మహనీయుల జయంతులను ఆచరిద్దాం | - | Sakshi
Sakshi News home page

మహనీయుల జయంతులను ఆచరిద్దాం

Apr 10 2025 12:57 AM | Updated on Apr 10 2025 12:57 AM

మహనీయుల జయంతులను ఆచరిద్దాం

మహనీయుల జయంతులను ఆచరిద్దాం

హొసపేటె: జిల్లా యంత్రాంగం ఏప్రిల్‌ 30న బసవణ్ణ జయంతిని సరళంగా జరుపుకుంటుందని, మే 10న మహాసాధ్వి హేమారెడ్డి మల్లమ్మ జయంతితో పాటు ఇద్దరు మహానుభావుల జయంతులను ఘనంగా నిర్వహిస్తుందని జిల్లాధికారి ఎంఎస్‌ దివాకర్‌ తెలిపారు. నగరంలోని తన కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన గురు బసవేశ్వర జయంతి, హేమారెడ్డి మల్లమ్మ జయంతి ఉత్సవాలపై సన్నాహక సమావేశానికి బుధవారం ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. తల్లిదండ్రులు నేటి యువతరానికి, పిల్లలకు బసవణ్ణ ఆలోచనలు, తత్వాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్‌ 30న బసవణ్ణ విగ్రహానికి పూలమాల వేసి, ఆపై కొట్టూరేశ్వర మఠంలో జరిగే సామూహిక వివాహ వేడుకలను నిర్వహిస్తారన్నారు. మే 10న మహాసాధ్వి హేమారెడ్డి మల్లమ్మ జయంతి, బసవణ్ణ జయంతులను ఘనంగా జరుపుకుందామన్నారు. నగరంలోని సన్నక్కి వీరభద్రేశ్వర ఆలయం నుంచి బసవేశ్వర సర్కిల్‌ వరకు భారీ ఊరేగింపు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ పి. వివేకానంద, కన్నడ, సంస్కృతి శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సిద్దలింగేష్‌ రంగన్నవర్‌, తహసీల్దార్‌ ఎం.శృతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement