Manchu Vishnu Entry In Kollywood Industry With Tamil Film - Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో లక్‌ పరీక్షించుకోనున్న మంచు విష్ణు

Published Fri, Dec 10 2021 3:46 PM | Last Updated on Fri, Dec 10 2021 4:41 PM

Manchu Vishnu Entry In Kollywood Industry With Tamil Film - Sakshi

కురళ్‌ 388 చిత్రంతో తెలుగుస్టార్‌ నటుడు మంచువిష్ణు కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు. నటుడు మోహన్‌బాబు పెద్దకొడుకే మంచువిష్ణు. ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం కురళ్‌ 388. రామా రీల్స్‌ పతాకంపై జాన్‌ సుధీర్, కిరన్‌ ధనబాలా కలిసి నిర్మించిన ఈ చిత్రంలో నటి సురభి హీరోయిన్‌గా, సంపత్‌కుమార్, నాజర్, మునీష్‌కాంత్, రామదాస్, జయప్రకాష్, పంజు సుబ్బు తలైవాసల్‌ విజయ్, ప్రగతి, సురేఖవాణి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.

జీఎస్‌ కార్తీక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. దీనికి ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతం, రాజేష్‌ యాదవ్‌ ఛాయాగ్రహణం అందించినట్లు దర్శకుడు తెలిపారు.

చదవండి: Mahesh Babu: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌పై ఆసక్తిగా స్పందించిన మహేశ్‌ బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement