బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

Published Wed, Feb 19 2025 1:01 AM | Last Updated on Wed, Feb 19 2025 12:58 AM

బుధవా

బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

వేసవి భత్యం ఊసేలేదు..

వేసవికాలం దృష్ట్యా గతంలో ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు ఐదు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉపాధి కూలీలకు 20శాతం అదనపు వేసవి భత్యం ఇచ్చేది. రెండేళ్ల వేసవి భత్యం నిలిచిపోగా ఈసారి కూడా వేసవి భత్యం అందేలా లేదు. దీంతో కూలీల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఉపాధి పనిదినాలు పెంచేందుకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం కూలీలకు అదనపు భత్యాన్ని అందజేసేది. దీంతో పనిచేసిన కూలీలకు ఆ రోజు పొందే కూలీలో ఫిబ్రవరి నెలలో 20శాతం, మార్చిలో 25శాతం, ఏప్రిల్‌, మే నెలల్లో 30శాతం, జూన్‌లో 20శాతం అదనపు భత్యం చెల్లిస్తుండేవారు. ఉపాధిహామీ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో వినియోగించిన సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా నేషనల్‌ ఇర్మమెటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో మూడేళ్లుగా ఉపాధి చెల్లింపులు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐసీ ఆధ్వర్యంలోకి వెళ్లడంతో అందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే వీలు లేకుండా పోయింది. ఉపాధి కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఒక రోజుకు గరిష్టంగా రూ.300 కూలీ చెల్లిస్తుంది. కూలీల వేతనాలు సైతం వారి ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వేసవి భత్యం ఇచ్చే అవకాశం లేకపోవడంతో వేసవిలో పనిచేసే కూలీల అలవెన్స్‌కు బ్రేక్‌ పడింది. దీనికి తోడు ఉపాధి పనులు జరిగే పని ప్రాంతంలో ఎండల తీవ్రత, వసతుల లేమి కారణాలతో పనులకు వచ్చే కూలీల సంఖ్య తగ్గిపోతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

నిలిచిన వేసవి భత్యం

కేంద్రం కొత్త సాఫ్ట్‌వేర్‌తో అందని అదనపు కూలి

కూలీల అలవెన్స్‌ హుష్‌కాకి

ఉపాధి పనులపై కూలీల విముఖత

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 20251
1/1

బుధవారం శ్రీ 19 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement