కరువు పనిపై పెరుగుతున్న ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

కరువు పనిపై పెరుగుతున్న ఆంక్షలు

Published Wed, Feb 19 2025 1:01 AM | Last Updated on Wed, Feb 19 2025 1:01 AM

-

కాటారం: గ్రామాల్లో వలసలు తగ్గించి స్థానికంగానే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన జాతీయ ఉపాధిహామీ పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై విధి విధానాలు మారుస్తుండడంతో క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరు అగమ్యగోచరంగా మారిపోయింది. గతంలో ఉపాధి పనులను పూర్తిస్థాయిలో వినియోగించుకున్న కూలీలు ప్రస్తుతం పనుల పట్ల పూర్తిస్థాయి విముఖత చూపిస్తున్న పరిస్థితి నెలకొంది. కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌ కారణంగా ఉపాధి పనులపై పెరిగిన ఆంక్షలతో గ్రామాల్లో పనులకు వచ్చే కూలీల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. జిల్లాలోని మొత్తం కూలీలలో కనీసం 10శాతం కూలీలు కూడా ఉపాధి పనులకు రావడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement