్యాప్తంగా మానవాళికి డెంగీ ముప్పు పొంచి ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దోమలు, వైరస్ల వ్యాప్తి పెరగడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఇటీవల వెల్లడించింది. దశాబ్దకాలంగా డెంగీ, జికా, చికున్ గున్యా వంటి ఆర్బోవైరస్ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగాయని ప్రకటించింది. ఏడాదికి 100 మిలియన్ల నుంచి 400 మిలియన్ల వరకు ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయని ప్రకటించింది. ప్రస్తుతం జనాభాలో దాదాపు సగం మందికి డెంగీ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. డబ్ల్యూహెచ్వో వెల్లడించిన కొన్ని ముఖ్యమైన వివరాలు... ♦ అటవీ నిర్మూలన, పారిశుధ్యం, పట్టణీకరణ, నీటిపారుదలలో సమస్యలు దోమలవ్యాప్తికి ప్రధాన కారణం. ♦ ముఖ్యంగా అవపాతం(వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి ద్రవీకరించడం), ఉష్ణోగ్రత పెరుగుదల, అధిక తేమ వంటివి దోమల అవాసాలకు అనుకూలంగా ఉన్నాయి. ♦ ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరంలో డెంగీ కేసులు సుమారు 0.5 మిలియన్ నమోదవగా, 2019 నాటికి 5.2 మిలియన్లకు పెరిగాయి. 2023లోనూ ఇదే ఉధృతి కొనసాగుతోంది. ♦ ఈ ఏడాది దాదాపు 129 దేశాలు డెంగీ బారినపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే 100కి పైగా దేశాల్లో డెంగీ వ్యాప్తి కనిపిస్తోంది. ♦ ఈ ఏడాది మార్చి చివరి వరకు ప్రపంచవ్యాప్తంగా 4,41,898 డెంగీ కేసులు నమోదవగా, 119 మంది మరణించారు. ♦ చికున్ గున్యా దాదాపు అన్ని ఖండాల్లో విస్తరించింది. ప్రస్తుతం సుమారు 115 దేశాల్లో దాని ప్రభావం ఉంది. -
కోవిడ్ డేటాను చైనా తొక్కిపెడుతోంది
ఐరాస/జెనీవా: 2020లో వూహాన్ మార్కెట్లో సేకరించిన శాంపిళ్ల డేటాను చైనా తొక్కిపెడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆరోపించింది. కరోనా మూలాలను అంచనా వేయడంలో ఈ సమాచారమే కీలకమని పేర్కొంది. కోవిడ్ పరిశోధనల ఫలితాలను అంతర్జాతీయ సంస్థలతో పంచుకుంటూ పారదర్శకంగా వ్యవహరించాలని హితవు పలికింది. మహమ్మారి పుట్టుకను అర్థం చేసుకోవడం నైతిక, శాస్త్రీయ అవసరమని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రెసియస్ అన్నారు. ‘‘వూహాన్లోని హునాన్ మార్కెట్లో సేకరించిన నమూనాల డేటాను ఈ ఏడాది జనవరి చివర్లో ఆన్లైన్ నుంచి తొలగించారు. దాన్ని తిరిగి అందరికీ అందుబాటులో ఉంచాలని చైనాకు చెప్పాం’’ అన్నారు. చైనాలోని వూహాన్ నగరంలో 2019 ఆఖరులో పుట్టిన కరోనా వైరస్ సార్స్–కోవ్–2 ప్రపంచమంతటా వ్యాపించి, లక్షలాది మరణాలకు కారణంగా మారడం తెలిసిందే. -
అయితే కోవిడ్ గురించి ఇప్పటిదాకా చెప్పినదంతా..!?
అయితే కోవిడ్ గురించి ఇప్పటిదాకా చెప్పినదంతా..!? -
WHO: కరోనా మహమ్మారి మూలాల గురించి మీకు తెలిసిందే చెప్పండి!
చైనా ల్యాబ్ లీక్ కారణంగా కరోనా వచ్చిదంటూ యూఎస్ వాదిస్తుండగా.. అవాస్తవం అని చైనా పదే పదే తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్-19 మూలాలు గురించి మీకు తెలిసిందే చెప్పండని శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అన్ని దేశాలను కోరింది. 2019లో చైనాలో వచ్చిన ఈ కరోనా ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేసింది. లక్షల్లో మరణాలు సంభవించగా, దేశాలన్ని ఆర్థిక సంక్షోభంలో కొట్టుకునే పరిస్థితకి దారితీసింది కూడా. ఈ కారణాల రీత్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మహమ్మారి పుట్టుక గురించి బహిర్గతం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేగాదు దీని గురించి అంతర్జాతీయ దేశాలతో పంచుకోవడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. ఇప్పడు నిందలు వేసుకోవడం ముఖ్యం కాదని, ఈ మహమ్మారి ఎల ప్రారంభమైంది అనేదానిపై అవగాహన పెంచుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి అంటువ్యాధులను నిరోధించవచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. ఈ కోవిడ్-19 మూలాన్ని గుర్తించడానికి సంబంధించిన ఏ చిన్న ప్రణాళికను డబ్ల్యూహెచ్ఓ వదిలిపెట్టలేదని నొక్కి చెప్పారు. ఈ విషయంలో వాస్తవాలు కావాలి 2021లో యూఎన్ ఈ మహమ్మారి మూలం తెలుసుకోవడానికి సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్(ఎస్ఏజీఓ) గ్రూప్ను కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన డేటాను చైనా పంచుకోవాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించమని ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. అలాగే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఈ విషయమై చైనా అగ్రనాయకులతో పలుమార్లు చర్చించినట్లు కూడా తెలిపారు. ఇలాంటి విషయాలను రాజకీయాలు చేయొద్దని అది పరిశోధనలను కష్టతరం చేస్తుంది, ఫలితంగా ప్రపంచ సురక్షితంగా ఉండదని చెప్పారు. ఇటీవలే యూఎస్లోని ప్రముఖ ఎనర్జీ డిపార్ట్మెట్ కరోనా మూలానికి వ్యూహాన్ ల్యాబ్ లీకే ఎక్కువగా కారణమని నివేదిక కూడా ఇచ్చింది. అదీగాక ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్లోనే అత్యున్నత అధికారులు ఉండటంతో ఈ నివేదిక ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈమేరకు డబ్ల్యూహెచ్ఓలోని అంటువ్యాధుల ఎపిడెమియాలజిస్ట్ వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ..ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు, దీర్ఘకాల కోవిడ్తో జీవిస్తున్న వారి కోసం ఇదేలా ప్రారంభమైందనేది తెలుసుకోవడం నైతికంగా అత్యంత ముఖ్యం. శాస్త్రీయ అధ్యయనంలో ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడటానికి ఈ సమాచారం పంచుకోవడం అత్యంత కీలకం అని అన్నారు. -
సై‘కాలేజీ’కి డిమాండ్!
టెక్నాలజీ పెరిగింది.. జీవన విధానం మారుతోంది.. అన్ని రంగాల్లో ఒత్తిడి పెరిగింది.. ఫలితంగా మానసిక, పని ఒత్తిడితో ‘సైకాలజీ’ సమస్యలతో బాధపడేవారు అధికమయ్యారు. ప్రతీ ఏడుగురిలో ఒకరికి మానసిక సమస్యలు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) చెబుతోందంటే ఏ స్థాయిలో ఈ సమస్యలు పెరుగుతున్నాయో స్పష్టమ వుతోంది. అయితే, దీనికి తగ్గట్లు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు, చికిత్స చేసేందుకు ఆ స్థాయిలో సైకాలజిస్టులు మాత్రం లేరు. దేశంలో ప్రతీ 10 లక్షల మందికి ఏడుగురు మాత్రమే సైకాలజిస్టులు ఉన్నారు. దీంతో వారి కొరత పెరిగింది. అయితే ప్రస్తుతం సైకాలజీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. ఎంతలా అంటే.. దేశవ్యాప్తంగా వీరి సంఖ్య ఏకంగా 50 శాతం పెరిగింది. సాక్షి ప్రతినిధి కర్నూలు: దేశంలో సైకాలజీ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతిష్టాత్మక కాలేజీలు ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లోనూ గ్రాడ్యుయేట్, డిప్లొమో, పీజీ కోర్సులు అంది స్తున్నాయి. డిగ్రీలో ఏ గ్రూపు చదివినా పీజీలో సైకాలజీని ఎంచుకో వచ్చు. గతంలో ఢిల్లీలోని రామానుజన్ కాలేజీతో పాటు యూని వర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలో సైకాలజీకి 30–40 వేల అప్లికేషన్లు మాత్ర మే వచ్చేవి. 2020–21లో 50–60వేల దరఖాస్తులు వచ్చాయి. 20 22లో 60వేలు దాటాయి. విద్యార్థులు ఎక్కువగా సైకాలజీపై ఆసక్తి చూపడంతో సైకాలజీ సీట్ల సంఖ్యను కూడా ఢిల్లీ యూని వర్సిటీ పెంచింది. ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూని వర్శిటీ)లో ఏటా 4–5వేల మంది చేరేవారు. ఇప్పుడు 10 వేల మంది అడ్మిషన్లు పొందుతున్నారు. అంటే సైకాలజీ చదివేవారి సంఖ్య రెట్టింపు అయింది. బెంగళూరు జైన్ డీమ్డ్ యూనివర్శిటీ, అమిటి, పూణేలోని సింబయాసిస్, యూనివర్శిటీ ఆఫ్ లక్నో, బెనారస్తో పాటు అన్ని వర్సిటీల్లో కూడా అడ్మిషన్లు 50% తక్కువ కాకుండా పెరిగాయి. కొన్నింటిలో రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో ఆంధ్రా, తిరుపతి ఎస్వీ వర్సిటీలో ఈ కోర్సు ఉంది. దేశ వ్యాప్తంగా 9వేల మంది మాత్రమే సైకాలజిస్టులు ఉన్నారు. కోవిడ్– 19 తర్వాత సైకాలజిస్టులకు భారీ డిమాండ్ ఏర్పడింది. వీరికి భారీగా వేతనాలు కూడా ఇస్తున్నారు. దీంతో చాలామంది ఈ సబ్జెక్టుపై ఆసక్తి పెంచుకున్నారు. అటు వర్సిటీలు కూడా క్లినికల్ సైకాలజీ, కౌన్సెలింగ్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, కాగ్నిటివ్ సైకాలజీ, కల్చరల్ సైకాలజీ, క్రిమినల్ సైకాలజీ, ఎడ్యు కేషన్ సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, న్యూరో సైకాలజీ పేరుతో ప్రత్యేక కోర్సులు అందిస్తున్నాయి. ► పాతికేళ్ల కిందట మానసిక రోగం అంటే చాలామందికి తెలీదు. ఇప్పుడు 10మంది ఆస్పత్రికి వెళ్తే వారిలో నలుగురిని డాక్టర్లు సైకాలజిస్టుకు సిఫార్సు చేస్తున్నారు. ► అభద్రత, ఆత్రుత, తదితర బాధలు పెరుగు తున్నాయి. దీంతో ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు ఉత్పన్నమవు తున్నాయి. ► కార్పొరేట్ విద్య వచ్చాక పిల్లలను ఉద్యోగం సాధించే యంత్రాలుగా మాత్రమే యాజమాన్యాలు చూస్తున్నాయి. అందుకు తగ్గట్లే శిక్షణనిస్తున్నాయి. దాంతో వారిపైనా తీవ్రమైన ఒత్తిడి ఉంటోంది. ► ముఖ్యంగా కోవిడ్–19 తర్వాత భర్త లను కోల్పోయిన భార్యలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, అమ్మా, నాన్నను కోల్పోయిన పిల్లలున్నారు. వీరందరూ మానసిక ఒత్తిడికి గురవు తున్నారు. అలాగే, కోవిడ్తో ఉపాధి కోల్పోయిన వారిదీ ఇదే పరిస్థితి. రకరకాల కారణాలతో.. ప్రతీ కాలేజీలో సైకాలజిస్టు తప్పనిసరిగా ఉండాలని 2008లోనే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కేరళలో స్కూలు స్థాయి నుంచే సైకాలజిస్టులు ఉన్నారు. అందుకే వారి చదువు, జీవన విధానం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సైకాలజీ కోర్సుకు డిమాండ్ పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామం. – సిరిగిరెడ్డి జయరెడ్డి, సైకాలజిస్టు, కర్నూలు -
వద్దు‘లే..జీ’ నడవటం ఈజీ.. మరణాలకు నాలుగో ప్రధాన కారణం ఏంటో తెలుసా?
తాగి డ్రైవింగ్ చేయడం.. అతి వేగంతో వాహనాలు నడపటం.. సిగరెట్లు తాగడం వంటివి ఎలా ప్రాణాంతకమవుతాయో.. రోజంతా మంచంపై కూర్చోవడం.. ఎలాంటి కదలికలు లేకుండా ఉండటం కూడా అంతే ప్రాణాంతకమని మీకు తెలుసా. సోమరితనం మీ విలువైన కాలంతోపాటు మీ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. శరీరానికి తగినంత వ్యాయామం చేయకపోతే అకాల మరణాలు సంభవించే అవకాశాలు 500 రెట్లు అధికమని ‘ది లాన్సెట్’లో ప్రచురించిన ఓ అధ్యయనం స్పష్టం చేసింది. నడక లేదా పరుగు వంటి సాధారణ వ్యాయామాలు చేయడానికి కూడా తీరిక లేని వ్యక్తి వ్యాధులను ఆహ్వానిస్తాడని వెల్లడించింది. సాక్షి, అమరావతి: బడి ఈడు పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఏ వయసు వారైనా తగినంత శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఇంటినుంచి అడుగు బయట పెట్టగానే బైక్ లేదా కారెక్కి తుర్రుమని గమ్యస్థానానికి చేరుతున్న వారెందరో ఉన్నారు. ఒక్క క్లిక్తో గుమ్మం వద్దకే అగ్గిపెట్టె నుంచి అన్నిరకాల వస్తువులు వచ్చి చేరుతున్నాయి. దీంతో బద్ధకస్తులు పెరిగిపోతున్నారు. ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులబారిన పడుతున్న వారి సంఖ్య కూడా శరవేగంగా పెరుగుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో నడక, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జిమ్ చేయడం లాంటి ఏదో ఒక వ్యాయామం చేసి తీరాలని వైద్యులు సూచిస్తున్నారు. భారం పెరిగిపోతోంది ప్రజలు బద్ధకిస్టులుగా మారడం.. ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, క్యాన్సర్ వంటి నాన్ కమ్యూనికబుల్ (ఎన్సీడీ) వ్యాధులు దేశంలోను, రాష్ట్రంలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో 63 శాతం, రాష్ట్రంలో 68 శాతం మరణాలకు ఎన్సీడీ వ్యాధులకు కారణమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్సీడీ నివారణ, నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 30 ఏళ్ల పైబడిన వారందరికీ స్క్రీనింగ్ నిర్వహించి.. వారి ఆరోగ్యంపై నిరంతర ఫాలో అప్ను వైద్య శాఖ చేపడుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 2.80 కోట్ల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా.. 55.41 లక్షల మందిలో రక్తపోటు లక్షణాలు వెలుగు చూశాయి. వీరిలో 16.28 లక్షల మందిలో సమస్య నిర్ధారణ అయింది. 5.46 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉండగా.. 5.14 లక్షల మందిలో సమస్య అదుపులోనే ఉంది. అదేవిధంగా 53.92 లక్షల మందిలో మధుమేహం సమస్య వెలుగు చూడగా.. 12.29 లక్షల మందికి సమస్య నిర్ధారణ అయింది. వీరిలో 4.17 లక్షల మంది ప్రస్తుతం చికిత్సలో ఉన్నారు. 3.65 లక్షల మందిలో సమస్య అదుపులో ఉంది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఎన్సీడీ బాధితులపై వైద్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రజల్లోకి తీసుకుని వెళ్లేలా.. దీర్ఘకాలిక జబ్బుల బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలకు శారీరక శ్రమ ఆవశ్యకతను తెలియజేసి.. వారిని నడక, వ్యాయామం ఇతర కార్యకలాపాల వైపు మళ్లించడంపై వైద్య శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థలు, ఎన్జీవోల సహకారాన్ని తీసుకుని వాకింగ్ ట్రాక్లు, గ్రౌండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించారు. పాఠశాల దశలోనే పిల్లల్లో వ్యాయామం, నడక రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మరణాలకు నాలుగో ప్రధాన కారణం బద్ధకమే ప్రజలు తగినంత శారీరక శ్రమ చేయకపోవడం మరణాలకు నాలుగో ప్రధాన కారణంగా ఉంటోందని డబ్ల్యూహెచ్వో సైతం హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాలకు నాలుగు ప్రధాన కారణాలను పరిశీలిస్తే అధిక రక్తపోటు మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత స్థానాల్లో పొగాకు వినియోగం, మధుమేహం, శారీరక శ్రమ చేయకపోవడం వంటివి ఉంటున్నాయి. తగినంత శారీరక శ్రమ లేకపోవడంతో ప్రజలు దీర్ఘకాలిక జబ్బులైన మధుమేహం, రక్తపోటు, పక్షవాతం, క్యాన్సర్, గుండె సమస్యలు, మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. వీటిని నయం చేసుకోవడానికి ఏటా రూ.25 వేల కోట్ల మేర ఖర్చవుతోందని, పదేళ్లలో ఈ ఖర్చు రూ.2.50 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని గత ఏడాది ఓ నివేదికలో డబ్ల్యూహెచ్వో స్పష్టం చేసింది. పట్టణీకరణ పెరుగుదల, రవాణా సౌకర్యంలో మార్పులు, అవుట్డోర్ పార్కులు, వాకింగ్ ట్రాక్లు అందుబాటులో లేకపోవడం, శారీరక శ్రమ ఆవశ్య కతపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ప్రజలను బద్ధకిస్టులుగా మార్చుతున్నాయి. ఇప్పటికే సమావేశం నిర్వహించాం ప్రజలకు వాకింగ్ చేయడానికి వీలుగా మైదానాలను అందుబాటులోకి తీసుకురావడం కోసం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇప్పటికే సమావేశం నిర్వహించాం. తమ గ్రౌండ్లను ఉదయం, సాయంత్రం ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరాం. వివిధ శాఖలను సమన్వయం చేసుకుని ప్రజల రోజువారి దినచర్యలో వాకింగ్, జాగింగ్, వ్యాయామం, ఇతర శారీరక శ్రమ కార్య కలాపాలను భాగం చేసేలా కార్యక్రమాలు చేపడతాం. – జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ మార్పు రావాలి పాశ్చాత్య జీవన విధానానికి ప్రజలు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో అలవాట్లలో మార్పు రావాలి. మన పూర్వీకుల జీవన విధానాల్లోకి మనం వెళ్లాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, వ్యాయామం, ఈత ఇలా ఏదో ఒక శారీరక శ్రమ చేయాలి. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుప డుతుంది. ఊబకాయం నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ -
కడుపు కోత తగ్గించేలా!
రాష్ట్రలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్ ప్రసవాలే చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేస్తున్న సిజేరియన్ల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం వైద్య శాఖ ప్రత్యేక ప్రణాళిక రచించింది. సాక్షి, అమరావతి: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మార్గదర్శకాల ప్రకారం మొత్తం ప్రసవాల్లో సిజేరియన్లు 10 నుంచి 15 శాతంలోపే ఉండాలి. కానీ.. మన రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన మొత్తం ప్రసవాల్లో 2021–22లో 43.82 శాతం, 2022–2023 (ఏప్రిల్ నుంచి డిసెంబర్)లో 47.39 శాతంగా నమోదైంది. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్ఎంఐఎస్) సమాచారం ప్రకారం.. 2021–22 సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగిన మొత్తం ప్రసవాల్లో 50.81 శాతం సిజేరియన్లుగా నమోదయ్యాయి. 2022–23లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ పరిశీలిస్తే 55.83 శాతానికి పెరిగింది. ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాల నియంత్రణకు వైద్య శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ల నియంత్రణ చర్యల్లో భాగంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా 26 జిల్లాల్లో ప్రసూతి సేవలందిస్తున్న నెట్వర్క్ ఆస్పత్రుల్లో నిర్వహించిన సిజేరియన్ ప్రసవాలపై ఆడిట్ నిర్వహించింది. 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే 2022–23 సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య రాష్ట్రంలో ప్రసూతి సేవలు అందిస్తున్న 198 ఆస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలపై వైద్య శాఖ అధ్యయనం నిర్వహించింది. వీటిలో ఏకంగా 74 ఆస్పత్రుల్లో 91నుంచి 100 శాతం సిజేరియన్లే చేసినట్టు తేలింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 14, పల్నాడులో 9, అనకాపల్లిలో 7, గుంటూరులో 8 ఆస్పత్రులు ఈ జాబితాలో ఉన్నాయి. 45 ఆస్పత్రుల్లో 81నుంచి 90 శాతం, 38 ఆస్పత్రుల్లో 71నుంచి 80%, 41 ఆస్పత్రుల్లో 70 శాతానికిపైగా సిజేరియన్లు చేసినట్టు అధికారులు గుర్తించారు. జిల్లాల వారీగా అత్యధికంగా సిజేరియన్లు నిర్వహించిన ఆస్పత్రులను పరిశీలిస్తే.. శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో 714 ప్రసవాలకు గాను.. 712 సిజేరియన్లు చేశారు. కర్నూలు జిల్లాలోని మరో ఆస్పత్రిలో 322 కాన్పులకు గాను 321, అన్నమయ్య జిల్లాలో 290 ప్రసవాలకు గాను 290 సిజేరియన్లు చేశారు. కుటుంబ సభ్యుల నుంచీ ఒత్తిడి! సిజేరియన్ చేయాలని గర్భిణుల కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండటం వల్లే ఇలా చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. తొలి కాన్పు సిజేరియన్ అయితే.. రెండో కాన్పు కూడా అలా చేయక తప్పడం లేదంటున్నారు. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ వైద్యులు అందుకు అంగీకరించకూడదని.. సంబంధిత కేసుల్లో ఆయా కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులైతే సిజేరియన్లు చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. కారణాలివీ.. ► సాధారణ ప్రసవంతో పోలిస్తే సిజేరియన్కు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజు ఎక్కువగా ఉండటం. సాధారణ ప్రసవం చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో గర్భిణి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తూ ఉండాలి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిపుణులైన నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండరు. దీంతో అన్ని గంటలపాటు ప్రైవేట్ వైద్యులు ఓపికతో ఎదురుచూసే పరిస్థితులు లేకపోవడం. ► చిన్నపాటి నర్సింగ్ హోమ్లు, ఆస్పత్రులకు ప్రత్యేకంగా 24/7 ఆనస్తీషియా వైద్యుడు అందుబాటులో లేకపోవడం. ► యువ వైద్యుల్లో సాధారణ ప్రసవాలు నిర్వహించడానికి తగినంత అనుభవం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. ► సాధారణ ప్రసవానికి సిద్ధపడేలా సిజేరియన్ ప్రసవంతో సంభవించే సమస్యలపై గర్భిణి, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకపోవడం. -
టెలిమెడిసిన్ సేవల్లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: టెలిమెడిసిన్ సేవల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ విశాల్ చౌహాన్ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకుని టెలిమెడిసిన్ సేవలను మరింత మెరుగైన రీతిలో అందించాలని సూచించారు. దేశంలో టెలిమెడిసిన్ విధానాన్ని బలోపేతం చేసే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఆగ్నేయ ఆసియా రీజియన్ ఆధ్వర్యాన ఢిల్లీలో నిర్వహిస్తున్న వర్క్షాప్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ చౌహాన్ మాట్లాడుతూ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా టెలిమెడిసిన్ సేవలను అమలు చేస్తున్నామని తెలిపారు. టెలిమెడిసిన్ సేవలకు కరోనా కష్టకాలంలో అత్యంత ఆదరణ లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లకు టెలిమెడిసిన్ సేవలను విస్తరించిందని తెలిపారు. రాష్ట్రంలో 27 టెలిమెడిసిన్ హబ్లను ఏర్పాటు చేశామని, రోజుకు 60వేల టెలి కన్సల్టేషన్లు నమోదవుతున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 9.7 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదు కాగా, ఇందులో 3.1కోట్లు (32 శాతం) ఏపీలోనే నమోదయ్యాయని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసి రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థను మరింత సమర్థంగా నడపాలని సీఎం వైఎస్ జగన్ సూచించారన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో టెలిమెడిసిన్ కోసం ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టి అందులో 6,145 మంది డాక్టర్లను రిజిస్టర్ చేయడం ద్వారా అప్పట్లో ప్రజలకు విశేష సేవలు అందించామన్నారు. ఈ డాక్టర్లు 13,74,698 కాల్స్ స్వీకరించి సేవలు అందజేశారన్నారు. -
మద్యం చుక్కతో క్యాన్సర్.. పరేషాన్లో ఇంకా తాగేస్తున్నారు..!
మద్యం చుక్కతో క్యాన్సర్- ప్రపంచ ఆరోగ్య సంస్థ -
‘మా కరోనా’ మా ఇష్టమని అంటున్నార్సార్!
‘మా కరోనా’ మా ఇష్టమని అంటున్నార్సార్! -
హెటిరో నుంచి కోవిడ్ -19 డ్రగ్.. డబ్ల్యూహెచ్ఓ ఆమోద ముద్ర
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం హెటిరోకి చెందిన ’నిర్మాకామ్’ (నిర్మాట్రెల్విర్) నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీక్వాలిఫికేషన్ (డబ్ల్యూహెచ్వో పీక్యూ) ఆమోదముద్ర లభించింది. ఈ ఔషధాన్ని మరింత మందికి అందుబాటులోకి తెచ్చే దిశగా ఇది కీలక మైలురాయని కంపెనీ ఎండీ వంశీ కృష్ణ బండి తెలిపారు. భారత్తో పాటు 95 అల్పాదాయ, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో నిర్మాకామ్ను మరింత వేగంగా, చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కోవిడ్–19 చికిత్సలో ఉపయోగించే ఫైజర్ ఔషధం ప్యాక్స్లోవిడ్కు ఇది జనరిక్ వెర్షన్. నిర్మాట్రెల్విర్ 150 మి.గ్రా.(2 ట్యాబ్లెట్లు), రిటోనావిర్ 100 మి.గ్రా.(1 ట్యాబ్లెట్) అనే 2 యాంటీవైరల్ ఔషధాలు ఈ ప్యాక్లో ఉంటాయి. దీని తయారీ, విక్రయానికి సంబంధించి మెడిసిన్స్ పేటెంట్ పూల్ (ఎంపీపీ) నుంచి స్వచ్ఛంద లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెటెరో తెలిపింది. ఈ లైసె న్స్ కింద జనరిక్ వెర్షన్ను రూపొందించిన తొలి సంస్థ హెటిరో కావడం ప్రశంసనీయమని ఎంపీపీ ఈడీ చార్లెస్ గోర్ తెలిపారు. దేశీయంగా అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి ఇప్పటికే అనుమతులు పొందినట్లు వివరించింది. -
చిన్నారుల ప్రాణం తీసిన దగ్గు మందు..మైడెన్ ఫార్మాస్యూటికల్స్కు ఊరట!
69 మంది చిన్నారుల మరణానికి కారణమని డబ్ల్యూహెచ్ఓ అనుమానం వ్యక్తం చేసిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో పదుల సంఖ్యలో చిన్నారుల మరణాలకు మైడెన్ ఫార్మా తయారు చేసిన డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ మోతాదు పరిమితికి మించి ఉన్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమానం వ్యక్తంచేసింది. తాజాగా ఆ సంస్థ తయారు చేసిన దగ్గు మందు సిరప్ల నుండి తీసిన నమూనాలను ప్రభుత్వ ప్రయోగశాలలో టెస్టులు నిర్వహించగా అందులో ఎలాంటి తప్పు లేదని తేలింది. కాబట్టి, తన ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వ అనుమతి కోరినట్లు మైడెన్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. ఈ సందర్భంగా మైడెన్ ఫార్మా మేనేజింగ్ డెరెక్టర్ నరేష్ కుమార్ గోయల్ మాట్లాడుతూ.. భారతీయ నియంత్రణ, న్యాయ వ్యవస్థలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మేం ఎలాంటి తప్పు చేయలేదు. ‘మేం ఇప్పుడు ఫ్యాక్టరీని పునప్రారంభించేలా అధికారులను కోరుతున్నాం. కానీ అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. అనుమతుల కోసం మేం ఇంకా వేచి ఉన్నాం అని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ నెలలో 69 మంది పిల్లల మరణాలకు మైడెన్ ఫార్మా కంపెనీ దగ్గు,జలుబు సిరప్లు సంబంధం కలిగి ఉండవచ్చని డబ్ల్యూహెచ్ఓ నివేదిక అనుమానం వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్ఓ నివేదికలతో అప్రమత్తమైన ఆరోగ్యశాఖ అధికారులు హర్యానాలోని సోనేపట్లోని మైడెన్ మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీలో మెడిసిన్ తయారీని నిలిపివేశారు. దగ్గు మందుపై కేంద్రం టెస్టులు నిర్వహించింది. ఈ తరుణంలో డిసెంబర్ 13న ఇండియన్ డ్రగ్స్ కంట్రోల్ జనరల్ వీజీ సోమాని..డబ్ల్యూహెచ్ఓకి లేఖ రాశారు. ఆ లేఖలో మైడెన్ ఉత్పత్తి చేసిన దగ్గు మందులపై టెస్టులు నిర్వహించాం. ఆ నమోనాలు సంస్థ వెల్లడించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉన్నట్లు కనిపెట్టాం. వాటిలో చిన్న పిల్లలో తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులకు దారితీసే డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాలు నమోనాలు లేవని గుర్తించామని పేర్కొన్నారు. పరీక్షల ఫలితాలను తదుపరి చర్య కోసం నిపుణుల బృందానికి పంపామని డబ్ల్యూహెచ్ఓకి రాసిన లేఖలో సోమాని తెలిపారు. చండీగఢ్లోని రాష్ట్ర ప్రభుత్వ రీజినల్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ ఈ పరీక్షలను నిర్వహించిందని ప్రభుత్వం ముందుగా తెలిపింది. ఆ లేఖపై డబ్ల్యూహెచ్ఓ ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు అక్టోబర్లో యూఎన్ ఏజెన్సీ మైడెన్ తయారు చేసిన ఉత్పత్తులలో విషపూరితమైన, తీవ్రమైన కిడ్నీలను నాశనం చేసే డైథైలిన్ గ్లైకాల్,ఇథిలీన్ గ్లైకాల్ మోతాదుకు మించి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించిన విషయం తెలిసిందే. -
‘కోవిడ్-19’పై గుడ్న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్ఓ
జెనివా: కోవిడ్-19 మహమ్మారి కోరల్లో చిక్కుకున్న ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోవైపు.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త అందించింది. కోవిడ్-19 వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని 90 శాతం మందిలో కొంత మేర రోగనిరోధక శక్తి పెంపొందినట్లు పేర్కొంది. ‘కరోనా వైరస్కు గురికావటం లేక వ్యాక్సినేషన్ వల్ల ప్రపంచంలోని 90 శాతం మందిలో కోవిడ్ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది’ అని తెలిపారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్. కోవిడ్-19 మహమ్మారి ఎమర్జెన్సీ దశ ముగింపునకు వచ్చిందని, అయితే, వైరస్ ఇంకా పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదని హెచ్చరించారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోల్ అధనోమ్. వైరస్పై నిఘా, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొనసాగుతున్న లోపాలతో కొత్త వేరియంట్ల కారణంగా మరణాలు పెరిగేందుకు కారణమవుతున్నట్లు హెచ్చరించారు. అంతకు ముందు.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ఏడాది తర్వాత కూడా కోవిడ్ నుంచి రక్షణ లభిస్తున్నట్లు ఓ పరిశోధన పేర్కొంది. దాని ఫలితంగా తరుచుగా బూస్టర్ డోస్లు తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించినట్లు తెలిపింది. ఇదీ చదవండి: Viral Video: భయానక దృశ్యం.. చెరువులో ఈత కొడుతుండగా దాడి చేసిన మొసలి -
మృత్యుఘాతం
న్యూయార్క్: గాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా దాదాపు 44 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేసింది. ఈ మేరకు ‘గాయాల నివారణ, సంరక్షణ’ 14వ ప్రపంచ సదస్సు సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఒక నివేదిక విడుదల చేసింది. గాయాలు, హింస వల్ల ప్రపంచవ్యాప్తంగా నిత్యం 12,000 మంది బలైపోతున్నారని నివేదికలో వివరించింది. 5 నుంచి 29 ఏళ్ల వయసున్నవారిలో సంభవిస్తున్న మరణాలకు తొలి 5 కారణాల్లో 3 కారణాలు గాయాలకు సంబంధించినవేనని స్పష్టం చేసింది. జనం మృత్యువాత పడడానికి రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, నీటిలో మునిగిపోవడం, అగ్ని ప్రమాదాలు, విషం తీసుకోవడం వంటివి ప్రధానంగా కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తేల్చిచెప్పింది. ప్రతి 6 మరణాల్లో ఒకటి ఆత్మహత్య, ప్రతి 9 మరణాల్లో ఒకటి హత్య, ప్రతి 61 మరణాల్లో ఒకటి యుద్ధం, ఘర్షణల వల్ల సంభవిస్తున్నాయని పేర్కొంది. సంపన్నులతో పోలిస్తే పేదలు గాయాల వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రీయెసస్ తెలిపారు. -
కరోనా తర్వాత ప్రపంచానికి మరో ఉపద్రవం.. అన్నింటికంటే డేంజర్..?
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కకావికలం చేసిన విషయం తెలిసిందే. 66 లక్షల మందిని బలిగొన్న ఈ వైరస్ కోట్ల మంది జీవితాలను నాశనం చేసింది. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడంతో ప్రపంచం కోవిడ్ కోరల నుంచి బయటపడింది. అయితే రాబోయో రోజుల్లో కరోనాకు మించిన ప్రాణాంతక వైరస్ ప్రపంచంపై పంజా విసరబోతుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. మార్బర్గ్ అనే వైరస్ కేసులు పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో వెలుగుచుశాయని, ఈ రోగులకు సరైన చికిత్స అందించి.. వైరస్ను కట్టడి చేయలేకపోతే మరో మహమ్మారిలా విశ్వమంతటా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రస్తుతానికి దీనికి 'డిసీజ్-ఎక్స్' గా నామకరణం చేసింది. డిసీజ్-ఎక్స్ ఎబోలా కంటే చాలా ప్రమాదకరం. ఈ వ్యాధి సోకినవారిలో 80 శాతం మంది రోగులు మరణిస్తారు. ఇప్పటికే కోట్ల మంది కరోనా బారినపడ్డారు. వారిలో రోగ నిరోధక శక్తి తగ్గింది. ఈ సమయంలో డిసీజ్-ఎక్స్ ఎటాక్ చేస్తే వాళ్లు తట్టుకోలేరని, కరోనా కంటే ఊహించని ప్రాణనష్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మందు లేదు.. డిసీజ్-ఎక్స్కు ఇప్పటివరకు వ్యాక్సిన్ గానీ, ఔషధాలు గానీ అందుబాటులో లేవు. దీనికి సంబంధించిన సమాచారం కూడా లేకపోవడంతో శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు జరుపుతున్నారు. ఒకవేళ ఇది మరో మహమ్మారిలా పరిణమిస్తే మానవాళి మనుగడకే ప్రమాదమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్తలు ఈ వైరస్కు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ ఇంకా పూర్తిగా కోలేదు. అన్ని దేశాల్లో ఇప్పటికీ కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డిసీజ్-ఎక్స్ కేసులు పెరిగి విశ్వమంతా వ్యాపిస్తే.. ఆ పరిస్థితి ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. చదవండి: ఎలాన్ మస్క్ తీరుతో అసంతృప్తి.. ట్విట్టర్కు అధికార పార్టీ గుడ్బై.. -
FIFA WC: ఖతర్ను కలవరపెడుతున్న 'క్యామెల్ ప్లూ' వైరస్
ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్కప్ 2022 ఖతర్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్కప్ను లైవ్లో వీక్షించడానికి విశ్వవ్యాప్తంగా 1.2 మిలిమన్ అభిమానులు ఖతర్ వెళ్లినట్లు సమాచారం. వీరంతా తమకు ఇష్టమైన ఫిఫా వరల్డ్కప్ను ఎంజాయ్ చేస్తూనే అరబ్ దేశాల్లో ఒకటైన ఖతర్ అందాలను వీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పరిశోధనా బృందం పెద్ద బాంబు పేల్చింది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో క్యామెల్ ప్లూ(Camel Flu Virus) అనే వైరస్ కలవరం సృష్టిస్తుందన్నారు. వరల్డ్కప్ను వీక్షించడానికి వచ్చినవారిలో కొంతమంది అభిమానులు క్యామెల్ ప్లూ వైరస్తో భాదపడుతున్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. క్యామెల్ ప్లూ వైరస్ అనేది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(MERS) వ్యాధితో బాధపడేలా చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఇక క్యామెల్ ప్లూ వైరస్ కరోనా వైరస్ కన్నా ప్రమాదకరమని.. ఈ వైరస్ను తొలుత 2012లో సౌదీ అరేబియాలో గుర్తించినట్లు వైద్య నిపుణులు స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా దాటికి ప్రపంచంలోని దేశాలన్ని లాక్డౌన్ విధించుకున్నాయి. ఇప్పటికే ఆ మహమ్మారి వదలడం లేదు. మెర్స్ వ్యాధి లక్షణాలు కరోనా లక్షణాలుగానే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, శ్వాసకోస ఇబ్బంది లాంటి సహజ లక్షణాలతోనే వ్యాధి ప్రారంభమవుతుంది. నుమోనియా లక్షణాలు కూడా దీనిలో అంతర్భాగం. ఈ వ్యాధికి గురైన వారు రోజురోజుకు మరింత వీక్గా మారిపోతుంటారు. విరేచనాలు, గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడుతుంటారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం అని నిపుణులు హెచ్చరించారు. ఇక క్యామెల్ ప్లూ వైరస్ ద్వారా సంక్రమించే మెర్స్ వ్యాధితో మరణాల రేటు 35 శాతం ఉందని హెచ్చరించారు. సాధారణంగా అరబ్ దేశాల్లో ఒంటెలతో అక్కడి జనజీవనం ముడిపడి ఉంటుంది. క్యామెల్ ప్లూ.. పేరులోనే ఒంటె పేరు కనిపిస్తుండడంతో ఈ వైరస్ ఒంటెల ద్వారా సంక్రమిస్తున్నట్లు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్యామెల్ రైడ్స్.. సఫారీ ఖతర్ ప్రజలకు జీవనాధారంగా ఉంది. అక్కడికే వచ్చే పర్యాటకులు క్యామెల్ రైడ్స్.. సఫారీ చేస్తుంటారు. క్యామెల్ ప్లూ వైరస్ కారణంగా ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్ చూడడానికి వచ్చే ఫుట్బాల్ అభిమానులు ఒంటెలను నేరుగా తాకకూడదని ఇంతకముందే హెచ్చరించారు. ఇది తెలియని కొంత మంది అభిమానులు ఒంటెలను ముట్టుకోవడం.. వాటిపై సఫారీ చేయడం వల్ల క్యామెల్ ప్లూ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. క్యామెల్ ప్లు అనేది జంతువుల నుంచి జంతువులకు.. జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అది నేరుగా లేదా ఇన్డైరెక్ట్గా వైరస్ అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఇక ఫిఫా వరల్డ్కప్ 2022ను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో క్యామెల్ ప్లూ వైరస్ బాధితులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయం తమను కలవరపెడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. చదవండి: FIFA WC: నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ ఎక్కడ? మెక్సికోపై గెలుపు.. షర్ట్ విప్పి రచ్చ చేసిన మెస్సీ -
2022 హీట్ దెబ్బ.. వేల మంది దుర్మరణం
కోపెన్హగ్: మునుపెన్నడూ లేని రేంజ్లో ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు యూరప్ను అతలాకుతలం చేశాయి. ఈ ఒక్క ఏడాదిలోనే అదీ యూరప్లోనే 15 వేల మందికి పైగా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ప్రకటించింది. వడగాల్పులకు ముఖ్యంగా స్పెయిన్, జర్మనీ దారుణంగా ప్రభావితం అయ్యాయని డబ్ల్యూహెచ్వో తెలిపింది. జూన్ నుంచి ఆగష్టు మధ్య యూరప్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొన్ని శతాబ్దాలుగా ఇదే అత్యధిక కావడం గమనార్హం. దేశాల నుంచి సమర్పించిన నివేదికల ఆధారంగా కనీసం 15వేల మంది మరణించారని, ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని డబ్ల్యూహెచ్వో రీజినల్ డైరెక్టర్ ఫర్ యూరప్ అయిన హాన్స్ క్లూగే ఒక ప్రకటనలో వెల్లడించారు. స్పెయిన్లో 4వేల మరణాలు, పోర్చుగల్లో వెయ్యి, యూకేలో 3,200 మరణాలు, జర్మనీలో 4,500 మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. జూన్, జులై మధ్యకాలంలో 40 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు బ్రిటన్కు ముచ్చెమటలు పోయించాయి. వేడిమి వల్ల ఒత్తిళ్లు, శరీరం చల్లదనంగా ఉండకపోవడం.. తదితర కారణాలతోనే మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, డయాబెటిస్ ఉన్నవాళ్లకు అధిక వేడిమి మరింత ప్రమాదమని నిపుణులు తెలిపారు. కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే దశాబ్దాలలో పెరుగుతున్న వేడిగాలులు, ఇతర తీవ్రమైన వాతావరణ సమస్యలు.. మరిన్ని వ్యాధులు, మరణాలకు దారితీస్తుందని WHO పేర్కొంది. ఇదీ చదవండి: నరకకూపం.. ప్రమాదం అంచున ప్రపంచం -
చిట్టి ధాన్యం..గట్టి ఆరోగ్యం..!
విజయనగరం: కొండ ప్రాంతాల్లోని గిరిజనులు ఆకలి తీర్చుకొనడానికే సాగుచేసే గడ్డిజాతికి చెందిన తృణధాన్యాలలో విశేష గుణాలను గుర్తించిన ఆహార శాస్త్రవేత్తలు ప్రపంచానికి చిరుధాన్యాల ప్రాముఖ్యాన్ని చాటుతున్నారు. చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, గంటెలు, రాగులు, జొన్నలు, ఊదలు, ఆరికెల సాగుపై మక్కువ పెంచుతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి చిరుధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చిరుధాన్యాల సాగు వల్ల భూమి సారం పెరుగుతుంది. నీటి వినియోగం తక్కువగా ఉండి పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదు. పోషక విలువలను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించి చిరుధాన్యాల ప్రాముఖ్యతను చాటి ఉత్పత్తి పెంచడానికి ప్రోత్సహించింది. అతి తక్కువ పెట్టుబడితో పండించే మిల్లెట్స్తో అధిక ఆదాయం వచ్చే మార్గాలను పెంపొందించింది. మిల్లెట్ పాలసీ పోషక గనులున్న చిరుధాన్యాల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం మిల్లెట్ పాలసీ ప్రకటించింది. చిరుధాన్యాల సాగు పెంచేందుకు హెక్టారుకు రూ.6వేలు చొప్పున ప్రోత్సాహకం ప్రకటించింది. సాగు విస్తీర్ణం పెంచడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెటింగ్ సౌకర్యంపై దృష్టి సారించింది. ఔషధ గుణాల సమ్మిళితం తృణధాన్యాలు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఔషధ గుణాల సమ్మిళితమైన ఆహారం. ఆరోగ్య గుళికలుగా వాటిని వరి్ణస్తారు. అవి తింటూ ఆరు నెలల నుంచి రెండేళ్ల లోపు వ్యాధులను నిర్మూలించుకోవచ్చు. రోగ కారణాలను శరీరం నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి. తృణధాన్యాలలోని పీచు పదార్థం శరీరానికి రక్షణగా నిలుస్తుందని న్యూట్రియన్స్ చెబుతున్నారు. ప్రభుత్వం అందసేస్తున్న ప్రోత్సాహాకాలతో పెరిగిన చిరు ధాన్యాల పంటను మార్కెట్లోకి వినియోగం పెంచడానికి జీసీసీ ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. చిరుధాన్యాలతో ఆహర పదార్థాల తయారీ, ముడి సరుకులను పుడ్ప్రోడక్ట్స్గా సిద్ధం చేయడం, దేవాలయాల్లో ప్రసాదాలకు అందించేందుకు మార్గం సుగమం చేసింది. చిరుధాన్యాల్లో కొర్రలను వినియోగిస్తే నరాల శక్తి మానసిక దృఢత్వం కలగడంతో పాటు ఆర్థరైటిస్, మార్ఛ రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. అండు కొర్రల వినియోగంతో రక్తశుద్ధి జరిగి, రక్తహీనత పోయి, రోగ నిరోధక శక్తి పెంచి డయాబిటిస్, మలబద్ధకం నివారిస్తుంది. సామలు వినియోగం వల్ల అండాశయం, వీర్యకణాల సమస్యలు దూరం కావడమే కాకుండా పీసీఓడీ, సంతాన లేమి సమస్యల నివారణకు పని చేస్తాయి. ఊదలు వాడడం వల్ల లివర్, కిడ్నీ వ్యాధులు, కొలెస్టరాల్, కామెర్లు తగ్గించడంలో ఉపయోగపడతాయి. సామలు వినియోగం వల్ల అండాశయం, వీర్యకణాల సమస్య, పీసీఓడీ, సంతానలేమి సమస్యల నివారణకు దోహదంచేస్తుంది. అండుకొర్రలు: జీర్ణాశయం,ఆర్ద్రయిటీస్,బి.థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయం నివారణకు సహకరిస్తుంది. పెరుగుతున్న విస్తీర్ణం పార్వతీపురం మన్యం జిల్లాలో మిల్లెట్స్ సాగు విస్తరిస్తోంది. ఇప్పటికే 3,750 ఎకరాల్లో సాగు విస్తురించే దిశగా చర్యలు తీసుకున్నారు. జీసీసీ బ్రాండ్తో మార్కెట్లోకి.. అత్యధిక పోషక విలువలు గల చిరుధాన్యాలకు ప్రాముఖ్యం లభించడంతో జీసీసీ బ్రాండ్తో మిల్లెట్స్ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాం. జీసీసీ ఎం.డి ఆదేశాల మేరకు నాణ్యత గల చిరుధాన్యాల కొనుగోలుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఆరోగ్య రక్షణలో చిరుధాన్యాల ఆవశ్యకత వివరిస్తున్నాం. గిరిజన రైతుల పండించే పంటలకు గిట్టుబాటు ధర చెల్లించడానికి రంగం సిద్ధం చేస్తున్నాం. గురుగుబిల్లి సంధ్యారాణి, జీసీసీ బ్రాంచ్ మేనేజర్ సీతంపేట -
WHO Report: ‘భారత్లో బద్ధకస్తులు ఎక్కువయ్యారు’.. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన
సాక్షి, హైదరాబాద్: దేశంలో బద్ధకస్తులు ఎక్కువయ్యారు. చాలామంది శారీరక శ్రమ చేయడం లేదు. ఫలితంగా దీర్ఘకాలికవ్యాధులు పెరుగుతున్నాయి. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు భారీగా పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ‘శారీరక శ్రమ లేకపోవడం వల్ల తలెత్తుతున్న అనారోగ్య సమస్యలు, పడుతున్న భారం’పై ఆ సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అందులో భారత్ గురించి అనేక అంశాలను ప్రస్తావించింది. మనదేశంలో 11–17 మధ్య వయస్సువారిలో 74 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. అందులో బాలురు 72 శాతం, బాలికలు 76 శాతం ఉన్నారు. 18 ఏళ్లు పైబడినవారిలో మహిళలు 44 శాతం, పురుషులు 25 శాతం వ్యాయామం చేయడంలేదు. 70 ఏళ్లు పైబడినవారిలో మహిళలు 60 శాతం, పురుషులు 38 శాతం శారీరక శ్రమ చేయడం లేదు. శారీరక శ్రమ చేయకపోవడం వల్ల దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్, పక్షవాతం, గుండె, క్యాన్సర్, మానసిక రుగ్మతలు తలెత్తుతు న్నాయి. వీటిని నయం చేసేందుకు అయ్యే ఖర్చు దేశంలో ఏడాదికి రూ. 25,600 కోట్ల ఖర్చు అవుతోంది. వచ్చే పదేళ్లలో అది ఏకంగా రూ.2.5 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. వాకింగ్, సైక్లింగ్పై జాతీయ విధానం కరువు దేశంలో చనిపోయేవారిలో 66% మంది దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులే. మొత్తం మరణాల్లో 30 శాతం గుండెకు సంబంధించినవే కావడం గమనార్హం. ఆ తర్వాత ఊపిరితిత్తి వ్యాధులు, క్యాన్సర్, షుగర్, ఇతరాలతో చనిపోతున్నారు. పాఠశాలల్లో నాణ్యమైన శారీరక శ్రమ ఉండటంలేదు. జాతీయంగా శారీరక వ్యాయామం చేయించడానికి పెద్ద వాళ్ల విషయంలో ఒక సర్వేలెన్స్ వ్యవస్థ ఉంది. కానీ, చిన్నపిల్లలకు లేదు. ఐదేళ్ల లోపు పిల్లల విషయంలో శారీరక శ్రమ ఎంత చేయాలన్న దానిపై మార్గదర్శకాలే లేవు. సాధారణ సిఫార్సులు... ► 2050 నాటికి శారీరక శ్రమ లేకపోవడం అనే స్థితిని 15 శాతానికి తగ్గించాలి. ► ప్రపంచంలో వచ్చే పదేళ్లలో సరైన శారీరక శ్రమ చేయకపోవడం వల్ల కొత్తగా 50 కోట్లమంది దీర్ఘకాలికవ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే పదేళల్లో నమోదయ్యే బీపీ కేసుల్లో 47 శాతం వ్యాయామం లేకపోవడం వల్లే సంభవించవచ్చు. మానసిక రుగ్మతలు నమోదయ్యే కేసుల్లో 43 శాతం మేర వ్యాయామం లేకపోవడం కారణమే. 50 కోట్ల కొత్త కేసుల్లో మూడో వంతు కేసులు దిగువ మధ్య ఆదాయ దేశాల్లోనే ఉంటాయి. అంటే మనలాంటి దేశాల్లోనే ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ► నడకకు అనువైన రహదారుల వ్యవస్థను నెలకొల్పాలి. ► వాహనాల వేగంపై నియంత్రణ ఉండాలి. ► డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ మాట్లాడుతూ నడపడంపై నియంత్రణ ఉండాలి. ► శారీరక శ్రమ చేయాలని ప్రోత్సహించే వ్యవస్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండాలి. ► ప్రతి ఒక్కరికీ వారానికి 300 నిముషాల వ్యాయామం తప్పనిసరి ► 18 ఏళ్లు పైబడినవారు వారానికి 150 నుంచి 300 మధ్యస్థ శారీరక శ్రమ చేయాలి. ► 11–17 మధ్య వయస్సున్న పిల్లలు రోజుకు గంట శారీరక శ్రమ చేయాలి. ► 18 ఏళ్లు పైబడినవారు కనీసం వారానికి రెండుసార్లు కండరాలు బలపడే వ్యాయామాలు చేయాలి. ► 50 ఏళ్లు పైబడినవారు వారానికి మూడు సార్లు బ్యాలెన్స్ ఎక్సర్ సైజ్లు చేయాలి. మానసిక రుగ్మతలపైనే ఖర్చు ఎక్కువ: డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వ్యాయామం లేకపోవడం వల్ల ప్రధానంగా బీపీ, డిప్రెషన్, మతిమరుపు సమస్యలు వస్తాయి. ప్రపంచంలో 75 శాతం మరణాలకు దీర్ఘాకాలిక జబ్బులే కారణం. ఈ జబ్బులకు శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణం. అయితే వీటిని తగ్గించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య బడ్జెట్లో కేవలం రెండు శాతమే ఖర్చు చేస్తున్నారు. -
భారత్లో ఒమిక్రాన్ ఎక్స్బీబీ కేసులు
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. ‘తీవ్రత దృష్ట్యా’ ప్రజలు సైతం వైరస్ను పెద్దగా పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పూర్తి స్థాయిలో కరోనా కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఈ నేపథ్యంలో.. తాజాగా కరోనా వైరస్ వేరియెంట్ ఒమిక్రాన్లో అత్యంత వేగంగా కేసుల వ్యాప్తికి కారణమయ్యే ఒక ఉప రకాన్ని భారత్లో గుర్తించారు. ఒమిక్రాన్ ఎక్స్బీబీ వేరియెంట్ కేసులు మన దేశంలో వెలుగు చూశాయి. ఒమిక్రాన్ ఎక్స్బీబీ వేరియెంట్ అంటే.. బీఏ.2.75, బీజే.1ల రీకాంబినెంట్. శాస్త్రీయ నామం బీఏ.2.10 (BA.2.10) మహారాష్ట్ర, కేరళ, ఇతర ప్రాంతాల్లో ఈ వేరియెంట్కు సంబంధించిన కొత్త కేసులు వెలుగు చూశాయి. అయితే ఈ వేరియెంట్ విషయంలో నిపుణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అందుకు కారణం.. సింగపూర్లో గత కొన్నిరోజులుగా కేసులు రెట్టింపు సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి కాబట్టి. ఒమిక్రాన్లో అత్యంత వేగంగా ఇన్ఫెక్షన్ను వ్యాపించే గుణం ఈ వేరియెంట్కు ఉందని పరిశోధకులు నిర్ధారించారు. ఇక గుజరాత్లో ఇప్పటికే బీఏ.5.1.7, బీఎఫ్.7 కేసులు వెలుగు చూశాయి. ఇవి కూడా వైరస్ను వేగంగా వ్యాపింపజేసే గుణం ఉన్న వేరియెంట్లే కావడం గమనార్హం. Omicron XBB తీవ్రత.. ఒమిక్రాన్ ఎక్స్బీబీ వేరియెంట్ తీవ్రత ప్రమాదకరమేమీ కాదు. కరోనా తరహా దగ్గు, లో ఫీవర్, జలుబు, వాసన గుర్తింపు లేకపోవడం, ఒళ్లు నొప్పులు.. ఇలా కరోనా తరహాలోనే లక్షణాలే కనిపిస్తున్నాయి. అలాగే మంచి చికిత్సతో తొందరగానే కోలుకోవచ్చు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ, దాని గుణం వల్ల ఇన్ఫెక్షన్ను అతిత్వరగా.. వేగంగా వ్యాపింపజేస్తుంది. అంతేకాదు ఆస్పత్రిలో చేర్చే కేసుల్ని పెంచే అవకాశాలు ఎక్కువని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. ► ఒమిక్రాన్ ఎక్స్బీబీ కేసులు ప్రస్తుతం భారత్లో ఐదు రాష్ట్రాల్లో 70 దాకా నమోదు అయ్యాయి. ఒకవేళ ఈ వేరియెంట్ గనుక విజృంభిస్తూ.. మూడు నుంచి నాలుగు వారాల్లో కేసులు మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ► ఆగస్టులో ఈ వేరియెంట్ను మొదట అమెరికాలో గుర్తించారు. ► సింగపూర్లో ఒక్కరోజులోనే 4,700 నుంచి 11,700 కేసులు పెరిగాయంటే తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు కూడా. ► ఇతర వైరస్లలాగే.. Corona Virus కూడా తన రూపాల్ని మార్చుకుంటూ పోతోంది. ► ఎక్స్బీబీ వేరియెంట్పై వ్యాక్సినేషన్ ప్రభావం పెద్దగా ఉండదని.. ఎందుకంటే దాని మ్యూటేషన్ అంతుచిక్కడం లేదని సైంటిస్టులు చెప్తున్నారు. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, ఒమిక్రాన్ ఎక్స్బీబీ వేరియెంట్పై స్పందించారు. పండుగ సీజన్ దృష్ట్యా భారత్ సహా మరికొన్ని దేశాల్లో ఈ వేరియెంట్ మరో వేవ్కు కారణం కావొచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: ఈ కెమెరాతో 15 మైళ్ల దూరంలో ఉన్న గోల్ఫ్ బంతిని కూడా క్లియర్గా చూడవచ్చు. -
దగ్గు సిరప్ కంపెనీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి... ఉత్పత్తికి చెక్!
చిన్నారులను మింగేసిని దగ్గు సిరప్ కంపెనీ మైడెన్ ఫార్మాస్యూటికల్స్లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. డబ్ల్యూహెచ్వో గాంబియాలో దాదాపు 66 మంది చిన్నారులు బారత్ తయారు చేసిన సిరప్ వల్లే చనిపోయారని పేర్కొనడంతో హర్యానా ప్రభుత్వం ఆ ఉత్పత్తులను నిలిపేసినట్లు తెలిపింది. అంతేగా ఆ కంపెనీ సంబంధించి మూడు జౌషధాలను పరీక్షల నిమిత్తం కలకత్తాలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబ్కి పంపారు. ఆ పరీక్ష నివేదికల తదనంతరం సదరు కంపెనీపై చర్యలు తీసుకుంటానని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. ఐతే కేంద్ర హర్యానా రాష్ట్ర జౌషధ విభాగా సంయుక్త తనిఖీల్లో ఔషధ తయారీలో దాదాపు 12 లోపాలను గుర్తించడంతోనే ఉత్పత్తిని నిలిపేసినట్లు చెప్పారు. ఈ మేరకు కంపెనీకి జారీ చేసిన షోకాజ్ నోటీస్లో...కంపెనీ ఔషధాలను తయారు చేయడానికి, పరీక్షించడానికి ఉపయోగించిన పరికరాలు, సాధనాల సమాచారానికి సంబంధించిన పుస్తకాన్ని నివేదించడంలో విఫలమైంది. అలాగే సిరప్ తయారీలో వాడిన రసాయనాల బ్యాచ్కి సంబంధించి సమాచారం కూడా పేర్కొనలేదు. సిరప్ తయారీ, ప్రక్రియ పద్ధతులను నివేదించడంలో విఫలం. అలాగే సిరప్కి సంబంధించి పరీక్షల నివేదికనను అందించలేకపోయింది. అంతేగాదు తయారి తేదీకి, ఉత్పత్తి అనుమతించిన తేదీకి చాలా వ్యత్యాసం ఉందంటూ పలు లోపాలను లేవనెత్తింది. ఈ మేరకు హర్యాన స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్ షోకాజ్ నోటీస్కి ప్రతిస్పందించేందుకు సదరు కంపెనీకి సుమారు 7 రోజుల వ్యవధి ఇచ్చింది. సదరు కంపెనీపైన వచ్చిన ఆరోపణలు నిజమైతే గనుక కంపెనీ తయారీ లైసెన్సు రద్దు చేయడమే గాక తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. (చదవండి: చిన్నారులను మింగేసిన దగ్గు మందు... సంచలన విషయాలు) -
చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు
న్యూఢిల్లీ: భారతదేశంలో తయారైన మైడెన్ ఫార్మాస్యూటికల్స్కు చెందిన దగ్గు మందు తాగి పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారులు మృతిచెందిన ఘటన విషాదం నింపింది. నాలుగు రకాల కాఫ్ సిరప్లు చిన్నారుల మృతికి కారణమంటూ డబ్ల్యూహెచ్ఓ మెడికల్ అలర్ట్ జారీ చేసింది. డైథలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ మోతాదు పరిమితికి మించి ఉన్నాయని తెలిపింది. ఇది విషపూరితమైందనీ, తీవ్రమైన మూత్రపిండాల వ్యాధులకు దారితీస్తుందని తెలిపిన డబ్ల్యూహెచ్ఓ మైడెన్పై సమగ్ర విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఘటన తరువాత దేశీయ ఫార్మా కంపెనీ మైడెన్ ఫార్మాస్యూటికల్స్కు సంబంధించి సంచలన విషయాలు వెలుగుచూశాయి.ఈ ఫార్మా కంపెనీకి చెందిన అనేక మందులు దేశంలోని నాలుగు రాష్ట్రాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలింది. ప్రజారోగ్య కార్యకర్త దినేష్ ఠాకూర్ని ఉటంకిస్తూ ఎన్టీటీవీ ఒక కథనాన్ని ప్రచురించింది. (Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ) వియత్నాం చెత్త రికార్డు ఉన్న ఫార్మా కంపెనీలు బ్లాక్ లిస్ట్ చేసిందనీ, అందులో మైడెన్ కూడా ఒకటని ఠాకూర్ విమర్శించారు. వియత్నాం 2011లో కంపెనీని నిషేధించిందన్నారు. ఇంత పేలవమైన రికార్డును కలిగి ఉన్నప్పుడు అనుమతి ఎలా ఇచ్చారని ఠాకూర్ ప్రశ్నించారు. కంపెనీలో తీవ్రమైన నాణ్యత నియంత్రణా లోపాలున్నాయని,సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సెంట్రల్ రెగ్యులేటర్ ఉన్నప్పటికీ కానీ ప్రతి రాష్ట్రానికి దాని స్వంత రెగ్యులేటర్ లేదన్నారు. కేరళ, గుజరాత్లోని రెగ్యులేటర్లు మైడెన్ మందులు నాణ్యత లేనివిగా తేలియాని గుర్తు చేశారు. బిహార్ ఇప్పటికే దీన్ని బ్లాక్ లిస్ట్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఎగుమతుల అనుమతిని కేంద్ర నియంత్రణ సంస్థ మాత్రమే ఇస్తుంది. కంపెనీ డైరెక్టర్లకు సంబంధించిన కొన్ని కేసులు కూడా కోర్టులో ఉన్నాయన్నారు. ఇవన్నీ దేశంలోని ఔషధ నియంత్రణ వ్యవస్థల పరిస్థితికి అద్దం పడుతున్నాయని ఠాకూర్ మండిపడ్డారు. (Infosys: మాజీ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు, కోర్టులో ఇన్ఫోసిస్కు షాక్) మైడెన్ ఫార్మాస్యూటికల్ మందులు, నాణ్యతా లోపాలు, చర్యలు బిహార్ (2008) : ఎరిత్రోమైసిన్ స్టీరేట్ 125ఎంజీ సిరప్ (4 బ్యాచ్లు నాణ్యత లేనివిగా గుర్తించారు బిహార్ (2011) : మిథైలెర్గోమెట్రిన్ ట్యాబ్ (నకిలీ) వియత్నాం: కంపెనీ 2011 నుండి 2013 వరకు నిషేధం గుజరాత్ (2013) : మాసిప్రో ట్యాబ్ (రద్దు సమస్యలు) జమ్మూ కాశ్మీర్ (2020) : సైప్రోహెప్టాడిన్ హైడ్రోక్లోరైడ్ సిరప్ ఐపీ (నాణ్యతాలోపం) కేరళ (2021) : మెట్ఫార్మిన్ 1000 ట్యాబ్ (రద్దు సమస్య) కేరళ (2021) : ఈసిప్రిన్ (ఐపీ ప్రమాణానికి అనుగుణంగా లేదు) కేరళ (2021): మెట్ఫార్మిన్ 500 mg (రద్దు సమస్య) కేరళ (2021) : మైకల్ డి ట్యాబ్ (తక్కువ నాణ్యత) ఇదీ చదవండి: ఫెస్టివ్ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త! కాగా నవంబర్ 1990లో కార్యకలాపాలను ప్రారంభించిన మైడెన్, గాంబియాకు మాత్రమే సిరప్ను తయారు చేసి ఎగుమతి చేసిందని భారత మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం. గాంబియా విషాదం తరువాత, మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్ల నమూనాలను ఇండియా పరీక్షిస్తోంది. నమూనాలను సెంట్రల్ ఫార్మాస్యూటికల్ లాబొరేటరీకి పంపామని, నేరం నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మైడెన్ ఫ్యాక్టరీలున్న హర్యానా రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
కరోనా మహమ్మారి...తగిన గుణపాఠం చెప్పింది: డబ్యూహెచ్ఓ చీఫ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మానవులకు తగిన గుణపాఠం చెప్పిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఛీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. మన ఆరోగ్యం పర్యావరణంతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తు చేసిందన్నారు. ప్రధానంగా పర్యావరణ మార్పు, మరుగునపడిపోతున్న మానవ తప్పిదాలను మనకు అవగతమయ్యేలా చేసిందని చెప్పారు. అంతేకాదు పర్యావరణ మార్పుల కారణంగా పాకిస్తాన్ ఎలా వరదలతో అల్లాడిందో కళ్లారా చూశామన్నారు. ఇలాంటి విపత్తే ఏ దేశానికైనా భవిష్యత్తులో జరగవచ్చు అని చెప్పారు. అంతేగాదు ఆమె ప్రజా ఆరోగ్య విధానం, పరిశోధనల ఆవశక్యత గురించి కూడా నొక్కి చెప్పారు. అలాగే వ్యాక్సిన్లు శరీరంపై ఎలా ప్రభావం చూపుతాయో కూడా వివరించారు. బూస్టర్ డోస్ తీసుకున్న చాలామంది కరోనా వ్యాధి భారిన పడ్డారని, ఇలాంటివి ఒకటి లేదా రెండు కేసులు మినహ అలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని కూడా చెప్పారు. అంతేగాదు వ్యాక్సిన్లు అనేవి వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని చెప్పారు. వ్యాక్సిన్ల కారణంగా సుమారు 20 బిలియన్ల మంది ప్రాణాలు రక్షింపబడ్డారని అన్నారు. అలాగే భారత్ కూడా ప్రజలందరూ వ్యాక్సిన్లు వేయించుకునేలా గట్టి చర్యలు తీసుకుందని ప్రశంసించారు. (చదవండి: టన్నుల కొద్ది వ్యర్థాలతో కోట్లు గడిస్తూ...వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న నగరం) -
కరోనా కథ ముగిసింది!: డబ్ల్యూహెచ్ఓ
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించిన కరోనా కథ ముగిసినట్టేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. కోవిడ్–19 తాలూకు అత్యంత భయానకమైన దశ ముగిసిపోయినట్టేనని వెల్లడించింది. ‘‘వైరస్ వెలుగులోకి వచ్చిన రెండున్నరేళ్లకు ఆ మహమ్మారి తోకముడిచే రోజులు వచ్చేశాయి. ఇకపై కేసుల అంతగా పెరుగుదల ఉండదు. అలాగని పూర్తిగా తగ్గి జీరో కేసులకు వచ్చే పరిస్థితి కూడా లేదు’’ అని అంచనా వేసింది. ‘‘రెండున్నరేళ్లుగా మనం చీకటి గుహలో బతుకులు వెళ్లదీస్తున్నాం. ఇప్పుడు గుహ చివర్లో వెలుగు రేఖ కనిపిస్తోంది. అయితే అక్కడికి చేరుకోవడానికి ఇంకా చాలా దూరముంది. అప్రమత్తంగా లేకుంటే ఇంకా ఎన్నో అడ్డంకులు వస్తాయి’’ అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అన్నారు. గురువారం ఆయన ఐరాస సర్వప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ బలహీనపడిపోయిందని అశోకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ కూడా అన్నారు. ఆయన తొలినుంచీ కరోనా కేసుల్ని ప్రపంచవ్యాప్తంగా ట్రాక్ చేస్తున్నారు. కరోనా వైరస్కు మన శరీరాలు అలవాటు పడిపోయాయని, ఇక ఆ వైరస్తో ప్రాణాలు కోల్పోవడం జరగదని ఆయన ధీమాగా చెప్పారు. -
కు.ని. మరణాలపై డబ్ల్యూహెచ్ఓ విచారణ
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విచారణ చేపట్టింది. కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్యశ్రీరావు ఆధ్వర్యంలో వైద్య బృందం గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించింది. గత నెల 25న జరిగిన ఆపరేషన్లపై వైద్యుల నుంచి బృందం సభ్యులు వివరాలు తెలుసుకున్నారు. శస్త్రచికిత్సల సమయంలో ఉపయోగించిన ఆపరేషన్ పరికరాలను పరిశీలించారు. వాటిని ఎలా స్టెరిలైజ్ చేశారో ఆపరేషన్ థియేటర్లో పని చేసే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆపరేషన్లు జరిగిన అనంతరం మహిళలను ఇంటికి పంపే ముందు వాడిన మందుల గురించి రికార్డు చేసుకున్నారు. -
జింబాబ్వేలో 'మీజిల్స్' విలయం.. 700 మంది చిన్నారులు మృత్యువాత
హరారే: జింబాబ్వేను మీజిల్స్ వ్యాధి కలవరపాటుకు గురి చేస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల 700 మంది చిన్నారులు మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1న ఒక్క రోజే 37మంది చిన్నారులు చనిపోయినట్లు తెలిపింది. సెప్టెంబర్ 4 నాటికి దేశంలో మొత్తం 6,291 కేసులు నమోదైనట్లు వెల్లడించింది. అయితే రెండు వారాల క్రితం మీజిల్స్ వల్ల 157మంది చిన్నారులు మరణించినట్లు అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా నాలుగు రెట్లు పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. మీజిల్స్ వ్యాధి బాధితుల్లో ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకోని, పోషకాహార లోపం ఉన్న చిన్నారులే ఉంటున్నారు. మతపరమైన నమ్మకాలతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్లు ఇప్పించకపోవడమూ ఈ పరిస్థితికి కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకునే వ్యాక్సిన్ తప్పనిసరిచేసేలా కొత్త చట్టం తీసుకురావాలని జింబాబ్వే భావిస్తోంది. 6 నెలల నుంచి 15ఏళ్ల పిల్లలకు పెద్దఎత్తున మాస్ వ్యాక్సినేషన్, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మతపెద్దలు దీనికి సహకరించాలని కోరుతోంది. డేంజర్.. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధుల్లో మీజిల్స్ కూడా ఒకటి. గాలి ద్వారా, తమ్ముడం, దగ్గడం వల్ల ఇతరులకు సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పిల్లలలో దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కన్పిస్తాయి. వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులకు ఈ వ్యాధి సోకితే తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీజిల్స్ వ్యాప్తిని నియంత్రించాలంటే 90శాతం మంది చిన్నారులకు వ్యాక్సిన్లు అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ఇబ్బందుల వల్ల సేవలు నిలిచిపోయి పేద దేశాల్లో మీజిల్స్ విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్లోనే హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5కోట్ల మంది పిల్లలు సాధారణ వ్యాక్సిన్లు తీసుకోలేకపోయారని యూనిసెఫ్ జులైలో చెప్పింది. దీనివల్ల పిల్లలకు ప్రమాదమని అప్పుడే హెచ్చరించింది. చదవండి: చైనాలో తీవ్ర భూకంపం.. 46 మంది దుర్మరణం -
అమెరికాలో మంకీపాక్స్ కలవరం.. 30 మంది చిన్నారులకు సోకిన వైరస్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను మంకీపాక్స్ కలవరానికి గురి చేస్తోంది. 30 మందికి పైగా చిన్నారులు ఈ వైరస్ బారిన పడినట్లు ఆ దేశ అంటువ్యాదుల నియంత్రణ కేంద్రం గణాంకాలు వెల్లడించాయి. వీటి ప్రకారం అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 18,417 కేసులు వెలుగు చూశాయి. దేశంలోని మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఈ కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా వయోజనులకు సోకుతున్న ఈ వ్యాధి చిన్నారులకూ వ్యాపించడం అమెరికాను ఆందోళనకు గురి చేస్తోంది. 11 రాష్ట్రాల్లోని చిన్నారులు మంకీపాక్స్ బారినపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్క టెక్సాస్లోనే 9 మంది చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు పేర్కొంది. అమెరికాలో నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా కాలిఫోర్నియాలో 3,291 మంది బాధితులున్నారు. ఆ తర్వాత న్యూయార్క్లో 3,273 కేసులు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్లో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. 8 ఏళ్ల లోపు చిన్నారులకు మంకీపాక్స్ సోకితే చాలా ప్రమాదమని అంటువ్యాధుల కేంద్రం హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం విశ్వవ్యాప్తంగా 96 దేశాల్లో మొత్తం 41,600 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా కనీసం 12 మంది చనిపోయారు. అత్యధికంగా అమెరికాలోనే ఈ కేసులు వెలుగుచూశాయి. చదవండి: కరోనా, మంకీపాక్స్ రెండూ ఒకే రకమైన వైరస్లా? -
అమెరికాలో మంకీపాక్స్ కలకలం... అత్యవసర పరిస్థితిని ప్రకటించిన అధికారులు
న్యూయార్క్: అమెరికాలో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. ఈ మేరకు అమెరికాలోని న్యూయార్క్ నగరం మంకీపాక్స్ వ్యాప్తికి కేంద్రంగా ఉందని, దాదాపు లక్ష మందికి పైగా ఈ వ్యాధి భారిన పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో ఆ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, న్యూయార్క్ సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్(డీఓహెచ్ఎంహెచ్) కమిషనర్ అశ్విన్ వాసన్ ప్రజారోగ్య దృష్ట్యా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు త్వరితగతిన వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ఈ ఎమర్జెన్సీ తక్షణమై అమలులోకి వస్తుందని వెల్లడించారు. ఈ క్రమంలో డీఓహెచ్ఎంహెచ్ న్యూయర్క్ సిటీ హెల్త్ కోడ్ కింద అత్యవసర ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వ్యాధిని నియంత్రణలోకి తెచ్చేలే సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. అదీగాక గతవారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మంకీపాక్స్ వ్యాప్తి అంతర్జాతీయ పరంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సూచిస్తుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. అంతేకాదు ఇది ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కలిగిస్తుందో లేదో అంచనా వేయడం కోసం గత నెలలోనే ఘెబ్రేయేసస్ అత్యవసర కమిటీని సమావేశ పరిచారు. ఆ సమయంలోనే సుమారు 47 దేశాల్లో దాదాపు 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు. అప్పటి నుంచి పెరుగుతూనే వచ్చిందని, ప్రస్తుతం ఇది కాస్త 75 దేశాలకు వ్యాపించి సుమారు 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. -
మంకీపాక్స్ అలానే సోకదు... ఒక్కోసారి..: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: మంకీపాక్స్ కేసులు వేగవంతంగా పెరుగుతన్న నేపథ్యంలో ప్రజల్లో ఎలాంటి వివక్షతకు దారితీస్తోందోనని డబ్ల్యూహెచ్ఓ అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ విషయమై డబ్ల్యూహెచ్ఓ టెక్నికల్ లీడ్ డాక్టర్ రోసముండ్ లూయిస్ జెనీవాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...ఈ వ్యాధికి సంబంధించిన తీవ్రమైన హాని ఏమి లేదని స్పష్టం చేశారు. ఇది స్వలింగ సంపర్కం వల్లే వచ్చిందే కానీ అందరకీ అలానే ఈ వ్యాధి సంక్రమించదని కూడా తేల్చి చెప్పారు. ప్రస్తుతం దాదాపు 75కు పైగా దేశాల్లో సుమారు 16 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఐతే వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మంకీపాక్స్ వ్యాధిని సరైన వ్యూహాలతో నియత్రించవచ్చు. అంతేకాదు మంకీపాక్స్ వ్యాధి ఉన్న వ్యక్తితో కలిసి ఉండటం, అతని వస్తువులు వాడటం, లైంగికి సంబంధం పెట్టుకోవడం వంటి తదితరాల వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ వ్యాధి గురించి ప్రజలను ఆందోళన చెందకూడదని, లైంగికంగా సంక్రమించే వ్యాధులపై అవగాహన పెంపొందించు కోవాలని సూచించారు. సమర్ధవంతమైన వ్యూహాలతో ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించగలమని విశ్వసిస్తున్నాని అని నొక్కి చెప్పారు. అంతేకాదు ఈ వ్యాధి కారణంగా ప్రజలు సమాజంలో వివక్షతకు గురికాకుండా ఉండేలా ఈ వ్యాధి పేరు త్వరితగతిన మార్చాలని డబ్ల్యూహెచ్ఓ యోచిస్తున్నట్లు తెలిపింది. (చదవండి: మంకీపాక్స్ వద్దు.. మరో పేరు పెట్టండి! డబ్ల్యూహెచ్వోకు లేఖ) -
తగ్గిన హెచ్ఐవీ తీవ్రత
విజయనగరం ఫోర్ట్: హెచ్ఐవీ తీవ్రత జిల్లాలో చాలా వరకు తగ్గిందని జిల్లా ఎయిడ్స్, కుష్టు నివారణ అధికారి రాణి సంయుక్త పేర్కొన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన వర్క్షాప్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ, ఎయిడ్స్ ప్రభావం ఏ ప్రాంతాలలో, ఏ సమూహాలలో, ఏ వయసు వారికి సోకుతున్నదో తెలుసుకోవడానికి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో 3 రోజుల వర్క్ షాపు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డబ్లు్యహెచ్ఓ కన్సల్టెంట్ సుకుమార్, డీపీఎం బాలాజీ, జిల్లా సూపర్ వైజర్ సాక్షి గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
Marburg virus: వెలుగులోకి మరో ప్రాణాంతక వైరస్.. డబ్ల్యూహెచ్వో అలర్ట్!
అక్ర: ప్రపంచ దేశాలను ప్రాణాంతక వైరస్లు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ.. మరో ప్రమాదకర వైరస్ బయపడటం ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలో అతి ప్రాణాంతకమైన 'మార్బర్గ్' వైరస్ వెలుగు చూసింది. రెండు కేసులు బయటపడినట్లు ఆదివారం ఘనా అధికారికంగా ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా ప్రాణాంతక వైరస్ నిర్ధరణ అయినట్లు పేర్కొంది. జులై 10నే పాజిటివ్గా తేలినప్పటికీ.. ఫలితాలను మరోమారు తనిఖీ చేసేందుకు సెనెగల్లోని ల్యాబ్కు పంపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో తెలిపింది. 'సెనెగల్లోని ఇన్స్టిట్యూట్ పాస్టెర్లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్గా తేలింది' అని ఘనా ఆరోగ్య విభాగం ప్రకటన చేసింది. దీంతో కేసులు వెలుగు చూసిన ప్రాంతంలో వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు చేపట్టినట్లు తెలిపింది. బాధితులతో కలిసిన వారిని ఐసోలేషన్కు తరలించామని, ఎవరిలోనూ వైరస్ లక్షణాలు కనిపించలేదని పేర్కొంది. ఆఫ్రికాలో మార్బర్గ్ వైరస్ వెలుగు చూడటం ఇది రెండో సంఘటన. గత ఏడాది గినియాలో తొలి కేసు నమోదైంది. ఆ తర్వాత ఎలాంటి కేసులు వెలుగు చూడలేదు. డబ్ల్యూహెచ్ఓ అప్రమత్తం.. ప్రాణాంతక మార్బర్గ్ వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. 'ఘనా ఆరోగ్య విభాగం వేగంగా స్పందించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇలా చేయటమే మంచిది. లేదంటే మార్బర్గ్ వైరస్ చేయిదాటిపోతుంది.' అని పేర్కొన్నారు డబ్యూహెచ్వో ఆఫ్రికా రీజనల్ డైరెక్టర్ మాట్షిడిసో మోటీ. మార్బర్గ్ వైరస్ సోకిన ఇద్దరు రోగులు.. ఘనాలోని సదరన్ అశాంతి నగర్కు చెందిన వారిగా తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందే ముందు వారిలో డయేరియా, శరీరంలో రక్త స్రావం, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయన్నారు. ఇదీ చదవండి: Monkeypox Global Health Emergency: మంకీపాక్స్ ప్రమాకరమైనదేనా? కాదా! డబ్ల్యూహుచ్ఓ అత్యవసర సమావేశం -
స్త్రీ జాతికి శుభవార్త!
అవును. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ అన్నట్టు ఇది స్త్రీ జాతికి శుభవార్త. తక్కువ వెలతో, అందరికీ అందుబాటులో ఉండే దేశీయ టీకా గనక భారత మహిళా లోకానికి మరీ మంచివార్త. గర్భాశయ ముఖద్వార (సర్వికల్) క్యాన్సర్పై విజయానికి మనమిప్పుడు మరింత చేరువయ్యాం. దేశంలోనే తొలి ‘క్వాడ్రివలెంట్ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్’ (క్యూహెచ్పీవీ)కి భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ మంగళవారం ఆమోదం తెలిపారు. పుణేకు చెందిన ప్రసిద్ధ ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ దేశీయంగా వృద్ధిచేస్తున్న ఈ ‘సర్వావ్యాక్’ టీకా ఈ నవంబర్ కల్లా అందుబాటులోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆడవారికి తరచూ వచ్చే క్యాన్సర్లలో నాలుగోదీ, 15 నుంచి 44 ఏళ్ళ మధ్య భారతీయ మహిళలను పట్టిపీడిస్తున్న క్యాన్సర్లలో రెండోదీ అయిన సర్వికల్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవడం ఇప్పుడిక మన చేతుల్లోనే ఉంది. మన దేశంలో ఏటా 1.23 లక్షల పైచిలుకు మంది ఆడవారు ఈ మాయదారి రోగం బారిన పడుతుంటే, సగం మందికి పైగా (67 వేల మంది) ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే, యుక్తవయసుకు రాకముందే ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలందరికీ హెచ్పీవీ టీకానిస్తే గర్భాశయ క్యాన్సర్ను సమూలంగా దూరం చేయవచ్చని సౌమ్య లాంటి శాస్త్రవేత్తల మాట. హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) అనేది లైంగికంగా వ్యాపించే కొన్ని వైరస్ల సమూహం. ఎక్కువ రిస్కుండే హెచ్పీవీల వల్ల క్యాన్సర్ వస్తుంది. నూటికి 95 సర్వికల్ క్యాన్సర్లు ఈ హెచ్పీవీ పుణ్యమే. సాధారణంగా గర్భాశయద్వార క్యాన్సర్ బయటపడేందుకు 15 నుంచి 20 ఏళ్ళు పడుతుంది. కానీ, వ్యాధినిరోధకత బాగా తక్కువగా ఉన్న స్త్రీలలో అయిదు నుంచి పదేళ్ళలోనే ఇది రావచ్చు. హెచ్ఐవీ లేని వారి కన్నా ఉన్నవారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఆరు రెట్లు ఎక్కువ. అయితే, క్రమం తప్పకుండా తరచూ పరీక్ష చేయించుకొంటే, ముందుగానే రోగ నిర్ధారణ, చికిత్స జరిగి బయటపడవచ్చు. తొమ్మిది నుంచి 14 ఏళ్ళ లోపు ఆడపిల్లలు టీకా వేయించుకుంటే, ఈ వ్యాధి రాదని డబ్ల్యూహెచ్ఓ లెక్క. మన దేశంలో అభివృద్ధి చేస్తున్న కొత్త టీకా కాకుండా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన మరో 4 టీకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఆ టీకాలకు మన దేశంలో ఒక్కో వ్యక్తికీ కనీసం రూ. 5 వేల నుంచి 8 వేల దాకా ఖర్చవుతుంది. కానీ, మన దేశవాళీ కొత్త టీకా అంతకన్నా చాలా తక్కువకే దొరకనుంది. నిజానికి, పుణేలోని సీరమ్ సంస్థ చేస్తున్న ఈ టీకా ప్రయోగాలు 2019 నుంచి నాలుగేళ్ళుగా జరుగుతున్నాయి. 12 ప్రాంతాల్లో 9 నుంచి 26 ఏళ్ళ మధ్య వయసులోని 2 వేల మందికి పైగా వ్యక్తులపై ఈ టీకాను ప్రయోగించి చూశారు. మూడు విడతలుగా ఈ ప్రయోగాలు సాగాయి. వైరస్ నిరోధకతకు అవసరమైన ప్రాథమికస్థాయి కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ఈ టీకా ప్రభావశీలమని ప్రయోగాల్లో తేలింది. టీకా వేసుకున్నవారిలో నూటికి నూరు మందిలో అద్భుత వ్యాధినిరోధకత అభివృద్ధి చెందినట్లూ, అంతా సురక్షితంగా ఉన్నట్లూ ఫలితాలు రావడం విశేషం. ప్రపంచంలో ప్రతి లక్ష మంది మహిళలనూ ప్రమాణంగా తీసుకుంటే, 18 ఏళ్ళ వయసుకే భయపెడుతున్న ప్రాణాంతక రోగమిది. అందుకే, అభివృద్ధి చెందిన దేశాలు గత 15 ఏళ్ళుగా రకరకాల సర్వికల్ క్యాన్సర్ టీకాలు వాడుతున్నాయి. ఇక, మన దేశంలో ఎప్పుడు లెక్కతీసినా కనీసం 4 లక్షల మందికి పైగా మహిళలు ఈ రోగపీడితులే. 30 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ అయిదేళ్ళకోసారి ఈ గర్భాశయద్వార క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలని ఆరోగ్యశాఖ మార్గదర్శకం. వసతుల లేమి, అవగాహన లోపంతో ఆచరణలో అది జరగడమే లేదు. అందుకే, ఇప్పుడు దేశీయంగా టీకా అభివృద్ధి ఓ పెనుమార్పు తేనుంది. 15 ఏళ్ళ లోపు ఆడపిల్లల్లో నూటికి 90 మందికి 2030 నాటికల్లా హెచ్పీవీ టీకాలతో రక్షణ కల్పించాలని డబ్ల్యూహెచ్ఓ లక్షిస్తున్న వేళ ఈ చొరవ సమయానికి అంది వచ్చింది. నిజానికి, ప్రాణాంతక క్యాన్సర్ల నుంచి రోగులను రక్షించేంత ప్రాథమిక వసతులు నేటికీ మన దేశంలో లేవు. దేశంలో సగటున ప్రతి 10 వేల మంది క్యాన్సర్ రోగులకూ కేవలం ముగ్గురు రేడియేషన్ ఆంకాలజిస్టులే ఉన్నారన్నది కఠోర వాస్తవం. ఈ పరిస్థితుల్లో చికిత్స కన్నా నివారణ ప్రధానం గనక, ఈ కొత్త టీకా ఉపయోగకరం. సర్వికల్ క్యాన్సర్ టీకాలను కూడా దేశ సార్వత్రిక టీకాకరణ కార్యక్రమంలో భాగంగా చేర్చాలని 2018లోనే టీకాకరణపై జాతీయ సాంకేతిక సలహా బృందం సూచించింది. కానీ, మెర్క్, గ్లాక్సో లాంటి బహుళ జాతి ఔషధ సంస్థల అంతర్జాతీయ టీకాలు ఖరీదైనవి కావడంతో ఆ పని జరగలేదు. అంతర్జాతీయ టీకాల ఆధిపత్యానికి గండికొడుతూ ఇప్పుడు దేశవాళీ చౌక రకం టీకా వచ్చింది గనక, ఆ బృహత్కార్యానికి వీలు చిక్కింది. ప్రతి 8 నిమిషాలకూ ఓ మహిళను సర్వికల్ క్యాన్సర్ బలితీసుకుంటున్న మన దేశంలో మహిళా ఆరోగ్య సంరక్షణలో ఈ కొత్త టీకా ఓ చరిత్రాత్మక పరిణామం. ప్రభుత్వం బరిలోకి దిగితే కనీసం 5 కోట్ల మంది బడి వయసు పిల్లలకు ఇది తక్షణం ఉపయుక్తం. దీని గురించి యువతుల్లో, తల్లితండ్రుల్లో చైతన్యం తేవాలి. కౌమారంలోనే ఈ టీకాలు తీసుకొనేలా ప్రోత్సహించాలి. సర్వికల్ క్యాన్సర్పై విజయం సాధించాలి. ఇప్పటికే, కరోనా వేళ టీకాల అభివృద్ధి, తయారీల్లో సాధించిన పురోగతితో మన దేశాన్ని ‘టీకాల రాజధాని’ అంటున్నారు. ‘సర్వావ్యాక్స్’ లాంటి కొత్త టీకాలు ఆ పేరును నిలబెడతాయి. మరిన్ని కొత్త టీకాల పరిశోధన, అభివృద్ధికి వసతులు కల్పించి, మన శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం పాలకుల కర్తవ్యం. -
మంకీపాక్స్ ప్రమాకరమైనదేనా? కాదా! డబ్ల్యూహుచ్ఓ అత్యవసర సమావేశం
జెనీవా: మంకీపాక్స్ వ్యాప్తి పై డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది అంతర్జాతీయపరంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా వర్గీకరించాలా వద్దా అని నిర్ణయించడానికి జూన్ 23న అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ ఛీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ..."మంకీపాక్స్ వ్యాధులు ఎక్కువగా నమోదవ్వడంతో ఇది అసాధరణమైన వ్యాధి అని సందేహం కలుగుతోంది. అందువల్ల ఈ విషయమై అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం అత్యవసర కమిటీని సమావేశపరచాలని నిర్ణయించాను. ఈ వ్యాప్తి అంతర్జాతీయపరంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సూచిస్తుందో లేదో అంచనా వేయడానికే సమావేశం ఏర్పాటు చేస్తున్నాను" అని చెప్పారు. (చదవండి: ఆ సమాధి పై ఎరుపు రంగుతో రాసిన హెచ్చరిక... తెరిచారో అంతే...) -
మంకీపాక్స్ అలర్ట్.. WHO సీరియస్ వార్నింగ్
జెనీవా: కరోనా కొత్త వేరియంట్లతో ఆందోళన చెందుతున్న ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ కొత్త సవాల్ విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్యల గణనీయంగా పెరుగుతోంది. ప్రజారోగ్యానికి మంకీపాక్స్ ముప్పు పొంచి ఉన్నదని డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇప్పటివరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. మరో 120 మందిలో లక్షణాలను గుర్తించామని వెల్లడించింది. కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్ వేగంగా వ్యాప్తిచెందుతున్నదని స్పష్టం చేసింది. మరోవైపు.. ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్ను సీరియస్గా తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వెంటనే వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని తెలిపింది. మంకీపాక్స్పై అందరికి అవగాహన కల్పించాలని, వ్యాధి లక్షణాలను తెలియజేయాలని పేర్కొన్నది. ఒకవేళ.. వైరస్ సమూహ వ్యాప్తి కనుక ప్రారంభమైతే.. చిన్నారులు, రోగ నిరోధక శక్తి లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. మంకీ పాక్స్పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం అధికారుల ఇచ్చిన సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో మంకీపాక్స్కు చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జ్వరం, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం మంకీ పాక్స్ లక్షణాలు. ఇక, అకస్మాత్తుగా తీవ్రమైన దద్దుర్లు వచ్చినవారు, మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చినవారు, మంకీపాక్స్ సోకినవారితో సన్నిహితంగా మెలిగినవారు, వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆసుపత్రిలో చేరాలి. ఐసొలేషన్లో ఉండి చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర ఏర్పడే వరకు చికిత్సలు తీసుకోవాలి. ఈ వైరస్ ఇతరులకు సోకకుండా తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. As of May 26, a total of 257 confirmed cases and 120 suspected cases have been reported from 23 member states that are not endemic for the virus, the health agency said in a statement. Read More: https://t.co/fXxedn66zx#Monkeypox #WHO pic.twitter.com/cSwwY9z51w — The Daily Star (@dailystarnews) May 30, 2022 ఇది కూడా చదవండి: ప్రజలకు మరో ముప్పు.. కొత్త వైరస్ కలకలం -
మరో కొత్త వైరస్ కలకలం.. 19 మంది మృతి
కొత్త వైరస్లు మానవాళికి సవాల్లు విసురుతున్నాయి. ఇప్పటికే కరోనా, దాని కొత్త వేరియంట్లతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న ప్రజలను మంకీ ఫాక్స్, మ్యాంగో ఫీవర్, టమాటో వ్యాధులు మరింత టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా కాంగో ఫీవర్ కేసులు పెరగడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. జంతువుల నుంచి మనుషులకు సోకే కాంగో ఫీవర్ ఇరాక్లో కలకలం రేపుతోంది. కొత్త వైరస్ వ్యాప్తితో ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటికే 19 మంది మృత్యువాత పడ్డట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. శరవేగంగా వ్యాపించడం, అంతర్గత, బహిర్గత రక్తస్రావానికి(ముక్కు నుంచి రక్తం కారడం) దారి తీయడం, విపరీతమైన జ్వరం దీని ముఖ్య లక్షణాలు. దీని బారిన పడ్డ ప్రతీ ఐదుగురిలో ఇద్దరి చొప్పున మరణిస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ వైరస్ తొలిసారిగా మొట్టమొదట 1944లో క్రిమియాలో కనుగొనబడింది. ఈ తర్వాత 1979లో ఇరాక్లోనే వెలుగు చూసింది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఎక్కువగానే కనిపించే కాంగో ఫీవర్ వైరస్ ఇరాక్ ప్రజలను అల్లకల్లోలం చేస్తోంది. ఇక, ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తుంది. అయితే, ఈ వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం మరింత టెన్షన్ పెడుతోంది. కాగా, కాంగో హెమోరేజిక్ అనే పేను ద్వారా జంతువుల్లో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల్లో ఈ వైరస్ వాహకంగా ఈ పేలు పనిచేస్తుంది. వైరస్ బారిన పడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు, పశువధ కేంద్రాల్లోని పదార్థాల ద్వారా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. ఇది కూడా చదవండి: విమాన ప్రయాణం విషాదాంతం -
మంకీపాక్స్ కలకలం...వందకు పైగా కేసులు
Monkeypox, a viral infection more common to west and central Africa: ఆఫ్రికాలో సర్వసాధారణమైన మంకీపాక్స్ యూరవప్ని వణికిస్తోంది. ఈ మంకీపాక్స్కి సంబంధించిన కేసలు యూరప్లో 100కు పైగా నమోదయ్యాయి. అంతేగాదు యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియాతో సహా దేశాల్లో వీటికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఐతే శాస్ర్తవేత్తలు మాత్రం కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్కి సంబంధించిన కేసులు అంతంగా వ్యాప్తి చెందలేదు కాబట్టి ఇది అంతగా వ్యాప్తి చెందదని చెబుతున్నారు. మంకీపాక్స్ అనేది తేలికపాటి వైరల్ అనారోగ్యం. ఇది జ్వరం వంటి లక్షణాలతో శరీరంపై దద్దర్లు కూడిన పొక్కుల వస్తుంటాయి. ఈ వ్యాదిని తొలిసారిగా కోతుల్లో గుర్తించారు. అంతే కాదు ఈ మంకీ పాక్స్ ఆఫ్రికావాసుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికి వరకు ఈ కేసులు యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్ మరియు పోర్చుగల్లలో ఈ కేసులను గుర్తించారు గానీ యూరప్లో ఇప్పటి వరకు గుర్తించని ఈ మంకీ పాక్స్కి సంబంధించిన కేసులు ఇప్పుడు అత్యధికంగా నమోదవుతున్నాయని జర్మని సాయుధ దళాల వైద్యా బృందం తెలపింది. ఐతే ఇది అంటువ్యాధి అని ఎక్కువకాలం కొనసాగే అవకాశం కూడా చాలా తక్కువ అని చెబుతోంది. దీనికి నిర్ధిష్టమైన వ్యాక్సిన్ మాత్రం లేదని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మాత్రం మశూచిని నిర్మూలించడానికి ఉపయోగించే వ్యాక్సిన్ కోతులకు వ్యతిరేకంగా 85% వరకు ప్రభావవంతంగా ఉందని తెలిపింది. మంకీపాక్స్ బారిన పడిన కొంతమంది ఆరోగ్య కార్యకర్తలు మరియు ఇతరులకు మశూచి వ్యాక్సిన్ను అందించినట్లు బ్రిటిష్ అధికారులు తెలిపారు. (చదవండి: దురదృష్టాన్ని పోగొట్టుకునేందుకు.. ఏకంగా పుట్టిన తేదినే మార్చుకున్న ప్రధాని) -
Monkeypox: శారీరకంగా కలవడం వల్లే వైరస్ విజృంభణ
ఇంతకాలం ఆఫ్రికాకే పరిమితమైన మంకీపాక్స్ వైరస్.. ఇప్పుడు యూరప్, యూకే, నార్త్ అమెరికాలోనూ విజృంభిస్తోంది. కేసులు తక్కువగానే నమోదు అవుతున్నప్పటికీ.. అది వ్యాపించడానికి గల కారణాలు తెలిస్తే విస్తుపోవడం ఖాయం. ఈ విజృంభణలో చాలావరకు కేసులు.. శారీరక కలయిక ద్వారానే వ్యాప్తి చెందినట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు వైద్య సంస్థలు ఒక స్పష్టమైన ప్రకటన చేశాయి. ► ఫ్లూ(జ్వరం) తరహా లక్షణాలు ఉండే మంకీపాక్స్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉత్తర అమెరికాతో పాటు యూరప్లోనూ డజన్ల కొద్దీ కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే వీటిలో చాలావరకు సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వ్యాప్తి చెందినవే కావడం గమనార్హం. ► కెనడాలో డజను, స్పెయిన్.. పోర్చుగల్లో 40(అనుమానిత.. ధృవీకరణ కేసులు), బ్రిటన్లో తొమ్మిది(మే 6వ తేదీ నుంచి ఇప్పటిదాకా..), అమెరికాలో బుధవారం తొలి మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ► శారీరక కలయిక ద్వారానే వ్యాప్తి చెందినట్లు వైరస్ బారిపడ్డ వాళ్లను పరీక్షిస్తే స్పష్టమయ్యింది. ఈ మేరకు అమెరికా సీడీసీ ప్రకటన చేసింది. మరోవైపు యూకే ఆరోగ్య భద్రత సంస్థ కూడా దాదాపు ఇలాంటి ప్రకటనే చేసింది. గే, బైసెక్సువల్, పరస్పర పురుష శృంగారంలో పాల్గొన్న వ్యక్తుల్లోనే మంకీపాక్స్ లక్షణాలు గుర్తించినట్లు వెల్లడించింది. యూకేలో వెలుగు చూసిన మొదటి కేసు నైజీరియాతోనే ముడిపడి ఉండడం విశేషం. ► ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గత వారం రోజులుగా యూకే, యూరోపియన్ ఆరోగ్య ప్రతినిధులతో సమన్వయం అవుతూ.. పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇప్పటిదాకా నమోదు అయిన కేసుల్లో చాలావరకు గే, బైసెక్సువల్గా గుర్తించినట్లు తెలిపింది. ‘‘పురుషుల పరస్పర శృంగారంతోనే వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ అయ్యింద’’ని డబ్ల్యూహెచ్వో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సోసే ఫాల్ వెల్లడించారు. ► మంకీపాక్స్ బారినపడ్డ వాళ్లు కోలుకోవడానికి పదిహేను రోజుల దాకా పట్టొచ్చు. ప్రాణాల మీదకు వచ్చేది చాలా తక్కువ సందర్భాల్లోనే. పది మందిలో ఒకరికి మాత్రమే ప్రాణాల మీదకు వస్తుంది. ఇంతకు ముందు.. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో వేలమంది మంకీపాక్స్ బారినపడ్డారు. కానీ, యూరప్, నార్త్ అమెరికాలో కేసులు వెలుగు చూడడం అరుదనే చెప్పాలి. ► మంకీపాక్స్.. జ్వరం తరహా లక్షణాలతో మొదలవుతుంది. జ్వరం, కండరాల నొప్పులు, ఒంటి మీద దద్దుర్లు వస్తాయి. మంకీపాక్స్ వైరస్ను మనీపాక్స్ వైరస్ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్లూ ‘ఆర్థోపాక్స్ వైరస్’ కుటుంబానికి చెందిన మంకీపాక్స్ వైరస్ వల్ల వస్తుంది. మంకీపాక్స్ ప్రధానంగా ముఖం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ► ఉచ్ఛ్వాస పెద్ద బిందువుల(తుంపర్ల) ద్వారా, శరీరంపై గాయాలు, కలుషితమైన పదార్థాలతో.. చాలాసందర్భాల్లో వ్యాపిస్తుంది. జంతువులు, మనుషులు, వైరస్ సోకిన వస్తువుల ద్వారానూ మంకీపాక్స్ వ్యాప్తి చెందుతుంది. జంతువుల ద్వారా కాటు, కొరికిన గాయాలు, కరవడం.. ఇలా వ్యాప్తి చెందుతుంది. ► అయితే యూరప్, నార్త్ అమెరికాతో పాటు యూకేలో వెలుగు చూస్తున్న కేసుల్లో.. వైరస్ బారినపడ్డ వాళ్లు ఇతరులతో అత్యంత సన్నిహితంగా(శారీరక సంబంధం) మెలగడం వల్లే వైరస్ విజృంభించడం గమనించాల్సిన విషయం. ► మంకీపాక్స్ తొలి కేసు 1950లో.. రెండు దఫాల అవుట్బ్రేక్లు(వేవ్)లుగా విజృంభించింది. ► పరిశోధనల నిమిత్తిం కోతులపై ప్రయోగాలు చేస్తున్న క్రమంలో గుర్తించారు. అయితే మనుషుల్లో గుర్తించింది మాత్రం 1970లో. అది కాంగోలో. ► ఆఫ్రికా ఖండంలో బయటపడ్డ వేల కేసుల్లో.. చాలావరకు అపరిశుభ్రత, జంతువుల ద్వారానే వైరస్ వ్యాపించింది. శారీరక కలయిక ద్వారా వ్యాపించిన కేసులు చాలా తక్కువే. ► స్మాల్పాక్స్ వ్యాక్సిన్నే చాలాకాలంగా మంకీపాక్స్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. కానీ, అది అథెంటిక్గా ప్రూవ్ కాలేదు. ► సాధారణ జ్వరానికి ఉపయోగించే చికిత్సతో పాటు యాంటీ వైరల్స్, వ్యాక్సినియా ఇమ్యూన్ గ్లూబ్లిన్ను కూడా మంకీపాక్స్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నారు. ► ఈ వైరస్ బారిన పడ్డవాళ్లు.. ఇతరులకు దూరంటూ, సాధారణ ఫ్లూ కోసం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు. ► ప్రస్తుతం బయటపడ్డ కేసుల వెనుక అరుదైన మంకీపాక్స్ వైరస్ ఉంది. అయినప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే సమయంలో వైరస్ కట్టడికి తగు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ::: సాక్షి, వెబ్స్పెషల్ -
డబ్ల్యూహెచ్ఓ పనితీరులో సంస్కరణల కోసం పిలుపునిచ్చిన మోదీ!
WHO must be reformed, India ready to play key role: గురువారం జరిగిన రెండవ గ్లోబల్ కోవిడ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పనితీరులో సంస్కరణల కోసం పిలుపు నిచ్చారు. ఈ సదస్సులో ప్రపంచ ఆరోగ్య భద్రతను మరింత స్థితిస్థాపకంగా నిర్మించుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ఆ ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. సరఫరా గొలుసులు స్థిరంగా ఉంచడానికి వ్యాక్సిన్లు, చికిత్సవిధానాల కోసం డబ్ల్యూహెచ్ఓ ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని స్పష్టంగా తెలుస్తోందన్నారు. అంతేకాదు ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు, ముఖ్యంగా వాణిజ్య సంబంధిత అంశాలకు సంబంధించిన మేథో సంపత్తి హక్కు(ట్రిప్స్)ల ఒప్పందాలు మరింత సరళంగా ఉండాలని చెప్పారు. ఈ మేరకు మోదీ సదస్సులో కరోనా విషయమై మాట్లాడుతూ..." కోవిడ్ మహమ్మారి విషయంలో భారత్ సమిష్టి కేంద్రీకృత వ్యూహాన్ని అనుసరించింది. మేము వార్షిక ఆరోగ్య సంరక్షణ బడ్జెట్కు అత్యధిక నిధులు కేటాయించాం. భారత్లోని వ్యాక్సినేషన్ ప్రక్రియ అతి పెద్దది. భారత్ డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన నాలుగు వ్యాక్సిన్లను తయారు చేయడమే కాకుండా ఐదు బిలియన్ డోస్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మేము 98 దేశాలకు 200 మిలియన్ డోస్ల వ్యాక్సిన్లను సరఫరా చేశాం. అతి తక్కువ ఖర్చుతో కరోనా చికిత్స పొందేలా సరికొత్త వైద్యా విధానాన్ని అభివృద్ధి చేశాం. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి మేము సంప్రదాయ ఔషధాలకు పెద్ధ పీఠవేశాం. గత నెలలో ఈ పురాతన జ్ఞానాన్ని ప్రపంచానికి అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో మేము భారత్లో 'డబ్ల్యూహెచ్ఓ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్'కి పునాది వేశాం" అని అన్నారు. (చదవండి: ప్రధాని మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ) -
స్మార్ట్గా బంధిస్తోంది.. అధికమవుతున్న అనారోగ్య సమస్యలు
స్మార్ట్ ఫోన్ల వాడకం పతాకస్థాయికి చేరింది. మొబైల్ లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. అవసరానికి వాడుకోవడం మంచిదే. కానీ దానికి బానిసలవుతున్న వారు కెరీర్ను పాడు చేసుకుంటున్నారు. అపరిమిత వాడకం.. జీవితాలనే చిన్నాభిన్నం చేస్తోంది. వెన్నెముక, కంటి తదితర సమస్యల బారినపడి అనారోగ్యం పాలవుతున్నారు. సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్మార్ట్ఫోన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తాజాగా ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లా చిరునామాతో సిమ్ కార్డులు తీసుకున్న 8,01,456 మంది స్మార్ట్ఫోన్లు వాడుతున్నట్లు తేలింది. ఏటా 10 నుంచి 15 శాతం వరకు మొబైల్ఫోన్ల సంఖ్య పెరుగుతోంది. ఇవి కాకుండా సాధారణ (కీప్యాడ్) ఫోన్లు మరో 10 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. నెలకు రూ.16 కోట్లు పైనే స్మార్ట్ఫోన్ వినియోగదారు నెలకు సగటున రూ.200 వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన వినియోగదారులు వివిధ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు నెలకు కనిష్టంగా రూ.16 కోట్లు, ఏడాదికి రూ.192 కోట్లకు పైగా చెల్లిస్తున్నారని తెలుస్తోంది. మిగతా సాధారణ ఫోన్లు కూడా కలిపితే ఏడాదికి రూ.250 కోట్లకు పైగా చార్జీల రూపంలో ఆయా కంపెనీలకు చెల్లిస్తున్నట్టు సమాచారం. సగటున 2 గంటల సమయం వృథా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న వారికి సగటున రోజుకు రెండు గంటల సమయం వృథా అవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా ఏదో ఒక యాప్ నుంచి ప్రయోజనం లేకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఎక్కువగా యువకులు, పనిచేసే వారు ఇలా చేయడం వల్ల ఉత్పాదక రంగంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. చాలామంది విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతున్నారు. సెల్ఫోన్ కొనివ్వలేదని.. గత ఏడాది డిసెంబర్లో ఉరవకొండ పట్టణంలో రవినాయక్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇంతకీ కారణమేంటంటే తల్లిదండ్రులు తనకు సెల్ఫోన్ కొనివ్వలేదని. తన కొడుకు సెల్ఫోన్కు బానిస అయ్యాడని తల్లి కుళ్లాయమ్మ కన్నీరుమున్నీరవుతోంది. అలవాటు చేసినందుకు.. అనంతపురం నగరానికి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాసులు, తనూష దంపతులకు మూడేళ్ల తేజాస్ అనే కుమారుడు ఉన్నాడు. అన్నం తినడం లేదని కుమారుడికి సెల్ఫోన్ అలవాటు చేశారు. చివరకు ఆ సెల్ఫోన్కు బానిసైన చిన్నారి.. ఏడీహెచ్డీ (అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్)కు గురయ్యాడు. ప్రస్తుతం కర్నూలులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ తాజాగా ప్రపంచ ఆరోగ్యసంస్థ సర్వే ప్రకారం ఎక్కువ సేపు మొబైల్ వాడుతున్న వారిలో టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ (మెడ నొప్పి) లక్షణాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ సేపు మెడ వంచి మొబైల్ ఫోన్ మెసేజ్లు చదువుతున్నారు. గంటల తరబడి మెడ వంచి చూడటం వల్ల వెన్నెముక సమస్యలు కూడా వస్తున్నట్టు గుర్తించారు. ముఖ్యంగా మితిమీరి మొబైల్ఫోన్కు అలవాటు పడిన చిన్నారులకు రెటీనా (కంటి) సమస్యలు వస్తున్నట్టు అధ్యయనాలు తేల్చాయి. అనర్థాలకు మూలం సెల్ఫోన్ అనేక అనర్థాలకు సెల్ఫోన్ వినియోగమే మూలం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సెల్ఫోన్, వాట్సాప్, ఇంటర్నెట్ వినియోగాన్ని కూడా ఒక బానిసత్వంగా పరిగణించింది. వీటి వల్ల అనేక అనర్థాలు వస్తున్నాయి. ప్రధానంగా నిద్ర వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. నిద్ర లేకపోవడంతో కోపతాపాలకు గురికావడం, ధ్యాస లోపించడం తోపాటు కంటి చూపు పూర్తిగా మందగిస్తోంది. చిన్న వయస్సులో నిషేధిత వెబ్సైట్లలోకి ప్రవేశించి పోర్న్ సైట్లకు బానిసలుగా మారిపోతున్నారు. సర్వ అనర్థాలకు కారణం సెల్ఫోన్ అని ప్రధానంగా చెప్పవచ్చు. –యండ్లూరి ప్రభాకర్, మానసిక వైద్య నిపుణుడు, అనంతపురం అధికమవుతున్న అనారోగ్య సమస్యలు (చదవండి: ప్రశాంత్ నీల్.. మన బంగారమే) -
మలేరియా కట్టడి చర్యలు భేష్
మద్దిలపాలెం(విశాఖ తూర్పు): మలేరియా పేరు చెబితేనే విశాఖ మన్యం గడగడలాడేది. వ్యాధులు సీజన్ ప్రారంభమైతే ఏజెన్సీలో వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగంలో అలజడి రేపేది. అలాంటి మలేరియా కట్టడికి తీసుకుంటున్న చర్యలు సత్ఫాలివ్వడంతో వ్యాధి తీవ్రతతోపాటు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మలేరియా కేసుల సంఖ్య 56 శాతం తగ్గాయి. ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మలేరియాను అంతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచం దృష్టికి తీసుకు రావడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. తొలిసారిగా 2008లో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించారని జిల్లా మలేరియా అధికారి వై.మణి తెలిపారు. దీనికి సంబంధించి ఆమె అందించిన వివరాలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2024 నాటికి మలేరియా కేసులు నమోదు పూర్తిగా తగ్గి పోవాలని సంకల్పించింది. దీనిలో భాగంగా 2020 నుంచి 2024 వరకూ ఏడాదికి ఒక థీమ్తో చర్యలు చేపడుతోంది. ఈ ఏడాది మలేరియా భారాన్ని తగ్గించడం, జీవితాలను రక్షించడం అనే థీమ్తో చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా 2030 నాటికి మలేరియా నిర్మూలనే లక్ష్యం. గణనీయంగా తగ్గిన కేసులు ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండేళ్లుగా మలేరియా కేసులతోపాటు, మరణాలు గణనీయంగా తగ్గాయి. కేసులు నమోదు 56 శాతానికి తగ్గింది. 2021 లో 239 కేసులు నమోదుకాగా, 2022 లో ఇప్పటి వరకూ 105 కేసులు నమోదయ్యాయి. (చదవండి: దంపుడు బియ్యానికి c/o కొండబారిడి) -
మళ్లీ పడగ విప్పుతున్న ప్రాణాంతక ఎబోలా..!
జెనీవా: ప్రాణాంతక ఎబోలా మళ్లీ పడగ విప్పుతోంది. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వ్యాప్తి మళ్లీ మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. డెమొక్రటిక్ రిపబ్లిక ఆఫ్ కాంగోలో వైరస్ వ్యాప్తి వెలుగులోకి వచ్చిందని తెలిపింది. ఆఫ్రికా ఈశాన్య ప్రాంతమైన ఈక్వెటర్ ప్రావిన్స్లోని మబండకా అనే పట్టణంలో ఎబోలా కేసు నమోదైంది. ఈ ప్రావిన్స్లో 2018 నుంచి ఎబోలా స్థానికంగా వ్యాప్తి చెందడం ఇది మూడోసారి. ఈ దేశంలో 1976నుంచి 14 సార్లు ఎబోలా వ్యాపించింది. రెండు వారాల క్రితమే వ్యాధి వ్యాప్తి ప్రారంభమైందనీ, ప్రస్తుతం దానిని అదుపు చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. చదవండి👉🏾 మొట్టమొదటిసారిగా.. యూఎస్లో పోర్నోగ్రఫీపై కోర్సు ‘ఇప్పటి వరకు ఒక కేసును ఎబోలాగా అధికారికంగా ధ్రువీకరించారు. 31 ఏళ్ల రోగిలో ఈనెల 5వ తేదీన ఎబోలా లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత ఏప్రిల్ 21న ఎబోలా చికిత్సా కేంద్రంలోని ఐసీయూలో చేర్పించారు. కానీ, ఒక రోజు తర్వాత అతడు మరణించాడు. వైద్య సిబ్బందిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వెంటనే వారు పరీక్షల కోసం నమూనాలను ఇచ్చారు. ఇక ఎబోలాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను గౌరవ ప్రదంగా నిర్వహించారు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. చదవండి👉🏻 ట్రిపుల్ బొనాంజా.. ఒకే కాన్పులో ఇద్దరు కాదు ముగ్గురు -
తులసిభాయ్.. ఆ ప్రముఖుడికి కొత్త పేరు పెట్టిన ప్రధాని మోదీ
గ్లోబల్ ఆయుష్ సమ్మిట్ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా టెడ్రోస్ ని కొత్త పేరుతో పిలుస్తానంటూ మోదీ చెప్పారు. అనంతరం టెడ్రోస్ను తులసీభాయ్గా ప్రధాని పేర్కొన్నారు. అనంతరం డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఆవిష్కరిస్తుందంటూ ప్రశంసించారు. సంప్రదాయ వైద్య విధానాలను కాపాడుకోవడంలో ఇండియా ఛాంపియన్గా నిలుస్తోందన్నారు. 150కి పైగా ఎంవోయూలు గుజరాతి రాజధాని గాంధీనగర్లో ఆయుష్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్ను ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆయుర్వేద రంగంలో పెట్టుబడులకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఔషధ మొక్కలకు ఇండియా పుట్టిళ్లన్నారు. మెడిసినల్ ప్లాంట్స్ని గ్రీన్గోల్డ్గా అభివర్ణించారు. ఆయుష్ ఉత్పత్తి చేస్తున్న మందులు 150కి పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నట్టు ప్రధాని తెలిపారు. ఆయుష్ ఆహార్ ద్వారా ఫుడ్ సప్లిమెంట్స్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఆయుష్ పార్కులు ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేద నిపుణులు, తయారీదారులతో బలమైన నెట్వర్క్ తయారు చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన 50 కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయి. గ్రీన్ గోల్డ్ ఆయుర్వేదాన్ని గ్రీన్ గోల్డ్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఆయుర్వేదానికి రోజురోజుకు డిమాండ్ పెరుగతుందన్నారు. 2014లో మూడు బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయుష్ ఉత్పత్తుల విలువ నేడు 18 బిలియన్ డాలర్లకు పెరగడమే ఇందుకు ఉదాహారణ అన్నారు. ఆయుర్వేద చికిత్స కోసం ఇండియా వచ్చే విదేశీయుల కోసం ప్రత్యేకంగా ఆయుష్ వీసాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. భారత్ను మరువలేం సంప్రదాయ మెడిసిన్స్ని ప్రోత్సహిస్తున్న భారత ప్రభుత్వాన్ని మారిషస్ ప్రధాని ప్రవీణ్ కుమార్ జగన్నాత్ మెచ్చుకున్నారు. వైద్య రంగంలో మారిషన్కు భారత్ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. మారిషన్లో ఆయుర్వేద కాలేజీ నిర్మించడంతో పాటు కోవిడ్ సమయంలో భారత్ ఎంతో అండగా ఉందని ఆయన తెలిపారు. చదవండి: సంప్రదాయ వైద్యానికి సమయమిదే! -
త్వరలో ఆయుష్ వీసా
గాంధీనగర్: ఆయుష్ (ఆయుర్వేద, యోగ, నాచురోపతి, యునానీ, సిద్ధ, హోమియోపతి) చికిత్స కోసం భారత్ వచ్చేవాళ్లకు ప్రత్యేక వీసా కేటగిరీ ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించడానికి త్వరలో ప్రవేశపెట్టే ఆయుష్ మార్క్తో ఆ ఉత్పత్తులకు విశ్వసనీయత పెరుగుతుందన్నారు. 3 రోజుల అంతర్జాతీయ ఆయుష్ పెట్టుబడుల సదస్సును ప్రారంభించాక హీల్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మారిషస్ ప్రధాని జగన్నాథ్, డ బ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ ఔషధ విధానాల కోసం కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక శాఖ ద్వారా నూతన సాంకేతికతలతో తయారయ్యే ఆయుష్ ఉత్పత్తులకు మార్కింగ్ ఇస్తారని మోదీ చెప్పారు. ‘‘సంప్రదాయ వైద్య విధానాల వల్లే కేరళలో టూరిజం పెరుగుతోంది. ఇది దేశమంతా విస్తరించాలి. హీల్ ఇన్ ఇండియా ఈ దశాబ్దానికి అతిపెద్ద బ్రాండ్ కావాలి’’ అన్నారు. దహోద్లో రూ. 20 వేల కోట్లతో ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్లాంట్ పెడతామన్నారు. 1800 కోట్ల డాలర్ల విలువ 2014కు పూర్వం ఆయుష్ రంగ విలువ 300 కోట్ల డాలర్ల కన్నా తక్కువని, ప్రస్తుతమిది 1800 కోట్ల డాలర్లను దాటిందని మోదీ తెలిపారు. సంప్రదాయ వైద్య స్టార్టప్లకు ఆయుష్ శాఖ సాయం చేస్తుందన్నారు. ఈ రంగం నుంచి యూనికార్న్లు (వందకోట్ల డాలర్ల విలువ దాటిన స్టార్టప్లు) వస్తాయన్నారు. ఆయుష్ ఈమార్కెట్ పోర్టల్ను విస్తరించి రైతులను కంపెనీలతో అనుసంధానం చేస్తామని మోదీ తెలిపారు. విదేశీ మార్కెట్లలో ఆయుష్ ఉత్పత్తుల ప్రోత్సాహానికి ఆయుష్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు చేశామని టెడ్రోస్ చెప్పారు. భారత్, మారిషస్ మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు పలు అంశాలపై మోదీ, జగన్నాథ్ చర్చలు జరిపారు. టెడ్రోస్ కాదు.. తులసీ భాయ్ హీల్ ఇన్ ఇండియా సదస్సుకు హాజరైన డ బ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్కు ప్రధా ని మోదీ తులసీ భాయ్ అని భారతీయ పేరు పెట్టారు. టెడ్రోస్ గుజరాతీలో ప్రసంగాన్ని ఆరంభించేందుకు ప్రయత్నించడాన్ని అభినందించారు. (చదవండి: పాల ఉత్పత్తిలో భారత్ టాప్) -
sakshi Cartoon: ఒమిక్రాన్ కొత్త వేరియంట్లపై WHO నిఘా
ఒమిక్రాన్ కొత్త వేరియంట్లపై WHO నిఘా -
ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామా? మరి మన ప్లానెట్ పరిస్థితి ఏంటి?
ఏప్రిల్ 7..వరల్డ్ హెల్త్ డే ...‘‘అవర్ ప్లానెట్.. అవర్ హెల్త్’’. మన ఆరోగ్యంతో పాటు ఈ భూ గ్రహాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే అనే విషయాన్ని గుర్తుచేయడమే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లక్ష్యం. రోజు రోజుకి ప్రాణాంతకంగా పరిణమిస్తున్న కాలుష్య భూతాన్ని అడ్డు కోవడం, పారిశుధ్య లేమి, క్లైమేట్ చేంజ్ ప్రభావాన్ని ఎదుర్కోవడం ఇవన్నీ మన ఆరోగ్య రక్షణలో భాగమే. మెరుగైన ఆరోగ్య ప్రపంచం నిర్మాణ ధ్యేయంతో ప్రతీ ఏడాది స్పెషల్ థీమ్తో వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటాం. ఈ భూప్రపంచం, భూమ్మీద ఉన్న మనుషుల ఆరోగ్యం అనే లక్ష్యంతో ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తున్నాం. ఏప్రిల్ 7, 1948న ఏర్పాటైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవాలని WHO తొలి సమావేశంలో నిర్ణయించారు. అలా 1950 నుండి ఏప్రిల్ 7న తొలి వరల్డ్ హెల్త్ డేని నిర్వహించారు. సమానమైన, మెరుగైన ఆరోగ్య ప్రపంచ నిర్మాణం అనే నినాదంతో మానవులను, భూమాతను ఆరోగ్యంగా ఉంచేందుకు చేపట్టాల్సిన అత్యవసర చర్యలపై ప్రపంచాన్ని హెచ్చరించడం అన్నమాట. ఇక 2022 సంవత్సరానికి సంబంధించి అవర్ ప్లానెట్ అవర్ హెల్త్ అనే థీమ్తో వరల్డ్ హెల్త్ డేని పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు ప్రజారోగ్య సమస్యలపై అవగాహనకు వివిధ కార్యకలాపాలను నిర్వహించడం ఆనవాయితీ. గత రెండేళ్లుగా కరోనా విజృంభించిన నేపథ్యంలో 2021లో ‘మన ఆరోగ్యం మన బాధ్యత’ అనే స్లోగన్తో వరల్డ్ హెల్త్ డేని నిర్వహించుకున్నాం. అయితే కోవిడ్-19 కారణంగా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, రోగనిరోధక వ్యవస్థ, విటమిన్లు, పోషకాలపై శ్రద్ధ పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యాధులనుంచి తప్పించుకునేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచే సమతుల ఆహారంపై ప్రత్యేక దృష్టి మొదలైంది. కానీ దీనికి చాలా కాలం ముందునుంచే ఆహారం, ఆరోగ్య సంబంధిత సమస్యలు, వాటినెలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పించడానికి తన వంతు కృషి చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనాకి తోడు ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు, క్యాన్సర్, న్యుమోనియా, ఆస్తమా, ముప్పు పెరిగింది.ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్లకు పైగా మరణాలు నివారించ దగిన పర్యావరణ కారణాల వల్ల సంభవిస్తున్నాయని WHO అంచనా వేసింది. మానవాళి ఎదుర్కొంటున్న ఏకైక అతిపెద్ద ఆరోగ్య ముప్పు వాతావరణ సంక్షోభం. ఇదే ఆరోగ్య సంక్షోభానికీ దారి తీస్తుందనేది అని మనం గమనించాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం, తగినంత వ్యాయామం, క్రమం తప్పకుండా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో, మనం నివసిస్తున్న భూగ్రహాన్ని కాపాడుకోవడానికి తగిన చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యం. మానవాళి మనుగడకు పెను ముప్పుగా పరిణమిస్తున్న వాతావరణ కాలుష్య నివారణపై ప్రతీ పౌరుడు ఆలోచించడం చాలా అవసరం. ప్లాస్టిక్ని నిషేధం, సహజ అటవీ, నీటి వనరుల రక్షణ కీలకం. వాయు కాలుష్యం, కలుషిత నీరు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణతోపాటు, పారిశుద్ధ్య లేమి, కొన్ని ప్రమాదకర రసాయనాలు, క్లైమేట్ చేంజ్ ప్రతికూల ప్రభావాలు అత్యంత ప్రమాదకర మైన ముప్పు అనేది గుర్తించాలి. ఆరోగ్యకరమైన ప్రపంచ నిర్మాణకోసం ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా మనమందరం పునరంకితం కావాలి. -
ఆ ఒప్పందం సఫలం కావాలంటే...
ఆరోగ్యరంగంలో నెలకొన్న అసమానతల పునాదిపైనే మహమ్మారి ప్రాణం పోసుకుని ప్రపంచంపై విరుచుకుపడింది. రికార్డు సమయంలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలిగినప్పటికీ వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రజల సంఖ్య అనేక పేద దేశాల్లో ఇప్పటికీ తక్కువే. న్యాయమైన పంపిణీ, చౌకగా లభ్యం కావడం, పరీక్షలకు అందుబాటులో ఉండటం వంటివి ఇప్పటికీ సవాలుగానే ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో సరికొత్త అంతర్జాతీయ ఆరోగ్య ఒడంబడిక ఫలితాలు తీసుకువస్తుందని ఆశించడంలో ఔచిత్యం లేదనిపిస్తుంది. సమన్యాయం, అందరికీ అందుబాటులో ఉంచడం అనేవి ఆరోగ్యానికి సంబంధించిన కీలక సూత్రాలుగా గుర్తించనంతవరకూ మహమ్మారిపై ఒప్పందం కూడా అంతర్జాతీయ వాతావరణ మార్పు ఒడంబడికలాగే నిష్ఫలమవుతుంది. కోవిడ్–19 మహమ్మారి భారత్లో తగ్గు ముఖం పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2022 మార్చి 22 నాటికి ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల 80 లక్షల కేసులు నమోదు కాగా, 60 లక్షల మంది మరణాల బారిన పడ్డారని సమాచారం. అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ స్థిరంగా పెరుగుతూ వచ్చింది. ఆఫ్రికాలోనూ, మరికొన్ని నిరుపేద దేశాల్లోనూ వ్యాక్సిన్లు వేయడం ఇప్పటికీ స్వల్పంగానే ఉంది. గత రెండేళ్లుగా మహమ్మారి ప్రపంచాన్ని కనీవినీ ఎరుగని స్థాయిలో అతలాకుతలం చేయడమే కాకుండా, దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. దీంతో అంతర్జాతీయ సంస్థలు భవిష్యత్ మహమ్మారులతో వ్యవహ రించడం ఎలాగని చర్చించుకుంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఒక అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకోవాలనే ప్రతి పాదన కూడా వీటిలో ఒకటి. రెండేళ్లలో పూర్తవుతుందని భావిస్తున్న ఈ ప్రయత్నపు విజయం పలు కారణాలపై ఆధారపడి ఉంటుంది. మానవ ఆరోగ్యం ప్రధాన సూత్రంగా లేకపోతే ఈ ఒప్పందానికి కూడా వాతావరణ మార్పు ఒప్పందానికి పట్టిన గతే పడుతుంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి కోవిడ్–19ని ఎదుర్కోవడా నికి దేశాల మధ్య సహకారం చాలా అవసరమని స్పష్టమైంది. ఒక సాంకేతిక, శాస్త్ర సంబంధిత ఏజెన్సీ అయిన ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ సవాలును ఎదుర్కోవడానికి అవసరమైన వివిధ ప్రజారోగ్య, బయో మెడికల్ కొలమానాలపై మార్గదర్శకత్వాన్ని అందించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారికి చెందిన డేటాను నిర్దిష్టంగా పదిలపర్చే స్థలంలాగా పాత్ర పోషించింది. వైరస్ కట్టడిపై ఈ సంస్థ ఇచ్చే పిలుపును జాతీయ ప్రభుత్వాలే స్వీకరించి ఆచరణలో పెట్టాయి. మాస్కు ధరించడం, లాక్డౌన్లు, ప్రయాణాలపై ఆంక్షలు వంటి వాటిని ఏజెన్సీ అందించిన సాంకేతిక సలహాను బట్టి, స్థానిక పరి స్థితిని బట్టి ఆయా దేశాలు పాటిస్తూ వచ్చాయి. అయితే చైనాలో వైరస్ మూలం గురించిన తనిఖీల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆరోపణలకు గురైంది. ప్రత్యేకించి చైనా పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా మృదు వైఖరి అవలంబించిందని కొన్ని పాలనా యంత్రాంగాలు విమర్శించాయి. మరోవైపున, దేశాలు స్వతంత్రంగా వైరస్ రూపాలపై పరిశోధన చేయడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన అధికారాలు కుదించుకుపోతున్నట్లు భావించింది. వ్యాధి లేక వైరస్ సంబంధిత సమాచారం, డేటా కోసం సభ్య దేశాలపై ఆధారపడాల్సి ఉండటమే ప్రపంచ ఆరోగ్య సంస్థకు అతిపెద్ద అవరోధంగా ఉంటోంది. 2002–2003 సంవత్సరాల్లో సార్స్ వైరస్ ప్రపంచంపై విరుచుకుపడిన నేపథ్యంలో 2005లో అంతర్జాతీయ ఆరోగ్య క్రమ బద్ధీకరణ (ఐహెచ్ఆర్) చట్టాన్ని తీసుకొచ్చారు. సార్స్ వైరస్ ఉనికికి సంబంధించిన సమాచారాన్ని చైనా నెలల తరబడి వెల్లడించకుండా తొక్కిపెట్టడంతో చాలా దేశాలకు అది విస్తరించింది. ప్రజారోగ్యానికి సంబంధించిన ఘటనలు దేశాల సరిహద్దులు దాటి సంభవించి నప్పుడు ప్రపంచ దేశాలు పాటించాల్సిన విధులు, బాధ్యతలకు సంబంధించి కొన్ని నియమాలను ఐహెచ్ఆర్ నెలకొల్పింది. 2020 జనవరి 30న ఐహెచ్ఆర్ ఎమర్జెన్సీ కమిటీ నిర్వహించిన సమావేశం లోనే, కోవిడ్–19ని అంతర్జాతీయంగా కలవరపెట్టే ప్రజారోగ్య అత్యవ సర పరిస్థితిగా సిఫార్సు చేశారు. అయితే ఐహెచ్ఆర్ బలహీనమైన చట్రంతో కూడుకుని ఉందనీ, పర్యవేక్షణ, నిఘా వంటి అంశాల్లో దాని అమలు లోపభూయిష్ఠంగా ఉందనీ అనుభవాలు తెలియజేస్తున్నాయి. మహమ్మారి వెలుగులో 2020 మే నెలలో ఐహెచ్ఆర్ వ్యవస్థ పనితీరు, దాని అమలు గురించి సమీక్షించాల్సిందిగా ప్రపంచ ఆరోగ్య సభ (వరల్డ్ హెల్త్ అసెంబ్లీ)... ప్రపంచ ఆరోగ్య సంస్థను కోరింది. 2021 డిసెంబర్లో మహమ్మారి సన్నాహక చర్యలపై సరికొత్త అంతర్జాతీయ ఒడంబడికపై చేసిన కృషిని ఆరోగ్య సభ ఆమోదించింది. ప్రతిపాదిత ఒడంబడికపై చర్చలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. తొలి ప్రశ్న ఏమిటంటే, ఈ ఒడంబడిక తీసుకునే రూపం చట్టానికి కట్టుబడి ఉండే ఉపకరణంగా ఉండాలా లేదా మరొకలా ఉండాలా అనేదే! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య సమస్యలపై విధివిధానాలను రూపొందించే అధికారాలను ఆరోగ్య అసెంబ్లీకి కట్టబెట్టింది. ఇంత వరకు దీనికి సంబంధించిన ఏకైక ఉదాహరణ ఏమిటంటే, 2005లో అమలులోకి వచ్చిన పొగాకు నియంత్రణపై ముసాయిదా కన్వెన్షన్ మాత్రమే. ఈ కన్వెన్షన్ కింద పొగాకు ఉత్పత్తులలో అక్రమ వాణిజ్యాన్ని తొలగించే ప్రొటోకాల్ని అమలులోకి తెచ్చారు. కొన్ని దేశాలు మహమ్మారిపై ఒడంబడిక విషయంలోనూ ఇలాంటి వైఖరినే పాటించాలని సూచించాయి. దీనికింద ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, నిర్దిష్ట విధివిధానాలతో కూడిన చట్రం ఉండాలని ఇవి కోరాయి. ఉదాహరణకు, జంతువుల నుంచి మను షులకు వ్యాపించే వ్యాధుల విస్తరణను నిరోధించేందుకు అడవి జంతువుల వ్యాపారంపై నిషేధం విధించే ప్రొటోకాల్ గురించి యూరోపియన్ యూనియన్ మాట్లాడుతోంది. కొత్త, ఆవిర్భవిస్తున్న వైరస్లపై జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను తప్పనిసరిగా అన్ని దేశాలూ పరస్పరం పంచుకోవాలనే డిమాండ్లు కూడా రంగంమీదికి వచ్చాయి. అయితే ఈ కొత్త విధానం లేదా ఒడంబడిక ఐహెచ్ఆర్ని తోసి రాజంటుందా లేదా దానికి అనుబంధ పాత్రను పోషిస్తుందా అనేది స్పష్టం కావడం లేదు. ఈ అన్ని ఘర్షణాత్మకమైన అంశాలపై సంప్ర దింపుల కమిటీ ఒక అవగాహనకు రావాల్సి ఉంది. ప్రపంచ ఆరోగ్యానికి సంబంధించి కొత్త నిబంధనలను అభివృద్ధి చేసే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, ఇంతవరకు మనకు ఎదురైన అతి పెద్ద గుణపాఠాలను విస్మరించకూడదు. ఆరోగ్యరంగంలో నెలకొన్న అసమానతల పునాదిపైనే మహమ్మారి ప్రాణం పోసుకుని ప్రపం చంపై విరుచుకుపడింది. రికార్డు సమయంలో వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలిగినప్పటికీ వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రజల సంఖ్య అనేక పేద దేశాల్లో ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉండిపోయింది. సంపన్న దేశాల్లోని ప్రజలు ఇప్పటికే బూస్టర్ డోసులు కూడా వేసుకున్నారు. మరోవైపున ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన వ్యాక్సిన్ పూల్ పేదప్రజలకు వ్యాక్సిన్లను అందించడంలో విఫలమైంది. న్యాయమైన పంపిణీ, చౌకగా లభ్యం కావడం, పరీక్షలు అందుబాటులో ఉండటం వంటివి ఇప్పటికీ సవాలుగానే ఉంటున్నాయి. భౌగోళిక–రాజకీయ వ్యూహాల పరంగా కఠినమైన స్థానాల నుంచి ప్రపంచ దేశాలు పక్కకు తొలిగేలా మహమ్మారి మార్పు తీసుకు రాలేక పోయింది. వాణిజ్య ఒప్పందాలలోనూ ఈ పరిస్థితే కొనసాగుతోంది. మేధా సంపత్తికి చెందిన అవరోధాలన్నీ చెక్కుచెదర కుండా అలాగే ఉంటున్నాయి. అదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్కనబెట్టి గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఎజెండా వంటి ప్రైవేట్ చర్యలను ప్రోత్సహించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అమెరికా ఇలాంటి వాటిని ప్రోత్సహించింది. ఈ నేపథ్యంలో అందరికీ వర్తించే బహుపాక్షికత అనే గొప్ప భావనపై దాడి చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో సరికొత్త అంతర్జాతీయ ఆరోగ్య ఒడంబడిక ఫలితాలు తీసుకు వస్తుందని ఆశించడంలో ఔచిత్యం లేదనిపిస్తుంది. దశాబ్దాలుగా వాతావరణ మార్పుపై ఒప్పందం కోసం ప్రపంచం చర్చిస్తూనే ఉంది. కర్బన ఉద్గారాలకు సంబంధించిన సూత్రాలను సంపన్న దేశాలు నిరంతరం వ్యతిరేకిస్తూ, ఉమ్మడి బాధ్యతలు చేపట్ట డానికి నిరాకరిస్తున్నాయి. పేద దేశాలకు టెక్నాలజీ బదలాయింపు, ఆర్థిక వనరుల పంపిణీపై చేసిన వాగ్దానాలు ఇప్పటికే కాగితాల మీదే ఉండిపోయాయి. సమన్యాయం, అందరికీ అందుబాటులో ఉంచడం అనేవి ఆరోగ్యానికి సంబంధించిన కీలక సూత్రాలుగా గుర్తించనంత వరకు మహమ్మారిపై కుదిరే ఒప్పందానికి కూడా వాతావరణ మార్పు ఒప్పందానికి పట్టిన గతే పడుతుందని విస్మరించరాదు. -
ఉక్రెయిన్లో దయనీయ పరిస్థితి..!
According WHO healthcare situation: ఉక్రెయిన్ పై రష్యా గత నెలరోజుల పైగా దాడి చేస్తూనే ఉంది. వైమానిక క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఈ యుద్ధం కేవలం ఉక్రెయన్కి ప్రాణ, ఆస్తి నష్టం మాత్రమే కలగించలేదు, అంతకుమంచిన తీవ్ర దుష్పరిణామాను మిగిల్చింది. ఈ నిరవధిక దాడుల కారణంగా ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. స్వచ్ఛమైన నీరు, ఆహారం లేకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురుయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ వైమానికి దాడుల కారణంగా కాలుష్యం ఎక్కువై నీరు, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోందని చెబుతోంది. ప్రస్తుతం రష్యా బలగాలు మారయుపోల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు ముమ్మరం చేశారు. నిజానికి 2011లో మారియుపోల్ తొలి కలరా వ్యాధిని గుర్తించారు. మళ్లీ ఈ యుద్ధం కారణంగా ఆ వ్యాధి మరింత ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మార్చి 18 నాటికి లుహాన్స్క్ ప్రాంతంలో దాదాపు లక్ష మందికి నీటి సౌకర్యం లేదని తెలిపింది. అయితే ప్రభుత్వేతర నియంత్రిత ప్రాంతాలలో కూడా దాదాపు 4 లక్షల మందికి నీటి సరఫరా లేదని వెల్లడించింది. ఈ యుద్ధం కారణంగా చాలామంది వ్యక్తులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అందువల్ల డిజార్డర్ డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. గర్భనిరోధకం అందుబాటులో లేకపోవడం వల్ల లైంగిక పరంగా హింసకు గురయ్యే ప్రమాదం పోంచి ఉందని తెలిపింది. అదీగాక లైంగికంగా సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని డబ్ల్యూహెచ్ఓ అంటోంది. ప్రమాదకరమైన సంక్రమిత అంటు వ్యాధులు కోవిడ్-19 కేసులు ఈ బాంబుల దాడుల కారణంగా ఒకే షెల్టర్లో కోవిడ్ -19 పేషంట్లకు వైద్యం అందించాల్సిన స్థితి ఏర్పడుతుంది. అది కాక ఈ బాంబు దాడుల కారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ఎక్కువయ్యే అవకాశం ఉంది. మార్చి 17 కల్లా ఉక్రెయిన్లో సుమారు 27,671 కోవిడ్ -19 కేసులు 384 మరణాలు సంభవించాయని నివేదిక పేర్కొంది. అయినా ఈ యుద్ధ తీవ్రత కారణంగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడం, చికిత్స అందించడం కూడా కష్టమేనని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. మీజిల్స్ కేసులు మార్చి 22న, రొమేనియాకు వచ్చి శిబిరాల్లో ఉంటున్న ఉక్రేనియన్ శరణార్థులలో మూడు అనుమానిత మీజిల్స్ కేసులు గుర్తించనట్లు నివేదిక తెలపింది. ప్రసవానంతర సంరక్షణ వచ్చే మూడు నెలల్లో ఉక్రెయిన్లో దాదాపు 80 వేల మంది మహిళలు జన్మనిస్తారని అంచనా. ప్రసూతి సంరక్షణకు అంతరాయం ఏర్పడి ప్రసూతి నియోనాటల్ సమస్యల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అదీగాక ప్రసూతి ఆసుపత్రులతో సహా ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై దాడుల కారణంగా సిజేరియన్ వంటి విధానాలను నిర్వహించడం, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ అందించడం వంటి ప్రసూతి సమస్యలను నిర్వహించే సామర్థ్యం కూడా తగ్గిందని డబ్ల్యూహెచ్ఓ నివేదికలో వెల్లడించింది. (చదవండి: ఫస్ట్ స్టేజ్ మిలటరీ ఆపరేషన్ ఫినిష్... అదే మా లక్ష్యం!) -
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి! టీబీ మహమ్మారిని తరిమి కొడదాం!
ప్రపంచ జనాభాను భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధుల్లో టీబీ మహమ్మారి లేదా క్షయవ్యాధి ఒకటి. కోవిడ్ మహమ్మారి తరువాత టీబీ మరణాలు మరింత పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు సుమారు 4వేలకు పైగా టీబీ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే టీబీపై అవగాహన కల్పించడంతోపాటు సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతో ప్రతీ ఏడాది మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుకుంటాం. గ్లోబల్ హెల్త్ క్యాంపెయిన్ భాగంగా WHO చేపట్టిన 8 ప్రధాన క్యాంపెయిన్లలో వరల్డ్ టీబీ డే కూడా ఒకటి. ప్రతీ ఏడాది మార్చి 24వ తేదీ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం నిర్వహిస్తారు. గ్లోబల్గా 2012 సంవత్సరంలో, మొత్తం 8.6 మిలియన్ల మంది టీబీ బారిన పడగా, 1.3 మిలియన్ల మంది మరణించారు. టీబీ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపడతాయి. డాక్టర్ రాబర్ట్ కోచ్ 1882లో TBకి కారణమయ్యే బాసిల్లస్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ను కనుగొన్నట్లు ప్రకటించిన తేదీకి గుర్తుగా, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాది మార్చి 24న ప్రపంచ టీబీ దినోత్సవాన్ని జరుపుకుంటాం అయితే క్షయవ్యాధికి పూర్తి నివారణ ఉన్నప్పటికీ, సరైన అవగాహన, చికిత్స తీసుకోకపోవడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. మరీ ముఖ్యంగా గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వేధించిన కరోనా తరువాత టీబీ ముప్పు మరింత పెరిగింది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా ఈ మరణాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘‘టీబీని అంతం చేయడానికి పెట్టుబడులు పెట్టండి, ప్రాణాలను కాపాడండి’’ అనే థీమ్తో 2022 ప్రపంచ టీబీ డే నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. టీబీని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాల ఫలితంగా 2000 సంవత్సరం నుండి సుమారు 66 మిలియన్ల మంది ప్రాణాలను దక్కించుకున్నారు. అయితే ఈ పోరాటాన్ని, ఇన్నేళ్ల పురోగతిని కోవిడ్-19 మహమ్మారి తారు మారు చేసింది. దశాబ్దంలో తొలిసారిగా, 2020లో టీబీ మరణాలు మళ్లీ పెరిగాయి. ఊపిరితిత్తులకు మాత్రమే టీబీ వస్తుందా? టీబీ వ్యాధి సాధారణంగా ఊపిరితిత్తులను పట్టి పీడించేది అయినప్పటికీ లింఫ్ నోడ్ టీబీ అంటే మెడ చుట్టూ ఉన్న లింఫ్ గ్రంథులకు, వెన్నెముక, మెదడు, గుండెకు, ఎముకలకు, కీళ్లకు ఇలా శరీరంలో ఏ అవయవానికైనా రావచ్చు. ఇరుకైన జీవన పరిస్థితులు, ఆరోగ్య సంరక్షణ లేకపోవడం, పారిశుధ్యం లోపం, అవగాహనా లేమి ప్రధానంగా పేదరికం లాంటి కారణాలు టీబీ వ్యాప్తికి కారకాలు. సాధారణంగా కనిపించే లక్షణాలు క్షయవ్యాధిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు అంటే కనీసం 3 వారాల పాటు తీవ్రమైన దగ్గు , దగ్గినపుడు కఫంతోపాటు రక్తం కనిపించడం మరో ప్రధాన లక్షణం. దీంతోపాటు చలితో కూడిన జ్వరం, ఆకలి మంద గించడం, బరువు తగ్గడం ఇతర లక్షణాలున్నపుడు టీబీ వ్యాధిగా అనుమానించి తగిన వైద్య పరీక్షలు చేయించు కోవాలి. అలాగే రాత్రి పూట చెమటలు ఎక్కువగా పట్టడంతోపాటు, ఛాతీ నొప్పిగా ఉంటే అప్రమత్తం కావాలి. సుదీర్ఘ కాలం కడుపునొప్పి, కీళ్ల నొప్పులు, మూర్ఛలు, తలనొప్పి వేధిస్తున్నా వైద్యడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. క్షయ వ్యాధిని ముందుగా గుర్తిస్తే 100 శాతం నివారణ సాధ్యం. ఏ రకమైన టీబీ సోకింది అనేదానిపై చికిత్స అధారపడి ఉంటుంది. లేటెంట్ టీబీవేరియంట్కు యాంటీ బయాటిక్స్, యాక్టివ్ TB సోకినవారు దాదాపు తొమ్మిది నెలల పాటు పలు రకాల మందులను వాడాలి. ఒకవేళ డ్రగ్-రెసిస్టెంట్ అంటే మందులకు లొంగని టీబీ అని తేలితే వారికి ప్రత్యేక చికిత్స అందించాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. -
ఏడాది చివరికి కరోనా అంతం!
జోహన్నెస్బర్గ్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అనేక దేశాల్లో ఇప్పటికే కరోనా వేరియంట్లు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఆల్ఫా, బీటా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లు వ్యాప్తి చెందడంతో లక్షల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కరోనా ముగింపు దశపై ఆశాజనక ప్రకటన చేసింది. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథానమ్ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూలై, జూన్ మధ్యలో ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయితే.. కరోనా పీక్ స్టేజ్ ముగుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గితే ఈ ఏడాది చివరి నాటికి కరోనా ముగింపు దశకు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు. అయితే, అది మన చేతిలోనే ఉందని తెలుపుతూ.. అందరూ కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఇదిలా ఉండగా.. ఆఫ్రికాలో కోవిడ్ వ్యాక్సినేషన్పై టెడ్రోస్ అసంతృప్తి వ్యక్తంచేశారు. అక్కడ కేవలం 11శాతం మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగడంతో టీకా పంపిణీపై డబ్ల్యూహెచ్ఓ దృష్టి సారించనున్నట్టు అథనమ్ వెల్లడించారు. అయితే, మోడెర్నా సీక్వెన్స్ను ఉపయోగించి ఆఫ్రికాలో మొట్టమొదటి ఎంఆర్ఎన్ఏ టీకాను రూపొందించిన ఆఫ్రిజెన్ బయెలాజిక్స్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. డబ్ల్యూహెచ్ఓ, కోవాక్స్ సహకారంలో ఆఫ్రిజెన్ ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగానే 2024లో ఆఫ్రిజెన్ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అథనమ్ పేర్కొన్నారు. -
ఒమిక్రాన్ ఎంత పని చేసిందంటే..
కరోనా వేరియేంట్లలో ప్రమాదకరం కాకపోయినా.. వేగంగా ఇన్ఫెక్షన్లతో వెల్లువలా కేసులు పెరగడానికి కారణమైంది ఒమిక్రాన్. కిందటి ఏడాది చివర్లో మొదలైన ఒమిక్రాన్ విజృంభణ.. ఇంకా కొనసాగుతూనే వస్తోంది. ప్రస్తుతం చాలా దేశాల్లో కేసుల తగ్గుముఖంతో సాధారణ ప్రజానీకానికి సడలింపులు, ఆంక్షల ఎత్తివేతతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ తరుణంలో ఒమిక్రాన్పై ఓ లెక్క అంటూ రిలీజ్ చేసింది డబ్ల్యూహెచ్వో.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ను నవంబర్ చివర్లో కరోనా వేరియెంట్గా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 130 మిలియన్ల కేసులు నమోదు అయ్యాయని WHO ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మరణాలు నమోదు అయ్యాయని తెలిపింది. విషాదానికి మించినది ఈ పరిణామం అని ఈ గణాంకాలపై వ్యాఖ్యానించారు ఆరోగ్య సంస్థ మేనేజర్ అబ్ది మహముద్. ప్రమాదకరమైన డెల్టా వేరియెంట్ తర్వాత ఒమిక్రాన్.. ప్రపంచంపై తన ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రమాదకరమైంది కాకపోయినా.. త్వరగతిన వ్యాపిస్తూ కేసుల సంఖ్యను పెంచేసింది. కరోనా వేరియెంట్లు వచ్చి తగ్గిన పేషెంట్లపై మరికొంత కాలం ప్రభావం చూపిస్తుండగా.. ఒమిక్రాన్ మాత్రం సుదీర్ఘకాలం చూపించే అవకాశం ఉండడం గమనార్హం. కరోనా మొదలైనప్పటి నుంచి తీవ్రస్థాయిలో రేంజ్లో కేసులు వెల్లువెత్తడం ఒమిక్రాన్ వల్లే అయ్యింది. అనధికారికంగా ఈ లెక్కలు ఇంకా ఎక్కువే ఉండొచ్చు. కానీ, ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం మాత్రమే ఇది అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. కరోనాలో ఒమిక్రాన్ చివరి వేరియెంట్ కాకపోవచ్చని, ఒకవేళ తర్వాత వేరియెంట్ గనుక పుట్టుకొస్తే.. దాని తీవ్రత మరింత దారుణంగా ఉండబోతుందంటూ డబ్ల్యూహెచ్వో ఇదివరకే ప్రపంచాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. COVID-19 డిసెంబర్ 2019 లో చైనాలో కరోనా వైరస్ పుట్టిందని ప్రకటించినప్పటి నుంచి.. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లమందికిపైగా కరోనా(వివిధ వేరియెంట్లు) బారినపడ్డారు. మొత్తం 57 లక్షల మందికి పైగా కరోనాతో మరణించారు. ఇందులో భారత్ నుంచి మరణాలు ఐదు లక్షలకు పైగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటిదాకా పది బిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందాయి. -
కలవరపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఏ.2.. స్పందించిన డబ్ల్యూహెచ్ఓ
లండన్: ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతునే ఉంది. మరొవైపు ఒమిక్రాన్ కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం బీఏ.2 వేరియంట్ పలు దేశాల్లో కలకలం సృష్టిస్తోంది. దీనిపై డబ్ల్యూహెచ్వో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజా అధ్యయనాల ప్రకారం.. బీఏ.2 వేరియంట్ ఇప్పటికే.. 57 దేశాలలో వెలుగులోకి వచ్చింది. ఇది ఒమిక్రాన్ వేరియంట్ కన్నా.. రెట్టింపు వేగంతో వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్వో తెలిపింది. కాగా, ఈ వేరియంట్ పదివారాల క్రితం దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చింది. చాలా తక్కువ సమయంలో పలుదేశాల్లో విస్తరించిందని పరిశోధకులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సేకరించిన తాజా నమునాలలో.. అనేక కొత్త వేరియంట్లు కనుగొనబడ్డాయని తెలిపారు. వీటిలో ప్రధానంగా.. బీఏ.1, బీఏ.1.1, బీఏ.2 మరియు బీఏ.3. రకానికి చెందిన వేరియంట్లు గుర్తించబడినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. వీటిలో బీఏ.2 సబ్ వేరియంట్ ఒమిక్రాన్ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. మనుషుల్లోని రోగ నిరోధక శక్తిని బీఏ.2 ఏమార్చగలదని తెలిపారు. కొత్త వేరియంట్ ఇమ్యూనిటీ నుంచి ఈ సబ్ వేరియంట్ సులభంగా తప్పించుకొనే సామర్థ్యం కల్గి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం బీఏ.1, బీఏ.1.1 వేరియంట్లను గుర్తించామని, గ్లోబల్ సైన్స్ ఇనిషియేటివ్కి 96 శాతం.. ఓమిక్రాన్ వేరియంట్ను పోలి ఉందని పరిశోధకులు వెల్లడించారు. బీఏ.2 వేరియంట్ మానవ కణాలలోకి ప్రవేశించడానికి అనేక ఉత్పరివర్తనాలు కల్గి ఉండి, స్పష్టమైన పెరుగుదల ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్వో పరిశోధకుల్లో ఒకరైన వాన్ కెర్ఖోవ్ బీఏ.2 వేరియంట్పై స్పందిచారు. దీనిపై సమాచారం పరిమితంగా ఉందని తెలిపారు. బీఏ.1 కంటె కూడా.. బీఏ.2 అధిక వ్యాప్తిని కలిగి ఉందని తెలిపారు. ప్రస్తుతం డెల్లా వేరియంట్.. మునుపటి కరోనా కంటె.. తక్కువ తీవ్రత కల్గి ఉందని అన్నారు. ప్రస్తుతం కరోన ఒక ప్రమాదకరమైన వ్యాధిగా మిగిలిపోయిందని వాన్ కెర్ఖోవ్ చెప్పుకొచ్చారు. చదవండిః సొంత వాహనాల్లోనూ మాస్క్ తప్పనిసరి! ఇంకెన్నాళ్లు? -
నియోకోవ్ వైరస్పై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు!
దక్షిణాఫ్రికాలో గబ్బిలాల్లో ప్రమాదకర నియో కోవ్ వైరస్ ఉన్నట్టు పరిశోధకులు హెచ్చరించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందించింది. వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ కొత్త రకం కరోనా వైరస్పై మరింత అధ్యయనం అవసరం అని తెలిపింది. గబ్బిలాల్లో నియో కోవ్ ఉన్నట్టు వుహాన్ పరిశోధకులు గుర్తించిన విషయం తమకు తెలిసిందని, అయితే, ఈ వైరస్ వల్ల మనుషులకు ముప్పు ఉంటుందా? లేదా అనే విషయం తెలుసుకొనేందుకు మరింత అధ్యయనం అవసరమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. (చదవండి: New Virus NeoCov: మరో బాంబు పేల్చిన చైనా.. ఆ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి ) ఇప్పటికే కరోనా, ఒమిక్రాన్తో అల్లాడిపోతున్నప్రజలకు నియోకోవ్ మరింత తలనొప్పిగా మారునుందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఎందుకుంటే ఈ వైరస్ వల్ల భవిష్యత్తులో మనుషులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఓ అధ్యయనంలో పరిశోధకులు తెలిపారు. కరోనావైరస్లోని వేరియంట్లు సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎస్ఏఆర్ఎస్) వరకు వ్యాధులకు కారణమయ్యే వైరస్కు సంబంధించింది. తాజాగా దక్షిణాఫ్రికాలో బయటపడిన నియో కోవ్ వైరస్కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతోపాటు మరణాల రేటు కూడా అధికంగానే ఉండే అవకాశముందని వూహాన్ ల్యాబ్ సైంటిస్టులు హెచ్చరించారు. -
ఒకటి రెండూ కాదు..మొత్తంగా నాలుగు..! కోవిడ్ వ్యాక్సిన్పై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు
Covid-19: మొదటి, రెండో డోసు తర్వాత.. బూస్టర్ డోసుకు ముందు కొత్తగా అదనపు డోసును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. రోగ నిరోధకశక్తి బాగా తక్కువున్నవారికి ఈ డోసు వేస్తేనే కరోనా నుంచి సమగ్ర రక్షణ లభిస్తుందని స్పష్టం చేసింది. అంటే వీరు మొత్తం నాలుగు డోసులుగా టీకాలు తీసుకోవాలన్నమాట. వ్యాక్సిన్లకు సంబంధించి ప్రాధాన్యాలపై డబ్ల్యూహెచ్ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. రోగనిరోధక శక్తి బాగా తక్కువ ఉన్నవారిలో వ్యాక్సిన్ సంబంధిత రక్షణ ఉత్పత్తి కావడం లేదు. ప్రస్తుత కేన్సర్ రోగులు, అలాగే ఏడాదిలోపు కేన్సర్ మందులు వాడినవారు, రెండేళ్ల లోపు అవయవ మార్పిడి జరిగిన వారు, డయాలసిస్లో ఉన్నవారు, ఎయిడ్స్ రోగుల్లో సీడీ4 సెల్స్ 200 కంటే తక్కువున్న వారు.. ఇలా ఏదో ఒకరకంగా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి అదనపు డోసు ఇవ్వాలి. మిగతావారికి ఈ అదనపు డోసు అవసరం లేదు. అందరికీ బూస్టర్ డోసు ఇప్పుడున్న వ్యాక్సిన్లు ఏవీ కూడా కరోనా వ్యాప్తిని ఆపలేవు. ఒమిక్రాన్ విషయంలో వ్యాక్సిన్ల పనితీరు గతంతో పోలిస్తే తగ్గింది. అందువల్ల అందరికీ బూస్టర్ డోసు తప్పనిసరిగా వేయాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది. అయితే హైబ్రిడ్ ఇమ్యూనిటీతోనే కరోనా నుంచి పూర్తిస్థాయి రక్షణ లభిస్తుంది. సాధారణ రోగనిరోధక శక్తి, బూస్టర్ డోసు కంటే కూడా ఇది చాలా శక్తిమంతమైంది. రెండు డోసుల వ్యాక్సినేషన్తో పాటు, ఒకసారి ఇన్ఫెక్షన్కు గురైతే హైబ్రిడ్ ఇమ్యూనిటీ వస్తుంది. అలాగే ఒక డోసు టీకాతో పాటు రెండుసార్లు ఇన్ఫెక్షన్ సోకినా ఈ తరహా రోగనిరోధకత అభివృద్ధి చెందుతుంది. ఇది ఎలాంటి కరోనా వైరస్నైనా ఎదుర్కొంటుంది. 60 ఏళ్లు పైబడితే హైరిస్క్లో ఉన్నట్టే బూస్టర్ డోసు కరోనా మరణాలను, రోగ తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కరోనా సోకినా తక్కువ లక్షణాలుంటాయి. లక్షణాలున్నప్పటికీ జబ్బు తీవ్రం కాకుండా చూస్తుంది. హైరిస్క్ గ్రూప్ వ్యక్తులకు బూస్టర్ డోసును మొదటి ప్రాధాన్యంగా వేయాలి. 60 ఏళ్లు పైబడినవారు హైరిస్క్లో ఉన్నట్లు లెక్క. 18–60 మధ్య వయస్సులో ఉన్న దీర్ఘకాలిక జబ్బులు లేనివారికి (లోరిస్క్ గ్రూప్) మొదటి డోసు వేయడం కంటే, హైరిస్క్ గ్రూప్కు బూస్టర్ డోసు వేయడం చాలా ముఖ్యం. తక్కువ రోగనిరోధకశక్తి కలిగినవారు... పుట్టుకతోనే తెల్ల రక్తకణాలు తక్కువ ఉండేవారు. పుట్టుకతోనే ఇమ్యునోగ్లోబిలిన్ (ఎం) అధిక సంఖ్యలో ఉండటం, కొన్ని రకాల కణాలు తక్కువగా ఉండటం (ఐఎల్–12, ఐఎల్–23, ఐఎఫ్– గామా) తెల్ల రక్తకణాల కదలికల్లో లోపం ఉండటం పుట్టుకతోనే బీ సెల్స్, టీసెల్స్ సరిగ్గా స్పందించక పోవడం. సీడీ 4 సెల్స్ తక్కువగా ఉండటం వల్ల అరుదైన జన్యు సమస్యలు ఉన్నవారు. కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు ఉన్నవారు. శరీరమంతా పూర్తిగా తెలుపు రంగులోకి మారినవారు. రోగ నిరోధకశక్తి బాగా తక్కువున్నవారికి అడిషనల్ డోసును రెండో డోసు తర్వాత ఒకటి నుంచి మూడు నెలల్లోపు ఇవ్వాలి. ఆ తర్వాత నాలుగు నుంచి ఆరు నెలల మధ్యలో బూస్టర్ డోసు (నాలుగో డోసు) ఇవ్వాలి. – డబ్ల్యూహెచ్ఓ బూస్టర్ డోసులో ప్రాధాన్య గ్రూపులు ఆరోగ్య సిబ్బంది, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, 60 ఏళ్లు పైబడినవారు. 60 ఏళ్ల లోపున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, టీచర్లు, అత్యవసర సిబ్బంది, మురికివాడల్లో ఉండేవారు, శరణార్థులు, వలస కార్మికులు 18– 60 ఏళ్ల లోపున్న దీర్ఘకాలిక వ్యాధులు లేనివారు. 18 ఏళ్లలోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు. ఏ జబ్బూలేని 18 ఏళ్ల లోపు పిల్లలు -
కరోనాకు 'కత్తెర'.. రెండు కొత్త చికిత్సా విధానాలు ఆమోదం
World Health Organization approved two new Covid-19 treatments: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహోచ్ఓ) శుక్రవారం కోవిడ్ -19 కోసం రెండు కొత్త చికిత్సా విధానాలను ఆమోదించింది. వ్యాక్సినేషన్లతో పాటు ఈ మెరుగైన చికిత్సలు కూడా తోడైతే ఈ కరోనా వైరస్ భారిన పడకుండా ఉండటమే కాక మరణాలను అరికట్టగలం అని డబ్ల్యూహోచ్వో నిపుణులు చెబుతున్నారు. అయితే డబ్ల్యూహోచ్వో మార్చి నాటికి యూరప్లో సగం మందికి కరోనా సోకుతుందని, ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోతాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే. బ్రిటీష్ మెడికల్ జర్నల్ (బీఎంజే), డబ్ల్యూహెచ్ఓ నిపుణులు తీవ్రమైన లేదా క్లిష్టమైన కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి కార్టికోస్టెరాయిడ్స్ తోపాటు ఆర్థరైటిస్ డ్రగ్ బారిసిటినిబ్ని ఉపయోగించి మెరుగైన చికిత్స అందించవచ్చు అని అన్నారు. అంతేకాదు ఈ చికిత్స విధానం వల్ల వెంటిలేటర్ల అవసరం తగ్గుతుందని, మనుగడ రేటును పెంచగలం అని చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన సోట్రోవిమాబ్ అనే సింథటిక్ యాంటీబాడీ చికిత్స అనేది కరోనా తీవ్రతరం కానీ రోగులకు కోసం. అయితే ఈ చికిత్స విధానం వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు లేదా మధుమేహం వంటి ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఈ చికిత్సా విధానం వల్ల ఆస్పత్రులపాలై ప్రమాదం ఎక్కువ. ఆసుపత్రిలో చేరే ప్రమాదం లేని వ్యక్తుల కోసం సోట్రోవిమాబ్ మంచి ప్రయోజనం ఇస్తోందని, అలాగే కరొనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్కి వ్యతిరేకంగా పనిచేస్తుందనేది కాస్త సందేహమే అని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. అయితే ఇప్పటి వరకు కరోనా కోసం మూడు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని డబ్ల్యూహెచ్ఓ విడి విడిగా ఆమోదించింది. సెప్టెంబర్ 2020లో ఆమోదించిన తీవ్రమైన అనారోగ్యం కోసం కార్టికోస్టెరాయిడ్స్ను ఉపయోగించే చికిత్స. ఇది చవకగా లభించే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. జూలైలో డబ్ల్యూహెచ్ఓ ఆమోదించిన ఆర్థరైటిస్ డ్రగ్స్ టోసిలిజుమాబ్, సరిలుమాబ్లతో అందిచే చికిత్స విధానం. అయితే ఈ చికిత్స విధానం ఇన్ఫెక్షన్ కారణంగా రోగనిరోధక వ్యవస్థ యొక్క అధిక ప్రతిచర్యతో పోరాడటానికి ఎంతగానేఉపకరిస్తోంది. ఈ రోగులు బారిసిటినిబ్ని కూడా ఉపయోగించవచ్చు. ఈ మేరకు రెండు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నప్పుడూ ఖర్చులను, వైద్యుల సలహాలను, మీ సమస్యలను దృష్టి ఉంచుకుని సరైన చికిత్స విధానాన్ని ఎంచుకోండి అని డబ్ల్యూ హెచఓ పేర్కొంది. -
ఒమిక్రాన్పై డబ్ల్యూహెచ్వో తీవ్ర హెచ్చరిక.. అక్కడ సగం మందికి ఒమిక్రాన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఒమిక్రాన్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో.. యూరోప్లో సగం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకే ప్రమాదం ఉన్నట్లు డబ్ల్యూహెచ్వో వైద్య నిపుణుడు డాక్టర్ హన్స్ క్లూజీ చెప్పారు. పశ్చిమం నుంచి తూర్పు దిశగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది తొలి వారంలోనే యూరోప్లో 70 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని, దీని ఆధారంగా డబ్ల్యూహెచ్వో ఈ అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇన్ఫెక్షన్లు రెండింతలు అయినట్లు తెలుస్తోంది. యూరోప్లో 8 వారాల్లోగా సగం మందికి ఒమిక్రాన్ సోకుతుందని సియాటిల్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యువేషన్ సంస్థ వెల్లడించినట్లు డాక్టర్ క్లూజీ తెలిపారు. ఇదిలాఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. 2,46,780 కేసులతో యూకే తొలి స్థానంలో ఉండగా.. 66,563 కేసులతో డెన్మార్క్ రెండో స్థానంలో ఉంది. ఇక భారత్లో 4,868 ఒమిక్రాన్ కేసులున్నాయి. (చదవండి: వాసనతో ప్రమాదం పసిగట్టి గోల్డ్ మెడల్ అందుకున్న చిట్టి హీరో.. ఇక లేడు) -
బీఅలర్ట్: ఒమిక్రాన్ను తక్కువ అంచనా వేయొద్దు
WHO Alert World On Omicron variant As Serious Issue: కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా విజృభిస్తుంది. అయితే చాలా దేశాలు ఈ వేరియంట్ని చాలా తేలికగా తీసుకుంటున్నాయని డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఇది అంత పెద్ద ప్రమాదకారి కాదని కొట్టిపారేయకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఈ మేరకు డబ్ల్యుహెచ్వో చీఫ్ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కీలక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఒకవైపు డెల్టా వేరియంట్తో పోటీపడుతూ ఒమిక్రాన్ వేగంగా విజృభిస్తుంది. అంతేకాదు మరోవేపు కేసులు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వారం వ్యవధిలో 71 శాతం కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారాయన. పైగా ఆస్పత్రులు కొత్త వేరియెంట్ పేషెంట్లతో నిండిపోతున్నాయి. నిజానికి డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తక్కువ తీవ్రతతో ఉన్నట్లు కనిపించడంతో తీవ్రత లేదని భావిస్తున్నారంతా. కానీ, అది వాస్తవం కాదు. ఒమిక్రాన్ తీవ్రత వల్లే ఆస్పతి పాలవుతున్నారు. చనిపోతున్నారు కూడా. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి సైతం సంక్రమించడం ఆందోళన కలిగిస్తోందని, మరోవైపు ప్రాణాలు పోయే ముప్పు సైతం పొంచి ఉందని టెడ్రోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. (చదవండి: క్యూఆర్ కోడ్ ఉన్నపెప్సీ ట్రక్లను తగలబెట్టేస్తా!) వ్యాక్సిన్ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదని, వ్యాక్సిన్ కేవలం రక్షణ వలయం లాంటిదని చెప్తున్నారాయన. అంతేకాదు కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకి సునామీలా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు, సెలవుల వల్ల కేసులు పెరగ్గా.. కోవిడ్ పరీక్షలు నిర్వహించడంలో పలు దేశాలు విఫలం అయ్యాయని, అందుకే కేసులు రికార్డు స్థాయిలో పెరుగతున్నాయని అన్నారు. ఈ ఏడాది ప్రతి దేశం కూడా 70% వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయాలని ఆకాంక్షించారు. కోవిడ్ -19 టెక్నికల్ లీడ్ వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. "ఒమిక్రాన్ కరోనా వైరస్ చివరి వేరియెంట్ కాదు. ఎప్పుడు ముగుస్తుందో కచ్చితంగా చెప్పలేం. ఒమిక్రాన్ వేరియంట్ను నుండి తమను తాము రక్షించుకోవడానికి వారు ఇప్పటికే తీసుకుంటున్న చర్యలను మరింత వేగవంతం చేయాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి" అని ప్రపంచాన్ని కోరారు. అయితే తాము 2022 ఏడాది చివరిలో కూడా ఈ కరోనా గురించి ఇంకా ప్రసంగించే పరిస్థితి ఏర్పడితే.. అంతకన్నా విషాదం ఇంకోకటి ఉండదు అని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ ఆవేదనగా చెప్పారు. (చదవండి: తల్లే పిల్లల్ని కిడ్నాప్ చేసింది.. ఎందుకో తెలుసా?) -
ఒమిక్రాన్ మిగతా వాటిలా కాదు.. శ్వాస వ్యవస్థ పైభాగంలో ఎఫెక్ట్ ఉంటుంది: డబ్ల్యూహెచ్వో
జెనీవా: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వేరియంట్ బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి, మరణాల రేటు తక్కువగానే ఉందని డబ్ల్యూహెచ్వో నిపుణుడు డాక్టర్ అబ్దీ మహముద్ తెలిపారు. అయితే అన్నిచోట్ల ఇదే తరహాలో ఉంటుందని భావించలేమని వెల్లడించారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్లో సాంక్రమికశక్తి కనిపిస్తోందని పేర్కొన్నారు. (చదవండి: సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం.. వారంలో ఆ రోజు పూర్తిస్థాయి లాక్డౌన్) అమెరికాలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని.. హాస్పిటల్స్లో చేరే పరిస్థితులు కూడా ఎక్కువగానే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. పాత వేరియంట్లు తీవ్రమైన న్యూమోనియాకు దారితీసి ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపగా.. ఒమిక్రాన్ శ్వాస వ్యవస్థ పైభాగంలో ప్రభావం చూపుతున్నట్లు అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయని చెప్పారు. ఇది ఒకరమైన మంచి వార్తే అయినప్పటికీ, దానిని నిరూపించడానికి మాకు మరిన్ని అధ్యయనాలు అవసరమని డాక్టర్ అబ్దీ మహముద్ అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 128 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడినట్టు డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. (చదవండి: భారత్లో తొలి ఒమిక్రాన్ మరణం ఆ రాష్ట్రంలోనే.. వెల్లడించిన కేంద్రం) -
మళ్ళీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రక్కసి
-
పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు..
ఫ్రాన్స్: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, యూరప్ దేశాల్లో రోజురోజుకు పరిస్థితి చేజారేలా కనిపిస్తోందని డబ్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 24 న ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో వెలుగుచూసినప్పటినుంచి, ఇప్పటి వరకు 108 దేశాల్లో పంజా విసిరింది. ముఖ్యంగా ఐరోపాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఫ్రాన్స్ దేశంలో ఒక్కరోజులోనే తొలిసారిగా లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఆ దేశంలో అధిక సంఖ్యలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఆసుపత్రుల్లో చేరికలు కూడా రెట్టింపయ్యాయి. గడచిన వారంలో ప్రతి వంద మందిలో ఒకరికి కోవిడ్ పాజిటివ్ బయటపడుతోంది. అంతేకాకుండా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అధిక ఇన్ఫెక్షలు ఒమిక్రాన్తో సంబంధం కలిగి ఉంటున్నాయి. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ మరింత డామినెట్ చేసే అవకాశం ఉన్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కోవిడ్ 19 ఉధృతిపై సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. చదవండి: వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఒమిక్రాన్ కాటుకు బలి! మొదటిసారిగా.. -
పోషకాహార లోపాలు ఇంకానా?
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేని 1992–93లో తొలిసారి చేపట్టిన తరువాత పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. లింగ నిష్పత్తి ఇప్పుడు వెయ్యిమంది పురుషులకు గాను 929కి పెరిగింది. ఈ మార్పు సమాజంలో అనేక సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలకు కారణమవుతుంది. మహిళల్లో అక్షరాస్యుల సంఖ్య, లింగ నిష్పత్తుల్లో పెరుగుదలకు ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ శుభవార్తలైతే.. సాధించుకోవాల్సినవి.. చాలా ఉన్నాయి. పౌష్టికాహారం, తత్సంబంధిత సూచీల్లో వైఫల్యం మనల్ని వెంటాడుతున్న సమస్య. జనాభాలో సగం మందిలో ఐరన్ తాలూకూ శక్తి లోపిస్తోంది. ఆడపిల్లలు, మహిళల్లో రక్తహీనత తాలూకూ ప్రచ్ఛన్న, దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. సామాజిక స్థాయిలో అనారోగ్యానికి, మరణాలకూ రక్తహీనత ఒక కారణమవుతోంది. కాబట్టి దేశంలో అమలవుతున్న పౌష్టికాహార కార్యక్రమాలను తరచూ సమీక్షించడం తక్షణావసరం. ట్వీట్లు, స్మార్ట్ ఫోన్లు, వెబినార్లతో కాకుండా ప్రత్యక్ష కార్యాచరణకు దిగాల్సి ఉంటుంది. భారతదేశం అనేక ఆరోగ్య సూచీల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించి నప్పటికీ మహిళలు, పిల్లల పౌష్టికాహారం విషయంలో మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) ఫ్యాక్ట్ షీట్స్ వెలువడ్డాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటికీ సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ఎన్ఎఫ్హెచ్ఎస్–5కు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఒక్కసారి వీక్షిస్తే మిశ్రమ ఫలి తాలు కనిపిస్తాయి. కొన్ని హర్షణీయమైన అంశాలతోపాటు దిగాలు పడాల్సినవీ దీంట్లో ఉన్నాయి. ఒక శుభవార్త ఏమిటంటే.. భౌగోళిక పోకడల విషయంలో మరీ ముఖ్యంగా లింగ నిష్పత్తిలో కొంత మార్పు కనిపిస్తూండటం! జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేని 1992–93లో మొట్టమొదటిసారి చేపట్టన తరువాత పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. అంతేకాదు. పుట్టుక సమయంలో లింగ నిష్పత్తి ప్రస్తుతం 929 (2015–16 నాటి ఎన్ఎఫ్హెచ్ఎస్–4లో ఇది వెయ్యి మంది పురుషులకు 919గా నమోదై ఉంది)కి చేరుకుంది. సాఫల్యత రేటు 2.2 శాతం నుంచి రెండు శాతానికి పడిపోవడమూ ఆనందం కలిగించే విషయమే. సాఫల్యత రేటు తగ్గుముఖం పడుతున్న రాష్ట్రాల్లో మరింత తగ్గిపోయినట్లుగా కనిపిస్తూంటే.. అధికంగా ఉన్న రాష్ట్రాల్లో పెద్దగా తేడా ఏమీ లేకుండా పోయింది. ఈ తేడా సమాజంలో అనేక సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలకు కారణమవుతుందన్నది తెలిసిందే. పూర్తిస్థాయి నివేదిక అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ వివరాలు విధాన రూపకల్పనలో, సామాజిక స్థాయిలో ఈ అంశాలకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా మహిళ సాధికారత, బాలికల కోసం చేపడుతున్న కార్యక్రమాలు, అవలంబిస్తున్న విధానాలు, ప్రచారాల పుణ్యమా అని ఇప్పుడు ఎంతో కొంత ప్రగతినైతే సాధించాం. మహిళల్లో అక్షరాస్యుల సంఖ్య, లింగ నిష్పత్తుల్లో పెరుగుదల, సాఫల్యత రేటులో తరుగుదలకు ప్రభుత్వ చర్యలకు ప్రత్యక్ష సంబంధం ఉందని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. సాక్షరత విషయంలో ఎంతో అభివృద్ధి నమోదవుతోంది. పదేళ్ల బడిని పూర్తి చేసుకున్న మహిళలు, పురుషుల శాతం కూడా ఎక్కువై 41 శాతం, 50.2 శాతానికి చేరుకుంది. కానీ చేయాల్సింది ఇంకా ఎంతో మిగిలి ఉంది. ఎందుకంటే ఈ అంకెలు మన శ్రామిక వర్గంలో సగానికపైగా తగిన నైపుణ్యం, అర్హతలకు దూరంగా ఉన్నారని చెబుతున్నాయి. వీటిని సాధించడం ద్వారా మాత్రమే అట్టడుగు శ్రామికులు పేదరికం చట్రం నుంచి బటయపడగలరు. ఆసుపత్రుల వంటి సంస్థల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరగడం మాత్రమే కాదు... మాతా శిశు సంక్షేమం, పసిపిల్లల టీకా కార్యక్రమం (ఏటా రెండు శాతం వృద్ధి)లో ప్రగతి సాధించిన ఖ్యాతి ఆరోగ్య రంగానికే దక్కుతుంది. కాన్పుల సమయంలో తల్లీబిడ్డల్లో మరణాలు ఒక శాతం వరకు కూడా తగ్గడం ఐదేళ్లలోపు పిల్లల మరణాల్లోనూ 1.6 శాతం తగ్గుదల నమోదు కావడం విశేషమే. ఈ అంశాల మాటేమిటి? ఇవన్నీ శుభవార్తలైతే.. సాధించుకోవాల్సినవి.. కొంచెం ఆందోళన కలిగించే అంశాలు ఇలా ఉన్నాయి. పౌష్టికాహారం, తత్సంబంధిత సూచీల్లో వైఫల్యం మనల్ని వెంటాడుతున్న సమస్య. 2015–16 నాటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేతో పోలిస్తే దేశం ఇప్పుడు మరింత ఎక్కువ రక్తహీనతను ఎదుర్కొంటోంది. ఆరేళ్ల పసిపిల్లల నుంచి కౌమార వయస్కులైన బాలబాలికలు, గర్భిణులు, 15 – 49 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల్లోనూ రక్తహీనత అధికం అవుతూండటం ఆందోళనకరమే. ఇంకోలా చెప్పాలంటే జనాభాలో సగంమందిలో ఐరన్ తాలూకూ శక్తి లోపిస్తోంది. ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలనుకుంటున్న మన ఆశయానికి ఇదేమంత మంచి విషయం కాదు. రక్తహీనత తాలూకూ ప్రచ్ఛన్న, దుష్ప్రభావాలు అన్నీ ఇన్నీ కావు. అన్ని వర్గాల్లోనూ కనిపిస్తూంటాయి. శారీరక, మానసిక అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా పిల్లలు, కౌమారుల్లో ఉండాల్సిన చురుకుదనాన్నీ తగ్గించేస్తుంది. ఆటలు, నేర్చుకునే శక్తినీ హరిస్తుంది. తద్వారా వారు సమర్థమైన ఉత్పాదకత కలిగిన పౌరులుగా ఎదగడం వీలుపడదు. పనిచేసే సామర్థ్యం తగ్గడం, తొందరగా అలసిపోవడం వల్ల ఉత్పత్తి, ఆదాయం రెండూ తగ్గిపోతాయి. అంతేకాదు.. కౌమార వయస్కులైన బాలికల్లో దాదాపు 59.1 శాతం మందిలోని రక్తహీనత కాబోయే తల్లులపై ప్రభావం చూపుతోంది. కాన్పు సమయంలో మాతా శిశువుల మరణానికి ప్రధాన కారణంగా మారుతోంది. సామాజిక స్థాయిలో అనారోగ్యానికి, మరణాలకూ రక్తహీనత ఒక కారణమవుతోంది. గతంతో పోలిస్తే కొంత మెరుగుదల ఉన్నప్పటికీ గర్భిణుల్లో ఐఎఫ్ఏ ట్యాబ్లెట్ల వాడకం ఇప్పటికీ తక్కువగా ఉంది. (41 శాతం మంది వంద రోజులపాటు తీసుకోగా, 26 శాతం మంది 180 కంటే ఎక్కువ రోజులు తీసుకున్నారు). ఈ విషయంలో ఎందుకు విఫలమయ్యామో పూర్తిస్థాయి నివేదిక అందిన తరువాత స్పష్టత వస్తుంది. ఇంకో ఆందోళనకరమైన విషయం అన్ని వయసుల వారిలోనూ పౌష్టికతను సూచించే అంశాల్లో పెరుగుదల అతితక్కువగా (ఏడాదికి 0.5 శాతం) ఉండటం. ఎన్ఎఫ్హెచ్ఎస్–4, ఎన్ఎఫ్హెచ్ఎస్–5ల మధ్య అవసరానికంటే ఓ మోస్తరు బరువు తక్కువన్న ఐదేళ్లలోపు పిల్లల శాతం 35.8 నుంచి 32.1 శాతానికి తగ్గింది. ఎదుగుదల తగ్గిన పిల్లల శాతం కూడా 38.4 నుంచి 35.5 శాతానికి మాత్రమే తక్కువైంది. సామర్థ్యానికి తగ్గ ఎదుగుదల ఓ మోస్తరుగా మాత్రమే లేని వారు 21 శాతం నుంచి 19.3 శాతానికి తగ్గారు. ఇదే సమయంలో సామర్థ్యానికి తగ్గ ఎదుగుల లేమి తీవ్రంగా ఉన్న వారు 7.5 నుంచి 7.7 శాతానికి పెరగడం గమనార్హం. రెండేళ్ల లోపు వయసు వారు తగిన ఆహారాన్ని తీసుకోని వారు 11.3 శాతం వరకూ ఉన్నారు. దీని వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయన్నది నిర్వివాద అంశం. గత ఎన్ఎఫ్హెచ్ఎస్ సమయంలో ఇది 9.6 శాతం మాత్రమే. ప్రాథమిక స్థాయిలో జరుగుతున్న ఈ పౌష్టికాహర లేమిని విధానకర్తలు, నిపుణులు... పౌష్టికాహర రంగంలో పనిచేస్తున్న వారు విస్మరిస్తూండటం ఎంతైనా ఆందోళన కలిగించే అంశం. ఈ లోపాన్ని సరిదిద్దకుండా పౌష్టికాహార సూచీల్లో చెప్పుకోదగ్గ మార్పులు అసాధ్యమనే చెప్పాలి. అందనంత ఎత్తులో ఇరుగుపొరుగు... కుటుంబ ఆరోగ్యం విషయంలో ఇరుగు పొరుగు దేశాలు మనకు అందనంత ఎత్తులో ఉన్నాయి. చైనాలో అటు పురుషులైనా, ఇటు మహిళలైనా వంద శాతం అక్షరాస్యత కలిగి ఉన్నారు. రక్తహీనత, 15–59 మధ్య వయస్కులైన మహిళల్లో 16 శాతం మాత్రమే ఉండగా.. ఎదుగుదల లోపం ఐదు శాతం మందిలో, సామర్థ్యానికి తగ్గ ఎదుగుదల లేదు. ఇటీవలి వరకూ ఎంతో వెనుబడి ఉన్న బంగ్లాదేశ్ కూడా వేగంగా పుంజుకుని.. మనల్ని మించిపోయింది. దేశంలో అమలవుతున్న పౌష్టికాహార కార్యక్రమాలను తరచూ సమీక్షించడం తక్షణావసరం. ఆంబులెన్స్ సర్వీసులు, సంస్థాగత కాన్పులు, కౌమార వయస్కుల్లో రక్తహీనత లోపాలను అధిగమిం చేందుకు 1997లో రీప్రొడక్టివ్ అండ్ ఛైల్డ్ హెల్త్ కార్యక్రమంలో ఎలాగైతే లోటుపాట్లను సరిదిద్దే ప్రయత్నం జరిగిందో అలాగే ఇప్పుడూ పౌష్టికాహార సూచీలను మెరుగుపరిచే ప్రయత్నం జరగాలి. సమగ్ర శిశు సంక్షేమ సేవల (ఐసీడీఎస్) కార్యక్రమాలను సమీక్షించుకుని ఆచరణ సాధ్యమైన ప్రణాళిక ద్వారా మంచి ఫలితాలను అందించేలా కృషి చేయాలి. ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలు తీసుకోవడంతో సమస్య పరిష్కారం సాధ్యం కాదు. ట్వీట్లు, స్మార్ట్ ఫోన్లు, వెబినార్లతో కాకుండా ప్రత్యక్ష కార్యచరణకు దిగాల్సి ఉంటుంది.! – వీణా రావు, భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి -
Omicron Variant: ప్రస్తుతానికి.. ఒమిక్రాన్తో ముప్పు లేదు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ రూపాంతరితం దేశంలోకి కూడా ప్రవేశించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ వైరస్తో ఇక థర్డ్ వేవ్ తప్పదేమోనన్న భయాలు పెరిగిపోతున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వేరియెంట్తో ప్రస్తుతానికి మాత్రం ముప్పు లేదని చెబుతోంది. వ్యాక్సిన్ వేసుకొని, కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తే సరిపోతుందని అంటోంది. కొత్త వేరియెంట్తో ప్రజల్లో వచ్చే సందేహాలకు సమాధానాలిచ్చే ప్రయత్నం కేంద్ర ఆరోగ్య శాఖ చేసింది. అవేంటో చూద్దాం. థర్డ్ వేవ్ వస్తుందా ? ఒమిక్రాన్ కేసులు కొన్ని రెట్ల వేగంతో పెరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఈ వేరియెంట్లో తీవ్ర లక్షణాలేమీ కనిపించలేదు. ఇప్పటికే భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతూ ఉండడం, డెల్టా వైరస్ కారణంగా యాంటీ బాడీలు అత్యధికుల్లో వృద్ధి చెందాయని సెరో సర్వేల్లో తేలడంతో వ్యాధి తీవ్రత తక్కువగానే ఉండే అవకాశాలే ఉన్నాయి. అయితే ఈ విషయం ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనాకి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ పాటించాలి. మాస్కు కచ్చితంగా పెట్టుకోవాలి. ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకోకపోతే తప్పనిసరిగా వేయించుకోవాలి. రద్దీ ప్రదేశాలకు వెళ్లడం మానాలి. గాలి , వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవాలి. ఒమిక్రాన్పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పని చేస్తాయా ? ప్రస్తుతం లభిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియెంట్ని అడ్డుకోలేవని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవు. వైరస్ కొమ్ము జన్యువుల్లో చోటు చేసుకున్న కొన్ని మార్పుల కారణంగా టీకా సామర్థ్యం తగ్గే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే వ్యాక్సిన్లు వేసుకున్న వారు, కరోనా సోకిన వారిలో ఏర్పడిన యాంటీబాడీలతో కణజాలంలో ఏర్పడే రోగనిరోధక శక్తి ఇంకా కొనసాగుతుంది. అయితే వ్యాధి తీవ్రతని తగ్గించడానికి తప్పనిసరిగా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఒమిక్రాన్ ఎంత ఆందోళనకరం ? వైరస్లో వస్తున్న మార్పులు, ఎంత వేగంతో వ్యాప్తి చెందుతుంది, రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడం, రీ ఇన్ఫెక్షన్లు వంటివాటిపై అంచనాలన్నింటినీ క్రోడీకరించి ఈ వైరస్ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా డబ్ల్యూహెచ్వో గుర్తించింది. కరోనా వైరస్ ఉన్నంతకాలం జన్యుమార్పులు, కొత్త రూపాంతారితాలు పుట్టుకురావడం సాధారణంగా జరిగేదే. సాధారణంగా వేరియెంట్లలో ఎక్కువ శాతం ప్రమాదకరం కాదు. ఎక్కువజన్యు మార్పులు జరిగిన వైరస్ బలహీన పడుతుంది. ఒమిక్రాన్ ఆ కోవలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్ వైరస్ 12 దేశాలను చుట్టేసింది!!
Omicron Variant Confirmed in 12 Countries: కొన్ని రోజులు క్రితం దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వైరస్ అప్పుడే పలు దేశాల్లో విరుచకుపడటానికి సన్నహాలు చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్లో డెల్టా వేరియంట్తో ప్రపంచదేశాలన్ని అతలాకుతలం అయ్యిపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది అనుకుంటున్న సమయంలో మళ్లీ ఈ కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలన్నింటికి దడ పుట్టించేలా విరుచకుపడటానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ కరోనా వైరస్ కొత్త వేరియంట్ గురించి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించని కొద్ది రోజుల్లోనే జపాన్, ఐరోపా, యునైటెడ్ కింగ్డమ్తో సహా సుమారు 12 దేశాల్లో ఈ కొత్త వేరియంట్కి సంబంధించిన తొలి కేసులు నమోదైనట్టు ధృవీకరించడం గమనార్హం. తాజాగా ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన నైజీరియా దక్షిణాఫ్రికా నుండి వచ్చిన ముగ్గురు ప్రయాణీకులలో కొత్త కోవిడ్ -19 వేరియంట్ తొలి కేసులను గుర్తించినట్లు ధృవీకరించింది. (చదవండి: టిక్టాక్ పిచ్చి.. డాక్టర్ వికృత చేష్టలు.. ఆపరేషన్ మధ్యలోనే వదిలేసి..) అయితే ఈ కరోనా మహమ్మారీ కారణంగా అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశాలైన అమెరికా, భారత్, చైనాలో ఇంతవరకు కొత్త వేరియంట్కి సంబంధించిన కేసులు నమోదు కాలేదు. ఈ మేరకు భారత్ కొత్త వేరియంట్ వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా ఆంక్షలు కఠినతరం చేయడమే కాకా ముందుగానే పలు టెస్ట్లు నిర్వహించి హోం క్యారంటైన్లో ఉంటే గానీ దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వటం లేదు. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్లోని ఒక సీనియయర్ వైద్యుడు ఈ ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే దేశంలోకి వచ్చే ఉండవచ్చని, ఇది డెల్లా వేరియంట్ కంటే వేగంతగా వ్యాప్తి చెందే అటువ్యాధి అని అన్నారు. పైగా ఇది చాలా ప్రాణాంతకమైనదని వ్యాక్సిన్లు ఎంతవరకు రక్షణగా ఉంటాయి అనే అంశంపై పరిశోధనలను వేగవంతం చేయాలని చెప్పారు. అంతేకాదు డెల్టా వేరియంట్ వల్ల కలిగే నష్టాన్ని అరికట్టలేని ప్రస్తుత వైద్య మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్న భారత్కి ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ మేరకు దక్షిణాఫ్రికాలోని వైద్యుల ఈ ఒమిక్రాన్ ప్రమాదకరమైన వైరస్ కావచ్చు కానీ డెల్టా కంటే తేలికపాటి లక్షణాలను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకోని వారిపై దీని ప్రభావం ఎంత వరకు ఉంటుందో అనే అంశం పై నిపుణులు కచ్చితమైన అవగాహనకు రావడానికి నాలుగు వారాలు పట్టవచ్చని దక్షిణాఫ్రికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కమ్యూనికేబుల్ డిసీజెస్ యాక్టింగ్ హెడ్ అడ్రియన్ ప్యూరెన్ అన్నారు. ఏదీఏమైన డబ్ల్యూహెచ్ఓకి గతేడాది అల్పా వేరియంట్ని ప్రమాదకరమైన వేరియంట్గా గుర్తించడానికి కొద్ది నెలల సమయం పట్టింది. కానీ ఈ ఒమిక్రాన్ వేరియంట్ని కొన్ని రోజుల వ్యవధిలోనే ప్రపంచ దేశాలకు అత్యంత ప్రమాదకరమైన ముప్పుగా డబ్ల్యూహెచ్ఓ గుర్తించడం గమనార్హం. (చదవండి: జపాన్లో తొలి ఒమిక్రాన్ కేసు..!!) -
ఒమిక్రాన్ జాడ ఇలా తెలుస్తుంది!
న్యూఢిల్లీ: తాజాగా ప్రపంచవ్యాప్తంగా అందరి ఆందోళనలకు కేంద్ర బిందువుగా మారిన ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్.. ఆర్టీ–పీసీఆర్, ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల నుంచి తప్పించుకోలేదని, టెస్టుల్లో దాని జాడ ఖచ్చితంగా తెలుస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్రసర్కార్ సూచించింది. రాష్ట్రాలు/యూటీల ఉన్నతాధికారులతో మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వర్చువల్ పద్ధతిలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్ తదితరులు పాల్గొన్నారు. ‘ వైరస్ నిర్ధారణ పరీక్షల నుంచి ఒమిక్రాన్ తప్పించుకోలేదు. టెస్టుల్లో దాని జాడ ఖచ్చితంగా తెలుస్తుంది. పరీక్షల సంఖ్యను పెంచడం ద్వారా ఈ రకం వేరియంట్ వ్యాప్తిని ముందుగానే అరికట్టేందుకు ఆస్కారముంది’ అని బలరాం అన్నారు. ఫలితాలొచ్చేదాకా ఎయిర్పోర్ట్లోనే.. బ్రిటన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బొట్సావానా, చైనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, సింగపూర్, హాంకాంగ్, ఇజ్రాయెల్ దేశాల నుంచి భారత్కు ప్రయాణికులు వస్తే వారికి ఎయిర్పోర్టులోనే ఆర్టీ–పీసీఆర్ టెస్ట్ చేస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ‘ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చేదాకా ఆయా ప్రయాణికులంతా ఎయిర్పోర్టులోనే వేచిఉండాలి. ఈ నిబంధన డిసెంబర్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానుంది. ఆర్టీ–పీసీఆర్ టెస్ట్కు, టెస్ట్ రిజల్ట్ వచ్చే దాకా ఎయిర్పోర్ట్లో ఉన్నపుడు ఆహారం కోసం మొత్తంగా రూ.1,700 ఖర్చుకానుంది’ అని ఆరోగ్య శాఖ తెలిపింది. ఒమిక్రాన్తో ‘హై రిస్కే’: డబ్ల్యూహెచ్వో ఒమిక్రాన్పై ఇప్పటిదాకా చేసిన పరిశోధనలు, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ వేరియంట్ను ‘హై రిస్క్’ కేటగిరీలోనే కొనసాగిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో)పునరుద్ఘాటించింది. రానున్న కొద్ది రోజుల్లో ఇది తీవ్ర పరిణామా లకు దారి తీసే అవకాశాలను కొట్టిపారేయలేమని డబ్ల్యూహెచ్వో వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రతను లెక్కిస్తే అది భారీస్థాయిలోనే ఉండొచ్చని సంస్థ రఅభిప్రాయపడింది. జపాన్లో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. -
ఒమిక్రాన్ నంబర్ 9, ఇంతకుముందున్న 8 వేరియంట్లు ఇవే!
జెనీవా: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మరో కొత్త రూపం సంతరించుకుంది. ‘ఒమిక్రాన్’గా పిలుస్తున్న ఈ వేరియంట్ గతంలో వచ్చినవాటికన్నా.. వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటికే ఐదు దేశాల్లో ఈ కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటివరకు ఎన్ని కోవిడ్ వేరియంట్లకు పేర్లు పెంట్టిందో తెలుసుకుందాం. (చదవండి: పోలీస్ ఇన్స్పెక్టర్ సహా ఐదుగురిని చంపేశాడు!) ఆల్ఫా: యూకేలోని కెంట్లో తొలిసారిగా 2020 సెప్టెంబర్లో గుర్తించారు. బ్రిటన్లో సెకండ్వేవ్ ఈ వేరియెంట్తోనే విజృంభించింది. బీటా: దక్షిణాఫ్రికాలో 2020 మేలో గుర్తించారు. ప్రపంచ దేశాల్లో 50% కేసుల్ని ఈ వేరియెంట్ పెంచింది. గామా: బ్రెజిల్లో నవంబర్ 2020లో గుర్తించారు. దక్షిణ అమెరికాలో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది డెల్టా: భారత్లో అక్టోబర్ 2020లో ఈ వైరస్ మొదటిసారి వెలుగులోకి వచ్చింది. ఆసియా, యూరప్లో విజృంభించింది. ఇప్పటివరకు వచ్చిన వేరియెంట్లలో ఇదే అత్యంత వేగంగా విస్తరించింది. ఆల్ఫా కంటే 60% వేగంగా వ్యాప్తి చెందింది. ఈటా: డిసెంబర్ 2020లో యూకేలో తొలిసారిగా బయటపడిన ఈ రకం 72 దేశాలకు విస్తరించింది. లోటా: న్యూయార్క్లో 2020లో బయటపడిన ఈ వేరియెంట్ పెద్దగా ప్రభావం చూపించలేదు కప్పా: భారత్లో అక్టోబర్ 2020లో వెలుగు చూసిన కప్పా వేరియెంట్ కేసులు 55 దేశాల్లో వెలుగులోకి వచ్చాయి లాంబ్డా: డిసెంబర్ 2020లో పెరూలో తొలిసారిగా వెలుగు చూసిన ఈ వేరియెంట్ మూడు నెలల్లోనే 41 దేశాలకు విస్తరించింది. (చదవండి: యువకుడితో వివాహేతర సంబంధం.. వారిని కరెంట్ స్తంభానికి కట్టేసి..) -
ప్రపంచాన్ని వణికిస్తున్న ‘ఒమిక్రాన్’.. ఇంతకూ ఆ పేరే ఎందుకు?
జెనీవా: కరోనా వైరస్లో కొత్త రకాలకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీకు వర్ణమాలలోని అక్షరాల పేర్లనే పెడుతూ వస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా అంటూ వరసగా పేర్లు పెట్టుకుంటూ వస్తున్న డబ్ల్యూహెచ్ఓ హఠాత్తుగా కొన్ని అక్షరాలను వదిలేసి ఒమిక్రాన్ని ఎంపిక చేసుకుంది. వాస్తవానికి లాంబ్డా తర్వాత ‘‘న్యూ’’ అక్షరం రావాలి. ఆ తర్వాత గ్రీకు వర్ణమాల ప్రకారం ‘‘గీఐ’ వస్తుంది. న్యూ అంటే ఆంగ్లంలో కొత్త అనే అర్థం ఉంది కాబట్టి గందరగోళానికి తావు లేకుండా దానిని విడిచిపెడితే, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పేరులో ‘XI’ (షి జిన్పింగ్) ఉండడంతో దానిని కూడా డబ్ల్యూహెచ్ఓ విడిచిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. వీటిని వదిలేసి గ్రీకు వర్ణమాలలోని పదిహేనో అక్షరమైన ‘ఒమిక్రాన్’గా కొత్త వేరియెంట్కు నామకరణం చేసింది. (చదవండి: ఎవడి డప్పు వాడు కొట్టుకున్నా..వందల కోట్లు కట్టాల్సిందే…!) -
100 కోట్ల టీకా డోసుల పంపిణీ
-
జర భద్రం! మీ ఫోన్ హ్యాక్ అయ్యిందేమో.. ఇలా చెక్ చేయండి
కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపిన గణాంకాల ప్రకారం..కోవిడ్-19 వల్ల 600 శాతం సైబర్ క్రైమ్ పెరిగినట్లు తెలిపింది. ముఖ్యంగా కంప్యూటర్ వైరస్, ట్రోజన్స్, స్పైవేర్, రాన్సమ్ వేర్, యాడ్వేర్, వార్మ్స్, ఫైల్ లెస్ మాల్వేర్ల సాయంతో సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా హైబ్రిడ్ దాడులకు పాల్పడేందుకు ప్రత్యేకంగా మెషిన్ లెర్నింగ్ను ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. అందులోనూ మనం తరుచూ వినియోగించే స్మార్ట్ ఫోన్లపై వైరస్ దాడులు పెరిగిపోతున్నట్లు హెచ్చరించింది. వైరస్ దాడుల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి? సైబర్ నేరస్తులు స్మార్ట్ ఫోన్లు, లేదంటే ఐఫోన్లపై ప్రత్యేకంగా తయారు చేసిన వైరస్లను మెయిల్స్ సాయంతో లేదంటే ఆఫర్లు ఇస్తామంటూ పాప్ ఆప్ యాడ్స్ను ఫోన్కి సెండ్ చేస్తుంటారు. ఆ సమయంలో ఫోన్ వినియోగదారులు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఏదైనా యాప్స్ డౌన్ లోడ్ చేసుకునే ముందే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మంచిదా? లేదంటే దాడులకు పాల్పడే అవకాశం ఉందా అని తెలుసుకోవాలి. అందుకోసం మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకునే సమయంలో సంబంధిత యాప్ వివరాలు, రివ్యూలు చెక్ చేయాలి. వైరస్ దాడి చేసినట్లు ఎలా గుర్తించాలి? ♦మీ స్మార్ట్ఫోన్లో వైరస్లను గుర్తించే సులభమైన మార్గం ఇదే. మీరు ఒకవేళ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే..వెంటనే కట్ అవ్వడం, మీ స్మార్ట్ఫోన్కు గుర్తు తెలియని టెక్స్ట్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ రావడం, మీ అనుమతి లేకుండా యాప్స్ను కొనుగోలు చేయడం. ♦ కంటిన్యూగా మీ ఫోన్ కు యాడ్స్ వస్తున్నా యాడ్ వేర్ మీ ఫోన్ను అటాక్ చేసినట్లు గుర్తించాలి. ♦ మాల్వేర్, ట్రోజన్ మీ స్మార్ట్ ఫోన్ని ఉపయోగించి స్పామ్ టెక్స్ట్ మెసేజ్లను మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నవారికి సెండ్ చేస్తుంటాయి. దీని అర్ధం మీ కాంటాక్ట్ ఫోల్డర్లోకి గుర్తు తెలియని వైరస్ దాడి చేసినట్లు గుర్తించాలి. ♦ మీ స్మార్ట్ఫోన్ పనితీరు బాగా తగ్గిపోతుంది. ♦వైరస్లు, మాల్వేర్లు మీ స్మార్ట్ఫోన్లో కొత్త యాప్లను కూడా డౌన్లోడ్ చేస్తుంటాయి. ♦ ఈ యాప్లు, మెసేజ్ల వల్ల మీ డేటా అంతా అయిపోయింది. ♦ బ్యాటరీ లైఫ్ టైమ్ తగ్గిపోతుంటాయి. పై తరహా ఇబ్బందులు ఎదురవుతుంటే మీ ఫోన్లో వైరస్ దాడి చేసినట్లేనని గుర్తించాలి. ఒకవేళ అదే జరిగితే మీ ఫోన్లో ఉన్న పర్సనల్ డేటా కాపీ చేసుకొని..వైరస్ తొలగించే ప్రయత్నం చేయండి. ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండండి. చదవండి: మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్, ఫీచర్లు మాత్రం అదుర్స్ -
కరోనా పూర్తి నిర్మూలన అసాధ్యం!
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి సుదీర్ఘకాలం కొనసాగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ అధికారి పూనమ్ కేత్రపాల్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఒక సమూహంలో టీకాలు, గత ఇన్ఫెక్షన్ల ఆధారంగా వృద్ధి చెందే ఇమ్యూనిటీ స్థాయిలను(హెర్డ్ ఇమ్యూనిటీ లేదా సమూహ రోగనిరోధకత) బట్టి దీర్ఘకాలంలో కరోనా ఎండమిక్(ఒకప్రాంతానికి పరిమితం అయ్యేవ్యాధి)గా మారే అవకాశాలుంటాయన్నారు. వైరస్ అదుపులో మనిషి ఉండకుండా, మనిషి అదుపులో వైరస్ ఉండే పరిస్థితిన సాధించాలని సంస్థ దక్షిణాసియా డైరెక్టర్గా పనిచేస్తున్న సింగ్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించిన ప్రాంతాల ప్రజలపై కరోనా ప్రభావం స్వల్పంగా ఉంటుందని అంచనా వేశారు. కోవాక్సిన్కు ఈయూఏ(అత్యవసర అనుమతులు) ఇవ్వడంపై మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ బయోటెక్ సమర్పించిన గణాంకాల మదింపు జరుగుతోందని, త్వరలో ఈ ప్రక్రియ పూర్తికావచ్చని తెలిపారు. చదవండి: (పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్: తెలిసినవారి పేర్లు కూడా మర్చిపోతున్నారా?) దేశాలన్నింటిలో కరోనా మరణాలకు అధికశాతం కారణం టీకా తీసుకోకపోవడమేనని, ఈ సమయంలో బూస్టర్డోసులిస్తే అసలు టీకా తీసుకోనివారికి సరఫరా కష్టమవుతుందని వివరించారు. అందుకే బూస్టర్ డోసులపై సంస్థ ఈ ఏడాది చివరివరకు నిషేధం విధించిందని చెప్పారు. అన్ని దేశాల్లో కనీసం 40 శాతం ప్రజానీకానికి టీకా అందేలా చూడాల్సిఉందన్నారు. అందరూ సురక్షితమయ్యేవరకు ఏ ఒక్కరూ సురక్షితం కాదని గుర్తు చేశారు. సమయాన్ని బట్టి కరోనా టీకా ప్రభావం తగ్గుతుందనేందుకు ప్రస్తుతానికి ఎలాంటి స్థిరమైన ఆధారాల్లేవని చెప్పారు. బూస్టర్ డోసులకు తాము వ్యతిరేకం కాదని, శాస్త్రీయ నిరూపణలను బట్టి బూస్టర్పై సిఫార్సులుంటాయని ఆమె చెప్పారు. పూర్తి నిర్మూలన అసాధ్యం కరోనాను ప్రపంచం నుంచి పూర్తిగా తరిమివేయడం సాధ్యం కాకపోవచ్చని పూనమ్ అభిప్రాయపడ్డారు. అయితే కాలక్రమేణా దాని ప్రభావాన్ని తగ్గించవచ్చని, తద్వారా మరణాలను, ఆస్పత్రిపాలవడాన్ని, ఇతర నష్టాలను కనిష్టాలకు తీసుకురావచ్చని చెప్పారు. ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా వైరస్ నుంచి రక్షణ బలహీనంగానే ఉందని, చాలామంది ప్రజలకు వైరస్ సోకే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అందుకే టీకా తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం, గాలాడని ప్రాంతాల్లో గుమికూడడాన్ని తగ్గించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం తదితర చర్యలు కొనసాగించాలని గట్టిగా సూచించారు. థర్డ్ వేవ్ రాకడ, దాని బలం.. మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా సరైన చర్యలు పాటిస్తే మరో వేవ్ రాకుండా చూసుకోవచ్చన్నారు. అనేక దేశాల్లో టీకా లభించని ఈ తరుణంలో తిరిగి కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేయాలన్న భారత్ నిర్ణయాన్ని స్వాగతించారు. కరోనా కారణంగా దేశాలు తమ ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరిచే అవకాశం లభించిందని ఆమె చెప్పారు. ఆరోగ్య వ్యవస్థపై ఇలాగే పెట్టుబడులు పెరగాలని అభిలషించారు. బలమైన ఆరోగ్య వ్యవస్థలుంటే ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కోగలమని ప్రపంచ దేశాలు గుర్తించాలని సింగ్ చెప్పారు. (చదవండి: Pakistan: ఫ్యూన్ పోస్ట్ కోసం ఏకంగా 15 లక్షల మంది అప్లై చేశారు) -
కొవాగ్జిన్.. ఇంకెంత కాలం?
కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకుని.. బయటి దేశాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్లకు ఇదొక చేదు వార్త. కొవాగ్జిన్కు డబ్ల్యూహెచ్వో అనుమతుల ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుస్తోంది. పూర్తి స్వదేశీ కొవిడ్-19 వ్యాక్సిన్ ‘కొవాగ్జిన్’.. డబ్ల్యూహెచ్వో ఈయూఏ లిస్ట్లో లేదు. ఈ తరుణంలో డబ్ల్యూహెచ్వో క్లియరెన్స్ తప్పనిసరిగా మారింది. రేపో, ఎల్లుండో అనే అంచనాల నడుమ.. ఇప్పుడు ఆ క్లియరెన్స్ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ►ఫేజ్ 3 ట్రయల్స్లో కొవాగ్జిన్ వ్యాక్సిన్ 77.8 శాతం సమర్థవంతంగా ప్రభావం చూపెట్టిందని భారత్ బయోటెక్ ప్రకటించుకుంది. ►అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO).. మాత్రం కొవాగ్జిన్కు ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు ►హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ ఇప్పటికే క్లియరెన్స్ సంబంధిత దరఖాస్తు పత్రాలను డబ్ల్యూహెచ్వోకి సమర్పించింది ►కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. వీలైనంత త్వరగా వ్యాక్సిన్కు గ్లోబల్ బాడీ(డబ్ల్యూహెచ్వో) క్లియరెన్స్ దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ వస్తోంది. ►అయితే నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ చైర్పర్సన్ డాక్టర్ వీకే పాల్ మాత్రం ఈ నెలాఖరుకల్లా క్లియరెన్స్ వస్తుందని గతంలో ప్రకటించారు. ►కానీ, టెక్నికల్ సంబంధిత సమస్యలతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ►ఈ ఆలస్యం.. విదేశాలకు ప్రయాణించే భారతీయులకు, ముఖ్యంగా విద్యార్థులకు ఇబ్బందికరంగా మారనుంది. ► WHO స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఇమ్యూనైజేషన్ (సేజ్) అక్టోబర్ 6న జరగబోయే భేటీలో కూడా కొవాగ్జిన్ క్లియరెన్స్పై స్పష్టత రాకపోవచ్చనే అంటున్నారు. ►భారత్లో కొవాగ్జిన్తో పాటు కొవిషీల్డ్ను ఈ ఏడాది జనవరి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా జనాభాకు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ►ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు, ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ సంయుక్తంగా భారత్కు చెందిన సీరమ్తో ఒప్పందం ద్వారా కొవిషీల్డ్ను తయారు చేసి అందిస్తున్నాయి. ►కొవిషీల్డ్ వ్యాక్సిన్కు డబ్ల్యూహెచ్వో అప్రూవల్(సర్టిఫికెట్ వెరిఫై ప్రక్రియ ద్వారా కొన్ని దేశాల్లోకి అనుమతిస్తున్నారు) ఉంది. ►అంతర్జాతీయ వైద్య విభాగంగా భావించే డబ్ల్యూహెచ్వో ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ లిస్ట్లో ఇప్పటిదాకా కేవలం.. ఫైజర్-బయోఎన్టెక్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, సినోఫార్మ్ వ్యాక్సిన్లకు మాత్రమే చోటు దక్కింది. చదవండి: ఒక అడుగు ముందుకు.. రెండు వెనక్కు! -
మీకు స్మోకింగ్ అలవాటుందా?.. అయితే, ఈ సమస్యలు ఎక్కువే..
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ లేకుండా రోజు గడవటం కష్టమంటే అతిశయోక్తి కాదేమో! మన జీవన విధానంలో అవి అంతగా కలిసిపోయాయి మరి! అయితే దాని వెన్నంటే కంటి సమస్యలు కూడా మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. కళ్లు పొడిబారడం, శుక్లాలు, దృష్టిలోపం తలెత్తడం వంటి సమస్యలెన్నో మనలో చాలామంది ఎదుర్కొంటున్నారు. యేటా దాదాపుగా 1 బిలియన్ మంది తాత్కాలిక లేదా దీర్ఘకాలిక కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజా నివేధికలో వెల్లడించింది. అయితే పోషకాహారం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు నూట్రీషనిస్ట్ రూపాలి దత్త సూచించిన కొన్ని చిట్కాలు మీకోసం.. విటమిన్లు అధికంగా ఉండే అహారాన్ని తినాలి శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమన్లు అందించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని మీకు తెలుసా? అమెరికన్ ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ ప్రకారం ‘ఎ, సి, ఇ’ విటమిన్లు శుక్లాలు, మాక్యులర్ డీజెనరేషన్ సహా కొన్ని కంటిసంబంధింత సమస్యలు నివారించడంలో కీలకంగా వ్యవహరిస్తాయని పేర్కొంది. అందువల్లనే నిపుణులు ఈ విటమిన్లు అధికంగ ఉండే సిట్రిక్ ఫలాలు, డ్రై నట్స్, విత్తనాలు, చేపలు.. వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోమని సూచిస్తున్నారు. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు ఆకుకూరల్లో, కూరగాయల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు నిండుగా ఉంటాయి. అకాడమీ ఆఫ్ నూట్రీషన్ అండ్ డైటిటిక్స్ అధ్యయనాల ప్రకారం మన ఆహారంలో భాగంగా ఆకుకూరలు తీసుకున్నట్లయితే యూవీ రేస్, రేడియేషన్ నుంచి కంటిచూపును కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుందని తేలింది. మరింత నీరు తాగాలి నీటి ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా గుర్తుచేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే శరీరానికి సరిపడినంత నీరు తాగడం వల్ల కలిగే లాభాలు మనందరికీ తెలుసు. డీహైడ్రేషన్ నుంచి కాపాడటమేకాకుండా, కంటికి హానిచేసే ఇతర కారకాల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. నియంత్రణలో శరీర బరువు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ చెందిన ఆప్తాల్మాలజీ విభాగంలో జరిపిన బీవర్ డ్యామ్ ఐ అధ్యయనాల ప్రకారం కంటి ఆరోగ్యంపై మాడిసన్, స్థూలకాయం ప్రభావం కూడా ఉంటుందని వెల్లడించింది. అధిక బరువు కారణంగా కంటిలోపలి భాగం నుంచి ఒత్తిడి పెరుగుతుందని తెల్పింది. కాబట్టి శరీర బరువును అదుపులో ఉంచే ఆహారపు అలవాట్లవల్ల ఆరోగ్యంగా జీవించవచ్చు. ధూమపానానికి దూరంగా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనాల ప్రకారం స్మోకింగ్ అలవాటు కంటి చూపులో మార్పులకు కారణం అవుతుందని వెల్లడించింది. పొగతాగని వారితో పోల్చితే స్మోకింగ్ చేసేవారిలో కాంటరాక్ట్ వంటి కంటి సమస్యలు రెండు, మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ సూచలను పాటిస్తే మీ కంటి చూపు జీవితకాలంపాటు పదిలంగా ఉంచుకోవచ్చని ప్రముఖ నూట్రీషనిస్ట్ రూపాలి దత్త సూచిస్తున్నారు. చదవండి: Dry Throat: నోటి దుర్వాసన, దగ్గు, పుండ్ల సమస్యా.. ఇలా చేస్తే.. -
ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచించి ఉంటేనా..
World Suicide Prevention Day 2021: మనిషికి జంతువుతో పోలిస్తే ఉన్న అడ్వాంటేజ్.. మనుగడ పోరాటంలో తెలివితేటల్ని, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోగలగడం. నోరు లేని మూగజీవాలు ఎలాగోలా తమ బతుకుల్ని నెట్టుకొస్తుంటే.. అన్నీ ఉన్నా సంఘజీవి మనిషి మాత్రం పిరికితనంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నాడు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలెన్నో బతుకుల్ని బుగ్గిపాలు చేస్తుంటే.. అందులో ఒకటైన ఆత్మహత్య మనిషిని మానసికంగా కుంగదీసి మరీ చంపేస్తోంది. ఒకవేళ ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే.. నెగెటివ్ అంశాలెన్నో పాజిటివ్గా మారిపోవడమే కాదు.. మరో మలుపు తిరిగి జీవితంలో అద్భుతాలు జరగొచ్చేమో కదా! ► సమస్యలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, ప్రాణం పోతే తిరిగి రాదు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. ►ఆత్మహత్యలను నివారించేందుకు, అది ఎంత పెద్ద నేరమో అవగాహన కల్పించేందుకు ప్రతీ ఏటా ఒక దినం నిర్వహిస్తున్నారు. ►ప్రతీ ఏటా ఆత్మహత్యా నివారణ దినోత్సవం సెప్టెంబర్ 10న జరుపుతున్నారు. ►ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా? ‘బతకాలనే ఆశను అవతలివాళ్లలో సృష్టించడం.. అదీ చేతల ద్వారా’. ►కరోనా వల్ల మనిషిలో మానసికంగా కుంగుబాటు ఎక్కువ అయిపోయింది. ►ఉద్యోగాలు కోల్పోవడం, ఉపాధి అవకాశాలు పోగొట్టుకోవడం, అయినవాళ్లను దూరం చేసుకోవడం, సోషల్ గ్యాదరింగ్లు లేకపోవడం వల్ల మనిషి.. నిరాశానిస్పృహలోకి నెట్టేస్తున్నాయి. క్షణికావేశంలో అయినవాళ్లకు, అభిమానించేవాళ్లకు దూరంగా వెళ్లిపోతున్నారు. ►కిందటి ఏడాది బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ హఠాన్మరణం తర్వాత దేశవ్యాప్తంగా డిప్రెషన్-సూసైడ్ల గురించి విస్తృత చర్చ నడిచింది. అంతకు ముందు ఆత్మహత్యలు చేసుకున్న సెలబ్రిటీలతో పాటు యువత మానసిక స్థితి గతులపై సమీక్ష నిర్వహించేందుకు మేధావులకు, మానసిక నిపుణులకు అవకాశం ఇచ్చింది. ►అందుకే ఈ ఏడాది “Creating Hope Through Action” థీమ్ తెచ్చారు ►వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. ది ఇంటర్నేషనల్ అసోషియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్(IASP), వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్(WFMH) సంయుక్తంగా ఈ రోజును నిర్వహిస్తారు. ►2003లో తొలిసారి ఈ దినోత్సవాన్ని నిర్వహించారు ►వందల్లో 60 మంది ఆత్మహత్యలకు పాల్పడడానికి కారణం.. ఒంటరిమనే భావన. కష్టకాలంలో సరైన ఓదార్పు లేకపోవడం. ►ఆర్థిక కారణాలు, బంధాలు, అయినవాళ్లతో గొడవలు కూడా మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నాయి. ►కాలు విరిగినా, చెయ్యి విరిగినా ఎలా విశ్రాంతి తీసుకుంటామో.. అలాగే మనసుకు విశ్రాంతి ఇవ్వాలి. ►సపోర్ట్గా నిలవాల్సింది సొసైటీనే. అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టుపక్కల ఉండే ఎవరైనా కావొచ్చు. ►సెన్సిటివ్ బిహేవియర్.. అంటే అప్పటిదాకా ధైర్యంగా ఉన్న మనిషి, చిన్న సంఘటనతోనూ కుంగుబాటుకు గురై ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి, వరుస దెబ్బలతో నిరాశనిస్పృహల్లోకి కూరుకుపోయిన వాళ్లే ఆత్మహత్యలకు పాల్పడతారనే అభిప్రాయం సరైంది కాదు. ►ఆత్మహత్యకు పాల్పడటం, ఆత్మహత్యకు యత్నించడం, పుసిగొల్పడం-ప్రేరేపించడం.. ఇవన్నీ నేరాలే. ఐపీసీ సెక్షన్-309 ప్రకారం.. జైలుశిక్ష జరిమానా తప్పవు. రాజీ కుదుర్చుకోవడానికి వీల్లేదు. అలాగే వీళ్ల తరపున ఏ లాయర్ వాదించడు. ►ప్రపంచంలో ప్రతీ నలభై సెకన్లకు ఒక ఆత్మహత్య నమోదు అవుతోంది. అందులో భారత్ టాప్ టెన్లో ఉండడం గమనార్హం. ►ఎందుకు బతకాలి? బతికి ఏం సాధించాలి? అనే పిరికి ప్రశ్నల కంటే.. బతికి సాధించుకోవాలి అనే ధైర్యం మనిషిని మహర్షిగా మారుస్తుంది. క్షణికావేశ నిర్ణయం ఒక జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తుంది. ఆ క్షణాన్ని గనుక అధిగమిస్తే అంతా వెలుగే నిండుతుంది - జాకీ చాన్ ఓడిన ప్రతీసారి రెట్టింపు ఉత్సామంతో పైకి లేవడమే మనిషి తన జీవితంలో సాధించే గొప్ప కీర్తి - నెల్సన్ మండేలా - సాక్షి, వెబ్డెస్క్ స్పెషల్ -
భారత్లో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధిగా కరోనా: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: భారత్లో కరోనా ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మరికొన్ని రోజులు కోవిడ్ ఇలానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. పిల్లలకు కరోనా సోకినా వ్యాధి అతి స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా ఇటీవల కోవిడ్ ఎప్పటికీ అంతం కాదని, మనతోనే శాశ్వతంగా ఉంటుందని చాలామంది శాస్త్రవేత్తలు పేర్కొన్న విషయం తెలిసిందే. సార్స్-కోవి-2ను అంతం చేయొచ్చా అని ప్రముఖ సైన్స్ జర్నల్ 'నేచర్' గత జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా మ్యునాలజిస్టులను, వైరాలజిస్టులను, ఆరోగ్య నిపుణులను అడిగింది. 'నిర్మూలించడం కుదరదు' అని వారిలో 90శాతానికి పైగా సమాధానమిచ్చారు. చదవండి: Finn Allen: వ్యాక్సిన్ రెండు డోసుల తర్వాత క్రికెటర్కు కరోనా పాజిటివ్ -
ఆందోళన: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాలు
సాక్షి, అమరావతి: సిజేరియన్ ప్రసవాలు పెరుగుతుండటం దుష్పరిణామాలు కలిగించే అంశమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన దానికంటే 6.2 మిలియన్లు అంటే 62 లక్షల సిజేరియన్ ప్రసవాలు అధికంగా జరుగుతున్నాయనేది డబ్ల్యూహెచ్వో అంచనా. తాజాగా సిజేరియన్ ప్రసవాలపై డబ్ల్యూహెచ్వో అన్ని దేశాలకు ఓ నివేదిక ఇచ్చింది. కోత ద్వారా ప్రసవం చేయడానికి ఎలాంటి కారణమూ చూపలేని పరిస్థితులు ఉన్నాయని, ఒత్తిడి వల్లనో, వాణిజ్యపరంగా లాభాలను ఆశించో, మరే ఇతర కారణాల వల్లనో గర్భిణి చేరిన గంటల వ్యవధిలోనే కోతల ద్వారా బిడ్డను బయటకు తీస్తున్నారని, ఇది భవిష్యత్లో తీవ్ర దుష్ఫలితాలను ఇస్తుందని పేర్కొంది. వైద్యపరంగా తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ ప్రసవం చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే 90 శాతం మంది డాక్టర్లు ఎందుకు సిజేరియన్ ప్రసవం చేయాల్సి వచ్చింది అనేందుకు సరైన కారణాలు చెప్పలేకపోతున్నారని పేర్కొంది. సిజేరియన్ ప్రసవానికి సాక్ష్యాలతో కూడిన క్లినికల్ ఆధారాలను చూపించేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్వో సూచించింది. చదవండి: గర్భిణులకు కోవిడ్ సోకితే, నెలలు నిండకముందే ప్రసవం క్రాస్ ఆడిట్కు ప్రభుత్వం నిర్ణయం రాష్ట్రంలోనూ కోతల ప్రసవాల సంఖ్య పెరుగుతున్నట్టు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా సిజేరియన్ ప్రసవాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గడిచిన నాలుగైదు మాసాల్లో ప్రభుత్వ పరిధిలోని పెద్దాసుపత్రుల్లోనూ సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగానే ఉన్నాయి. రాత్రి 8 గంటల సమయం నుంచి ఉదయం 8 గంటల ముందు ఆస్పత్రిలో చేరిన వారికి ఎక్కువగా సిజేరియన్ ప్రసవాలు చేస్తున్నట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో సిజేరియన్ల వల్ల కలిగే నష్టాలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కార్యాచరణ చేపట్టింది. కోతల ప్రసవాలపై కలిగే నష్టాలపై ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులో క్రాస్ ఆడిట్ నిర్వహిస్తారు. ఒక జిల్లాలో జరిగిన ప్రసవాలపై మరో జిల్లా అధికారులతో క్రాస్ ఆడిట్ నిర్వహించి, అకారణంగా కోతలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. చదవండి: గర్భధారణ సమయంలో టిఫా స్కానింగ్ ఎందుకు చేస్తారు? 25 శాతానికి మించకూడదు మొత్తం ప్రసవాల్లో 25 శాతానికి మించి కోతల ప్రసవాలు జరగకూడదు. అలాంటిది ప్రైవేటు ఆస్పత్రుల్లో 65 శాతం పైగా జరుగుతున్నాయి. ప్రభుత్వ పరిధిలోనూ 35 నుంచి 40 శాతం జరుగుతున్నాయి. అవగాహన లేక కొంతమంది గర్భిణుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ‘మా బిడ్డ నొప్పులు భరించలేదు.. ఆపరేషన్ చేయండి డాక్టర్..’ అంటున్నారు. లేదంటే ‘ఈ రోజు మంచి రోజు.. ప్రసవం ఈ రోజు జరిగితే బావుంటుందని పంతులు చెప్పారు..’ అంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇలాంటి నిర్ణయాల వల్ల తల్లికీ బిడ్డకూ నష్టం చేసిన వారవుతారు. – డా.గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు సిజేరియన్తో ఆరోగ్య సమస్యలు ►సాధారణ ప్రసవం ద్వారా పుట్టిన వారికంటే సిజేరియన్ ప్రసవం ద్వారా పుట్టిన పిల్లలకు ఐక్యూ తక్కువగా ఉంటుంది. ►చిన్న వయసులోనే తల్లులకు నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. సిజేరియన్ వల్ల చాలామంది తల్లులు స్థూలకాయం బారిన పడుతున్నారు. ►పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. 2021 మార్చి నుంచి జూన్ వరకు ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ప్రసవాలు ఇలా.. ఆస్పత్రి మొత్తం ప్రసవాలు సిజేరియన్ ప్రసవాలు జీజీహెచ్, అనంతపురం 2,150 945 జీజీహెచ్, విజయవాడ 2,351 1,173 జీజీహెచ్, కాకినాడ 1,900 645 జీజీహెచ్, కర్నూలు 2,119 921 కింగ్జార్జి, విశాఖపట్నం 2,484 1087 జీజీహెచ్, శ్రీకాకుళం 583 308 జీజీహెచ్, గుంటూరు 1,986 971 జీజీహెచ్, నెల్లూరు 1,074 596 జీజీహెచ్, కడప 1,536 826 జీజీహెచ్, ఒంగోలు 260 143 -
మిశ్రమ టీకాలు వేయించుకోవచ్చా..?
కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ వేయించుకోవడం ఒకటే మార్గం. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు జనం టీకాల కోసం పరుగులు పెడుతున్నారు. అయితే పలు కంపెనీల వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లను రెండు డోసులుగా తీసుకోవచ్చా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మిశ్రమ టీకాలు వేయించుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయనే భయాలు నెలకొన్నాయి. వీటికి సమాధానంగా పలు అధ్యయనాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టత నిచ్చాయి. మిక్స్ అండ్ మ్యాచ్ వ్యాక్సిన్ల ప్రభావంపై మరింత క్లారిటీ కోసం ఈ వీడియో చూడండి. -
కరోనా లీక్: డబ్ల్యుహెచ్ఓ నిపుణుడి వ్యాఖ్యల కలకలం
లండన్: కరోనా కేసులు తొలిసారి గుర్తించిన ప్రాంతంలోని ఒక ల్యాబ్ భద్రతా ప్రమాణాలపై అప్పట్లోనే అనుమానాలు వచ్చాయని డబ్ల్యుహెచ్ఓ నిపుణుడు పీటర్ బెన్ ఎంబరెక్ చెప్పారు. కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలపై చైనాలో పరిశోధనకు వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందంలో ఆయన పనిచేశారు. ఆ సమయంలోనే సదరు ల్యాబ్ ప్రమాణాలపై తనకు అనుమానాలు వచ్చాయని డానిష్ టీవీ డాక్యుమెంటరీలో బెన్ తెలిపారు. వూహాన్లోని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ల్యాబ్లో కరోనా వైరస్లను ఉంచారని, కానీ ఆ ల్యాబ్ భద్రతా ప్రమాణాలు కరోనా వైరస్ కట్టడి చేసే స్థాయిలో లేవని బెన్ తెలిపారు. చైనా అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థపై ఒత్తిడి తెచ్చి, మహమ్మారి మూలాలపై విచారణ సమయంలో లీక్ సిద్ధాంతాన్నివిరమించుకోవాలని ఒత్తిడి తెచ్చారని బెన్ మాటమార్చడం సంచలనంగా మారింది. సదరు బృందం మాత్రం అప్పట్లో వూహాన్ నుంచి కరోనా విడుదల కాలేదంటూ నివేదికనిచ్చింది. ఈ బృందానికి నాయకత్వం వహించిన బెన్ తాజాగా అనుమానాలు వ్యక్తం చేయడంపై కలకలం రేగుతోంది. ‘‘ది వైరస్ మిస్టరీ" పేరుతో వచ్చిన తాజా డాక్యుమెంటరీలో బెన్ చైనాకు పోవడం, వూహాన్ మార్కెట్లో స్టాల్స్ను పరిశీలించడం, తన అనుమానాలు వ్యక్తం చేయడం తదితర దృశ్యాలున్నాయి. కరోనా వైరస్ ఏదో ఒక ప్రాణి నుంచి మనిషికి ఈ మార్కెట్లోనే వచ్చిఉంటుందని బెన్ అనుమానపడ్డారు. అలాగే వూహాన్లోని చైనా ల్యాబ్పై ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్కు దగ్గరలో ఉన్న సీడీసీ చైనా ల్యాబ్పై తనకు చాలా అనుమానాలున్నాయన్నారు. గబ్బిలాల నుంచి శాంపిళ్లు తీస్తున్న ల్యాబ్ వర్కర్కు కరోనా తొలిసారి సోకి ఉండే ప్రమాదం ఉందని గతంలో బెన్ అభిప్రాయపడ్డారు. బెన్ వ్యాఖ్యలు అనుమానాలను బలపరుస్తున్నాయని, చైనా ల్యాబ్పై స్వతంత్ర పరిశోధన జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చైనా నుంచి మరింత పారదర్శకతను ఆశిస్తున్నామని సంస్థ చీఫ్ టెడ్రోస్ చెప్పారు. ల్యాబుల్లో ప్రమాదాలు జరగడం సహజమన్నారు. డబ్ల్యుహెచ్ఓ మాత్రం ఇంకా పరిశోధనలు జరగాల్సిఉందంటూ ఒక ప్రకటనతో సరిపుచ్చింది. (corona virus: పండుగ ఊరేగింపులపై నిషేధం!) -
రండి బాబూ రండి..!
నగదు బహుమానాల నుంచి స్కాలర్షిప్ల వరకు కోళ్ల దగ్గర్నుంచి కొత్త కార్ల వరకు గిఫ్ట్ వోచర్ల నుంచి స్క్రాచ్ కార్డుల వరకు రండి బాబూ రండి అంటూ.. వివిధ దేశాలు ప్రజల్ని ఆఫర్లతో ముంచేస్తున్నాయి. ఇదంతా ఏ కంపెనీయో తమ వాణిజ్యాన్ని పెంచుకోవడానికి కాదండీ. మరి దాని కథా కమామిషు ఏంటో చూద్దాం.. . ఇప్పటివరకు తమ వ్యాపారాలను పెంచుకోవడానికి వాణిజ్య సంస్థలు ఇలాంటి గిఫ్ట్ వోచర్లు, నగదు బహుమానాలు ఇవ్వడం మనకి తెలుసు. ఇప్పుడు కరోనా మహమ్మారిని ప్రపంచం నుంచి తరిమి కొట్టాలంటే ఇదొక్కటే మార్గమని వివిధ దేశాలు భావిస్తున్నాయి. ప్రభుత్వాలకి అండగా కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. చివరికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాక్సిన్ వేసుకుంటే 100 డాలర్లు ఇవ్వాలంటూ రాష్ట్రాలకు పిలుపునివ్వడం విశేషం. –నేషనల్ డెస్క్, సాక్షి ఆఫర్లు ఇలా... ► రష్యా రాజధాని మాస్కోలో కోవిడ్–19 రెండు డోసులు తీసుకున్న వారికి ప్రతీ వారం లక్కీ డ్రా తీసి అయిదుగురికి కార్లు ఇస్తోంది. ► బ్రిటన్లో యువత వ్యాక్సిన్ తీసుకుంటే వివిధ కంపెనీలు కార్లలో ఉచితంగా టీకా కేంద్రాలకు తీసుకువెళ్లడం, పిజ్జాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. ► అమెరికాలో ఒక్కో రాష్ట్రం ఒక్కో విధానాన్ని అవలంబిస్తోంది. ఎక్కువ రాష్ట్రాలు నగదు బహుమానాలు ఇస్తున్నాయి. కాలిఫోర్నియాలో 50 డాలర్ల విలువ జేసే గిఫ్ట్ వోచర్లను 20 లక్షల మంది వరకు ఇచ్చింది. ఓహియో మరో అడుగు ముందుకేసి కాలేజీ విద్యార్థులు వ్యాక్సిన్ వేయించుకుంటే స్కాలర్షిప్లు అందిస్తామని ప్రకటించింది. న్యూయార్క్ రాష్ట్రం వ్యాక్స్ అండ్ స్క్రాచ్ అంటూ స్క్రాచ్ కార్డులను ప్రవేశపెట్టింది. టీకా తీసుకున్న వారికి ఇచ్చిన స్క్రాచ్ కార్డులో 20 డాలర్ల నుంచి 10 లక్షల డాలర్ల వరకు ఎంతైనా ఉండొచ్చు. ఇక ఎవరి అదృష్టం వారిది. ► ఫిలిప్పీన్స్, థాయ్లాండ్లలో కొన్ని ప్రాంతాల్లో టీకా వేసుకున్న వారికి ఆవుల్ని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించాయి. ► దుబాయ్లో వ్యాక్సిన్ వేయించుకున్న వారికి జిమ్స్, ఫిటినెస్ సెంటర్లకి ఉచితంగా వెళ్లొచ్చు ► ఇండోనేసియాలో ఒక టీకా డోసు తీసుకొని ఎంచక్కా కోడిని ఇంటికి తీసుకువెళ్లి కూర వండుకొని లాగించేయొచ్చు ► చైనాలో టీకా తీసుకుంటే నిత్యావసర సరుకులపై డిస్కౌంట్లు, ఉచితంగా గుడ్లు పంపిణీ చేస్తున్నారు. ► సెర్బియాలో వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతీ ఒక్కరికీ 30 డాలర్ల నగదు బహుమతి ఇస్తున్నారు. ► ఇజ్రాయెల్లో వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రభుత్వం ఆస్తి పన్నులో డిస్కౌంట్ ఇస్తోంది. ► హాంకాంగ్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకంగా వ్యాక్సిన్ తీసుకుంటే లక్కీ డ్రా తీసి అపార్ట్మెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు. మరికొన్ని వాణిజ్య సంస్థలు వజ్రాలు పొదిగిన వాచీలు, బంగారం బిస్కెట్ల్ని కూడా ఆఫర్లుగా ఇస్తున్నాయి. ► ఊబర్ సంస్థ భారత్ సహా వివిధ దేశాల్లో టీకా కేంద్రాలకు ఉచితంగా ప్రజల్ని తీసుకువెళుతోంది. ► భారత్లోని చెన్నైలో ఒక వాణిజ్య సంస్థ లక్కీ డ్రా తీసి వాషింగ్ మిషన్లు ఇస్తూ ఉంటే, అరుణాచల్ ప్రదేశ్లో ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఎందుకీ ప్రోత్సాహకాలు? ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమించి కోవిడ్–19 వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చారు. అయితే, దీనిపై ఉన్నన్ని అపోహలు అన్నీఇన్నీ కావు. ఇప్పటి వరకు ప్రపంచ జనాభాలో కేవలం 15% మంది రెండు డోసులు తీసుకుంటే, ఒక్క డోసు తీసుకున్న వారు 29% మంది మాత్రమే ఉన్నారు. దీంతో, కొన్ని దేశాలు కరోనా టీకా తీసుకోకపోతే కఠినమైన నిబంధనలు విధిస్తున్నాయి. వీటిపై కూడా ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న వారికి హెల్త్ పాస్లు ఇచ్చి, అవి ఉంటేనే రెస్టారెంట్లలో అనుమతి ఉంటుందని ఇటీవల ఫ్రాన్స్ పార్లమెంటు ఒక బిల్లును ఆమోదించగా దీనిపై ఆ దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. టీకా తప్పనిసరిగా తీసుకోవడం అంటే తమ వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని వారు నిరసన తెలిపారు. ఈ పరిణామాల నడుమ టీకాలు తీసుకుంటే ఇన్సెంటివ్లు ఇవ్వడమే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇన్సెంటివ్లు సరైనవేనా? కరోనా టీకాపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు పోగొట్టి, వారికి వైద్య శాస్త్రంపై విశ్వాసం కలిగించాల్సిన ప్రభుత్వాలు ఇలా ప్రోత్సాహకాల వల వెయ్యడంపై చాలా చోట్ల చర్చ జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్ను తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధనలు విధించడానికి బదులుగా ప్రజలకి ఆసక్తి కలిగించేలా ప్రోత్సాహకాలు ఇవ్వడం సరైందేనని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ పబ్లిక్ హెల్త్ డిప్యూటీ డైరెక్టర్ నాన్సీ కాస్ అభిప్రాయపడ్డారు. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ తీసుకోకపోతే కఠినమైన నిబంధనలు, జరిమానాలు విధిస్తున్నారని, అటువంటి వాటి కంటే ప్రోత్సాహకాలు చాలా మెరుగైనవని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) కూడా చిన్న పిల్లలకు కొన్ని రకాల వ్యాక్సిన్లు ఎలా తప్పనిసరో, కరోనా టీకాని కూడా తప్పనిసరి చేయాలని సూచిస్తోంది. ఇలా ఉండగా, 100 డాలర్లు ఇస్తామంటే కరోనా టీకా తీసుకోవడానికి అమెరికాలోని మూడో వంతు ప్రజలు సిద్ధమేనని ఇటీవల కాలిఫోర్నియా యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాల ప్రజలకు కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించాలంటేæ టీకా మినహా మరో గత్యంతరం లేదని, అందుకే ఏం చేసైనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మేలని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. -
వైద్య పరికరాలకు ‘చికిత్స’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాస్పత్రులకు ఆధునిక వైద్య ఉపకరణాలు అందుబాటులోకి వస్తున్నాయి. కొత్తగా వంద రకాల పరికరాలను సర్జికల్ జాబితాలో చేర్చారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఏటా లక్షలాది శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. కొత్త కొత్త వైద్య పద్ధతులు వస్తున్న నేపథ్యంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి సమీక్ష నిర్వహించి ఆధునిక ఉపకరణాలను అందుబాటులోకి తీసుకురావాలి. కానీ 2014 తర్వాత అప్పటి ప్రభుత్వం దీని గురించి అసలు పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు.. స్పెషాలిటీ వైద్యులు సర్జికల్ జాబితాపై కసరత్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా నిర్వహించిన సమీక్షలో శస్త్రచికిత్సలకు అవసరమైన 390 రకాల సర్జికల్ ఉపకరణాలతో జాబితా తయారు చేశారు. ఇందులో 100 రకాలు కొత్తగా చేర్చినవే. ప్రైవేటు ఆస్పత్రుల్లోని పరికరాల కంటే ఇవి అత్యుత్తమమైనవని వైద్యులు, అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో చైనా నుంచి వచ్చిన నాసిరకం పరికరాలు వాడుతుంటారని వివరించారు. ప్రభుత్వ రేటు కాంట్రాక్టులో ఉన్నవన్నీ అమెరికా ఔషధ నియంత్రణతో పాటు డబ్ల్యూహెచ్వో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉన్నవేనని తెలిపారు. జనరల్ సర్జరీ, గ్యాస్ట్రిక్, ప్రసవాల్లో వాడే పరికరాల్లో ఆధునికమైనవి ఎక్కువగా వచ్చాయని చెప్పారు. గతంలో శస్త్రచికిత్సలు చేసేటప్పుడు శరీరంపై కోతలు ఎక్కువగా పెట్టేవాళ్లు. కానీ ఇప్పుడు చిన్న గాటుతో చికిత్స చేసే ల్యాప్రోస్కోపిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి వైద్య ఉపకరణాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. రేటు ఎక్కువైతే పునఃసమీక్ష.. మొత్తం 390 రకాల పరికరాల్లో.. రేటు ఎక్కువగా ఉన్న వాటి విషయంలో పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. మొదటిసారిగా సర్జికల్ ఉపకరణాలను అన్ని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న స్పెషాలిటీ వైద్యుల అభిప్రాయాలు తీసుకుని మరీ నిర్ధారించారు. ఆధునిక వైద్య పరికరాలు గతంలోని రేటు కాంట్రాక్టులో లేకపోవడంతో.. ఆస్పత్రుల్లో లోకల్ పర్చేజీ కింద ఎక్కువ రేటు చెల్లించి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తే మరింత రేటు తగ్గుతుందని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు. ఏటా లక్షలాదిమంది సర్జరీ చేయించుకునేందుకు ప్రభుత్వాస్పత్రులకు వస్తున్నారని, ఆధునిక వైద్యపరికరాలుంటే రక్తస్రావం తక్కువగా ఉండటం, త్వరగా గాయాలు మానడం, ఇన్ఫెక్షన్లు తగ్గడం వంటి ఉపయోగాలుంటాయని వైద్యులు చెప్పారు. అందరి అభిప్రాయాలతోనే.. ఆధునిక వైద్య పరికరాల కొనుగోలుపై స్పెషాలిటీ వైద్యులు కసరత్తు చేశాకే నిర్ధారణకు వచ్చాం. బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యుల అభిప్రాయాలు తీసుకున్నాం. అందరి అభిప్రాయాల మేరకే ఉపకరణాల జాబితా తయారు చేశాం. సర్జికల్ బడ్జెట్ కొంత పెంచాల్సి ఉంది. దీని కోసం ప్రయత్నిస్తున్నాం. – డా.రాఘవేంద్రరావు, వైద్య విద్యా సంచాలకులు -
Covaxin : కేంద్రం ప్రకటన.. గల్ఫ్ వెళ్లేవారికి భరోసా
హైదరాబాద్: కోవాగ్జిన్ తీసుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్న వారికి భరోసా కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కోవాగ్జిన్ టీకా కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ జులై 20న రాజ్యసభలో తెలిపారు. తెలిపింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలు, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కోవాగ్జిన్ గుర్తింపుపై అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. సందేహాలు ప్రస్తుతానికి గల్ఫ్ దేశాలలో కోవిషీల్డ్ కే గుర్తింపు ఉంది. డబ్ల్యూహెచ్ఓ అనుమతి వస్తేనే కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారికి గల్ఫ్ దేశాలు అనుమతించే అవకాశం ఉంది. దీంతో కోవాగ్జిన్ తీసుకున్న వారు తాము గల్ఫ్ దేశాలకు ఎప్పుడు వెళ్తామో ఏమో అనే సందేహాంలో ఉన్నారు. ఇప్పటికే నెలల తరబడి వర్క్కు దూరంగా ఉన్నామని,.. ఇదే పరిస్థితి కొనసాగితే అప్పులు పాలవుతామని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో కేంద్రం చేసిన ప్రకటన వారికి భరోసా కలిగించింది. ఇలాగైతే కష్టం కోవిడ్ ఫస్ట్వేవ్ ముగిసిన తర్వాత గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న చాలా మంది భారతీయులు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు సెలవులపై ఇంటికి వచ్చారు. వీరిలో చాలా మంది డిసెంబరు నుంచి మార్చి మధ్యలో ఇండియాకు చేరుకున్నారు. అయితే ఆ తర్వాత కోవిడ్ సెకండ్వేవ్ మొదలవడంతో చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇంతలో ఏప్రిల్ 25 నుంచి భారత్ - గల్ఫ్ దేశాల మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే జులై 25 నుంచి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని వార్తలు వస్తుండటంతో తిరిగి పనులకు వెళ్లేందుకు గల్ఫ్ కార్మికులు సిద్ధమవుతున్నారు. -
కరోనా నెమ్మదించలేదు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి నియంత్రణలోకి వస్తోందన్న భావన వద్దని, మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయమిదని డబ్ల్యూహెచ్వో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ కేసులు భారీగా నమోదవుతుండటం, లాక్డౌన్ నిబంధనల సడలింపు, టీకాల కార్యక్రమం మందగమనం, ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం.. ఈ నాలుగు అంశాలు దీనికి కారణమని తెలిపారు. కరోనా పరిస్థితిపై బ్లూమ్బెర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు కీలక అంశాలను వెల్లడించారు. డెల్టా వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయని, వ్యాధి ఇప్పటికీ వ్యాపిస్తూనే ఉందనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నా యని ఆమె వివరించారు. ‘‘శుక్రవారం ఒక్కరోజే దాదాపు ఐదు లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. 9,300 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే మహమ్మారి తగ్గుముఖం పడుతోందని అనే అవకాశమే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా వర్గీకరించుకున్న ఆరు ప్రాంతాల్లో కనీసం ఐదింటిలో కేసుల సంఖ్య ఎక్కువైంది. ఆఫ్రికా దేశాల్లో అయితే మరణాల రేటు 30–40 శాతం పెరిగింది. డెల్టా వేరియంట్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. కొత్త కేసుల పెరుగుదలలో బ్రెజిల్, ఇండోనేషియా, అమెరికా, యూకేలు ముందు వరసలో ఉన్నాయి. యూరప్లో గత వారం రోజుల్లో 32.2 శాతం, తూర్పు మధ్యధరా ప్రాంతంలో 21.2 శాతం, ఆఫ్రికాలో 18.2 శాతం కేసులు పెరిగాయి..’’అని సౌమ్యా స్వామినాథన్ వివరించారు. టీకా ఉత్పత్తి పెంచాలి ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల కార్యక్రమం మందగిస్తోందని, లాక్డౌన్ నిబంధనల సడలింపు కూడా తోడు కావడంతో సమస్య జటిలమవుతోందని సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ‘‘బ్రిటన్లో ఈ నెల 19వ తేదీ నుంచి కోవిడ్ నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇతర యూరోపియన్ దేశాల్లోనూ దశలవారీగా నిబంధనల ఎత్తివేత కొనసాగుతోంది. ఇది వైరస్ విస్తరణ పెరిగేందుకు కారణమవుతుంది. ప్రపంచ దేశాలు టీకాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాలను ఉచితంగా అందుబాటులో ఉంచడం, స్వచ్ఛందంగా కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలి. ట్రిప్స్ ఒప్పందంలోని కొన్ని అంశాలను అనుకూలంగా మార్చుకుని మేధోహక్కుల రాయితీలివ్వడం వంటి చర్యలు చేపట్టాలి. తద్వారా ఎక్కువ సంఖ్యలో టీకాలు ఉత్పత్తి చేయవచ్చు’’అని సూచించారు. దేశాలు స్థానికంగానే టీకాలు తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ప్రాణాలు కోల్పోయారు. అంటే మహమ్మారి తగ్గుముఖం పడుతోందని అనే అవకాశమే లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా వర్గీకరించుకున్న ఆరు ప్రాంతాల్లో కనీసం ఐదింటిలో కేసుల సంఖ్య ఎక్కువైంది. ఆఫ్రికా దేశాల్లో అయితే మరణాల రేటు 30–40 శాతం పెరిగింది. డెల్టా వేరియంట్ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. కొత్త కేసుల పెరుగుదలలో బ్రెజిల్, ఇండోనేషియా, అమెరికా, యూకేలు ముం దు వరసలో ఉన్నాయి. యూరప్లో గత వారం రోజుల్లో 32.2%, తూర్పు మధ్యధరా ప్రాంతంలో 21.2%, ఆఫ్రికాలో 18.2% కేసులు పెరిగాయి..’’అని సౌమ్యా స్వామినాథన్ వివరించారు. టీకా ఉత్పత్తి పెంచాలి ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాల కార్యక్రమం మందగిస్తోందని, లాక్డౌన్ నిబంధనల సడలింపు కూడా తోడు కావడంతో సమస్య జటిలమవుతోందని సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ‘‘బ్రిటన్లో ఈ నెల 19వ తేదీ నుంచి కోవిడ్ నిబంధనలను పూర్తిగా తొలగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఇతర యూరోపియన్ దేశాల్లోనూ దశలవారీగా నిబంధనల ఎత్తివేత కొనసాగుతోంది. ఇది వైరస్ విస్తరణ పెరిగేందుకు కారణమవుతుంది. ప్రపంచ దేశాలు టీకాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. సాంకేతిక పరిజ్ఞానాలను ఉచితంగా అందుబాటులో ఉంచడం, స్వచ్ఛందంగా కంపెనీలకు లైసెన్సులు ఇవ్వాలి. ట్రిప్స్ ఒప్పందంలోని కొన్ని అంశాలను అనుకూలంగా మార్చుకుని మేధోహక్కుల రాయితీలివ్వడం వంటి చర్యలు చేపట్టాలి. తద్వారా ఎక్కువ సంఖ్యలో టీకాలు ఉత్పత్తి చేయవచ్చు’’అని సూచించారు. దేశాలు స్థానికంగానే టీకాలు తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. -
డెల్టా కంటే లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరం..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ధాటి నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్లు కలవరపెడుతున్నాయి. కాలానికి తగ్గట్టుగా రూపాంతరం చెందుతున్న మహమ్మారి… డెల్టా, లాంబ్డా వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతోంది. ఇండియాలో సెకండ్ వేవ్కి కారణమైన డెల్టా వేరియంట్ ప్రస్తుతం 100కిపైగా దేశాల్లో విజృంభిస్తోంది. మరోవైపు దక్షిణ అమెరికా, లాటిన్ ఆమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా మరో రూపం లాంబ్డా వేరియంట్ భయాందోళనలు సృష్టిస్తుంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో లాంబ్డా వేరియంట్పై పరిశోధనలు జరిపిన మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా డెల్టా రకం కంటే లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని ప్రకటించింది. ప్రపంచంలోని 30 దేశాల్లో విస్తరించిన లాంబ్డా వేరియంట్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించవచ్చని షాకింగ్ న్యూస్ తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాల రేటు ఉన్న పెరూ దేశం నుంచి లాంబ్డా జాతి వైరస్ ఉద్భవించిందని మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది. మరోవైపు యూకేలో గుర్తించిన లాంబ్డా కరోనా వేరియంట్ డెల్టా కంటే మూడు రెట్లు ప్రమాదకరమైన అంటువ్యాధి అని పరిశోధకులు తేల్చారు. పెరూలో మే, జూన్ నెలల్లో వెలుగుచూసిన కరోనా వైరస్ నమూనాలలో లాంబ్డా దాదాపు 82 శాతం ఉందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పాహో) వెల్లడించింది. మరో దక్షిణ అమెరికా దేశమైన చిలీలో మే, జూన్ నుంచి 31 శాతానికి పైగా నమూనాల్లో లాంబ్డా వేరియంట్ వైరస్ ఉందని గుర్తించారు. లాంబ్డా వైరస్ త్వరగా ప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. -
డెల్టా వేరియంట్ డేంజరస్
ఐరాస/జెనీవా: కరోనా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, క్రమంగా రూపాంతరం చెందుతూ ప్రమాదకరంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అడానోమ్ ఘెబ్రేయెసుస్ హెచ్చరించారు. కోవిడ్–19 మహమ్మారి విషయంలో ప్రపంచం ప్రమాదకర దశను ఎదుర్కొంటోందని అన్నారు. కరోనా వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్న దేశాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని, ఆసుపత్రులు మళ్లీ బాధితులతో నిండిపోతున్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల్లో డెల్టా వేరియంట్ ఆధిపత్య వేరియంట్గా మారుతోందని వెల్లడించారు. ప్రజారోగ్య రంగం స్పందనే దీనికి విరుగుడు అని చెప్పారు. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశం కూడా కరోనా ముప్పు నుంచి పూర్తిగా బయటపడలేదని డాక్టర్ టెడ్రోస్ స్పష్టం చేశారు. ఇప్పటిదాకా 98 దేశాల్లో డెల్టా వేరియంట్ ఉనికి బయటపడిందని, వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్న దేశాలకు వ్యాప్తి చెందుతోందని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. -
రెండు రోజుల్లో మోడెర్నా టీకాల రాక!
న్యూఢిల్లీ: అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీ ‘మోడెర్నా’ అభివృద్ధి చేసిన కోవిడ్–19 వ్యాక్సిన్లు భారత్కు చేరుకోనున్నాయి. మరో రెండు రోజుల్లో మొదటి బ్యాచ్ టీకాలు మన దేశానికి చేరుకుంటాయని భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మోడెర్నా టీకాకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి ఇప్పటికే లభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రారంభించిన కోవాక్స్ కార్యక్రమంలో భాగంగా మోడెర్నా టీకాలు భారత్కు అందనున్నాయి. భారత్లో డీసీజీఐ నుంచి అనుమతి లభించిన నాలుగో టీకా ఇదే కావడం విశేషం. -
ప్రపంచ సంస్థలపై డ్రాగన్ పట్టు
ఒక రాజ్యంపై పట్టు సాధించడం కన్నా, అన్ని రాజ్యాలపై ప్రభావం చూపే సంస్థపై పట్టు సాధిస్తే? సరిగ్గా చైనా ఇదే సూత్రాన్ని అవలంబిస్తోంది. దీనివల్ల తాను ఆడించినట్లు ప్రపంచాన్ని ఆడించవచ్చని చైనా అధినాయకత్వం భావిస్తోంది. ఈ ప్రయత్నాలు ఇప్పటికే కొంతమేర సఫలమయ్యాయని వివిధ నివేదికలు చెబుతున్నాయి. అదేంటో చూద్దాం! ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న సంస్థలపై పట్టుకోసం చైనా యత్నిస్తోందని, దీనిద్వారా స్వీయ ప్రయోజనాలు పొందాలని చైనా ఆశిస్తోందని ఆశ్చర్యకరమైన అంశాలు బయటకొచ్చాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లను ఏవిధంగా చైనా కబ్జా చేసేందుకు యత్నిస్తోందో బ్రిటన్కు చెందిన పార్లమెంటరీ ఫారెన్ అఫైర్స్ కమిటీ నివేదిక వివరించగా, పలు ఐరాస ఏజెన్సీల్లో చైనా పౌరులు కీలక స్థానాల్లో ఉన్నట్లు గేట్వే హౌస్ నివేదిక తెలిపింది. కీలకమైన స్థానాల్లో పాగా వేయడం, ఇందుకోసం సామ, భేద, దానోపాయాలను ఉపయోగించడం ద్వారా ప్రపంచ సంస్థలపై చైనా పట్టుజిక్కించుకుంటోందన్న అనుమానాలను ఈ నివేదికలు బలపరుస్తున్నాయి. చైనా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఆ సంస్థల స్థాపక నియమావళికి వ్యతిరేకమే కాక, చైనాకు అవి ఆయుధాలుగా మారతాయనే ఆందోళనలు పెరిగాయి. ఆరింటిపై కన్ను ప్రపంచ దేశాల్లో చాలావాటికి సభ్యత్వాలున్న కీలకమైన అరడజను సంస్థలపై బ్రిటన్కు చెందిన 11 మంది ఎంపీలు తయారు చేసిన నివేదిక దృష్టి సారించింది. ప్రపంచ ఆరోగ్య సమాఖ్య(డబ్ల్యూహెచ్ఓ), ఇంటర్పోల్, అంతర్జాతీయ మానవ హక్కుల హైకమిషనర్ ఆఫీసు(ఓహెచ్సీహెచ్ఆర్)లాంటి ముఖ్యమైన సంస్థల్లో చైనా ప్రాముఖ్యత పెరుగుతున్న తీరును వివరించింది. ఇందుకు పలు ఉదాహరణలు సైతం ఉన్నాయని తెలిపింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ)లో నైన్త్ డీజీ కోసం 2019లో జరిగిన ఎన్నికలను నివేదిక ఉదహరించింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తమకు కామెరూన్ దేశం నుంచి రావాల్సిన 7.8 కోట్ల డాలర్ల అప్పును చైనా మాఫీ చేసింది. అనంతరం నైన్త్ డీజీ పదవికి పోటీ నుంచి కామెరూన్ అభ్యర్థి తప్పుకున్నారు, దీంతో చైనా అభ్యర్థికి ఈ పోస్టు దక్కింది. ప్రస్తుతం ఐరాసకు చెందిన 15 విభాగాల్లో నాలిగింటికి(ఎఫ్ఏఓ, ఐటీయూ, ఐసీఏఓ, ఐడీఓ) చైనావాళ్లే అధిపతులుగా ఉన్నారని, వేరే ఏ దేశానికి చెందిన వారు ఒక్క విభాగానికి మించి అధిపతులుగా లేరని వివరించింది. 2019లో డబ్ల్యూఐపీఓను కూడా చైనా చేజిక్కించుకునేదే కానీ చివరి నిమిషంలో అమెరికా అడ్డంపడింది. డబ్బుతో కొనేస్తుంది కీలక ఆర్గనైజేషన్లను చేజిక్కించుకోవడంలో చైనా ఎక్కువగా నిధులు, ఆర్థిక సాయం మార్గాన్ని ఎంచుకుంటోంది. సాధారణంగా ఇలాంటి సంస్థలకు ఆయా దేశాలు వాటి ఆర్థిక స్థితిని బట్టి నిధులు ఇస్తాయి. ఇదికాకుండా లక్ష్యసాధన కోసం వీటికి వివిధ దేశాలు విరాళాలు ఇస్తుంటాయి. చైనా దీన్ని తనకు అనువుగా మలచుకుంటోందని గేట్వే నివేదిక చెబుతోంది. 2010–19 కాలంలో చైనా చేసే స్వచ్ఛంద విరాళాలు 346 శాతం పెరిగాయి. దీంతో ఐరాస సంస్థలు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు నిధులు లభించినట్లవుతుంది, ఎక్కువగా విరాళమిచ్చినందుకు సాధారణంగానే చైనా చెప్పినట్లు ఈ ప్రాజెక్టులు ప్రభావితమవుతుంటాయి. నిజానికి యూఎస్ తదితర దేశాలిచ్చే నిధులతో పోలిస్తే చైనా ఇచ్చేది తక్కువే కానీ తక్కువ ఇచ్చి ఎక్కువ ప్రభావం చూపడం చైనా విధానమని ఒక మాజీ అధికారి వివరించారు. అలాగే కొన్నిమార్లు కొన్ని ఆయాచితంగా కలిసివచ్చి సంస్థలపై చైనా పట్టు పెరిగేందుకు దోహదం చేస్తుంటాయి. ఉదాహరణకు డబ్ల్యూహెచ్ఓకు ట్రంప్ ప్రభుత్వం నిధులు తగ్గించగానే, ఆపన్న హస్తం చాచినంత ఫోజుకొట్టి చైనా కొంతమేర నిధులిచ్చి పట్టు పెంచుకుంది. బైడెన్ ఈ పరిస్థితిని చక్కదిద్దే పనులు చేపట్టారు కానీ పోయిన పట్టు తిరిగి రాలేదని నిపుణులు తెలిపారు. అలాగే ఇంటర్పోల్లో చైనా తక్కువ నిధులిచ్చినా ఎక్కువ ప్రభావం చూపే స్థితిలో ఉంది. దీంతో పలు దేశాలకు చెందిన నేరçస్తులపై జారీ చేసే రెడ్కార్నర్ నోటీసులను ప్రభావితం చేయగలదని చెప్పారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్పై సైతం పట్టు పెంచుకోవాలని చైనా యత్నిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సంస్థల్లో టాప్–3 స్థాయిలో చైనా ఉంది. ఇప్పటికైతే ఈ రెండిటిపై యూఎస్, ఈయూ పట్టు చాలా గట్టిగా ఉందని గేట్వే నివేదిక తెలిపింది. పరోక్షంగా కూడా ప్రభావం కొన్ని సంస్థల్లోని కీలక పదవిలో చైనీయులు లేకున్నా, ఇప్పుడున్నవారి ద్వారా చైనా పలు విధాలుగా పరోక్ష లబ్ది పొందుతోందని గేట్వే నివేదిక తెలిపింది. ఉదాహరణకు డబ్లు్యహెచ్ఓ అధ్యక్షుడైన టెడ్రోస్ చైనీయుడు కాదు. కానీ ఆయన ఎన్నికకు చైనా 2017లో మద్దతిచ్చింది. అంతకుముందు ఆయన ఇథియోపియా మంత్రిగా పనిచేశారు. ఆఫ్రికాకు చెందిన ఈ దేశంలో అత్యధికంగా చైనా పెట్టుబడులు పెట్టింది. అంతకుముందు ఈ సంస్థకు పదేళ్ల పాటు అధ్యక్షత వహించిన మార్గరెట్ ఛాన్ హాంకాంగ్కు చెందినవారు. దీంతో డబ్లు్యహెచ్ఓ నుంచి చైనాకు ఎంతగా మద్దతు వస్తుందో అవగతమవుతోందని నివేదికలు తెలిపాయి. కొన్ని సంస్థల్లో పట్టు కోసం కొన్నిదేశాలపై చైనా దౌర్జన్యపూరిత డిప్లమసీ మార్గాన్ని ఎంచుకుంటుందని తెలిపాయి. -
ప్రజారోగ్యంపై పట్టింపు ఏది?
భారతదేశం కరోనా దెబ్బకు విలవిలలాడిపోవడానికి ఆరోగ్యరంగానికి బడ్జెట్ కేటాయింపు చాలా తక్కువగా ఉండటం కూడా కారణమే. పైగా కేంద్రం, రాష్ట్రాల మీద పెత్తనాన్ని ప్రదర్శించింది. ఇది తాను ఏమీ చేయలేక మరొకరిని నిందించడమే తప్ప మరొకటి కాదు. అందువల్ల కరోనా అనంతరం ప్రభు త్వాలు సంపూర్ణ ఆరోగ్య వ్యవస్థను, మనకు ఉన్న మౌలిక సదుపాయాలను పూర్తిగా సమీక్షించుకోవాలి. మరోవైపున కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కోట్లాదిమందిని పేదవాళ్ల జాబితాలోకి తోసేసింది. ఇక ఎంతమాత్రం కూడా ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు లక్షలు చెల్లించే స్థితి లేదు. ఇప్పుడు దేశం ముందు రెండే దారులున్నాయి. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య బాధ్యతను తీసుకోవడమా? లేదా ప్రజలు మూకుమ్మడిగా ప్రాణాలు కోల్పోవడమా? మన పొరుగున ఉన్న చైనా, మనకన్నా అధిక జనాభా ఉన్న దేశం.. మలేరియా రహితదేశంగా మారిపోయింది. బుధవారం అంటే నిన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ప్రకటించిన 40 దేశాల్లో చైనా చేరిపోయింది. అంతేకాకుండా, మనకన్నా చిన్నదేశం, అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న శ్రీలంక కూడా మలేరియా రహిత దేశమైపోయింది. సెప్టెంబర్ 5, 2016న ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇట్లా 40 దేశాలు తమ గడ్డమీదినుంచి మలేరియాను తరిమి కొట్టాయి. ఇవేకాక అల్జీ రియా, మారిషస్, జోర్డాన్, లిబియా, మొరాకో, అల్బేనియా నుంచి బ్రిటన్ దాకా యూరప్ దేశాల్లో చాలా మలేరియా నుంచి విముక్తి అయ్యాయి. అంతేకాకుండా, దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, చిలీ, జమైకా, క్యూబా, ఉరుగ్వే లాంటి దేశాలు ఈ జాబితాలో చేరి పోయాయి. కానీ మనదేశంలో మాత్రం ఇంకా మలేరియా విలయ తాండవం చేస్తూనే ఉంది. మారుమూల ప్రాంతాలైన అడవుల్లో నివసించే ఆదివాసులు ప్రతి సంవత్సరం లెక్కలకు అందనంత మంది మలేరియా ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారు. రాబోయే పది సంవత్సరాలలో భారత్ని మలేరియా రహితదేశంగా చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు చేసి నట్టు చెబుతున్నారు. అయితే మనదేశంలో ఉన్న ఆదివాసుల జీవన పరిస్థితులు, స్థితిగతులను పరిశీలిస్తే ఇది సాధ్యమయ్యే పనేనా అనే అనుమానం రాక మానదు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితులు కొనసాగుతున్న వ్యత్యాసాలు ప్రజల ఆరోగ్య స్థితిగతులపై తీవ్ర ప్రభావాన్ని కలుగజేస్తున్నాయి. మలేరియాతోపాటు, మరొక ముఖ్యమైన సమస్య క్షయ వ్యాధి. ఇది కూడా ప్రజలలో చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇండియా క్షయ వ్యాధి నివేదిక–2020 ప్రకారం 26.9 లక్షల కేసులు నమోదు కాగా, 79,144 మంది మరణించారు. 2019లో 24.04 లక్షల కేసులు నమోదు అయ్యాయి. అంటే 2019 కన్నా 2020లో 14 శాతం అధి కంగా కేసులు నమోదయ్యాయి. అయితే అనధికార లెక్కలు ఇంకా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో అంటే 2025 నాటికి టి.బి. రహిత దేశంగా భారతదేశాన్ని తయారుచేస్తామని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించక మానదు. ప్రతి సంవత్సరం సరాసరి 4,36,000 మంది టి.బి. వల్ల మరణి స్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా 2019లో పదిలక్షల 40వేల మంది క్షయవల్ల మరణిస్తే, మొత్తంగా 20 లక్షల 64 వేలమంది ఆ వ్యాధి బారిన పడ్డారు. ఇందులో మహిళలు 34శాతం కాగా, 59శాతం పురుషులు, బిహార్, ఛత్తీస్గఢ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో అధిక సంఖ్యలో క్షయవ్యాధి బారిన పడుతున్నారు. క్షయవ్యాధిలో ఇండియా, మొదటిస్థానంలో ఉండగా, ఇండోనేషియా, పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా దేశాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. దీనితోపాటు పోషకాహార లోపం మరొక ప్రధాన ఆరోగ్య సమస్య. ప్రజలు అనారోగ్యం పాలు కావడానికి 50 శాతం వరకు పోషకాహార లోపమే ప్రధాన కారణమనే విషయాన్ని న్యూట్రిషన్ వరల్డ్–2020 నివేదిక బయటపెట్టింది. పిల్లల్లో పోషకాహారలోపం చాలా ఎక్కువగా ఉంటోందనీ, దాదాపు 50 శాతం మంది పిల్లల్లో ఎముకల ఎదుగుదల లేదని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో కూడా ఆదివాసీ, దళితుల శాతం అధికం. పోషకాహార లోపంతోపాటు, రక్తహీనత కూడా వీరిలో అధికం. ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. దళితుల్లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 48 శాతం దళితుల్లోని బాల, బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. పరిస్థితులు ఇలా ఉండగా, కరోనాలాంటి వ్యాధి ప్రబలితే ఎటు వంటి పరిస్థితులను మనం చవిచూశామో తెలుసు. ఇంకా కరోనా ప్రభావం ఎంత దుష్ప్రభావాన్ని మిగిల్చిందో, మిగులుస్తుందో లెక్కలు తేలాల్సి ఉంది. అంతేకాకుండా, జీవనశైలి మీద ఆధారపడిన మధుమేహం, రక్తపోటు వంటి సమస్యల వల్ల కరోనా బారిన పడిన వారు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి లెక్కలు లేవు. ఇవన్నీపోనూ.. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజల ఆరోగ్య సమస్యను ప్రాధాన్యత లేని సమస్యగా చూస్తున్నాయి. ఇది తీవ్రంగా కలచివేసే సమస్య. మనం రోజురోజుకూ ఎంతో పురోగమిస్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ ఎటువంటి దూరదృష్టి లేదు. ప్రజల ప్రాణాలు, భద్రత, ఇతర సమస్యల కేంద్రంగా ఈ అంశాన్ని ఆలో చించడం మానేశాం. మన ఆరోగ్య సూచికలన్నీ ప్రపంచ దేశాలన్నింటిలో తిరోగామి స్థాయిలో ఉన్నాయి. దీనికి కారణం మనకు ఒక కచ్చితమైన ఆరోగ్య విధానం లేదు. పేరుకు హెల్త్ పాలసీలు తయారు చేసుకుంటాం. కానీ అది కూడా ఎక్కడో పాత కాలమైతే అల్మారాలో, ఇప్పుడైతే కంప్యూటర్ సర్వర్లో దాగి ఉంటుంది. అటువంటిదే 2017 జాతీయ హెల్త్ పాలసీ, అంతకుముందు రెండుసార్లు హెల్త్ పాలసీలు తయారు చేశారు. కానీ అవి ఆచరణకు నోచుకోలేదు. 2017లో రూపొందించిన పాలసీ కూడా అటువంటిదే. అందులో అన్ని సాంకేతికపరమైన సమస్యలే తప్ప, ఎక్కడా నిర్దిష్టమైన కార్యాచరణ లేదు. పైగా ఆ నివేదికలోనే చెప్పిన విషయం విస్మయం కలిగించక మానదు. ‘కొంతమంది ఆరోగ్య విషయాన్ని, ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని అంటున్నారు. కానీ, మన దేశంలో ఆరోగ్య రంగానికి సంబంధించిన మౌలిక సదుపా యాలు అటువంటి స్థితిలో లేవు’ అని స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా, ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపు స్థూల జాతీయోత్పత్తిలో 1.26 శాతంగా ఉందని, అది 2.5 శాతం పెరిగితే తప్ప ఎటువంటి నూతన సౌకర్యాలు సాధ్యంకావని తేల్చిచెప్పారు. ప్రపంచంలోని చాలా దేశాలు మనకన్నా అదనంగా ఆరోగ్యంమీద ఖర్చు పెడుతున్నాయి. అమెరికా 17 శాతం, బ్రెజిల్ 9.2 శాతం, డెన్మార్క్ 10.1 శాతం, కెనడా 10.7 శాతం జాతీయ స్థూల ఉత్పత్తిలో ఖర్చు చేస్తున్నాయి. కాబట్టే ఆ దేశాలు ఆరోగ్య రంగంలో వచ్చే ఎటు వంటి సమస్యలనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాయి. భారత్ కరోనా దెబ్బకు విలవిలలాడి పోవడానికి ఈ బడ్జెట్ లేమి కూడా కారణం. కేంద్ర, రాష్ట్రాల మీద పెత్తనాన్ని ప్రదర్శించింది. ఇది తాను ఏమీ చేయలేక మరొకరిని నిందించడమే తప్ప మరొకటి కాదు. అందువల్ల కరోనా అనంతరం ప్రభుత్వాలు సంపూర్ణ ఆరోగ్య వ్యవ స్థను, మన మౌలిక సదుపాయాలను పూర్తిగా సమీక్షించుకోవాలి. అంతేకాకుండా, హెల్త్ పాలసీ–2017 స్థానంలో మరొక సమ గ్రమైన, నూతనమైన ఆరోగ్య విధానం రూపకల్పన చేసుకోవాలి. అందులో చాలా స్పష్టంగా కేంద్ర, రాష్ట్రాల విధులను, బాధ్యతలను ప్రత్యేకంగా పేర్కొనాలి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనాను దృష్టిలో పెట్టుకొని, ఇకపై ప్రజల మీద భారం వేయకుండా ప్రభు త్వమే ఆరోగ్య బాధ్యతను వహించాలి. సార్వజనీన ఆరోగ్య రక్షణకు అంటే ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యాన్ని అందించే విధానాన్ని తయారు చేసుకోవాలి. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కోట్లాదిమందిని పేదవాళ్ల జాబితాలోకి తోసేసింది. ఇక ఎంతమాత్రం కూడా ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రులకు లక్షలు చెల్లించే స్థితి లేదు. ఇప్పుడు దేశం ముందు రెండే దారులున్నాయి. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య బాధ్యతను తీసుకోవడమా? లేదా ప్రజలు మూకుమ్మడిగా ప్రాణాలు కోల్పోవ డమా? మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
దడ పుట్టిస్తున్న ‘డెల్టా’.. 85 దేశాల్లోకి ఎంట్రీ!
ఐరాస: ప్రపంచ దేశాలకు దడ పుట్టిస్తున్న కరోనా డెల్టా వేరియంట్ను 85 దేశాల్లో గుర్తించారని గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది.మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదముందని హెచ్చరించింది. విస్తృతంగా వ్యాప్తి చెందే ప్రధాన వేరియంట్గా మారనుందని ఆందోళన వ్యక్తం చేసింది. వేరియంట్ల వారీగా ఆల్ఫా 170 దేశాల్లో, బీటా 119 దేశాల్లో, గామా 71 దేశాల్లో, డెల్టా 85 దేశాల్లో గుర్తించారని జూన్ 22న విడుదల చేసిన, గత వారం రోజుల గణాంకాలతో కూడిన నివేదికలో వెల్లడించింది. ఈ నాలుగు ఆందోళనకారక వేరియంట్ల (వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్) మ్యుటేషన్లను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఆల్ఫా సహా మిగతా వేరియంట్ల కన్నా డెల్టా అతి వేగంగా వ్యాప్తి చెందుతోందంది. జూన్ 14 –20 మధ్య భారత్లో అత్యధికంగా 4,41,976 కేసులు, 16,329 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. అయితే, ఇవి గతవారంతో పోలిస్తే 30% తక్కువని తెలిపింది. డెల్టా వేరియంట్ సోకినవారికి ఆక్సిజన్ అవసరం, ఐసీయూలో చేరే పరిస్థితి అధికంగా ఉందని, మరణాలు కూడా అధికంగానే ఉన్నాయని సింగపూర్లో విడుదలైన ఒక నివేదిక వెల్లడించిందని తెలిపింది. ఆల్ఫా కన్నా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని జపాన్లో విడుదలైన ఒక నివేదిక పేర్కొందని వెల్లడించింది. డెల్టా వేరియంట్పై ఫైజర్ బయోఎన్టెక్–కొమిర్నటీ, ఆస్ట్రాజెనెకా–వాక్జ్జెవ్రియా టీకాలు ప్రభావవంతంగా పనిచేశాయని ఆ రెండు నివేదికలు వెల్లడించాయని పేర్కొంది. మైసూరులో ఒకరికి డెల్టా ప్లస్ మైసూరు: మైసూరులో ముగ్గురికి డెల్టా వేరియంట్ కరోనా వైరస్, ఒకరికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్లు అధికారులు తెలిపారు. మైసూరులో 19 ఏళ్ల యువకుడిలో రాష్ట్రంలో తొలిసారి డెల్టా వైరస్ను గుర్తించారు. అలాగే మరో ఇద్దరిలోనూ డెల్టా వైరస్, ఒకరిలో డెల్టా ప్లస్ వేరియంట్ను గుర్తించారు. మే 13న బెంగళూరులోని నిమ్హాన్స్ ల్యాబ్కు ఈ అనుమానిత కరోనా రోగుల శాంపిల్స్నుపంపించగా అందులో ముగ్గురికి బీ1.617.2 (డెల్టా), మరొకరిలో బీ1.617.2.1 (డెల్టా ప్లస్) వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొంది, ఈ నలుగురూ కోలుకున్నారని అ«ధికారులు తెలిపారు. -
కోవాగ్జిన్ను విదేశాలు గుర్తించడం లేదు: మమత
కోల్కతా: కోవాగ్జిన్ తీసుకున్న వారి విదేశీ ప్రయాణాలకు ఎలాంటి ఆటంకాలు చూడాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ’కోవాగ్జిన్కు విదేశాల్లో అనుమతి లేదు. విదేశాల్లో ఉన్నతచదువుల కోసం వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు సమస్యలు ఎదురవుతున్నాయి. కోవాగ్జిన్కు తమ దేశంలో గుర్తింపు లేదు కాబట్టి వారు వ్యాక్సిన్ తీసుకోనట్లుగానే ఆయాదేశాలు పరిగణిస్తున్నాయి. కోవాగ్జిన్ ప్రధాని నరేంద్ర మోదీ మానసపుత్రిక... బ్రెజిల్, బంగ్లాదేశ్లలో సమస్యలకు కారణమైంది. కోవాగ్జిన్కు తక్షణం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఆమోదం పొందండి లేదా ప్రపంచదేశాలు దీన్ని అంగీకరించేలా చర్యలు చేపట్టండి’ అని మమత పేర్కొన్నారు. కోవిషీల్డ్ తీసుకున్న వారికి విదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదన్నారు. ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్వో చాన్నాళ్ల కిందటే అనుమతించింది. చదవండి: (కోవాగ్జిన్ ఒప్పందం.. బ్రెజిల్లో ప్రకంపనలు)