నర్సాపూర్: తెలంగాణ మోడల్ పాఠశాలలో 2025– 26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండలంలోని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పర్హానా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉందన్నారు. తమ పాఠశాలలో 6వ తరగతితో పాటు 7 నుంచి 10 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. కాగా ఏప్రిల్ 13వ తేదీన పరీక్ష ఉంటుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్లూఎస్ విద్యార్థులకు ఫీజు రూ. 125, ఓసీలకు రూ. 200 ఫీజు ఉంటుందని ప్రిన్సిపాల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment