
వనం.. భక్త జనసంద్రం
గురువారం శ్రీ 27 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025
చిన్నారి
నృత్య ప్రదర్శన
ప్రత్యేక అలంకరణలో దుర్గమ్మ
నిలిచిన నీటి సరఫరా
జాతరలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టాయిలెట్లలో నీరు లేకపోవడంతో నిర్వాహకులు వాటికి తాళాలు వేశారు. తాగునీటి కోసం అవస్థలు తప్పలేదు. తర్వాత అధికారులు పొడిచన్ పల్లి తాగునీటి పథకం నుంచి నీటి సరఫరాను పునరుద్ధరించారు. అయితే ఉదయం భక్తుల సంఖ్య తక్కువగా కనిపించింది. సాయంత్రానికి ఎక్కువైంది. మంజీరనదిలో షవర్ బాత్ ల కింద స్నానాలు చేసిన భక్తులు దుర్గమ్మను దర్శించుకొని శివ దీక్షలు చేపట్టారు. సాయంత్రం పండ్లు తిని దీక్ష విరమించారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆర్డీఓ రమాదేవి, డీఎస్పీ ప్రసన్న కుమార్, ఈఓ చంద్రశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పాపన్నపేట(మెదక్): మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏడుపాయల జాతర బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేద బ్రాహ్మణులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంజీర నదిలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు ఉచిత సేవలు అందిస్తున్న ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకులు అవుల రాజిరెడ్డి సుప్రభాతరావు, ప్రభాకర్ రెడ్డి, గోవింద్ నాయక్ ఉన్నారు.
ఇబ్బందులు తలెత్తొద్దు: కలెక్టర్
ఏడుపాయల జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన వన దుర్గమ్మను దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నేడు బండ్లు తిరిగే కార్యక్రమం ఉన్నందున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, వారికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సైతం దుర్గమ్మను దర్శించుకొని పూజలు చేశారు. జాతరలో ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు.
న్యూస్రీల్
ఏడుపాయల జాతర ప్రారంభం
దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన
మంత్రి దామోదర
ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్, ఎస్పీ

వనం.. భక్త జనసంద్రం

వనం.. భక్త జనసంద్రం

వనం.. భక్త జనసంద్రం

వనం.. భక్త జనసంద్రం
Comments
Please login to add a commentAdd a comment