పీయూ సిబ్బందికి ఈపీఎఫ్‌ సదుపాయం | - | Sakshi
Sakshi News home page

పీయూ సిబ్బందికి ఈపీఎఫ్‌ సదుపాయం

Apr 3 2025 1:28 AM | Updated on Apr 3 2025 1:28 AM

పీయూ సిబ్బందికి ఈపీఎఫ్‌ సదుపాయం

పీయూ సిబ్బందికి ఈపీఎఫ్‌ సదుపాయం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీ సిబ్బందికి గత కొన్నేళ్లుగా ఈపీఎఫ్‌ సదుపాయం లేకపోవడంతో వీసీ శ్రీనివాస్‌ చొరవతో ఈపీఎఫ్‌ సదుపాయాన్ని కల్పిస్తూ ఇటీవలి జరిగిన ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ నాన్‌టీచింగ్‌ సంఘం నాయకులు వీసీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రామ్మోహన్‌ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా లేని ఈపీఎఫ్‌ సదుపాయాన్ని వీసీ చొరవ తీసుకుని కల్పించడం గొప్ప విషయమన్నారు. సిబ్బంది అనారోగ్యం పాలైతే రూ.లక్షల్లో ఖర్చు చేసి ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారని, ఈ సదుపాయం కల్పించడం వల్ల ఇబ్బందులు తప్పనున్నాయని పేర్కొన్నారు. సిబ్బందికి వేతనాలు సైతం గత కొన్నేళ్లుగా పెంపుదల లేదని, వాటిని త్వరలోనే పెంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు వీసీ చెప్పడం హర్షించదగ్గ విషయం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement