మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
భూపాలపల్లి రూరల్: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించే విధంగా కృషిచేయాలని అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సూచించారు. జిల్లాకేంద్రంలోని సమాఖ్య భవనంలో డీఆర్డీఓ నరేష్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సమాఖ్య సంఘాల సభ్యులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో రుణాలు అందిస్తుందన్నారు. మహిళా సంఘాలు, మహిళా సభ్యులు అందరూ ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, వీఓలు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ విజయలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment