
నేడు పొద్దుటూరు, బోనకల్ మార్గంలో ప్రత్యేక బస్సులు
ఖమ్మంమయూరిసెంటర్: బోనకల్ మండలం పొద్దుటూరులో గురువారం బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుండగా ప్రత్యేక బస్సును నడిపిస్తున్నట్లు ఖమ్మం ఆర్టీసీ డిపో మేనేజర్ పి.దినేష్కుమార్ తెలిపారు. ఖమ్మం నుండి కొణిజర్ల, పొద్దుటూరు మీదుగా బోనకల్ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ఖమ్మం పాత బస్టాండ్ గురువారం ఉదయం 9–30, మధ్యాహ్నం 12–30, సాయంత్రం 03–30, 6–30 గంటలకు బస్సులు బయలుదేరతాయని, బోనకల్ నుండి ఖమ్మంకు ఉదయం 8, 11, మధ్యాహ్నం 2, రాత్రి 8 గంటలకు బస్సులు ఉంటాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment