ఆధార్‌ ప్రామాణికత విధానాన్ని మార్చండి | - | Sakshi
Sakshi News home page

ఆధార్‌ ప్రామాణికత విధానాన్ని మార్చండి

Published Fri, Mar 7 2025 9:08 AM | Last Updated on Fri, Mar 7 2025 9:05 AM

ఆధార్‌ ప్రామాణికత విధానాన్ని మార్చండి

ఆధార్‌ ప్రామాణికత విధానాన్ని మార్చండి

భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ సంక్షేమ, సామాజికాభివృద్ధి, సంతృప్తికర స్థాయిలను తెలుసుకు నేందుకు వినియోగిస్తున్న ఆధార్‌ ప్రామాణికత విధానాన్ని మార్చాలని గ్రామ/వార్డ్‌ సచివాలయ ఉద్యోగుల పంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్య గురువారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వరుస సర్వేల నిమిత్తం సచివాలయ ఉద్యోగులను ప్రజల ఇళ్లకు పంపి ఆధార్‌ అథెంటిఫికేషన్‌ కోసం ఓటీపీ లేదా బయోమెట్రిక్‌, ఫేషియల్‌ కోసం అడిగినప్పుడు పదేపదే ఎందుకు ఇన్నిసార్లు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఒక వైపు ఓటీపీలు షేర్‌ చేయవద్దని వివిధ మాధ్య మాల్లో బ్యాంకులు చెబుతుంటే సచివాలయ ఉద్యోగులు మాత్రం ఇంటింటికి వచ్చి అడిగి ఇబ్బంది పెడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల ద్వారా చేయించే ప్రతి సర్వే గురించి ప్రభుత్వం ముందుగా ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మాధ్యమాల ద్వారా ప్రతి పౌరునికి తెలిసేలా ప్రచారం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సచివాలయ ఉద్యోగుల పంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అర్లయ్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement