కర్నూలు(సెంట్రల్): ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని జి.శ్రీలేఖ కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు కలెక్టర్ పి.రంజిత్బాషా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల సి.బెళగల్ మండలం పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న సైన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న శ్రీలేఖతో పాటు మరో ఆరుగురిపై చెట్టు కొమ్మ విరిగి పడగా తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలుపెద్దాసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీలేఖ ఆదివారం చనిపోవడంతో విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా రూ.5 లక్షలు మంజూరు చేశారు. బాలిక మృతి దురదృష్టకరమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment