శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక | Chinese Ship That Docked At Sri Lanka Port, Leaves After 6 Days | Sakshi
Sakshi News home page

శ్రీలంకను వీడిన చైనా నిఘా నౌక

Published Tue, Aug 23 2022 6:23 AM | Last Updated on Tue, Aug 23 2022 6:23 AM

Chinese Ship That Docked At Sri Lanka Port, Leaves After 6 Days - Sakshi

కొలంబో: శ్రీలంకలోని వ్యూహాత్మకంగా కీలకమైన హంబన్‌టోట పోర్టులో మకాం వేసిన చైనా నిఘా నౌక ఆరు రోజుల అనంతరం సోమవారం అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థలు, శాటిలైట్‌ ట్రాకింగ్‌ సామర్థ్యం కలిగిన యువాన్‌ వాంగ్‌ 5 రాకపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ నౌక హంబన్‌టోటకు ఈనెల 11వ తేదీనే రావాల్సి ఉంది. భారత్‌ భద్రతాపరమైన ఆందోళనల నడుమ శ్రీలంక అధికారులు అనుమతులను వెంటనే ఇవ్వలేదు.

చైనా నిర్వహణలో ఉన్న హంబన్‌టోటకు ఈ నెల 16వ తేదీన చేరుకుని ఇంధనం నింపుకునే కారణంతో సోమవారం వరకు అక్కడే లంగరేసింది. యువాన్‌ వాంగ్‌ 5 సోమవారం సాయంత్రం 4 గంటలకు చైనాలోని జియాంగ్‌ యిన్‌ పోర్టు దిశగా తిరిగి బయలుదేరి వెళ్లిపోయిందని హార్బర్‌ అధికారులు వెల్లడించారు. ముందుగా కుదిరిన ఒప్పందం ప్రకారం పోర్టులో ఉన్న సమయంలో నౌకలోని సిబ్బందిని మార్చలేదని వివరించారు. తమ ప్రాదేశిక జలాల్లో ఉన్న సమయంలో ఈ నౌకలోని ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ వ్యవస్థ స్విఛాన్‌ చేసి ఉంటుందని, ఎటువంటి పరిశోధనలు జరపరాదనే షరతులతోనే అనుమతులు ఇచ్చినట్లు శ్రీలంక ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement