అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి | Two Indian students die while swimming in lake in USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి

Published Mon, Apr 24 2023 6:33 AM | Last Updated on Mon, Apr 24 2023 6:33 AM

Two Indian students die while swimming in lake in USA - Sakshi

న్యూయార్క్‌: అమెరికాలో ఇండియానా రాష్ట్రంలో సరస్సులో ఈతకెళ్లిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ నెల 15వ తేదీన సిద్ధాంత్‌ షా(19), ఆర్యన్‌ వైద్య(20)లు మరికొందరితో కలిసి మొన్రో సరస్సులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈదుతూనే ఇద్దరూ నీళ్లలో మునిగిపోయారు.

అధికారులు ఎంతగా ప్రయత్నించినా వారి జాడ దొరకలేదు. ఈ నెల 18వ తేదీన ఇద్దరి మృతదేహాలు సరస్సులో తేలియాడుతూ కనిపించగా వెలికితీశారు. సిద్ధాంత్, ఆర్యన్‌లు ఇండియానా యూనివర్సిటీకి చెందిన కెల్లీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ విద్యార్థులని అధికారులు వెల్లడించారు. వీరిద్దరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement