రెడీ... సెట్‌... గో | Allu Arjun announces Pushpa 2: The Rule is postponed | Sakshi
Sakshi News home page

రెడీ... సెట్‌... గో

Published Fri, Jul 19 2024 12:57 AM | Last Updated on Fri, Jul 19 2024 12:57 AM

Allu Arjun announces Pushpa 2: The Rule is postponed

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప: ది రూల్‌’. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ షూటింగ్‌కి రెడీ సెట్‌ గో అంటున్నారు మేకర్స్‌. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్‌’ (2021) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీకి సీక్వెల్‌గా సేమ్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప: ది రూల్‌’ రూపొందుతోంది.

షెడ్యూల్‌ ప్రకారం చిత్రీకరణ పూర్తి అయ్యుంటే ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్‌ సకాలంలో పూర్తి కాకపోవడం.. క్వాలిటీ విషయంలో చిత్రయూనిట్‌ రాజీ పడకపోవడంతో ఈ మూవీని డిసెంబర్‌ 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజా షెడ్యూల్‌ విషయానికి వస్తే.. ఈ నెల 22 లేదా 25న ప్రారంభం అవుతుందట. ఈ నెల 28 నుంచి అల్లు అర్జున్‌ కూడా చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. శరవేగంగా చిత్రీకరణ, పోస్ట్‌ప్రోడక్షన్‌ పనులు పూర్తి చేసి, డిసెంబరు 6నే సినిమాని విడుదల చేయాలని మేకర్స్‌ ఫిక్స్‌ అయ్యారని భోగట్టా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement