సీయూఈటీలో ఖమ్మం విద్యార్థిని ప్రతిభ | Sakshi
Sakshi News home page

సీయూఈటీలో ఖమ్మం విద్యార్థిని ప్రతిభ

Published Tue, Aug 15 2023 1:22 AM

- - Sakshi

ఖమ్మం, సహకారనగర్‌: కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్టు (సీయూఈటీ)లో ఖమ్మానికి చెందిన విద్యార్థిని ప్రతిభ కనబర్చింది. జిల్లా కేంద్రంలోని బుర్హాన్‌పురానికి చెందిన వున్నవ రిషిక కేంద్రియ విద్యాలయంలో పదో తరగతి వరకు చదవగా, ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. ఈ క్రమంలో సీయూఈటీ రాసిన ఆమె 541 మార్కులు సాధించగా.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (షిల్లాంగ్‌ క్యాంపస్‌)లోని అన్ని విభాగాల్లో సీటు సాధించింది. తెలంగాణ నుంచి అన్ని విభాగాల్లో సీటు సాధించిన ఏకై క విద్యార్థినిగా రిషిక గుర్తింపు సాధించింది. ఆమె ఈ విద్యా సంవ త్సరం(2023–24) బీఏ హానర్స్‌ రీసెర్చ్‌ ఇంగ్లిష్‌ కోర్సు అభ్యసించాలని నిర్ణయించుకుంది. కాగా, రిషిక తండ్రి ఇంగ్లిష్‌ ఉపాధ్యాయుడైన కిరణ్‌కుమార్‌ కరోనా సమయంలో కన్నుమూశాడు. ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యంగా రిషిక చెబుతోంది.

వున్నవ రిషిక
1/1

వున్నవ రిషిక

Advertisement
Advertisement