ఆర్చ్ను ఢీకొన్న టిప్పర్
●డ్రైవర్ దుర్మరణం..ఎల్కుర్తిలో ఘటన
ధర్మసాగర్: ఓ టిప్పర్.. వెంచర్ ఆర్చ్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని ఎల్కుర్తి శివారు ఓ వెంచర్ వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కాజీపేట మండలం మడికొండ గ్రామానికి చెందిన చేపూరి అనిల్ (36) టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎల్కుర్తి శివారులో హనుమకొండకు చెందిన ఓ వ్యక్తి వెంచర్ చేస్తున్నాడు. వెంచర్ ముందుభాగంలో ఆర్చ్ నిర్మాణం చేశాడు. వెంచర్లో టిప్పర్లతో మొరం పోస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అనిల్ టిప్పర్లో మొరం లోడ్ చేసుకుని వెంచర్లో అన్లోడ్ చేశాడు. అనంతరం డబ్బా దించకుండానే వస్తున్న క్రమంలో ఆర్చ్ పిల్లర్ను ఢీకొంది. దీంతో ఆర్చ్ కూలి టిప్పర్ ముందు భాగంలో పడడంతో అనిల్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జానీపాషా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment