అప్పుడిచ్చారు.. ఇప్పుడు లాక్కొంటున్నారు | - | Sakshi
Sakshi News home page

అప్పుడిచ్చారు.. ఇప్పుడు లాక్కొంటున్నారు

Published Tue, Feb 25 2025 7:27 AM | Last Updated on Tue, Feb 25 2025 7:26 AM

అప్పుడిచ్చారు.. ఇప్పుడు లాక్కొంటున్నారు

అప్పుడిచ్చారు.. ఇప్పుడు లాక్కొంటున్నారు

మెదక్‌ కలెక్టరేట్‌: భూములు లాక్కొంటున్నారు.. తమకు న్యాయం చేయాలంటూ మాసాయిపేట మండలం అచ్చంపేట దళితులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్చంపేటలోని 40 బీసీ, ఎస్సీ కుటుంబాలకు గ్రామ శివారులోని 61 నుండి 135 వరకు గల సర్వే నంబర్‌లలో 1994లో అప్పటి ప్రభుత్వం జీవనోపాధికై భూములిచ్చిందన్నారు. ఎస్సీలకు మూడెకరాలు, బీసీలకు ఎకరన్నర చొప్పు న కేటాయించారని, కాని హద్దులు చూపలేదని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక ఆ భూములను సాగుకు అనువుగా మార్చుకొన్నామన్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్‌ అధికారులు వచ్చి అడ్డుకోవడం వల్ల సాగు చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల రెవెన్యూ అధికారులు వచ్చి ఆ భూముల్లో పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారన్నారు. ఇప్పటి ప్రభుత్వం తమ భూములను లాక్కోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ స్పందించి న్యాయం చేయాలని వేడుకొన్నారు.

కలెక్టరేట్‌ ఎదుట దళితుల నిరసన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement