నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
● డీఎంహెచ్ఓ మల్లికార్జున్
నర్మెట: ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్ అన్నారు. ఆశ డే సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యసిబ్బంది ని బద్ధతతో విధులు నిర్వర్తించాలని సూపర్వైజర్లు, ఏ ఎన్ఎంలు, ఆశలు క్షేత్రస్థాయిలో పర్యటించి పేదవారికి పూర్తిస్థాయిలో వైద్యం అందేలా చూడాలన్నా రు. ఈ సందర్భంగా పల్లె దవాఖాన సామగ్రిని ఎంఎల్హెచ్విలకు అందజేశారు. టీబీ సూటం సాంప్సి ల్స్, కుస్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి వైద్యాధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి భాస్కర్, మండల వెద్యాధికారులు సీహెచ్ ఉదయ్ కిరణ్, ప్రసన్న కృష్ణ, సూపర్వైర్లు పద్మావతి, భాగ్య, నల్లగంతల శ్రీనివాస్, ఏఎన్ఎంలు, ఆశలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment