
28 నుంచి రాష్ట్రస్థాయి మహిళల హ్యాండ్బాల్ పోటీలు
మందమర్రిరూరల్: ఈ నెల 28, 29, 30వ తేదీల్లో మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో రాష్ట్రస్థాయి మహిళల హ్యాండ్బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీల్లో సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున 20 మంది ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో ఎంపికై న జట్టు గుజరాత్లో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి రమేష్రెడ్డి, కోచ్ అరవింద్ పాల్గొన్నారు.