ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలి

Apr 16 2025 11:12 AM | Updated on Apr 16 2025 11:12 AM

ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలి

ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలి

జనగామ రూరల్‌: ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతీరోజు కేంద్రాలను పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్‌ రెవెన్యూ రోహిత్‌ సింగ్‌ ఆదేశించారు. మంగళవారం జనగామ మండలం పెంబర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపీఎంఎస్‌లో వివరాలను నమోదు చేయాలన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి సరస్వతి, సహకార శాఖ అధికారి రాజేందర్‌ రెడ్డి, డీఎం మేనేజర్‌ హథిరాం తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ రోహిత్‌ సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement