ఆర్జీయూకేటీలో ‘కథక్‌’ శిబిరం | - | Sakshi
Sakshi News home page

ఆర్జీయూకేటీలో ‘కథక్‌’ శిబిరం

Published Wed, Mar 5 2025 1:23 AM | Last Updated on Wed, Mar 5 2025 1:19 AM

ఆర్జీయూకేటీలో ‘కథక్‌’ శిబిరం

ఆర్జీయూకేటీలో ‘కథక్‌’ శిబిరం

బాసర: స్పిక్‌ మేకే హెరిటేజ్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించనున్న కథక్‌ నృత్య శిబిరాన్ని మంగళవారం ఆర్జీయూకేటీలో ప్రారంభించారు. మార్చి 4 నుంచి 8 వరకు నిర్వహించనున్న శిబిరంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కథక్‌ నృత్యకారిని శ్రీమతి ఆర్తి శంకర్‌, శ్రీమతి రచన విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ వీసీ గోవర్ధన్‌ మాట్లాడుతూ కనుమరుగవుతున్న సాంస్కృతిక కళలను ఆర్జీయూకేటీ విద్యార్థులకు అందిస్తున్నందుకు అభినందించారు. శిబిరంలో శిక్షణ పొందిన 60 మంది విద్యార్థులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న సాక్‌ ఆడిటోరియంలో ప్రదర్శించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పిక్‌ మేకే హెరిటేజ్‌ క్లబ్‌ ఆర్జీయూకేటీ బాసర కోఆర్డినేటర్‌ డా.రాకేష్‌ రెడ్డి, అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ విఠల్‌, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement