సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమా | Kaliyugam Pattanamlo Movie Streaming Now OTT | Sakshi
Sakshi News home page

సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమా

May 23 2024 8:13 AM | Updated on May 23 2024 9:19 AM

Kaliyugam Pattanamlo Movie Streaming Now OTT

విశ్వ కార్తీక్, ఆయూషి పటేల్‌ జంటగా నూతన దర్శకుడు రమాకాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్‌ ఆధ్వర్యంలో కందుల గ్రూప్‌ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కాటం రమేశ్‌ నిర్మించారు. ఈ సినిమా మార్చి 29న విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో చిన్న సినిమాగా ప్రేక్షకులముందుకు వచ్చినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. అయితే, ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండా సైలెంట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్‌. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మే 23 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. పిల్ల‌ల‌ను క్రమశిక్షణతో పెంచ‌క‌పోతే వారు సొసైటీకి ఎలాంటి అన‌ర్థాలు క‌లిగిస్తారో చాలా చక్కగా చెప్పాడు డైరెక్టర్‌. నేను శైల‌జ‌ సినిమాలో కేజీ క్రేజీ ఫీలింగ్ అనే సాంగ్‌తో మెప్పించిన చిత్ర శుక్లా.. ఈ సినిమాలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఎలాంటి బోరింగ్‌ లేకుంగా సాగే ‘కలియుగం పట్టణంలో’ కథను మీరు చూసేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement