ఆ ఒత్తిడి మా మీదా ఉంది | Nepotism accusations haven't reached the South yet | Sakshi
Sakshi News home page

ఆ ఒత్తిడి మా మీదా ఉంది

Oct 15 2020 12:51 AM | Updated on Oct 15 2020 9:07 AM

Nepotism accusations haven’t reached the South yet - Sakshi

సీనియర్‌ నటి సుహాసినిలో దర్శకురాలు కూడా ఉన్నారు. గతంలో ‘ఇందిర’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారామె. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు సుహాసిని. అమేజాన్‌ ప్రైమ్‌ నిర్మించిన ‘పుత్తమ్‌ పుదు కాలై’ అనే యాంథాలజీలో ఓ భాగానికి దర్శకత్వం వహించారామె. ‘కాఫీ, ఎనీవన్‌?’ టైటిల్‌తో తెరకెక్కిన ఈ భాగంలో అనూహాసన్, శ్రుతీహాసన్‌ నటించారు. ఈ నెల 16న ఈ యాంథాలజీ ప్రైమ్‌లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ– ‘‘కాఫీ, ఎనీవన్‌’ కథలో మా కజిన్‌ అనూహాసన్, శ్రుతీహాసన్‌ నటించారు. మా నాన్న చారుహాసన్, బాబాయి కమల్‌హాసన్‌ని కూడా యాక్ట్‌ చేయించాలనుకున్నాను. తర్వాత వద్దనుకున్నాను. ఈ లాక్‌డౌన్‌ సమయంలో సుమారు ఆరు షార్ట్‌ స్టోరీలు సిద్ధం చేసుకున్నాను’’ అన్నారు. కుటుంబ సభ్యులకే అవకాశాలు, నెపోటిజమ్‌ అనే టాపిక్‌ గురించి మాట్లాడుతూ – ‘‘నేను చారుహాసన్, కమల్‌హాసన్‌ కుటుంబానికి చెందిన వ్యక్తిని అనేది ఎవ్వరం మార్చలేం. ఆ నెపోటిజమ్‌ ఒత్తిడి మా మీదా ఉంది. మా తర్వాతి తరం అయిన శ్రుతీహాసన్‌ వంటి వాళ్ల మీద ఇంకా ఉంది. అయితే సౌతిండియాలో నెపోటిజమ్‌ అనే మహమ్మారి  ఇంకా రాలేదనుకుంటున్నాను’’ అన్నారు సుహాసిని.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement