suhasini
-
షూటింగ్ పూర్తి కాగానే అక్కడ జరిగేది ఇదే.. లైంగిక వేధింపులపై సుహాసిని
మలయాళ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ నివేదిక స్పష్టం చేసిన తర్వాత చాలామంది సీనియర్ హీరోయిన్లు నిజమేనంటూ తమ అభిప్రాయం చెప్పారు. అయితే, తాజాగా నటి సుహాసిని ఆ విషయాన్ని మరోసారి ధ్రువీకరించారు. ప్రస్తుతం గోవాలో అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సినిమాలో మహిళలకు రక్షణ అనే అంశంపై చర్చావేదికను నిర్వహించారు. అందులో పలు భాషలకు చెందిన నటీమణులు, దర్శకులు పాల్గొన్నారు. అందులో పాల్గొన్న నటి సుహాసిని మాట్లాడుతూ సినిమా రంగం ఇతర రంగాలకు కాస్త భిన్నమైందని పేర్కొన్నారు. ఇతర రంగాలలో పని చేసే వారు పని పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోతారన్నారు. అయితే సినిమాలో అలా కాదన్నారు. 200 నుంచి 300 మంది షూటింగ్ కోసం ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడే ఒక కుటుంబంలా కలిసుండాలన్నారు. అక్కడ విధి, విధానాలను పాటించకపోతే హద్దులు మీరే అవకాశం ఉంటుందన్నారు. 200 మంది ఓ చిత్ర యూనిట్లో తమ కుటుంబాలకు దూరంగా ఉండే వారిపై కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు సినిమా రంగంలోని వస్తున్న వారికి సరైన అనుభవం ఉండటం లేదన్నారు. దీన్ని కొందరు తప్పుగా వాడుకోవాలను చూస్తారన్నారు. అదేవిధంగా ఇతర చిత్ర పరిశ్రమల మాదిరి మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలకు రక్షణ తక్కువన్నారు. మలమాళ చిత్రాల షూటింగ్లు అధికంగా వేర్వేరు ప్రాంతాల్లో జరుగుతుంటాయని చెప్పారు. దీంతో నటీమణులు నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుందన్నారు. దీంతో వారిపై తప్పుగా ప్రవర్తించే అవకాశం ఎక్కువన్నారు. ఇదే మలయాళ చిత్ర పరిశ్రమలో జరుగుతోందని చెప్పారు. తమిళ చిత్ర షూటింగ్ పూర్తి అయితే తాను చైన్నెకి తిరిగి వెళ్లిపోతానని, తెలుగు షూటింగ్ అయితే హైదరాబాద్కు, కర్ణాటకలో షూటింగ్ అయితే బెంగళూర్కు వెళ్లిపోతానన్నారు. అయితే మలయాళం సినిమాల షూటింగ్ పూర్తి అయితే మీరు ఇంటికి తిరిగి వెళ్లలేరని, కారణం అక్కడ అలాంటి వాతావరణం లేకపోవడమేనని అన్నారు. అంతేకాకుడా మీకు బయటకు కూడా వెళ్లడం కుదరదన్నారు. అందుకే షూటింగ్ ప్రాంతాల్లో హద్దులు మీరుతున్నాయనే అభిప్రాయాన్ని నటి సుహాసిని వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
ఆస్పత్రిలో చేరిన హీరో కమల్ హాసన్ సోదరుడు
ప్రముఖ నటుడు, దర్శకుడు చారు హాసన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని ఈయన కుమార్తె, ఒకప్పటి హీరోయిన్ సుహాసిని చెప్పుకొచ్చింది. దీపావళి పండగ ముందు అంటే గురువారం రాత్రి చారు హాసన్.. అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)'దీపావళికి ముందే మా నాన్న అస్వస్థతకు గురయ్యారు. మా పండగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారు' అని సుహాసిని తన్ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్స్, కమల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) -
చంద్రబాబుపై క్రిమినల్ కేసు..!?
-
ఆస్పత్రి పాలైన హీరో కమల్ హాసన్ సోదరుడు.. ఏమైందంటే?
ప్రముఖ హీరో కమల్ హాసన్ సోదరుడు చారు హాసన్ ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఈయన వయసు 93 ఏళ్లు. ఈ వయసులో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా తాజాగా అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు హాస్పిటల్లో చేర్చారు. ఈ క్రమంలోనే ఈయన కూతురు, ప్రముఖ నటి సుహాసిని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. తండ్రి పరిస్థితి గురించి ఆసక్తికరంగా రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: ఎన్నాళ్ల నుంచో ఇబ్బంది పడుతున్నాం.. హీరో రాజశేఖర్ ట్వీట్)కమల్ హాసన్కి చారు హాసన్ అన్నయ్య. వీళ్లిద్దరి మధ్య 15 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇకపోతే చారు హాసన్ కి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సుహాసిని ఇందులో ఒకరు. తెలుగు, తమిళ సినిమాల్లో అప్పట్లో హీరోయిన్ గా చాలాగుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తోంది.ఇదిలా ఉండగా నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చారు హాసన్.. 1979 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. 93 ఏళ్ల వయసులోనూ 'హర' అనే సినిమాలో నటించారు. తాజాగా ఆరోగ్య రీత్యా వచ్చే సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం తన తండ్రికి ఏం పర్లేదని, కోలుకుంటున్నారని సుహాసిని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: టాలీవుడ్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) -
అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత పల్లె అనుచరుల దుశ్చర్య
పుట్టపర్తి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండలం నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త , ఎస్టీ కులానికి చెందిన సుహాసినిపై టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు ఆంజనేయులు బలాత్కారానికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే సుహాసిని కుమార్తె కదిరిలో చదువుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి కుమార్తెను ఇంటికి తీసుకొస్తుండగా.. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో నాయనాకోట తండాలో కాపుకాసిన పల్లె అనుచరుడు ఆంజనేయులు, అతని కుటుంబ సభ్యులు సుహాసిని చీర లాగి బలాత్కారం చేయబోయారు. ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్ లాక్కున్నారు. అడ్డొచ్చిన ఆమె తల్లిపై దాడిచేసి చేయి విరగ్గొట్టారు. కులం పేరుతో దూషించారు. తోటి కార్యకర్తను కాపాడిందని.. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త పోస్టును తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకోవాలని ఆంజనేయులు ప్రయతి్నస్తున్నాడు. ఈ క్రమంలోనే స్థానిక అంగన్వాడీ కార్యకర్త నాగమణిని వేధింపులకు గురి చేశారు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఈ నెల 27న ఆత్మహత్యకు ప్రయతి్నంచింది. అంగన్వాడీ కేంద్రంలోనే సెల్ఫీ వీడియో తీసి ఆంజనేయులు ఆగడాలను వివరిస్తూ పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.పక్క గ్రామమైన నారసింపల్లి తండాకు చెందిన మినీ అంగన్వాడీ కార్యకర్త సుహాసినికి విషయం తెలియడంతో వెంటనే సదరు కేంద్రానికి వెళ్లి తోటివారితో కలిసి నాగమణిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగమణి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కాగా.. నాగమణిని రక్షించిందనే కోపంతో సుహాసినిపై పల్లె అనుచరుడు ఆంజనేయులు దాషీ్టకానికి ఒడిగట్టాడు. బాధితురాలు జాయింట్ కలెక్టర్ అభిõÙక్కుమార్, ఎస్పీ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా అంగన్వాడీ కార్యకర్తపై దాడి చేసిన ఆంజనేయులు, అతని కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, గౌరవాధ్యక్షుడు వెంకటే‹Ù, అధ్యక్షుడు మహబున్నీషా, కోశాధికారి శ్రీదేవి,కార్యదర్శి దిల్షాద్ పాల్గొన్నారు. -
సూర్యాపేటలో ఘోరం: ఆడపిల్ల అని తెలిసి అబార్షన్, వైద్యం వికటించి..
సూర్యాపేటటౌన్: పుట్టేది ఆడపిల్ల అని తెలిసి భార్యకు ఆర్ఎంపీతో భర్త అబార్షన్ చేయించగా, వైద్యం వికటించి ఆమె మృతిచెందింది. మృతురాలి కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఎంజీనగర్తండాకు చెందిన రత్నావత్ హరిసింగ్కు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని రాముతండాకు చెందిన సుహాసిని(26)కి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. సుహాసిని మూడోసారి గర్భవతి కాగా, స్కానింగ్లో ఆడపిల్ల అని తెలియడంతో హరిసింగ్ సుహాసినికి అబార్షన్ చేయించాలనుకున్నాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ సలహా తీసుకోగా.. ఏడో నెలలో అబార్షన్ చేయిస్తే తల్లీబిడ్డకు ప్రమాదం ఉంటుందని ఆమె చెప్పింది. అయినా, సుహాసినిని రెండురోజుల క్రితం బలవంతంగా హరిసింగ్ హుజూర్నగర్ ప్రాంతంలో ఓ ఆర్ఎంపీతో అబార్షన్ చేయించాడు. అయితే వైద్యం వికటించి సుహాసిని పరిస్థితి విషమంగా మారింది. మెరుగైన వైద్యం కోసం కోదాడకు, ఆపై ఖమ్మంకు అక్కడ నుంచి సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా ఆమె మృతి చెందింది. అయితే సుహాసిని మృతిచెందిన విషయాన్ని హరిసింగ్ కుటుంబసభ్యులకు చెప్పకుండా ఎంజీనగర్ తండాకు తీసుకొచ్చాడని, గ్రామస్తులు గమనించి విషయం తమకు తెలిపారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. సూర్యాపేటటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పంపించారు. అయితే పోలీసులు ఫిర్యాదు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. పీహెచ్డీ చేసిన హరిసింగ్.. హరిసింగ్ నెలరోజుల క్రితమే ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకున్నాడని, ఉన్నత చదువులు చదివిన వ్యక్తే బలవంతంగా అబార్షన్ చేయించి సుహాసిని మృతికి కారణమయ్యాడని మృతురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సుహాసిని అంటే మీకు ఇష్టమా లేక ప్రేమనా..?
-
నమ్మించి.. నట్టేట్లో తోసేసి..
రావులపాలెం/తాడేపల్లి రూరల్: ఓ బిడ్డతో కలిసి ఉంటున్న మహిళను ప్రేమ పేరుతో నమ్మించాడు.. మూడేళ్ల పాటు సహజీవనం చేశాడు. ఓ చిన్నారికి జన్మనిచ్చాడు. అనంతరం వారిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. మాయమాటలు చెప్పి తల్లీబిడ్డలను గోదావరి బ్రిడ్జి పైకి తీసుకువచ్చి.. నిర్దాక్షిణ్యంగా నదిలోకి తోసేశాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద జరిగిన ఈ ఘటనలో తల్లి, ఏడాది చిన్నారి గల్లంతవ్వగా.. 13 ఏళ్ల బాలికను పోలీసులు రక్షించారు. వివరాలు.. భర్తతో విభేదాల వల్ల పుప్పాల సుహాసిని(36) కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లికి వచ్చి ఓ హోటల్లో పనిచేస్తూ కుమార్తె లక్ష్మీ సాయి కీర్తనతో కలిసి జీవిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఉలవ సురేశ్ కూడా తాడేపల్లిలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. సురేశ్కు అప్పటికే వివాహమైంది. అయినా సుహాసినిని ప్రేమిస్తున్నానంటూ నమ్మించాడు. ఎన్టీఆర్ కరకట్ట మీద ఉన్న ఓ ఇంట్లో మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. జెర్సీ(ఏడాది పాప) జన్మించిన తర్వాత గొడవలు మొదలై ఇద్దరూ విడిపోయారు. సుహాసిని తన ఇద్దరు బిడ్డలతో కలిసి క్రిస్టియన్పేటలో ఉంటోంది. సురేశ్ తరుచూ వచ్చి సుహాసినితో గొడవ పడేవాడు. దీంతో సుహాసిని తన పెద్ద కుమార్తె కీర్తనకు ఫోన్ ఇచ్చి.. ఇంటికి ఎవరైనా వచ్చి బెదిరిస్తే 100కు ఫోన్ చేయాలని ధైర్యం చెప్పి పనికి వెళ్లేది. ఈ నేపథ్యంలో సురేశ్ దుస్తులు కొందామని నమ్మించి సుహాసిని, లక్ష్మీకీర్తన, జెర్సీలను శనివారం రాత్రి కారులో రాజమహేంద్రవరం తీసుకువచ్చాడు. అక్కడి నుంచి రావులపాలెం తెచ్చాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గౌతమీ గోదావరి పాత బ్రిడ్జి పైకి కారును తీసుకువచ్చి ఆపాడు. ఆ తర్వాత కొంతసేపటికి సెల్ఫీ తీసుకుందామంటూ సుహాసినిని బ్రిడ్జి గోడపై కూర్చోమని చెప్పి.. సుహాసినితో పాటు జెర్సీని గోదావరిలోకి తోసేశాడు. అనంతరం కారులో కూర్చుని ఫోన్లో పాటలు వింటున్న కీర్తనను కూడా బయటకు తెచ్చి గోదావరిలోకి తోసేశాడు. ఆ తర్వాత సురేశ్ కారులో పరారయ్యాడు. సకాలంలో స్పందించిన పోలీసులు బ్రిడ్జి పై నుంచి పడిపోతున్న సమయంలో కీర్తన బ్రిడ్జికి ఉన్న కేబుల్ పైపును బలంగా పట్టుకుంది. తన వద్ద ఉన్న ఫోన్తో తెల్లవారుజామున 3.50 గంటలకు 100 నంబర్కు డయల్ చేసింది. పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఫోన్ లొకేషన్ ఆధారంగా 10 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని ఆమెను రక్షించారు. ప్రథమ చికిత్స అందించి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు. సుహాసిని, కీర్తన ఆచూకీ కోసం పోలీసులు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి కోసం మరో బృందం విస్తృతంగా గాలిస్తోంది. కీర్తన ప్రాణాలను కాపాడిన పోలీసులను ఎస్పీ శ్రీధర్ అభినందించారు. -
పొన్నియిన్ సెల్వన్ క్యాలెండర్ ఆవిష్కరణ
తమిళసినిమా: 2022లో అనూహ్య విజయం సాధింన చిత్రం పొన్నియిన్ సెల్వన్. దర్శకుడు మణిరత్నం అద్భుత సృష్టి ఇది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఇందులో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శరత్ కుమార్, ప్రకాశ్రాజ్, విక్రమ్ప్రభు వంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ నాయకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే. కల్కి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్ర రెండవ భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా పొన్నియిన్ సెల్వన్– 2 చిత్రం ఏప్రిల్ 28న తెరపైకి రానుంది. దర్శకుడు మణిరత్నం సతీమణి, నటి సుహాసిని వ్యవస్థాపకురాలుగా నామ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు. దీనికి దర్శకుడు కూడా గౌరవ ఫౌండర్గా వ్యవహరిస్తున్నారు. ఇది స్వచ్ఛంద సేవ ఫౌండేషన్. దీని ద్వారా పలుసేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా నామ్– 2023 పేరుతో పొన్నియిన్ సెల్వన్ చిత్రం దృశ్యాలతో క్యాలెండర్ను పొందుపరిచారు. బుధవారం సాయంత్రం స్థానిక టీ.నగర్లోని ఆ సంస్థ కార్యాలయంలో విడుదల చేశారు. మణిరత్నం, సుహాసినితో పాటు నామ్ ఫౌండేషన్ నిర్వాహకుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జయంరవి, జయరాం, రఘు పాల్గొని క్యాలెండర్ను ఆవిష్కరించారు. -
'నిన్నే చూస్తు' మూవీ రివ్యూ
టైటిల్ : నిన్నే చూస్తు దర్శకుడు: కె. గోవర్ధనరావు నటీనటులు: శ్రీకాంత్ గుర్రం, బుజ్జి(హేమలత రెడ్డి), సుహాసిని, సుమన్, సాయాజి షిండే, భానుచందర్, కిన్నెర, జబర్దస్త్ మహేష్ తదితరులు బ్యానర్ : వీరభద్ర క్రియేషన్స్ ప్రొడ్యూసర్: పోతిరెడ్డి హేమలత రెడ్డి సంగీతం: రమణ్ రాతోడ్ ఎడిటర్ : నాగిరెడ్డి కెమెరా : ఈదర ప్రసాద్ విడుదల తేదీ: అక్టోబర్ 27, 2022 శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం నిన్నే చూస్తు. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 27న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం.. కథ అమలాపురంలో ఉండే కృష్ణ (శ్రీకాంత్ గుర్రం) తన తండ్రి బాను చందర్ను హత్య చేసిన వారిని చంపాలని రగిలిపోతుంటాడు. బ్యాగ్లో గన్ పెట్టుకొని తల్లి సుహాసినికి ఇంటర్వ్యూ పేరుతో బయటకు వెళ్లి తన తండ్రిని చంపిన వారిని వెదుకుతూ ఉంటాడు. చివరకు తన తండ్రిని చంపిన వ్యక్తి వైజాగ్లో ఉన్నాడని తెలిసి అక్కడకు వెళ్లి చంపడానికి ట్రై చేస్తే అది మిస్ అవుతుంది. వైజాగ్లోని ప్రముఖ వ్యాపారవేత్త జగదీశ్ చంద్ర ప్రసాద్ (సుమన్), ఇంద్ర (కిన్నెర)ల కూతురు సత్య (హేమలతా రెడ్డి/ బుజ్జి ) అమెరికాలో చదువుకుని ఇండియాకు తిరిగి వస్తుంది. తన ఫ్రెండ్ స్వాతి(ప్రెసిడెంట్ కూతురు)ని కలవడానికి అమలాపురం వస్తుంది సత్య. ఈ క్రమంలో హీరోహీరోయిన్లిద్దరూ ప్రేమలో పడతారు. వీరి ప్రేమను కృష్ణ అమ్మ కూడా ఒప్పు కుంటుంది. పెద్దలతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం వైజాగ్ రమ్మంటుంది సత్య. దాంతో వైజాగ్ వెళ్లిన కృష్ణకు ఇంతకాలం తను చంపాలనుకున్న వ్యక్తి, ఎంతో ఇష్టంగా ప్రేమించిన సత్య తండ్రి జగదీశ్ చంద్ర ప్రసాద్ ఇద్దరూ ఒక్కరే అని తెలుసుకుంటాడు. అతడి మీద కోపంతో సత్యతో నువ్వంటే ఇష్టం లేదు "ఐ హేట్ యు" అని చెప్పి వస్తాడు. దీంతో సత్య తల్లి ఇంద్ర (కిన్నెర) సొంత అన్న అయిన సాయాజి షిండే కొడుకుతో సత్యకు పెళ్లి ఫిక్స్ చేస్తారు. అసలు జగదీశ్ చంద్ర ప్రసాద్ కృష్ణ నాన్న భానుచందర్ను ఎందుకు చంపాడు? జగదీశ్ను కృష్ణ చంపాడా లేదా? సత్య కృష్ణను పెళ్లాడిందా? లేక తన బావను పెళ్లి చేసుకుందా? అన్న విషయాలు తెలియాలంటే "నిన్నే చూస్తు".. సినిమా చూడాల్సిందే! నటీనటుల పనితీరు అమ్మను ప్రేమగా చూసుకొనే కొడుకుగా, సత్యను ప్రేమించే లవర్గా, మరో వైపు తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కొడుకుగా పలు షేడ్స్ వున్న పాత్రలో శ్రీకాంత్ చక్కగా నటించాడు. ఒక వైపు నిర్మాతగా మరోవైపు హీరోయిన్గా బుజ్జి(హేమలతా రెడ్డి) ఆకట్టుకుంటుంది. హీరోహీరోయిన్స్ తల్లిదండ్రులు, హీరో ఫ్రెండ్స్ వారి పాత్రలకు తగ్గట్లు నటించారు. సాంకేతిక నిపుణుల పనితీరు కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనను దర్శకుడు కె గోవర్ధనరావు అద్భుతంగా తెరకెక్కించాడు. రమణ్ రాథోడ్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రాఫర్ ఈదర ప్రసాద్ అందించిన విజువల్స్ పర్వాలేదు. లవ్ కు స్టార్స్ ఇవ్వకూడదు, ప్రేమను ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. నాగిరెడ్డి ఇంకాస్త ఎడిటింగ్ చేసుంటే బాగుండేది. చదవండి: అప్పుడే సమంతతో లవ్లో పడ్డా: విజయ్ దేవరకొండ బన్నీ భార్య స్నేహారెడ్డి చీర ఖరీదెంతో తెలుసా? -
హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
Suhasini Respond On Hindi Language War: ప్రస్తుతం సినీ పరిశ్రమంలో హిందీ భాష వివాదం హాట్టాపిక్గా నిలిచింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హిందీ జాతీయ భాష కాదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ల మధ్య ట్విటర్ వార్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వార్పై సౌత్, నార్త్ సినీ సెలెబ్రెటీలు స్పందిస్తు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి సుహాసిని హిందీ భాష వివాదంపై స్పందించారు. చదవండి: ‘లైగర్’కి రికార్డు డీల్స్, డిజిటల్, ఆడియో రైట్స్కు కళ్లు చెదిరే ఆఫర్స్ నటులు అన్న తర్వాత అన్ని భాషలను నేర్చుకోవాలని ఆమె అన్నారు. హిందీ భాష చాలా బాగుంటుందని, అది కూడా నేర్చుకోవాలని ఆమె సూచించారు. హిందీ వాళ్లు మంచి వాళ్లని, వాళ్లతో మాట్లాడాలంటే హిందీ నేర్చుకోవాలని చెప్పారు. అలాగే తమిళం వాళ్లు కూడా మంచి వాళ్లేనని, హిందీ వాళ్లు కూడా తమిళంలో మాట్లాడితే సంతోషంగా ఉంటుందని సుహాసిని వ్యాఖ్యానించారు. తమ ఇంట్లో పని చేసే వాళ్లలో కొంతమంది తెలుగు మాట్లాడతారని, మరికొంతమంది హిందీ మాట్లాడతారన్నారు. చదవండి: లెటెస్ట్ అప్డేట్: ఈ నెలలోనే ఓటీటీకి ఆర్ఆర్ఆర్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్! ఆ తర్వాత ఆ భాషే కావాలి.. ఈ భాషే కావాలంటే మనకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుందని సుహాసిని అభిప్రాయపడ్డారు. అందుకే అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలన్నారు. దీంతో సుహాసిని వ్యాఖ్యలపై తమిళ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా సుహాసినిని ట్రోల్ చేస్తున్నారు. హిందీ భాష మాట్లాడాలనిపిస్తే హిందీ సినిమాలే చేసుకుంటూ బాలీవుడ్లోనే ఉండాల్సిందంటూ సుహాసినిపై సటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. -
మర్డర్ కేసుపై ‘ఫోకస్’ పెట్టిన విజయ్ శంకర్
విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతున్న విజయ్ శంకర్ మరో విలక్షణమైన కథతో మన ముందుకు రానున్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో నిర్మాణ విలువల విషయంలో ఏ మాత్రం రాజీపడని రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఫోకస్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా జి. సూర్యతేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్ థ్రిల్లర్గా ‘ఫోకస్’ మూవీ తెరకెక్కుతోందని మూవీ యూనిట్ పేర్కొంది. ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం కీలక పాత్ర పోషిస్తుండగా, అషూరెడ్డి హీరోయిన్గా నటిస్తోంది.భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ‘మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో చాలా సినిమాలు వచ్చాయి..కానీ మా ఫోకస్ చిత్రం వాటంన్నింటికి విభిన్నమైనది. మర్డర్ మిస్టరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ను ఇష్టపడే ప్రేక్షకులకు మా చిత్రం కొత్త తరహా అనుభూతిని ఇస్తుంది. సినిమాను గురించిన మరిన్ని విశేషాలు, వివరాలను త్వరలో వెల్లడిస్తాం’అని చిత్ర దర్శకుడు సూర్యతేజ తెలిపారు. -
మణిరత్నం, సుహాసినిల ప్రేమపెళ్లి.. ట్విస్ట్ ఏంటో తెలుసా?
Suhasini Maniratnam Love Story: సుహాసిని.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. తెలుగు నాట పుట్టకపోయినా.. తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారామె. వాస్తవానికి.. సుహాసిని తమిళ చిత్రాలతో అరంగేట్రం చేసినప్పటికీ.. టాలీవుడ్లోనే స్టార్ హీరోయిన్గా జేజేలు అందుకున్నారు. ఇక ఈ నటి పెళ్లి ప్రముఖ దర్శకుడు మణిరత్నంతో జరిగిన విషయం తెలిసిందే. ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఈ జంట పెళ్లి గురించి అనేక వదంతులు వచ్చాయి. వీరిది ప్రేమ వివాహమా? లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా? అని చాలా మందికి ఇప్పటికీ ఓ తీరని సందేహమే! వీరి పెళ్లి ఎలా జరిగిదంటే.. 1988లో సుహానికి తండ్రి చారుహాసన్(హీరో కమల్ హాసన్ అన్నయ్య) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారట. అప్పుడు సుహాసిని తండ్రి దగ్గరకు వెళ్తే.. ఇకపై సినిమాలు చెయ్యొద్దని అన్నారట. ఆమె గురించి, మణిరత్నం గురించి బయట వదంతులు వస్తున్నాయని, దీని గురించి ఒక్కసారి అతనితో మాట్లాడమని చెప్పాడట. తండ్రి సూచనతో సుహాసిని మణిరత్నంకు ఫోన్ చేసి మాట్లాడారట. అయితే అప్పటికే మణిరత్నంపై ఒక రకమైన గౌరవం ఉన్న సుహాసినికి ఫోన్ సంభాషణ ద్వారా అది మరింత పెరిగింది. ప్రత్యక్షంగా కలుసుకొని గంటలు, గంటలు మాట్లాడుకున్నారట. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ పుట్టి, అది కాస్త పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదట. ఇరు కుటుంబాల పెద్దలే మాట్లాడుకొని వీరి వివాహం జరిపించారట. ఈ విధంగా ఇండస్ట్రీలో వచ్చిన వదంతులే మణిరత్నం, సుహాసినిల పెళ్లికి పునాదులు వేశాయి. 1988 ఆగస్ట్ 25న వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు. పేరు నందన్ . అన్నట్లు ఈ రోజు(ఆగస్ట్ 15) సుహాసిని పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమె బర్త్డే విషెస్ తెలియజేశారు. -
మణిశర్మ స్వరాలకు కీరవాణి గాత్రం తోడైతే..
ధ్రువన్, నియా త్రిపాఠి, సుహాసిని, నాజర్ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'బలమెవ్వడు'. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, టైటిల్ సాంగ్ని కీరవాణి ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. సంగీత ప్రపంచంలో మణిశర్మ, కీరవాణిలది ప్రత్యేక స్థానం. అలాంటిది ఓ సాంగ్ కోసం ఇద్దరూ కలిశారు. మణిశర్మ స్వరాలకి కీరవాణి గాత్రం అందించారు. ఈ లిరికల్ సాంగ్ని విడుదల చేసింది చిత్ర బృందం. ఇక సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్కు మంచి ఆధరణ లభిస్తుంది. -
పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికూతురు సుహాసిని
-
'బలమెవ్వడు'లో పవర్ఫుల్ పాత్రలో సుహాసినీ
దశాబ్దాలుగా తెలుగు, తమిళ చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్నారు సుహసినీ. తెలుగు ప్రేక్షకులకు సుహసినీ అంటే ప్రత్యేక అభిమానం. వాళ్ల అభిమానాన్ని కాపాడుకునేలా గొప్ప క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు సుహసినీ. గతంలో 'రాఖీ' చిత్రంలో ఆమె పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎంత పేరొచ్చిందో మనందరికీ తెలిసిందే. ఈసారి మరో పవర్ ఫుల్ పాత్ర ద్వారా మన ముందుకు రాబోతున్నారు. "బలమెవ్వడు" సినిమాలో డాక్టర్ యశోద పాత్రలో నటిస్తున్నారు సుహసినీ. మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే నిజాయితీ గల వైద్యురాలి పాత్రలో సుహసినీ జీవించనున్నట్లు తెలుస్తోంది. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న "బలమెవ్వడు" సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్బీ మార్కండేయులు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన "బలమెవ్వడు" కాన్సెప్ట్ టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని చిత్రయూనిట్ పేర్కొంది. -
నిత్య పెళ్లికూతురు సుహాసినికి ఏకంగా దొంగల టీమే ఉంది!
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: అనాథనని చెబుతూ పెళ్లి పేరుతో యువకులను మోసం చేస్తున్న కిలాడి లేడి నిత్య పెళ్లికూతురు సుహాసిని మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక సంవత్సరంలో సుహాసిని ఇద్దరిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని మోసం చేస్తూ ఉంటుందని ఆమె చేతిలో మోసపోయిన బాధితుడు ‘సాక్షి’కి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పక్కా ప్లాన్ ప్రకారం సుహాసిని ట్రాప్ చేసి మోసాలు చేస్తూ ఉందని పేర్కొన్నారు. సుహాసినికి దొంగల టీం ఉందని, తన లాగా సుహాసిని చేతిలో మోసపోయిన బాధితులు చాలా మందే ఉన్నారని తెలిపారు. సుహాసిని మోసాలు తమకు తెలిసిన తర్వాత ఇంట్లో నుంచి గోడ దూకి పారిపోయిందని వెల్లడించారు. పారిపోయే ముందు ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం అంతా తీసుకెళ్లిందని తెలిపారు. తమ దగ్గర మొత్తం 16లక్షలు తీసుకొని వెళ్ళిందని, అదే సమయంలో మణుగూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేస్తే కంప్లెట్ తీసుకులేదని పేర్కొన్నారు. సుహాసిని ఎపిసోడ్లో తమ కుటుంబం పూర్తిగా ఇబ్బందుల్లో పడిందని, తన ఎపిసోడ్ తర్వాత తిరుపతిలో సునీల్ అనే వ్యక్తి మోసం చేసిందన్నారు. -
తారలు కలిసి మెరిశారు: చాలా ఎంజాయ్ చేశాం!
తమిళసినిమా: 1980 సంవత్సరంలో ప్రముఖ కథానాయకులు, నాయకిలుగా వెలుగొందిన తారలు కొన్ని ఏళ్లుగా ఏడాదికోసారి ఒక చోట కలిసి సరదాగా గడపడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. దక్షిణాదికి చెందిన రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, నటీమణులు రాధిక శరత్కుమార్, సుహాసిని, అంబిక, రాధ, లిజి మొదలగు పలువురు నటీనటులు ఏడాదికి ఒకసారి ఒక ఫాంహౌస్లాంటి ప్రాంతంలో కలుసుకుని తమ అనుభవాలను, అనుభూతులను పంచుకుంటుంటారు. అదేవిధంగా ఈ వీకెండ్లో 1980లో ప్రముఖ నాయికలుగా రాణించిన నటీనటులు చెన్నైలో కలుసుకుని సరదాగా ముచ్చట్లు చెప్పుకొని పసందైన విందు ఆరగించి ఆనందంగా గడిపారు. అలా కలుసుకున్న వారిలో నటి రాధిక శరత్కుమార్, కుష్బూ, సుహాసిని, రాధ, అంబిక, పూర్ణిమా భాగ్యరాజ్, లిజి, నటుడు రఘు వున్నారు. ఫొటోలను నటి రాధిక శరత్కుమార్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ 1980లలో ప్రముఖ హీరో హీరోయిన్లుగా రాణించిన వారందరూ ఇప్పటికీ సన్నిహితంగా మెలుగుతున్నారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా తాము కలుసుకోలేకపోయామని ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుతో ఈ వీకెండ్లో మళ్లీ తామంతా కలుసుకుని గత అనుభవాలను, అనుభూతులను పంచుకుని ఆనందంగా గడిపినట్లు తెలిపారు. ఇందుకు స్పందించిన ఖుష్బూ సుందర్.. ‘‘చాలా చాలా ఎంజాయ్ చేశాం. ఎంతో ఉల్లాసంగా గడిపాం’’ అని పేర్కొన్నారు. -
నాన్నని ‘నాగులు బావ’ అని పిలిచేవాళ్లు
ఆరడుగుల ఆజానుబాహుడు.. కన్ను తిప్పుకోలేని వస్త్రధారణ.. అందంగా కనిపించే విలక్షణ విలన్... సూటు వేసుకుంటే నిజాం నవాబు.. ‘భలే మామా భలే...’ ‘ఇదే మన తక్షణ కర్తవ్యం...’ ‘బాబులు గాడి దెబ్బ అంటే గోల్కొండ అబ్బ అనాలి..’ ‘రారోయి మా ఇంటికీ! మావా! మాటున్నదీ! మంచి మాటున్నదీ!’ ఈ మాటలపాటల ప్రత్యేకతలతో తెలుగు సినీ ప్రేక్షకులకు చేరువయ్యారు... కొద్ది సినిమాలలో నటించి, అతి కొద్దికాలం మాత్రమే జీవించి, తెలుగు సినీ పరిశ్రమలో అందమైన విలన్గా ముద్ర వేసుకున్న ఆర్. నాగేశ్వరరావు గురించి జ్ఞాపకాలుగా ఆర్ద్రమైన గుండెతో పంచుకున్నారు సింగపూర్లో నివాసం ఉంటున్న వారి పెద్ద కుమార్తె సుహాసిని.. ‘నాన్న పోయేనాటికి నా వయసు ఎనిమిది సంవత్సరాలు. నాన్నకు మాసివ్ అటాక్ రావటం, మేడ మీద నుంచి ఆయనను కిందకు తీసుకు రావటం, అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా దారిలోనే మరణించటం, ఇంటికి తీసుకువచ్చి హాలులో.. నిండైన విగ్రహంలాంటి నాన్నను పడుకోపెట్టడం.. పక్కనే అమ్మ కన్నీరుమున్నీరవ్వటం... నా మనసు ఆయన జ్ఞాపకాలలోకి పరుగులు తీస్తూనే ఉంటుంది. ఐస్క్రీమ్ చేసి పెట్టేవారు.. నాన్న సికింద్రాబాద్ జీరాలో పుట్టి పెరిగారు. నాన్న నాయనమ్మ కడుపులో ఉండగా తాతగారు పోయారు. అప్పటికే నాన్నకు ఒక అన్నయ్య ఉన్నారు. నాన్న వాళ్ల అన్నయ్య ఇంట్లోనే పెరిగారు. అది నాన్న సొంత ఇల్లే. నాన్న మంచి పొజిషన్కి వచ్చాక ఆ ఇల్లు వాళ్లకి ఇచ్చేశారు. నాన్న నవాబులతో దోస్తీగా ఉండేవారు. ఆయన మాట్లాడే భాషలో తెలంగాణ నవాబుల హిందీ ఉర్దూ మాండలికం ఉండేది. అమ్మ రత్నాబాయి గుంటూరు లో పుట్టి పెరిగింది. నాన్నగారిది మేనరికం. మేం ఐదుగురు పిల్లలం. మోహన్, తాతాజీ, సుహాసిని (నేను), శ్యామ్, చాందినీ. అన్నయ్యలు, తమ్ముడు గతించారు. నేను, చెల్లి మాత్రమే ఉన్నాం. నాన్న పోయేనాటికి చెల్లెలికి నాలుగేళ్లు, నాకు ఎనిమిది సంవత్సరాలు. అందరం హైదరాబాద్లోనే పుట్టి పెరిగాం. ప్రస్తుతం సింగపూర్లో ఉంటున్నాను. దొంగరాముడు చిత్రంలో సావితి, ఆర్. నాగేశ్వరరావు రిక్షాలో వెళ్లమన్నారు.. అమ్మ వాళ్లందరూ తరచుగా భద్రాచలం వెళ్లేవారు. రైల్వే స్టేషన్ మా ఇంటికి దగ్గరే. కాని అందరూ పని పూర్తి చేసుకుని వెళ్లేసరికి ట్రైన్ టైమ్ అయిపోయేది. అందుకని నాన్న పరుగెత్తుకుంటూ, ఇంజన్ డ్రైవర్ దగ్గరకు వెళ్లి, రైలు ఆపించేవారట. బ్రిటిష్ టైమ్లో తాతయ్య (అమ్మవాళ్ల నాన్న) ట్రైన్ ఇంజిన్ డ్రైవర్గా ఉండేవారు. బహుశః అందుకే ఆపేవారేమో. ‘జీవితంలో కష్టపడటం నేర్చుకోవాలి, స్కూల్కి రిక్షాలో వెళ్లండి’ అని చెప్పేవారు నాన్న. సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా, ప్రతి ఆదివారం స్వయంగా ఐస్క్రీమ్ తయారుచేసి పెట్టేవారు. అవకాశం ఉన్నప్పుడు బీచ్కి తీసుకెళ్లి, మాతో దాగుడు మూతలు ఆడేవారు. డ్రై ఫ్రూట్స్ తెచ్చేవారు.. మేం పొద్దున్నే నిద్ర లేచి హాల్లో కూర్చుని చదువుకుంటుంటే చూడటం ఇష్టం నాన్నకు. కారులో అన్నవరం తీసుకువెళ్లేవారు. నదీ తీర ప్రాంతంలో డ్రైవింగ్ చేయటం చాలా ఇష్టం. అక్కడ స్నేహితులందరితో కలిసి భోజనం చేసేవారు. ప్రతి వారం మద్రాస్ ప్యారిస్ కార్నర్ నుంచి స్వీట్స్, పూలు, కూరలు తెచ్చేవారు. ఆ రోజుల్లోనే అంటే 1955 ప్రాంతంలోనే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తెచ్చేవారు. అమ్మ వంటలు బాగా చేసేది. నాన్న మంచి ఆహారం మితంగా తినేవారు. ప్రతిరోజూ రాత్రి పరాఠాలు, నాన్వెజ్ తినేవారు. హైదరాబాద్ స్టయిల్ ఆహారం ఇష్టపడేవారు. మీగడ పెరుగంటే చాలా ఇష్టం. ఎస్.వి. రంగరావుతో నాగేశ్వరరావు నాగులు బావ అనేవారు.. అప్పుడు మేం ఉన్న మా ఇంటితో ఎప్పటికప్పుడు కొత్త అనుబంధం ఏర్పడుతూనే ఉంది. ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడల్లా, అక్కడ నాన్నతో కలిసి పెరిగిన వాళ్లు, ‘‘మీ నాన్నతో కలిసి పెరిగాం. మేమంతా చనువుగా ఆయనను ‘నాగులు బావ’ అని పిలిచేవాళ్లం’’ అని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్పి రోడ్లో ఇప్పటికీ పాత హార్డ్వేర్ దుకాణాలున్న ప్రాంతానికి వెళితే, ‘మిమ్మల్ని బాగా చూసినట్లు ఉంది. అచ్చం నాన్నగారిలా ఉన్నారు’ అంటూ, నాన్నను గుర్తు తెచ్చుకుంటారు. నాన్న నిండైన విగ్రహమే అందుకు కారణం. అమ్మ 90 సంవత్సరాలు వచ్చేవరకు జీవించింది. నాన్న గురించి అమ్మ చెప్పే మాటలు వింటూ పెరిగాను. ఇప్పటికీ గుర్తుండిపోయింది... నాన్న పోయిన రోజున ఆయనను తీసుకురావటం బాగా గుర్తుంది. గదిలో పడుకుని ఉండగా మాసివ్ అటాక్ వచ్చి అతి పిన్న వయసులోనే కన్నుమూశారు. ఆయనను చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఆ చేదు జ్ఞాపకం ఇంకా పచ్చిగానే ఉంది . నాన్న గురించి వింటూ, పెరగటం వల్ల, నాన్నలా ఉండాలనే భావన నాకు తెలియకుండానే అలవాటైపోయింది. ఆయన పర్సనాలిటీ నాకు వచ్చిందని గర్వపడతాను. నాన్న ఇప్పటికీ మా మనసులో, ఆలోచనలలో, చేతలలో సజీవంగానే ఉన్నారు. నాన్నకి అందమే కాదు, వ్యక్తిత్వం, అస్తిత్వం కూడా ఉన్నాయి. తల్లిదండ్రులతో ఉన్న బంధం మరచిపోవటం కష్టం. సుహాసిని నాన్న వెరీ పర్టిక్యులర్ నాన్న ఆజానుబాహువు. అందమైనవారు. నాన్న స్టయిల్ని చాలామంది ఫాలో అయ్యేవారు. నవాబుల కంటె హుందాగా, గొప్పగా ఉండేవారు. నాన్న దగ్గర 300 సూట్లున్నాయి. షూస్ లెక్క చెప్పలేను. ఏ సూట్లో చూసినా ఎంతో కంఫర్టబుల్గా అనిపించేవారు. ఎస్వి రంగారావు అంకుల్ గృహప్రవేశానికి నాన్న హై కాలర్ (నెహ్రూ కాలర్) బ్లాక్ సూట్, ఎస్విఆర్ వైట్ సూట్, టోపీ ధరించారు. అతిథులందరికీ నాన్న విస్తళ్లు వేసి వడ్డించారు. అడ్డగీతల రా సిల్క్, బ్రైట్ ఎల్లో... హై కాలర్ స్వెటర్తో ఇంగ్లీషు దొరలా ఎంతో దర్పంగా, హుందాగా అనిపించేవారు. మా అందరికీ నాన్నే బట్టలు కొనేవారు. ఒకసారి నాకు అద్దాలు కుట్టిన నల్ల లంగా తీసుకువచ్చారు. అది నాకు బాగా గుర్తుండిపోయింది. ఇప్పటికీ అలాంటి లంగా కనిపిస్తే, ఆ రోజులు గుర్తుకు వస్తాయి. – సుహాసిని సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఒకే కారులో తిరిగాం, పెళ్లనేశారు: యంగ్ హీరో
బాలాదిత్య.. హీరోగా కెరీర్ ప్రారంభించడానికి ముందే బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో మెప్పించాడు. లిటిల్ సోల్జర్స్, జంబలకిడిపంబ హిట్లర్, అబ్బాయిగారు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, సమరసింహా రెడ్డి వంటి పలు చిత్రాల్లో నటనతో ఆకట్టుకున్న అతడు చంటిగాడు సినిమాతో హీరోగా మారాడు. ఆయన నటించిన అన్నపూర్ణమ్మ గారి మనవడు ఇటీవలే రిలీజై మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం అతడు సినిమాలతో పాటు సీరియళ్లలోనూ నటిస్తూ బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్నాడు. ఇదిలా వుంటే 'చంటిగాడు' సినిమాలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న సుహాసినిని బాలాదిత్య పెళ్లి చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దానిపై అతడు తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుహాసిని, తాను మంచి స్నేహితులమని చెప్పాడు. తాము పెళ్లి చేసుకోబోతున్నామని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశాడు. ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు ఇద్దరం ఒకే కారులో ప్రయాణించేవాళ్లమని, అది చూసి కొందరు తప్పుగా అనుకున్నారని తెలిపాడు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. మేం రెండు సినిమాల్లో కలిసి నటించేసరికి పెళ్లి చేసుకుంటున్నామంటూ వార్తలు రాసేశారు. కానీ మాకు అలాంటి అభిప్రాయమే లేదని తేల్చి చెప్పాడు. చదవండి: ప్రతిఒక్కరి జీవితానికి అన్వయించుకునే కథ అన్నపూర్ణమ్మ గారి మనవడు ఐసీయూలో సినీ రచయిత, కేటీఆర్ సాయం! -
ఇలాంటి వార్తలను నమ్మకండి :నటి సుహాసిని
ప్రముఖ దర్శకులు మణిరత్నం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్లో అకౌంట్ ఓపెన్ చేస్తే అభిమానులకు ఆనందమే. బుధవారం అలాంటి ఆనందమే దక్కింది. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. జూన్ 2న మణిరత్నం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చారన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. వీటిపై మణిరత్నం భార్య, ప్రముఖ నటి సుహాసిని స్పందించారు. ‘‘బుధవారం మణిరత్నం ట్విటర్ అకౌంట్ను స్టార్ట్ చేసినట్లుగా ఒక వ్యక్తి మణిరత్నం పేరుతో ట్వీట్ చేశాడు. ఇలాంటి నకిలీ అకౌంట్ను నమ్మొదు. దయచేసి అప్రమత్తంగా ఉండండి’’ అని పేర్కొన్నారు సుహాసిని. -
కమల్ హాసన్ కూతురితో నటి తీన్మార్ స్టెప్పులు!
సాక్షి, చెన్నై: విశ్వనటుడు కమల్ హాసన్ కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజాకర్షణ లక్ష్యంగా ఆగమేఘాలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. కమల్కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్ కుమార్తె సుహాసిని కూడా సుడిగాలి ప్రచారంలో భాగమయ్యారు. వీరికి తోడుగా కమల్ కూతురు అక్షర హాసన్ కూడా క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆమె తరచూ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కమల్కు ఓటేయడంటూ అక్షర, సుహాసిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ క్రమంలో వీళ్లిద్దరూ డప్పు చప్పుళ్లకు తీన్మార్ డ్యాన్స్లు చేసి జనాలను ఆకట్టుకున్నారు. బ్యాండ్ సౌండ్కు ఎంతో ఎనర్జిటిక్గా స్టెప్పులేసిన వీరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: కమల్ పార్టీ అభ్యర్థి ఇంట్లో రూ.10 కోట్ల నగదు స్వాధీనం ఒకే వేదికపై మామ అల్లుడు (రజనీకాంత్, ధనుష్)కు అవార్డులు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1691347313.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘సిటీని అద్భుతంగా తీర్చిదిద్దే వారికే ఓటు’
సాక్షి, హిమాయత్నగర్ : వేగంగా విస్తరిస్తున్న మన హైదరాబాద్ సిటీలో మరిన్ని కొత్త కట్టడాలు రావాల్సిన అవసరం ఉంది. విదేశాల్లోని సిటీల్లా, రీసెంట్గా ప్రారంభించిన దుర్గం చెరువు ఫ్లైఓవర్ లాంటివి ఏర్పాటు చేస్తే సిటీ కొత్త కొత్తగా ఉంటుంది. టెక్నాలజీతో పాటు, శానిటేషన్ వంటి వాటిలో కూడా మార్పులు ఎంతో అవసరం. ఈ ఎన్నికల్లో సిటీని మరింత అద్భుతంగా తీర్చిదిద్దే వారికి ఓటువేసి ఎన్నుకుందాం. - సుహాసిని, బుల్లితెర నటి ఓటు వేస్తేనే భారతీయుడు లక్డీకాపూల్: ఓటు ప్రజల హక్కు.. తప్పకుండా ఓటును వినియోగించుకోవాలి. ఏ పార్టీ వారికైనా కానివ్వండి.. కానీ ఓటు మాత్రం కచ్చితంగా వేయాలి. ఓటు వేసినప్పుడే ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఓటు వేస్తేనే మనం భారతీయులం.. ఓటు వేయని వాళ్లు భారతీయులే కాదన్నది నా అభిప్రాయం. నానక్రామ్గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్కి వెళ్తే ఏదో అబ్రాడ్లో ఉన్నట్లు ఉంటుంది. సిటీలో రోడ్లపై దృష్టి పెట్టాలి. రోడ్లను వెడల్పు చేసి ట్రాఫిక్ని తగ్గించగలిగితే ఇంకా గొప్ప సిటీ అవుతుంది. – సప్తగిరి, సినీనటుడు -
ఆ ఒత్తిడి మా మీదా ఉంది
సీనియర్ నటి సుహాసినిలో దర్శకురాలు కూడా ఉన్నారు. గతంలో ‘ఇందిర’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారామె. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు సుహాసిని. అమేజాన్ ప్రైమ్ నిర్మించిన ‘పుత్తమ్ పుదు కాలై’ అనే యాంథాలజీలో ఓ భాగానికి దర్శకత్వం వహించారామె. ‘కాఫీ, ఎనీవన్?’ టైటిల్తో తెరకెక్కిన ఈ భాగంలో అనూహాసన్, శ్రుతీహాసన్ నటించారు. ఈ నెల 16న ఈ యాంథాలజీ ప్రైమ్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ– ‘‘కాఫీ, ఎనీవన్’ కథలో మా కజిన్ అనూహాసన్, శ్రుతీహాసన్ నటించారు. మా నాన్న చారుహాసన్, బాబాయి కమల్హాసన్ని కూడా యాక్ట్ చేయించాలనుకున్నాను. తర్వాత వద్దనుకున్నాను. ఈ లాక్డౌన్ సమయంలో సుమారు ఆరు షార్ట్ స్టోరీలు సిద్ధం చేసుకున్నాను’’ అన్నారు. కుటుంబ సభ్యులకే అవకాశాలు, నెపోటిజమ్ అనే టాపిక్ గురించి మాట్లాడుతూ – ‘‘నేను చారుహాసన్, కమల్హాసన్ కుటుంబానికి చెందిన వ్యక్తిని అనేది ఎవ్వరం మార్చలేం. ఆ నెపోటిజమ్ ఒత్తిడి మా మీదా ఉంది. మా తర్వాతి తరం అయిన శ్రుతీహాసన్ వంటి వాళ్ల మీద ఇంకా ఉంది. అయితే సౌతిండియాలో నెపోటిజమ్ అనే మహమ్మారి ఇంకా రాలేదనుకుంటున్నాను’’ అన్నారు సుహాసిని. -
కట్ చెప్పలేదు.. కట్టేసుకున్నారు..!
(వెబ్ స్పెషల్): ఇంటర్వ్యూల్లో చాలా మంది హీరోయిన్లు చెప్పే మాట తాము డైరెక్టర్స్ చాయిస్ అని. అంటే.. దర్శకులు చెప్పినట్లు తాము చేస్తామని అర్థం. కొన్ని కొన్ని సార్లు ఈ చెప్పే వారి మాటలు అవతలి వారి మనసును తాకుతాయి. దాంతో ఒకరి మీద ఒకరికి ఇష్టం, ప్రేమ కలుగుతాయి. అది కాస్త పెళ్లికి దారి తీస్తుంది. దాంతో కట్ చెప్పలేక వారితో జీవితాన్ని ముడి వేసుకున్నారు. హీరోయిన్లు దర్శకులను వివాహం చేసుకోవడం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. మరి ఇంతకు ఏ హీరోయిన్ ఏ దర్శకుడిని పరిణయం ఆడిందో చూడండి.. సుహాసిని-మణిరత్నం హీరోయిన్, దర్శకుల వివాహం టాపిక్ వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది సుహాసిని-మణిరత్నంల పేర్లే. ఆమె అందం, అభినయాల కలబోత అయితే.. ఆయన భారతీయ ఆత్మను ప్రతిబింబించే చిత్రాల దర్శకుడు. వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి 1988లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. దివంగత దర్శకుడు కె. బాలచందర్ ఒత్తిడి మేరకే తాము వివాహం చేసుకున్నామంటారు సుహాసిని. వీరికి ఒక కుమారుడు నందన్ ఉన్నాడు. (చదవండి: పెద్దన్నయ్య) రేవతి - సురేష్ చంద్ర సురేష్ చంద్ర దర్శత్వంలో రేవతి రెండు చిత్రాల్లో నటించారు. అలా ఏర్పడ్డ పరిచయంతో ఈ జంట ప్రేమలో పడ్డారు. 1986లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. కృష్ణవంశీ - రమ్య కృష్ణ కృష్ణవంశీ తెరకెక్కించిన చంద్రలేఖ చిత్రంలో రమ్యకృష్ణ నటించారు. అలా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ జంట 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు రిత్విక్ ఉన్నాడు. రోజా - సెల్వమణి రోజాని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది సెల్వమణి. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. 2002లో రోజా, సెల్వమణిలు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు, పాప ఉన్నారు. శరణ్య-పొన్నవనన్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నారు శరణ్య. కానీ 1980-90ల కాలంలో ఈమె చాలా తమిళ సినిమాల్లో హీరోయిన్గా చేశారు. అప్పుడే దర్శకుడు పొన్నవనన్తో ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకున్నారు.(చదవండి:ఇదే నాకు పెద్ద బర్త్డే గిఫ్ట్ ) ఖుష్బూ-సుందర్ ఇద్దరు కలిసి ఒక్క చిత్రం కూడా చేయలేదు. కన్నడ నిర్మాత అయిన సుందర్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఖుష్బూ. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. వారి పేరు అవంతిక అనందిత. సీత- పార్థిపన్ సీనియర్ నటి సీత, దర్శకుడు పార్థిపన్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 1990లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమర్తెలు, ఓ దత్తత తీసుకున్న కొడుకు ఉన్నారు. 2001లో ఈ జంట విడాకులతో విడిపోయారు. ఆ తర్వాత సీత మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. (చదవండి: జీవితం ఉన్నది అనుభవించడానికే..) దేవయాని- రాజ్ కుమారన్ దర్శకుడు రాజ్ కుమారన్, దేవయానిల లవ్ ఎఫైర్ అప్పట్లో ఒక సెన్సేషన్. రాజ్ కుమారన్ దర్శత్వంలో దేవయాని నీ వరువై ఏనా అనే చిత్రంలో నటించారు. వీరిద్దరూ 2001లో వివాహం చేసుకున్నారు. అమలాపాల్ - విజయ్ దర్శకుడు అమలాపాల్, విజయ్ ప్రేమ వ్యవహారం గురించి తెలిసిందే. పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. వీరే కాక దర్శకుడు సెల్వ రాఘన్, హరి, ప్రియ దర్శన్ వంటి వారు హీరోయిన్లనే వివాహం చేసుకున్నారు. -
చిట్టి చిలుక
లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ ప్రేక్షకులను వినోదపరచడానికి, చైతన్యపరచడానికి పాటలు, వీడియోలు, షార్ట్ ఫిల్మస్ ఇలా ఏదోటి చేస్తున్నారు స్టార్స్. తాజాగా సీనియర్ నటి సుహాసిని కూడా ఓ షార్ట్ ఫిలిం తీశారు. దీని పేరు ‘చిన్నంజిరు కిళియే’ (చిట్టి చిలుక). 20 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలిం లో మళయాళ నటి ఆహా కష్ణ ముఖ్య పాత్రలో నటించారు. ఎవరి ఇంట్లో వాళ్లు ఉండి ఈ షార్ట్ ఫిలింను పూర్తి చేశారు. ఐ ఫోన్లో షూట్ చేసిన ఈ షార్ట్ ఫిలిం ఈ వారంలో విడుదల కానుంది. ఇది కరోనా వైరస్పై అవగహనకు సంబంధించిందా లేకపోతే వేరే కథాంశంతో తెరకెక్కిందా అనే విషయం తెలియాల్సి ఉంది. -
పచ్చడి తిని ఆఫీసుకెళ్లారు
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఆరోగ్యం విషయంలో అడపా దడపా అభిమానులు షాక్కి గురయ్యే వార్తలు బయటికొస్తుంటాయి. తాజాగా ఆయన చెనై్నలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారనే వార్త ఫ్యాన్స్ని కలవరానికి గురి చేసింది. గత ఏడాది మణిరత్నంకు గుండె పోటు వచ్చిన విషయం తెలిసిందే. చికిత్స తీసుకున్న ఆయన కోలుకున్నారు. ఇప్పుడు భారీ మల్టీస్టారర్ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ పనుల్లో ఉన్న మణి ఆస్పత్రిలో చేరారని వార్త రావడంతో ఏమై ఉంటుంది? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ‘ఆల్ ఈజ్ వెల్’ అని స్పష్టం చేశారు మణిరత్నం సతీమణి, నటి సుహాసిని. ‘‘నా భర్త ఈ రోజు (సోమవారం) ఉదయం పని చేయడానికి వెళ్లారు. ‘నామ్ ఉమన్’ ట్రస్ట్ కోసం మా ఇంట్లో వర్క్షాప్ ఏర్పాటు చేశాను. ట్రస్ట్ కోచ్ రూపా రోటీలు, మామిడికాయ పచ్చడి తీసుకొస్తే, ఆయన ఇష్టంగా తిని, స్క్రిప్ట్లో మరింత స్పైస్ యాడ్ చేయడం కోసం ఆఫీస్కి వెళ్లారు’’ అని సుహాసినీ మణిరత్నం తెలిపారు. ఇక ‘పొన్నియిన్ సెల్వన్’ విషయానికి వస్తే.. ప్రముఖ తమిళ నవల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో మోహన్బాబు, ఐశ్వర్యా రాయ్, అనుష్క, శింబు, కార్తీ, కీర్తీ సురేష్.. ఇలా పలువురు ప్రముఖ తారలు నటించనున్నారని సమాచారం. నటీనటుల గురించి ఇంకా మణిరత్నం అధికారికంగా ప్రకటించలేదు. -
కష్టాలకే రేటింగ్ ఎక్కువ!
‘అపరంజి’ బొమ్మగా ఆకట్టుకుని, ‘ఇద్దరమ్మాయిలు’తో మెప్పించి, ‘అష్టాచెమ్మా’ఆడేసి, ఇప్పుడు ‘నా కోడలు బంగారం’ అనిపించుకుంటున్న సుహాసిని తెలుగమ్మాయి.పరిచయం అక్కర్లేని నటి. వెండి తెర నుంచి బుల్లితెర వైపుగా టర్న్ తీసుకొని అందమైన అభినయంతో మెప్పిస్తున్న సుహాసిని ‘సాక్షి’తో పంచుకున్న చిరుజల్లులు మాల. ‘చాలా మంది సీరియల్ పాత్రల పేర్లతోనే పిలుస్తుంటారు. కానీ, నన్ను జనం ‘సుహాసిని’గానే గుర్తుంచుకున్నారు. ఈ గుర్తింపు ‘చంటిగాడు’ సినిమా ఇచ్చింది. చంటిగాడు సినిమా టెన్త్క్లాస్లో ఉండగా చేశాను. ఆ సినిమా సమయంలో నటన గురించి ఎలాంటి ఐడియా లేదు. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేదు. ఫొటోగ్రఫీ తెలిసిన వారి ద్వారా నా ఫొటోలు దర్శకురాలు జయగారి దగ్గకు వెళ్లాయి. నా ఫొటో చూడగానే పేరు అడక్కుండా, స్క్రీన్ టెస్ట్ చేయకుండా ఈ అమ్మాయే నా సినిమాలో హీరోయిన్ అన్నారట. అలా నేను సినిమాలోకి వచ్చాను. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలు చేశాను. సీరియల్ వైపు ‘అపరంజి’ సీరియల్తో మూవీ నుంచి టీవీకి వచ్చాను. ఓకే చేయడానికి ముందు ఆలోచనలో పడ్డాను. ‘సినిమాల్లో చేస్తున్నాను.. టీవీలో చేస్తే ఆఫర్స్ రావేమో’ అని. కానీ, సీరియల్లో లీడ్ రోల్ అంతా నా చుట్టూతానే తిరుగుతుంది, పర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ ఉంది.. పైగా అప్పటికి మంచి రోల్ ఉన్న సినిమాలూ కూడా నాకేవీ లేవు. నా కో–యాక్టర్స్ కూడా ఇదే మంచి ఆప్షన్ అన్నారు. యాక్టర్స్కి కావల్సింది వర్క్, గుర్తింపు. చంటిగాడుతో నాకు గుర్తింపు వచ్చింది. నాక్కావల్సింది వర్క్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టీవీకి టర్న్ అయ్యాను. ఫ్యామిలీ సపోర్ట్ పుట్టిపెరిగింది అంతా నెల్లూరులోనే. మా తాతగారికి నేను సినిమాలో నటించడం అస్సలు ఇష్టం లేదు గ్లామర్ ఫీల్డ్ అని. ఎంతోకొంత చదివించి పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అనేవారు.. కానీ, మా అమ్మ బాగా సపోర్ట్ చేశారు. నాకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. ఇంట్లో వాళ్లకు తెలియకుండా నాకు డ్యాన్స్ నేర్పించింది అమ్మ. ‘ఇలా ఉండాలి’ అని చెబుతారు కానీ, ఇలాగే ఉండి తీరాలి అని మా ఇంట్లో ఎప్పుడూ చెప్పలేదు. ఏదైనా వర్క్ చేసేముందు మాత్రం ‘ఆలోచించుకో’ అంటారు. మన ఇష్టం లేకుండా ఏదీ చేయలేం కదా! గ్లామర్ రోల్ అంటే ఓకే కానీ నాకూ ఎక్స్పోజింగ్ ఇష్టంలేదు. అందుకే అలాంటి ఆఫర్స్ వచ్చినా ఒప్పుకోలేదు. చేసినంత వరకు మంచి ఆఫర్స్ వచ్చాయి. ‘ప్రేమ, నాకోడలు బంగారం’.. సీరియల్స్తో ప్రొడ్యూసర్గా మారాను. ఈ అవకాశం నాకు ‘జీ’టీవీ ఇచ్చింది. అన్నింటికన్నా ప్రొడ్యూసర్ టైమ్ చాలా ఇంపార్టెంట్. ప్రతీది దగ్గరుండి చూసుకోవాలి. మా నాన్నగారు, మావారి సపోర్ట్ ఉండటంతో నా వర్క్ ఈజీ అయ్యింది. అందుకే ఆర్టిస్టుగా, ప్రొడ్యూసర్గా చేయగలుగుతున్నాను.ఎప్పుడూ రెండు, మూడు సీరియల్స్ ఒకేసారి ఒప్పుకొని టెన్షన్ పడలేదు. ఒకే సీరియల్.. నెలలో పదిహేను రోజులు వర్క్, మిగతా రోజులు ఇల్లు. జీవితాన్ని అలా బ్యాలెన్స్ చేసుకోవడం ఈజీ అయ్యింది. ఎప్పుడైనా విలేజీకి వెళితే.. ‘నీకెన్ని కష్టాలమ్మా! తర్వాత ఏమౌతుందమ్మా’ అంటుంటారు సీరియల్ గురించి మాట్లాడుతూ. సీరియల్స్లో కష్టాలు, కన్నీళ్లు ఎక్కువ అని చాలా మంది అంటుంటారు. అయితే, ప్రేక్షకులు వాటికే ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. టి.ఆర్.పి.. ని బట్టే కంటెంట్ మార్చుకుంటూ వస్తాం. ఆ విధంగా చూస్తే కష్టాలున్న వాటికే రేటింగ్ ఎక్కువ అన్నమాట(నవ్వుతూ). నా కోడలు బంగారం అత్తా–కోడలు అనగానే ఒకరికొకరు పడదు.. అనుకుంటారు. కానీ, ‘నా కోడలు బంగారం’ సీరియల్ మిగతా సీరియల్స్కి రివర్స్గా ఉంటుంది. ‘జీ’ టీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్లో అత్తా–కోడలు తల్లీ కూతురులా ఉంటారు. నిజజీవితంలోనూ మా అత్తగారితో నేను చాలా బాగా ఉంటాను. ఇప్పుడు సీరియల్స్ కేవలం మహిళలు మాత్రమే కాదు యూత్, పిల్లలు కూడా చూస్తున్నారు. వారిని అట్రాక్టివ్ చేసేలా .. కొంత రొమాంటిక్, ఇంకొంత ఫన్ చూపిస్తుంటాం. అలాగే మదర్, ఫాదర్ సెంటిమెంట్ సీన్స్ కూడా మిస్ అవకూడదు. ఇలా ఆడియన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని సీరియల్ ప్లాన్ నడుస్తుంటుంది. కాస్ట్యూమ్స్ ఎంపిక నాకు షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నెలలో 15 రోజులు షూటింగ్, మిగతా 15 రోజులు షాపింగ్ (నవ్వుతూ) చేయమన్నా విసుగు రాదు. కొత్తబట్టలు.. ఎప్పుడూ కొంటుంటున్నాను. ఏ రోజుకారోజు బెటర్డ్రెస్ అని ఎంపిక చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి నాకీ అలవాటు ఉంది. నేను అందరిలో ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటాను. నా రెమ్యునరేషన్లో సగం మనీ బట్టలకే (నవ్వుతూ). ఇంట్లో నా బట్టలే కట్టలు కట్టలుగా ఉంటాయి. అంత పిచ్చి.. బట్టలంటే. పెళ్ళి.. తర్వాతి జీవితం ఇద్దరమ్మాయిలు సీరియల్ చేస్తున్నప్పుడు నా కో–స్టార్ ధర్మ నేను ప్రేమించుకున్నాం. పెద్దల అంగీకారం పెళ్లి చేసుకున్నాం. తను యాక్టింగ్లోకి రాకముందు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారు. తనకు ఆస్ట్రేలియాలో జాబ్ ఆఫర్ వచ్చింది. ‘ఏమంటావు..?’ అని అడిగారు. నేను రాలేను.. అని చెప్పాను. ‘నీ కోసం నేనే జాబ్ వదిలేస్తాను’ అన్నారు. ‘ఇద్దరమ్మాయిలు’ సీరియల్లో తను చాలా తక్కువ టైమ్లోనే మంచిపేరు తెచ్చుకున్నారు. నా యాక్టింగ్లోనూ సజెషన్స్ ఇస్తుంటారు. ముందు అంతేకదా అనుకుంటాను. తర్వాత మార్చుకుంటాను. పెళ్లయ్యాక మేం కలిసి సీరియల్ చేయలేదు. ఇద్దరమ్మాయిలు సీరియల్లో మాత్రం పోటా పోటీగా చేశాం. తనకు టైమ్ పంక్చువాలిటీ ఎక్కువ. చాలా ఫన్ క్రియేట్ చేస్తారు. రోజూ నిన్నటి కన్నా ఈ రోజు ఇంకొంచెం మంచి అనిపించుకుంటే చాలని, నా వల్ల ఎవరూ ఇబ్బందిపడకూడదని అనుకుంటాను. అందుకే సోషల్మీడియాలోనూ లేను. రిప్లై కోసం ఎదురు చూసేవారిని ఇబ్బందిపెట్టినట్టు అవుతుందని నా ఆలోచన. నెగిటివ్ అంటే అస్సలు ఇష్టపడను. ‘నా చుట్టూ మంచి ఉండాలి. అందులో నేను ఉండాలి’ అనే తత్త్వం నాది. – నిర్మలారెడ్డి -
మూగపిల్ల
అనగనగా ఒక బాలిక. పేరు సుభాషిణి. నామకరణం నాడే బిడ్డ మూగపిల్ల అవుతుందని ఏ తల్లిదండ్రులు ఊహించగలరు పాపం? ఆ బాలికకు ఇద్దరు అక్కలు ఉన్నారు. సుకేశిని, సుహాసిని అని వాళ్ల పేర్లు ముందే పెట్టారు. ఆ పేర్లలోని అనుప్రాసను తప్పనివ్వకుండా తల్లిదండ్రులు కడసారి బిడ్డకు సుభాషిణి అని పేరు పెట్టకున్నారు. క్లుప్తంగా ‘సుభా’ అని పిలవసాగారు.వరులను వెదకడంలోను, కట్నాలు కానుకలు ఇవ్వడంలోను– సర్వసాధారణంగా పెళ్లిళ్లలో పడే పాట్లన్నీ పడి ఎలాగో పెద్దపిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసేశారు. ఇక కడగొట్టు బిడ్డే మిగిలి ఉంది. తల్లిదండ్రుల గుండెల మీద కనబడని బరువులా ఆ బాలిక ఈడేరి ఇంట్లో కూర్చుని ఉంది. ఆమెకు నోరు లోపించింది కనుక భావానుభూతి కూడా తప్పక లోపిస్తుందనే లోకం తలచినట్లుగా ఉంది. ఆ ధీమాతోనే ఆమె సమక్షంలోనే ఆమె భవిష్యత్తు గురించి చర్చించి ఆందోళన చెందేవాళ్లు. దాంతొ తన స్థితిని చిన్నతనంలోను సుభా అర్థం చేసుకుంది. అందువల్ల నలుగురిలోకీ రావడం మానుకుంది. ఆటల పాటల స్నేహాల ప్రసక్తే మానుకుంది. ఏకాంతంగా వేరుగా ఉండిపోయేది. తననెవరూ తలవకుండా మరచిపోతే చాలు, లోకం తనకు మహోపకారం చేసినట్టు అనుకునేది. కాని బాధను మరవడం ఎవరికి శక్యం? రాత్రింబగళ్లు ఈ బిడ్డను గురించిన ఆందోళనే తల్లిదండ్రుల మనసులను వేధించింది. తల్లి కళ్లల్లో ఆమె ఒక విరూపిగా ఉంది. కూతురిలోని వెలితి తల్లికి గౌరవహాని అనిపిస్తుంది. అందుకే సుభా అంటే తల్లికి తన శరీరం మీద ఏదో మచ్చలా ఏవగింపు. తండ్రి వాణీకాంతకు తన సంతానంలోకల్లా సుభా అంటేనే అనురాగం ఎక్కువ. సుభాకు మాట లోపించింది గాని, ధనురాకారంలో తీర్చిదిద్దిన పొడవాటి కనుబొమ్మలు అంచులుగా గల చారెడేసి కళ్లకు కొదవలేదు. ఆమె మనసులో మెదిలిన భావాలకు అనుగుణంగా ఆమె పెదవులు చిగురుటాకులా కంపించేవి. భావాలను వ్యక్తం చేసేటప్పుడు అనుగుణమైన భాష అంత సులువుగా పట్టుబడదు. అదొక అనువాద క్రమం. ఆ అనువాదం తరచు సంతృప్తికరంగా ఉండదు. భాషతో నిమిత్తం లేని ఆ నీలాల కళ్లకు అనువాదపు బెడదలుండవు. కళ్లల్లో మనస్సు నీడ సూటిగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. భావం మనసులో విప్పారినా, ముడిగినా, మెరిసినా, ఇరులలో మాయమైనా– అస్తమించే పాలిపోయిన చంద్రవంకలా నిస్సత్తువగా కాసేపు నిలిచిపోయినా, ఆకాశం మూలమూలలనూ కనురెప్పపాటులో కాంతివంతం చేసే విద్యుల్లతలా కదిలినా– ఆ నీలాల కన్నుల్లో ఛాయలుగా తోచక విధి లేదు. పెదవులు కదపడం కన్నా వేరే భాష లేని పుట్టుమూగకు నేత్రభాష అలవడుతుంది. ప్రకృతిమాతలో కానవచ్చే ఏకాంత వైభవం మూగవారికి వశమవుతుంది. అందువల్లే పొరుగు పిల్లలు సుభా అంటే భయపడేవారు. ఎడంగా ఉండేవారు. ఆట పాటలకు కూడా కలిసేవారు కాదు. నిర్జనమైన మధ్యాహ్న సమయంలా ఆమె నిశ్శబ్దంగా, ఏకాకిగా చరించేది. ఆమె స్వగ్రామం చండీపూర్. అదొక చిన్న నది ఒడ్డున ఉంది. అసలు బెంగాల్లోని నదులన్నీ చిన్నవే. ఇల్లు వెడలని మధ్యతరగతి మర్యాదస్తుల కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడబిడ్డలా కరకట్టలను మీరకుండా బిరబిరా ప్రవహిస్తూ తన దారిన తాను పోతుంటుంది. తన తీర పరిసర గ్రామాల్లో ప్రతి ఇంటికీ పనిగత్తెలా తన విధులు తీర్చుకుంటూ విశ్రాంతి ఎరుగని ప్రయాణం చేస్తుంది. ఏటికి ఇరుగట్లా ఇళ్లూ వాకిళ్లూ ఉన్నాయి.హాయిగా నీడనిచ్చే చెట్లు ఉన్నాయి. కొండ కోనలను దిగివచ్చి మైదానంలో పడినది మొదలు ఆ నదీ దేవత ఇంటింటికీ ఉద్యానవన దేవత అయింది. తన్ను తానే మరచిన పారవశ్యంలో పరుగెత్తిపోతూ దయామయంగా ఎంతో పరిచర్య చేస్తోంది. వాణీకాంత ఇంటిని ఏటిలోంచి చూడవచ్చు. ఆ ఊరిలోని ప్రతి గుడిసె, ప్రతి చావడి ఏటిలో ఓడ నడిపే నావికుల కనుచూపు నుంచి దాక్కోలేవు. సుభా రోజూ పని పూర్తి చేసుకోవడంతోనే బయలుదేరి చడీచప్పుడూ లేకుండా ఏటి తిన్నెకు వెళ్లి కూర్చునేది. ప్రాపంచికమైన జంఝాటంలో పడి ఏ నావికుడైనా ఏటి గట్టున ఈ బాలికను గమనిస్తున్నాడో లేదో చెప్పలేము.కాని ప్రకృతిమాత ఆ బాలికలోని మాట లోపాన్ని భర్తీ చేయడానికి ఆమెకు బదులుగా తానే మాట్లాడేది. సెలయేటి గుసగుసలు, జానపదుల సంభాషణలు, ఓడ సరంగు తీయని పల్లెపదాలు, పక్షుల కిలకిలలు, చెట్ల వీవనలు– అన్నీ కలసి ఆమె హృదయస్పందనతో ఏకీభూతమయ్యాయి. అవన్నీ ఒక అపూర్వ నాద తరంగమై అలసిన ఆమె గుండెలపై నినదిస్తున్నాయి. ప్రకృతిమాతకు చెందిన ఈ మార్మిక చలనమే ఆ మూగ బాలిక భాష. విల్లులాంటి కనుబొమ్మలంచు గట్టిన ఆ నీలనయనాల భాషే ఆమెను అక్కడ ఆవరించిన ప్రపంచంలోని భాష. మిట్టమధ్యాహ్న ఘడియల్లో నావికులు, బెస్తలు భోజనాలకు వెళ్లిపోతారు. గ్రామీణులు మాగన్నుగా పడుకుంటారు. పక్షులు నిశ్శబ్దమవుతాయి. రహదారి పడవలు విశ్రమిస్తాయి. బహు వ్యాపకాలతో వేగే ప్రపంచం ఒక్క క్షణం పని నిలిపి, హఠాత్తుగా ఏకాంతపు కొలువుదీర్చి బ్రహ్మరాక్షసిగా మారిపోతుంది. అప్పుడు విస్ఫార విశాలాకాశం కింద నిశ్శబ్దంగా ఇద్దరు కూర్చుంటారు: ఒకరు ప్రకృతి, మరొకరు మూగ బాలిక. ఒకరు చండభానుని కిందా– మరొకరు చిన్న చెట్టు పరచిన నీడపట్టున ఉంటారు. అలాగని సుభాకు స్నేహితులసలే లేరనుకోవద్దు. వాళ్ల దొడ్డో సర్భాషి, పంగుళి అనే రెండు గంగిగోవులు ఉన్నాయి. వాటి పేర్లు పెట్టి నోరారా ఆమె వాటిని ఏనాడూ పిలిచి ఎరుగదు. వస్తోందనగా ఆమె అడుగుల చప్పుడును బట్టి అవి ఆమె రాకను తెలుసుకునేవి. ఆమె మాటలు ఉచ్చరించలేకపోయినా మూగగా ముచ్చటగా గొణిగేది. స్ఫుటమైన ఉచ్చారణ కన్నా మృదువైన ఆ గొణుగుడే వాటికి సులభంగా బోధపడేది.ఆమె వాటిని గోముగా బుజ్జగించినా, కోపంతో కసరినా, బతిమాలినా మనుషుల కన్నా అవే చక్కగా అర్థం చేసుకునేవి. సుభా పశువులశాలకు వస్తుంది. వచ్చీ రావడంతోనే సర్భాషి మెడకు తన చేతులు చుట్టేస్తుంది. తన చెక్కిలిని గోవు చెక్కిలికి ఆనించి మెల్లగా పాముతుంది. ఇంతలో పంగుళి నాలుకసాచి ఆమె ముఖాన్ని నాకుతుంది. సుభా రోజుకు కనీసం మూడుసార్లు పశువుల కొట్టంలోకి వచ్చి వెళుతుంది. అది ఆమె నియమం. ఇంకా ఎక్కువసార్లు వచ్చి వెళ్లడం కూడా కద్దు. పరుషోక్తులు పడవలసి వచ్చి, మనసు గాయపడినప్పుడల్లా ఈ మూగ నేస్తాల దగ్గరకు వచ్చేస్తుంటుంది. అలా రావడానికి ఏవేళా అడ్డురాదు. ఆమె నిరాశాపూరితమైన చూపుల మూలంగా గోవులు ఆమె ఆత్మక్షోభను కనిపెట్టినట్లే అగుపిస్తాయి. గోవుమాణిక్యాలే ఆమెకు చేరువగా వచ్చి కొమ్ములతో ఆమె చేతులను రాసుకుంటాయి. మూగగా, ఉద్విగ్నంగా ఆమెను ఓదార్చబూనుకుంటాయి. గోవు నేస్తాలే కాకుండా, మేకపిల్ల, ఒక పిల్లికూన కూడా ఆమె స్నేహబృందంలో ఉన్నాయి. అయితే, అవి ఈమె పట్ల గట్టి బంధం ఏర్పరచుకున్నా, వాటి పట్ల ఆమెకంత ఆత్మీయత లేదు. అందులో ఆ పిల్లికూన రాత్రిగాని, పగలుగాని సమయం దొరికనప్పుడల్లా ఆమె ఒడిలోకి అట్టే దూరి నిద్రపోతుంది. సుభా దాని మెడా వీపూ వేళ్లతో నిమురుతూ నిద్రపుచ్చుతుంటుంది. అందుకు దాని తృప్తి వెల్లడిస్తుంటుంది. ఈ చతుష్పాద జంతువుల్లోనే కాకుండా, ద్విపాద జంతువుల్లో కూడా సుభాకొక నేస్తుడున్నాడు. అతనితో బంధం ఎలాంటిదో చెప్పడం కష్టం. అతనికి మాట ఉంది. అందువల్ల వారిద్దరికీ అర్థమయ్యే భాష లేకపోయింది. వాడు గోసాయనుల కడసారి కుర్రవాడు. పేరు ప్రతాప్. సోమరి. తల్లిదండ్రులు ప్రయత్నించి ప్రయత్నించి వాడు ఏనాటికైనా జీవనోపాధి చూసుకోగలడనే ఆశను వదులుకున్నారు. వాడొక తిరుగుబోతు. అత్మీయులైన వారు వాణ్ణి ఏవగించుకున్నప్పటికీ మిగిలిన ఊరివారందరితోనూ చనువుగా, మంచిగా ఉంటాడు. పనిపాటలు లేని ఇలాంటి వాళ్లు ఊరుమ్మడి సొత్తుగా పరిగణింపుకెక్కుతారు.షికారు వెళ్లి సేదదీరడానికి పట్నంలో బహిరంగ స్థలం అవసరమైనట్లే గ్రామానికి ఇద్దరు ముగ్గురు సదా తీరుబడి జీవాలు కావాల్సి ఉంటారు. వారి పుణ్యమా అంటూ అందరికీ కాలం వెళ్లమారుతుంది. ఏమీ తోచకపోతే, ఊసులాడుతూ పొద్దుగడిపే స్నేహితుడు కావాలంటే ఇటువంటి వాళ్లు సిద్ధంగా ఎల్లప్పుడూ బాతాఖానీ రాయుళ్ల చేతికి దొరుకుతారు. ప్రతాప్ పెట్టుకున్న వ్యాపకం చేపలను పట్టడం. కాలమంతా ఎక్కువగా ఈ వ్యాపకంతోనే గడిపేస్తాడు. ప్రతి మధ్యాహ్నం అతను ఆ పనిలోనే కనిపిస్తాడు. ఆ వ్యాపకం వల్లనే అతడు ప్రతినిత్యం సుభాను కలుసుకోగలుగుతాడు. అతడేమి తలపెట్టినా అందుకొక సలహాదారు, నేస్తం కావాలి. చేపలకు గాలమేసేటప్పుడు నిశ్శబ్దంగా కూర్చోగల నేస్తమైతే అన్నిటికంటే మంచిది. ఇంకేం, సుభాలో ఆ నిశ్శబ్ద స్వభావం ఉంది. ప్రతాప్ అందుకే ఆమె ఆ వేళ అక్కడ ఉండాలని కోరుకుంటాడు. ఆమెను అందరూ సుభా అని పిలిస్తే ప్రతాప్ ఆప్యాయత కొద్దీ ‘సూ’ అని పిలిచేవాడు. చింతమాను నీడలో సుభా కూర్చుంటే, ఇంకాస్త దూరంలో ప్రతాప్ కూర్చుని గాలం వేసేవాడు. ప్రతాప్ ఇన్ని ఆకులు తెచ్చేవాడు. వాటితో ‘సూ’ తాంబూలం సిద్ధపరచేది. కూర్చుని చాలాసేపు పరికిస్తూ ప్రతాప్కి ఏదో సాయపడాలని ఆందోళనపడుతూ ఉండేదని నా నమ్మకం. అలా సాయపడటం ద్వారా ఆమె భూమికి బరువు చేటు కాదని, నిరర్థకం కాదని నిరూపించుకోవాలనుకునేది. కాని తాను చెయ్యడానికేమీ లేదు.అప్పుడు ఆమె దేవదేవుని ప్రార్థించేది. అపురూప శక్తినేదో ప్రసాదిస్తే ఒక గొప్ప కార్యం ఘనంగా చేసి, ‘అమ్మో! మన ‘సూ’ ఇంత చేస్తుందని కలలో కూడా అనుకోలేదని ప్రతాప్ నోట ఆశ్చర్యార్థకం రాబట్టాలని ఉబలాటపడేది. సుభా జలదేవతే అయినట్లయితే, రసాతలంలోని నాగరాజు కిరీటంలోని మాణిక్యాన్ని పెకలించి దోసిట పెట్టుకుని జలాల్లోంచి నెమ్మదిగా ఒడ్డుకు చేర్చేది. అంతటితో పాడు చేపల వేట చాలించి ప్రతాప్ నీటిలో దూకి రసాతలంలోకి మునక ఈతలో వెళ్లి ఏడంతస్తుల వెండిమేడలో బంగారుతల్పం మీద ఒక యువతీమణి దర్శనభాగ్యం పొందేవాడు. ఆ యువతీమణి వాణీకాంత కూతురు, ‘సూ’ కన్నా అతనికి మరెవ్వరవుతారు? ధగధగాయమానంగా మెరిసే ఆ మాణిక్యనగరం రాజుగారి కుమార్తె ‘సూ’ను చూసేవాడు. కాని పాపం, ఇదొక్కడే సాధ్యంకాని పనిగాని తక్కినవన్నీ సుసాధ్యాలే. పాటలీపుత్ర రాజప్రాసాదంలో కాకుండా, ఆమె వాణీకాంత ఇంట పుట్టినదాయె! దాంతో గోసాయనుల కుర్రవాణ్ణి చకితుణ్ణి చేసే సాధన విశేషాలు దొరకక హతాశురాలయ్యేది. పెరిగి పెద్దదయింది. క్రమక్రమంగా తనను తాను తెలుసుకోవడం ప్రారంభించింది. పౌర్ణమినాడు సముద్రగర్భగోళం నుంచి ఎగసిపడే కెరటంలా చెప్పనలవికాని నూతన చేతన స్ఫూర్తి ఆమెలో అలముకుంది. తన ప్రశ్నకు తాను అర్థం చేసుకోగల సమాధానం లభించలేదు. ఒక పున్నమిరాత్రి నడిజామున లేచి, తన గది తలుపులు మెల్లగా తెరిచి వెన్నెల్లోకి కూడా పిరికిగా తొంగిచూసింది. రాకా చంద్రికలో సుభా వలెనే ప్రకృతి ఆదమరచి నిద్రిస్తున్న భూదేవిని తిలకిస్తోంది. అప్పుడు సుభాలో బలలీయమైన పడుచుదనం స్పందించింది. మోదఖేదాలు రెండూ ఆమెలో ముప్పిరిగొన్నాయి. పూర్వం చెప్పరానంత ఏకాకిగా భావించుకునేదేగాని ఈ నిమిషంలో అదే భావం తుది శ్రుతులకు చేరి పరాకాష్ఠ చెందింది. ఆమె హృదయం బరువెక్కింది, కాని వెలిబుచ్చలేదు. నిశ్శబ్ద వ్యథార్తమైన ప్రకృతిమాత సన్నిధానంలో లోలోపల కుమిలే ఆ ఆడపడుచు తలవంచింది. ఆమెకు వివాహం జరిపించడం ఎలాగన్నదే తల్లిదండ్రులను వేపుకు తినసాగింది. పిల్ల ఎదిగింది. ఈడేరిన పిల్ల నట్టింట పడి ఉండటంతో లోకం వారిని చీకొట్టింది. వెలివేస్తామని బెదిరించింది కూడా. వాణీకాంత జరుగుబాటు ఉన్న సంపన్న గృహస్థే. రెండుపూటలా చేపలవేపుడు రుచిచూడగలిగిన కుటుంబమే. కలిమి గలవాని మీద అసూయ కావలసినంత. అది లోకధర్మమే. అందుకే అతనికి విరోధుల కొరత లేదు.ఒకనాడు ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిల్ల పెళ్లిని గురించి కలగజేసుకున్నారు. వాణీకాంత చెప్పులరిగేలా తిరిగి ఇంటికొచ్చాడు. ఇక కలకత్తా వెళితే తప్ప వీలులేదన్నాడు. కుటుంబం కుటుంబమంతా ప్రయాణమైంది. మంచెతెర కప్పిన ఉషస్సులాగ సుభా హృదయం అశ్రుపూర్ణాకులమైంది. ఇన్ని రోజుల నుంచి ఆమె బిక్కుబిక్కుమంటోంది. అలా పెనగొన్న భయంతోనే తల్లిదండ్రుల వెనుక మూగజంతువులా బయల్దేరింది. వారి కళ్లలోకి చూసి ఏదో తెలుసుకోవాలనుకుంది. కాని వారు ఆమెకు ఏమాటా విప్పి చెప్పలేదు. ఇలా జరుగుతూ ఉండగా ఒక మధ్యాహ్నం గాలం నడుపుతూ కూర్చున్న ప్రతాప్ ఇలా అన్నాడు: ‘అయితే, సూ.. నీకు మొగుణ్ణి చూశారన్న మాట. నీకు పెళ్లవుతుంది. నన్ను మరచిపోకేం’ అని గాలం ఆడిస్తూ మళ్లీ వేటలో నిమగ్నమయ్యాడు. ‘నీకు నేను చేసిన అపచారం ఏముంది?’ అని ఉచ్చులో చిక్కిన పావురం బోయవాని ముఖం చూసి దీనంగా అడుగుతుంది. అలాగే సుభా ప్రతాప్ వైపు దీనంగా చూసింది. ఇక ఆ రోజుకి చింతమాను కింద కూర్చోలేక తిరిగొచ్చింది. వాణీకాంత ఒక్క కునుకుతీసి లేచి పడకగదిలో హుక్కా పీలుస్తున్నాడు. ఇంతలో సుభా వచ్చి అతని కాళ్ల వద్ద పడి తండ్రి ముఖంలోకి చూస్తూ గావురుమంది. వాణీకాంత ఓదార్చబోయి తానే కంటతడి పెట్టసాగాడు. ఉదయమే కలకత్తా ప్రయాణం నిశ్చయమైపోయింది. పశువుల కొట్టంలోని తన బాల్య స్నేహితులందరి వద్దా సెలవు తీసుకునేందుకు వెళ్లింది. చేతితో వాటికి పచ్చమేత అందించింది. వాటి మెడలు వాటేసుకుంది. కళ్లలోకి చూసింది. ఆమె కళ్లు బాష్పాలు కురిశాయి. బాష్పాలే ఆమె భాష. గోవు మాణిక్యాలు అర్థం చేసుకున్నాయి. నాడు బహుళ దశమి రాత్రి. సుభా గది వెడలి వచ్చింది. ఏటి గట్టున తాను కూర్చునే తావున గరికపట్టు మీద బోర్లా పడుకుంది. భూదేవి ఆమెకు నిశ్శబ్ద, సుబల మాతృమూర్తి. ‘నువ్వు నన్ను ఎడబాయనివ్వొద్దు. తల్లీ, నిన్ను నేను కావులించుకున్నట్లే నువ్వూ నన్ను నీ గాఢ సమాలింగనంలో చిక్కబట్టుకో తల్లీ!’ అని నివేదించుకోవాలని యత్నించింది. కలకత్తా మహానగరంలో ఒక ఇంట్లో ఒకానొకనాడు సుభాకు తల్లి అలంకరించింది. బిగువుగా జడ అల్లింది. ఇన్ని ఆభరణాలను దిగవేసింది. ఆమె సహజ లావణ్యాన్ని చంపడానికి చేయాల్సినదంతా చేసింది.సుభా నీలలోచనాలు అశ్రుపూరితాలయ్యాయి. ఏడ్చి ఏడ్చి కళ్లు వాచిపోతాయని తల్లి భయపడి కసురుకొని తిట్టింది. కాని కన్నీళ్లు తిట్లకు వెరుస్తాయా?ఒక స్నేహితుణ్ణి వెంటబెట్టుకుని వరుడు పెళ్లిచూపులకు వచ్చాడు. తలుపువార నిలబడి, వరుడి ముందుకు పంపే ముందు కూతురికి తల్లి బిగ్గరగా సూచనలు ఇవ్వసాగింది. దాంతో ఆమె ఇంకా వెక్కివెక్కిఏడవసాగింది. ఆ మహాపురుషుడు ఆమెను ఎగాదిగా పరీక్షగా చూసి ‘అంత నాసికాదు’ అని స్వగతాన్ని పైకి అన్నాడు.ఆమె బాష్పాలు అతని మనసును ఆకర్షించాయి. ఆమెది సుకోమల హృదయమనుకున్నాడు. తల్లిదండ్రులను ఎడబాయడానికి కుములుతున్న ఆమె ఆర్ద్రహృదయం తనకెంతో ఉపకరిస్తుందని అనుకుంటూ,ఏడుపును ఆమె సుగుణంగానే లెక్కగట్టుకున్నాడు. పురోహితుడు వచ్చాడు. శుభాశుభాలు లెక్కించాడు. ఒక శుభదినాన వివాహం పూర్తయింది. నోరులేని బిడ్డను ఒకరి చేతుల్లోపెట్టి తల్లిదండ్రులు తమ ఇల్లు చేరారు. దేవుని దయవల్ల ఇహంలో వారి కులానికీ, పరంలో వారి భద్రతకు భంగం వాటిల్లకుండా తప్పింది. అల్లుడికి పశ్చిమబెంగాల్లో ఉద్యోగం అయింది. పెళ్లయిన కొద్దిరోజులకే భార్యను కాపురానికి తీసుకుపోయాడు.పట్టుమని పదిరోజులైనా గడవలేదు. పెళ్లికూతురు మూగదని అంతా కనిపెట్టారు. ఇంకా ఎవరైనా కనిపెట్టలేకపోతే, అది ఆవిడ తప్పుకాదు. ఇందులో ఆమె ఎవ్వరినీ మోసగించలేదు. ఆమె గుట్టంతా కళ్లే విప్పి చెప్పేశాయి. కాని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. ఎవ్వరూ ఆమెను పలకరించలేదు. పుట్టినది మొదలు తనకు తెలిసిన మొహాలిప్పుడు కరువయ్యాయి. మూగపిల్ల భాషను ఎరిగిన వారంతా దూరమయ్యారు. ఆమె నీరవ హృదయం అంతమేలేని, వినబడని ఏడుపు చప్పుళ్లు నెలకొన్నాయి. అదెవ్వరికి తెలుసు అంతర్ద్రష్టకు తప్ప! - రవీంద్రనాథ్ టాగోర్ -
స్క్రీన్ టెస్ట్
ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి. ఏ నోట విన్నా రాజకీయమే. రచ్చబండ మీద, పొలం గట్ల దగ్గర అక్కడా ఇక్కడా అనే తేడా లేదు. ఎక్కడ చూసినా రాజకీయాలే. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమా సీన్లలో ఉండే రాజకీయాలను కథ నిర్ణయిస్తుంది. ఒకప్పుడు సినిమా, రాజకీయాలు రెండూ రెండు భిన్న కోణాలు. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు కలిసే ప్రయాణం చేస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. సినిమాల్లో రాజకీయాలు కాదు, రాజకీయాల్లో సినిమా స్టార్స్ గురించి ఈ వారం స్పెషల్ క్విజ్. 1. సినిమా వాళ్లల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్కు (యం.పి) ఎన్నికైన మొట్టమొదటి తెలుగు నటుడు ఇతను. కాంగ్రెస్ పార్టీ తరపున ఒంగోలు నుంచి గెలుపొందిన ఈ నటుడు ఎవరో తెలుసా? ఎ) చిత్తూరు నాగయ్య బి) కాంతారావు సి) కొంగర జగ్గయ్య డి) యస్వీ రంగారావు 2. 1989లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన నటుడెవరో కనుక్కుందామా? ఎ) కృష్ణ బి) శోభన్బాబు సి) హరనాథ్ డి) శరత్బాబు 3. ప్రముఖ నటుడు చిరంజీవి 2008లో ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తు ఏంటో కనుక్కోండి? ఎ) రైలు బి) కారు సి) విమానం డి) స్కూటర్ 4. 2009 ఎలక్షన్స్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ తరపున యం.ఎల్.ఏ గా గెలిచిన సినీ నటి ఎవరో తెలుసా? ( సికింద్రాబాద్ నియోజకవర్గం) ఎ) కుష్బూ బి) నగ్మా సి) సుహాసిని డి) జయసుధ 5. నటి రోజా వైయస్ఆర్ సీపీ తరపున పోటీ చేసి యం.ఎల్.ఏగా గెలుపొందారు. ఆమె ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారో తెలుసా? ఎ) నగరి బి) చిత్తూరు సి) పీలేరు డి) తిరుపతి 6. ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటేరియన్గా గెలుపొందిన నటి? ఎ) హేమమాలిని బి) జయప్రద సి) జయబాధురి డి) రేఖ 7. ఈయన ప్రముఖ సినిమా రచయిత. తమిళనాట రాజకీయాల్లో చాలా కీలక పాత్రను పోషించారు. ఎవరా రచయిత? ఎ) కరుణానిధి బి) యం.జీ.ఆర్ సి) స్టాలిన్ డి) నెపోలియన్ 8. నటి రాధిక భర్త శరత్కుమార్. అనేక తెలుగు సినిమాల్లో కూడా నటించారు. తమిళ రాజకీయల్లో క్రియాశీలక వ్యక్తి. 2007లో ఆయన తన సొంత పొలిటికల్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ పేరేంటి? ఎ) హిందూ మక్కళ్ కట్చి బి) కొంగునాడు మున్నేట్ర కళగం సి) తమిళ్ మానిల కాంగ్రెస్ డి) ఆల్ ఇండియా సమత్తువ మక్కళ్ కట్చి 9. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ యం.ఎల్.ఏగా గెలుపొందిన తెలుగు సినీ ప్రముఖుడెవరో కనుక్కోండి? ఎ) మురళీమోహన్ బి) ఏవీయస్ సి) అలీ డి) కోట శ్రీనివాసరావు 10. 1995వ సంవత్సరం నుంచి 6 సంవత్సరాలు రాజ్యసభలో పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన తెలుగు నటుడెవరు? ఎ) చిరంజీవి బి) మోహన్బాబు సి) బాలకృష్ణ డి) ఏయన్నార్ 11. 2019 కర్ణాటక ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను అని ఈ మధ్యే ప్రకటించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) సాయికుమార్ బి) ప్రకాశ్ రాజ్ సి) అయ్యప్ప.పి.శర్మ డి) యశ్ 12. 1998లో భారతీయ జనతా పార్టీలో చేరి, మెదక్ నియోజక వర్గం నుంచి యం.పీ గా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరా నటి? ఎ) శారద బి) కవిత సి) విజయశాంతి డి) విజయనిర్మల 13. ప్రముఖ నటి సౌందర్య ప్రచారానికి వెళ్తూ ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కుప్పకూలి మరణించారు. ఆమె ఏ సంవత్సరంలో మరణించారు? ఎ) 2000 బి) 2001 సి) 2002 డి) 2004 14. ఈ నటుడు 2017లో కర్ణాటకలోని ఓ పార్టీలో చేరారు. ఐదు నెలల తర్వాత ఆ పార్టీకి తిలోదకాలిచ్చి ప్రజాకీయ అనే సొంత పార్టీని ప్రారంభించారు. ఎవరా నటుడు? ఎ)ఉపేంద్ర బి) పునీత్ రాజ్కుమార్ సి) సుదీప్ డి) శివ రాజ్కుమార్ 15. 2006లో కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్ర రావు సి) దిలీప్ కుమార్ డి) రాజేష్ఖన్నా 16. ‘మక్కళ్ నీది మయం’ అనే పొలిటికల్ పార్టీని స్థాపించిన తమిళ నటుడు ఎవరు? ఎ) కమల్హాసన్ బి) రజనీకాంత్ సి) విశాల్ డి) విజయ్కాంత్ 17. ఈయన ప్రముఖ నటుడు. యం.ఎల్.ఏ గా రెండుసార్లు గెలుపొందారు. రెండుసార్లు ఓడిపోయారు. ఆ నటుడెవరు? ఎ) సుమన్ బి) పోసాని కృష్ణమురళీ సి) బాబుమోహన్ డి) విజయ్ చందర్ 18. 1999లో పదమూడవ లోక్సభకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బాపట్ల నుంచి యంపీగా పోటీ చేసి గెలుపొందిన తెలుగు నిర్మాత ఎవరు? ఎ) సి.అశ్వనీదత్ బి) మాగంటి బాబు సి) జి.ఆదిశేషగిరిరావు డి) డి.రామానాయుడు 19. కాకినాడ నుంచి పోటీచేసి 12వ లోక్సభలో అడుగుపెట్టిన ప్రముఖ నటుడు ఎవరు? ఎ) కృష్ణ బి) మురళీమోహన్ సి) కైకాల సత్యనారాయణ డి) కృష్ణంరాజు 20. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత తమిళ ప్రజల గుండెల్లో నిలిచారు. ఆమె మరణానంతరం ఆమెపై 3 బయోపిక్లు నిర్మితమవుతున్నాయి. అందులో ఓ చిత్రంలో జయలలిత పాత్రలో నటిస్తున్న నటి ఎవరో తెలుసా? ఎ) నిత్యామీనన్ బి) అనుష్క సి) హన్సిక డి) త్రిష మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (సి) 2) (ఎ) 3) (ఎ) 4) (డి) 5) (ఎ) 6) (బి) 7) (ఎ) 8) (డి) 9) (డి) 10) (బి) 11) (బి) 12) (సి) 13) (డి) 14) (ఎ) 15) (ఎ) 16) (ఎ) 17) (సి) 18) (డి) 19) (డి) 20) (ఎ) నిర్వహణ: శివ మల్లాల -
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో టీడీపీకీ షాక్
-
ఓటమి తెలిసే సుహాసినికి సీటు
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ కుమారుడు, తన బావమరిది నందమూరి హరికృష్ణను తన రాజకీయ వ్యూహంలో పావుగా వాడుకుని బలి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన కుమార్తె సుహాసినిని అదే రీతిలో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయించి బలి చేశారనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసినిని తెరపైకి తీసుకురావడం ద్వారా ఎన్టీఆర్ కుటుంబంలో తన పట్ల వ్యతిరేకతతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్లకు చెక్ పెట్టాలని బాబు వ్యూహం రూపొందించారని, తద్వారా హరికృష్ణ ఇంట్లోనూ విభేదాలను రాజేశారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. కూకట్పల్లి స్థానం నుంచి హరికృష్ణ కుమారుడు, సినీ నటుడు కల్యాణ్రామ్ను పోటీ చేయించాలని తొలుత బాబు ప్రయత్నించారు. కుటుంబ సభ్యుల ద్వారా కల్యాణ్రామ్పై ఒత్తిడి తెచ్చారు. కల్యాణ్రామ్ ఒప్పుకోకపోవడంతో అనూహ్యంగా ఆయన సోదరి సుహాసినిని తెరపైకి తీసుకొచ్చారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని గుప్పిట్లో పెట్టుకునే క్రమంలో చంద్రబాబు అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి లాగి ఇబ్బంది పెట్టారనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోంది. కూకట్పల్లి నుంచి గెలిచే అవకాశం లేదని తెలిసి కూడా తన రాజకీయాల కోసం బాబు ఆమెను పోటీ చేయించి ఘోర పరాజయంతో మరింత కుంగదీశారని టీడీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. 2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హరికృష్ణ ఆసక్తి చూపారని, పెనమలూరు సీటు అడిగినా చంద్రబాబు ఇవ్వలేదని, ఆయన రాజ్యసభ సభ్యత్వం గడువు ముగిసిన తర్వాత రెండోసారి అవకాశం ఇవ్వకుండా మోసం చేశారని టీడీపీ నేత చెప్పారు. హరికృష్ణ కుటుంబానికి మేలు చేయాలంటే ఏపీలో జరిగే ఎన్నికల్లో ఒక స్థానం ఇచ్చే ఆలోచన చేయకుండా, తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయే చోట ఆయన కుమార్తెను బరిలోకి దించడం కచ్చితంగా బాబు చేసిన మోసమేనన్న వాదన వినిపిస్తోంది. చంద్రబాబు వలకు చిక్కని కల్యాణ్రామ్ కొద్దిరోజుల క్రితం నందమూరి హరికృష్ణ మృతి చెందినప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్లు చంద్రబాబు పట్ల అయిష్టత కనబరిచారు. అయినా పట్టువీడకుండా కల్యాణ్రామ్ను టీడీపీ పొలిట్బ్యూరోలో చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. కల్యాణ్రామ్ ఆయన వలలో పడలేదు. తననూ వాడుకుని వదిలేస్తారనే అభిప్రాయంతో ఆయన చంద్రబాబు ప్రతిపాదనకు అంగీకరించలేదనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సుహాసినిని ఎన్నికల రంగంలోకి దించారు. సుహాసిని పోటీ చేయడం ఆమె కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదని టీడీపీ నేతలు తెలిపారు. హరికృష్ణ రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్నానని చెప్పుకునేందుకు, హరికృష్ణపై ఉన్న సానుభూతిని వాడుకోవడానికే చంద్రబాబు ఆమెను తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయించారని గుంటూరుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. వీటన్నింటికీ మించి హరికృష్ణ కుటుంబం తన చేయి దాటిపోకుండా ఉండేందుకు, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్లకు చెక్ పెట్టేందుకు బాబు పన్నాగం పన్నినట్లు చెబుతున్నారు. బాబు వ్యూహాన్ని పసిగట్టిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్లు తమ సోదరికి మద్దతుగా పత్రికా ప్రకటన విడుదల చేసి, ఆ తర్వాత మిన్నకుండిపోయారు. ఎన్నికల ప్రచారంలో అడుగుపెట్టలేదు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కారణంగా హరికృష్ణ కుమార్తె ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కూకట్పల్లిలో బెడిసికొట్టిన టీడీపీ వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే భాగ్యనగరంలోని కూకట్పల్లి నియోజకవర్గంలో ఎన్నికలు ఒక ఎత్తుగా శుక్రవారం పోలింగ్ సాగింది. ఏపీ సీఎం చంద్రబాబు కూకట్పల్లిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో తన బంధువులను కీలకం చేయాలని ఎత్తులు వేశారు. అందులో భాగంగా తన సమీప బంధువు సుహాసిని రంగంలోకి దించి సరికొత్త రాజకీయానికి తెరలేపారు. ఎలాగైనా కూకట్పల్లిలో సుహాసినీని తన పాచికలతో నెగ్గించుకోవాలని చూశారు. కానీ చంద్రబాబు వ్యూహం అక్కడ ఫలించలేదు. కావల్సినంత డబ్బులు పంపినా ద్వితీయ శ్రేణి నాయకులు బస్తీవాసులకు అందజేయకుండా దిగమింగేశారని ప్రచారం సాగుతోంది. బస్తీ నాయకులను కేవలం రోజుకు రెండు మందుబాటిళ్లతో సరిపెట్టేశారు. దీనికి తోడు ఈనెల 5వ తేదీ రాత్రి ఏపీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్రావు ఇంటి వద్ద భారీ మొత్తం నగదును పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో, బయటి నుంచి డబ్బులు, ఇతర ప్రలోభాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయాలని చూసిన టీడీపీ ఆంధ్ర ప్రాంత నాయకులు పలాయనం చిత్తగించారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను బస్తీ టీడీపీ నాయకులు సీరియస్గా తీసుకోకుండా వదిలేశారని సమాచారం. దీంతో అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలుపు తథ్యమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. -
సుహాసినికి ఎన్టీఆర్ ఝలక్
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన సోదరి సుహాసినికి హీరో ఎన్టీఆర్ ఝలక్ ఇచ్చారు. ఆమె తరపున ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. కూకట్పల్లిలో ప్రచారానికి దూరంగా ఉండాలని భావించారు. తన అక్క సుహాసిని గెలిపించాలని ఇంతకుముందు ట్విటర్ ద్వారా కోరారు. మరోవైపు ఆమె తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. అయితే హీరో కళ్యాణ్రామ్ ప్రచారం చేస్తారా, లేదా అనేది స్పష్టం కాలేదు. ప్రజా కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా సుహాసిని పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె తరపున ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ ఎన్నికల ప్రచారానికి వస్తారని అంతకుముందు మీడియాలో వార్తలు వచ్చాయి. తన అన్న కుమార్తెకు మద్దతుగా నందమూరి బాలకృష్ణ రోడ్ షోలు నిర్వహించనున్నారని సమాచారం. (మా అక్కను గెలిపించండి : ఎన్టీఆర్) -
ప్రచారంలో సుహాసినికి చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్ : కూకట్పల్లి ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసినికి ప్రచారంలో చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. తొలుత ఆమెను కూకట్పల్లి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఇప్పుడ టీఆర్ఎస్ నుంచి ఊహించని నిరసనను ఎదుర్కొంటున్నారు. ప్రచారంలో భాగంగా సోమవారం కూకట్పల్లిలోని అల్లాపూర్ డివిజన్లో పర్యటించారు. దీనిలో టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. డివిజన్లోని టీఆర్ఎస్ కార్యాలయం ముందు నుంచి సుహాసిని వెళ్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెను అడ్డుకోవడంతో ఘర్షణ జరిగినట్లు తెలిసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈఘటన తరువాత సుహాసిని అర్ధాంతరంగా ప్రచారం ముగించుకుని వెనుకకు వెళ్లిపోయారు. ‘నందమూరి సుహాసినిని చిత్తు చిత్తుగా ఓడిస్తాం’ -
సుహాసిని నామినేషన్ దాఖలు
హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని నామినేషన్ దాఖలు చేశారు. శనివారం నటుడు బాలకృష్ణతో కలసి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్న ఆమె ఉదయం 11 గంటలకు నామినేషన్ సమర్పించారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆమెతోపాటు బాలకృష్ణ, స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ రంగారావు, మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి, మరో ఇద్దరు నాయకులు లోనికి వెళ్లారు. ఆమె నామినేషన్ దాఖలుకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో టీడీపీ తప్ప మహాకూటమిలోని ఇతర పార్టీల నాయకులెవరూ హాజరుకాలేదు. నామినేషన్కు ముందు, తర్వాత పలువురితో సెల్ఫీలు దిగిన ఆమె ఎలాంటి ప్రసంగం చేయలేదు. బాలకృష్ణ సైతం చేతులు ఊపుతూ వెళ్లిపోయారు. అయితే నామినేషన్ సందర్భంగా అభ్యర్థితోపాటు లోనికి నలుగురు మించి వెళ్లరాదనే నిబంధనలు ఉల్లంఘించినట్లు పలువురు ఆరోపించారు. నామినేషన్ సందర్భంగా ఎన్టీఆర్ కుమారులు బాలకృష్ణ, సాయికృష్ణ హాజరైనప్పటికీ, దివంగత హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హాజరుకాలేదు. ప్రజా సేవకు సిద్ధపడుతున్నతన సోదరి సుహాసినిని విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. -
వచ్చే ఏడాది జన నేత
దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్లు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. జనరంజకమైన పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంపై ‘యాత్ర’ సినిమా తెరకెక్కింది. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఈ సినిమాని డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘యాత్ర’ డిసెంబర్ 21న విడుదల కావడం లేదట. బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘యన్.టి.ఆర్: కథానాయకుడు, యన్.టి.ఆర్: మహానాయకుడు’ పేరుతో రెండు భాగాలుగా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నారు. ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ విడుదల అయ్యే రోజున వైఎస్ బయోపిక్ ‘యాత్ర’ సినిమాని ఆ చిత్రబృందం రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. జగపతిబాబు, సుహాసిని, రావు రమేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘యాత్ర’ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్. -
కూకట్పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి సుహాసిని
-
వయసుతో సంబంధం లేదు!
వయసు దేహానికి పెరుగుతుంది. మనసుకు కాదు. అందుకే ప్రేమకు వయసుతో సంబంధం లేదు. దాదాపు ఇదే కాన్సెప్ట్తో తమిళంలో ‘పవర్ పాండీ’ అనే సినిమా రూపొందింది. నిర్మాత–నటుడు ధనుష్ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడంలో ‘అంబి నింగే వయస్సాయ్తో’ అనే పేరుతో రీమేక్ అయ్యింది. ఇందులో కన్నడ స్టార్ హీరో అంబరీష్ నటించారు. అంబరీష్ యంగ్ ఏజ్ నాటి సీన్స్లో సుదీప్ కనిపిస్తారు.అన్నట్లు.. ఈ సినిమాకు సుదీప్ కూడా ఓ నిర్మాత. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు చిత్రబృందం. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాతో గురుదత్తా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సుహాసిని ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమాకు అర్జున్ జన్యా సంగీతం అందించారు. -
స్త్రీలోక సంచారం
కార్ల అమ్మకాలు, కొనుగోళ్లలో నాలుగో వంతు మార్కెట్ మహిళలదేనని, గత ఐదేళ్లలో మహిళల కొత్త, పాత కార్ల వినియోగం 10–12 శాతం నుంచి 25 శాతానికి రెట్టింపు అయిందని తాజా సర్వేలో వెల్లడయింది. ఈ పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు మరింత సులభంగా, ఫ్రెండ్లీగా ఉండే ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు కార్ల ఉత్పత్తి కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయని కూడా సర్వేలు కొన్ని పెద్ద కంపెనీల పేర్లను ఉదహరించాయి. అన్ని జాతులూ కలిసిమెలిసి, స్వేచ్ఛగా జీవించే అమెరికాలో జాతి వివక్షకు చోటు లేదని ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ ట్వీట్ చేశారు. తమను తాము ఆధిక్యజాతిగా భావించుకుంటున్న అమెరికన్లు కొందరు వర్జీనియాలోని చార్లెట్విల్ పట్టణంలో పరజాతులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిపి ఏడాది పూర్తయిన సందర్భంగా మళ్లీ అలాంటి ర్యాలీలే జరిగే అవకాశం ఉండటంతో స్థానికేతరులకు మనో ధైర్యాన్ని ఇచ్చేందుకు ఇవాంకా ఇలా.. (తన తండ్రి మద్దతిచ్చే ఆధిక్య భావజాలానికి పూర్తి విరుద్ధంగా).. ట్వీట్ చేయడం విశేషం. ఆగస్టు 12న మరణించిన భారత సంతతి బ్రిటిష్ రచయిత, నోబెల్ గ్రహీత వి.ఎస్.నయీపాల్.. స్త్రీల రచనా సామర్థ్యం విషయంలో తేలిక భావంతో ఉండేవారనీ, స్త్రీలోలుడని, స్త్రీలపై తరచు చెయ్యి చేసుకునేవాడని.. నివాళులలో భాగంగా జాతీయ పత్రికల్లో వరదలా వచ్చిపడిన ఆయన జీవిత విశేషాలను బట్టి తెలుస్తోంది. ‘రీడర్స్ డైజెస్ట్’ మాజీ ఎడిటర్ రాహుల్ సింగ్.. నయీపాల్లోని సత్యశీలతను కొనియాడుతూ.. సంక్లిష్టమైన ఆయన వ్యక్తిగతం జీవితానికి నిదర్శనంగా.. మొదటి భార్య ప్యాట్, పెళ్లికాకుండా ఆయనతో కలిసి ఉన్న మార్గరెట్ అనే ఒక అర్జెంటీనా మహిళ, నదీరా అనే మరో పాకిస్తానీ మహిళల గురించి ప్రస్తావించడాన్ని బట్టి నయీపాల్ జీవితంలో స్త్రీలకు పెద్ద స్థానమే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు డెన్జెల్ వాషింగ్టన్.. తన కుమార్తె (ఆమె కూడా హాలీవుడ్ నటి) ఒలీవియాతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారి నడుము విరగ్గొడతానని హెచ్చరించారు. గత ఏడాది హార్వీ వైన్స్టీన్ లైంగిక వేధింపులు బహిర్గతం అయిన అనంతరం ‘మీటూ’ ఉద్యమంతో బాధిత నటీమణులంతా సంఘటితం కావడంపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా.. మీటూ వల్ల హాలీవుడ్ ఇప్పుడు మరింత సురక్షితం అయిందని చెబుతూ, ఒకవేళ తన కూతుర్ని ఎవరైనా లైంగికంగా వేధిస్తున్నట్లు తెలిస్తే తక్షణం వెళ్లి వారి వెన్నెముకను సున్నం చేస్తానని డెన్జెల్ అన్నారు. మేనేజ్మెంట్ డిగ్రీలు లేకపోయినప్పటికీ మహిళలు ఇంటా బయటా పనుల్ని చక్కబెట్టగలరని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. చండీగఢ్లో ‘భారత వికాస్ పరిషత్’ నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. ‘ఒక మహిళ బయటì పనికి వెళ్లి వస్తోందంటే ఆమె ఏకకాలంలో రెండు పనులు చేస్తున్నట్లు. ఇదే మాట పురుషుడి విషయంలో చెప్పలేం. ఎందుకంటే అతడు బయటి పని మాత్రమే చేస్తాడు తప్ప, ఇంట్లో పూచిక పుల్లంత పని కూడా అందుకోడు’ అని కిరణ్ జీ (చండీగఢ్ ఎం.పి. కిరణ్ఖేర్) అన్న మాటను సమర్థించారు. వయసొచ్చిన కొడుకు విషయంలో తల్లికి ఉండే భయాలు, బెంగలు, ఆరాలు, అనుమానాలు, నిఘాలు.. ఇవన్నీ కలిసి ‘మమ్మా కి పరిచాయి’ (అమ్మ నీడ) అనే థీమ్తో విడుదలైన ‘హెలికాప్టర్ ఇలా’ చిత్రంలోని టీజర్ సాంగ్ యూత్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. తల్లిగా కాజల్, కొడుకుగా రిథీ సేన్ కనిపించే ఈ పాటలో.. కొడుకును అనుక్షణం ప్రొటక్ట్ చేసే కేరింగ్ మదర్, తల్లి పోరు పడలేక సతమతమయ్యే కొడుకు కనిపిస్తారు. ‘లండన్ లోని భారత దౌత్య కార్యాలయంలో టీమ్ ఇండియా’ అనే క్యాప్షన్తో ఈ నెల 8న బి.సి.సి.ఐ. (బోర్ట్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) ట్విట్టర్లో పెట్టిన గ్రూప్ ఫొటోలో టీమ్ సభ్యులతో పాటు విరాక్ కోహ్లీ భార్య అనుష్కాశర్మ కూడా ఉండటంపై ‘క్రికెట్నీ, బాలీవుడ్నీ కలపకండి’ అంటూ వస్తున్న ట్రోల్స్ మీద ఎట్టకేలకు అనుష్క స్పందించారు. అయితే.. ‘ఇలాంటి ట్రోల్స్కి నేను స్పందించను’ అన్నంత వరకే ఆమె స్పందించారు! నేడు నటి సుహాసిని 57వ పుట్టినరోజు. భర్త మణిరత్నం.. కొడుకు నందన్.. ఇదీ ఆమె ఫ్యామిలీ. సుహాసిని నాస్తికురాలు. ‘‘నాకు దేవుడి మీద నమ్మకం లేదు. దైవ ప్రార్థనల మీద నమ్మకం లేదు. నాకు, నా కుటుంబానికి సంతోషాన్ని ఇవ్వు దేవుడా అని గుడులకు వెళ్లడం మీద నమ్మకం లేదు’’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సుహాసిని. అలాగే మల్టీ టాస్కింగ్ (ఒకేసారి అనేక పనులు నెత్తికెత్తుకునే నేర్పు) మీద కూడా ఆమెకు నమ్మకం లేదు. ‘అదెలా సాధ్యం?’ అంటారు. ‘‘ఇంట్లో పని ఇంట్లోనే. బయటి పని బయటే. ఇక్కణ్ణుంచి ఆ పని, ఆక్కణ్ణుంచి ఈ పని చెయ్యలేను’’ అని చెబుతుంటారు సుహాసిని. -
ఇంటర్ విద్యాశాఖలో కలకలం
విద్యారణ్యపురి వరంగల్: నకిలీ కుల ధ్రువీకరణ పత్రం తో ఉద్యోగం పొందినట్లు ఆరోపణలు ఎదు ర్కొంటున్న ఐదు, ఆరో జోన్ల ఇంటర్ విద్య ఆర్జేడీ(ఎఫ్ఏసీ) సుహాసినిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆదివారం తెలంగాణ ప్రభుత్వ స్పెషన్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆర్ ఆచార్య సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు చెందిన సుహాసిని ము న్నూరుకాపు సామాజిక వర్గం అనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబా ద్ జిల్లాలో ఎస్టీ కేటగిరీలో 1991లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈమె లెక్చరర్గా నియామకమయ్యారు. 2005లో ప్రిన్సి పాల్గా, 2014లో ఇంటర్ విద్య ఆర్ఐఓగా పదోన్నతి పొం దారు. గత కొంతకాలంగా కరీంనగర్ జిల్లాలో డీఐ ఈఓగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న సుహాసినికి 2016లో ఐదవ, ఆరవజోన్కు సంబంధించిన వరంగల్ ఇంటర్ విద్య ఇన్చార్జి ఆర్జేడీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. గత కొన్ని నెలల క్రితమే ఫుల్ అడిషనల్ చార్జి(ఎఫ్ఏసీ) కూడా ఇచ్చారు. అయితే సుహాసిని ఎస్టీ కాదని, ఆమెది మున్నూరుకాపు సామాజిక వర్గమని, నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందారని ఆరోపిస్తూ ఓ సంస్థ బాధ్యులు కొన్నేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం సుహాసినిపై ఉన్నతాధికారులతో విచారణ చేయించింది. విచారణలో సుహాసిని ఎస్టీ కాదని, నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందినట్లు వెల్లడైనట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం సుహాసినిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు సస్పెన్షన్లోనే కొనసాగిస్తారు. సుహాసినిని హెడ్క్వార్టర్ కూడా వదిలి వెళ్లొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆమెపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇన్చార్జి ఆర్జేడీగా హన్మంతరావు కాగా సుహాసినిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు ఐదు, ఆరో జోన్ వరంగల్ ఇంటర్ విద్య ఆర్జేడీగా హన్మంతరావును నియమించినట్లు తెలిసింది. సుహాసినిని సస్పెండ్ చేసిన ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో డీఐఈఓగా పనిచేస్తున్న హన్మంతరావును ఆమె స్థానంలో వరంగల్ ఇన్చార్జి ఆర్జేడీగా నియమించారని సమాచారం. ఒకటి రెండు రోజుల్లో హన్మంతరావు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. -
అరవైలో ఇరవైలా..
అరవై ఏళ్ల వయసులో ఓ యాక్షన్ స్టంట్ను సింగిల్ టేక్లో కంప్లీట్ చేయడం అంటే మాములు విషయం కాదు. కానీ ఈజీగా చేశారట కన్నడ నటుడు అంబరీష్. గురు దత్తా దర్శకునిగా పరిచయం అవుతున్న కన్నడ చిత్రం ‘అంబి నింగ్ వయసాయతో’. తమిళ నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘పవర్ పాండి’ సినిమాకు రీమేక్ ఇది. ‘అంబి నింగ్ వయసాయతో’ చిత్రంలో అంబరీష్కు జోడీగా సుహాసిని నటించారు. ఓ కీలక పాత్రను సుదీప్ చేశారు. ‘‘ఇందులో రిటైర్డ్ స్టంట్ డైరెక్టర్గా అంబరీష్ సార్ నటించారు. సినిమాలో ఓ యాక్షన్ స్టంట్ను డూప్ లేకుండా చేశారు. 60 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎనర్జీ లెవల్స్ చూసి షాక్ అయ్యాను’’ అన్నారు డైరెక్టర్ గురు దత్తా. 60లో 20 ఏళ్ల కుర్రాడిలా అంబరీష్ ఫైట్ చేయడం యూనిట్లో ఇతర సభ్యులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కొత్త లుక్ను అంబరీష్ సతీమణి, నటి సుమలత రిలీజ్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. -
యాత్రలో జగపతిబాబు
వైఎస్ రాజారెడ్డి.. ఈ పేరు చెప్పగానే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి అని గుర్తుకొస్తారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రాజారెడ్డి అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటే.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో విలక్షణ నటుడు జగపతిబాబు కనిపించనున్నారు. రాజారెడ్డి అంటే రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా పులివెందుల ప్రాంత ప్రజలకు ఎనలేని అభిమానం. అటువంటి రాజారెడ్డి పాత్రకు జగపతిబాబు అయితే కరెక్టుగా సరిపోతారని భావించిన చిత్రబృందం ఆయన్ను సంప్రదించడం, ఆయన గ్రీన్సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఆదివారం రాత్రి దర్శక–నిర్మాతలతో మాట్లాడాక జగపతిబాబు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే లుక్ టెస్ట్ చేయనున్నారు. కాగా ఈ చిత్రంలో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటిస్తోన్న విషయం తెలిసిందే. -
సబితగా సుహాసిని
‘నా సోదరి’ అని మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆప్యాయంగా అనేవారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అన్నకు ఎంతో ఇష్టంగా రాఖీ కట్టేవారు సబిత. వైఎస్ హయాంలో తొలి మహిళా హోంమంత్రిగా సబిత బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే మహానేత వైయస్సార్ జీవితం ఆధారంగా ‘యాత్ర’ పేరుతో ఓ సినిమా నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతోంది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సబితా ఇంద్రారెడ్డి పాత్రను సుహాసిని చేయనున్నారు. త్వరలో లుక్ టెస్ట్ జరగనుంది. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. వైఎస్ గెటప్లో ఉన్న మమ్ముట్టి ఫస్ట్ లుక్కి అనూహ్య స్పందన లభించింది. -
ఒక హీరో.. నాలుగు కథలు
దుల్కర్ సల్మాన్ హీరోగా బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో మలయాళం, తమిళం భాషల్లో రూపొందిన చిత్రం ‘సోలో’ బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. నేహా శర్మ, ధన్సిక కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో నాజర్, సుహాసిని కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని నిర్మాత గాజుల వెంకటేశ్ ‘అతడే’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకలో సీడీని నిర్మాత రాజ్కందుకూరి విడుదల చేసి, డాక్టర్ గౌతమ్ కశ్యప్, నిర్మాత వెంకటేశ్కు అందించారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘4 వినూత్న కథలు ఈ సినిమాలో ఉంటాయి. అన్ని షేడ్స్లోనూ హీరో బాగా నటించారు. మూవీ చూస్తుంటే డబ్బింగ్ అనే ఫీలింగ్ కలగదు’’ అన్నారు. ‘‘ఎంతో ఇష్టపడి తీసుకున్న ఈ సినిమా తెలుగులో కూడా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్. మాటల రచయిత గౌతమ్ కశ్యప్, లిరిక్ రైటర్ పూర్ణాచారి పాల్గొన్నారు. -
సరైన పరిష్కారం!
గ్యాంగ్లో ఎవరికైనా ఏమైనా జరిగితే సత్య ఊరుకోడు. ఎందుకంటే అతనే గ్యాంగ్ లీడర్. కానీ సడన్గా ఓ నలుగురి గ్యాంగ్ వల్ల మర్డర్ జరుగుతుంది. అసలు.. ఈ సత్యగ్యాంగ్కు మర్డర్కి సంబంధం ఏంటి? ఆ మర్డర్ పర్పస్ ఏంటి? అనే విషయాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘సత్యగ్యాంగ్’. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై సాత్విక్ ఈశ్వర్, అక్షిత, ప్రత్యూష్, సుమన్, సుహాసిని, ‘కాలేకేయ’ ప్రభాకర్ ముఖ్య తారలుగా ప్రభాస్ దర్శకత్వంలో మహేశ్ ఖన్నా నిర్మించారు. సెన్సార్ కంప్లీటైంది. ‘‘కాంప్రమైజ్ కాకుండా 16 నెలలు శ్రమించి నిర్మించాం. ఈ చిత్రం ద్వారా ఓ మంచి సందేశం ఇస్తున్నాం. పాటలకు, ట్రైలర్కు మంచి స్పందన లభించింది. క్లైమాక్స్లో అనాథల భవిష్యత్కు సరైన పరిష్కారం చూపటం హైలైట్. ‘సత్యగ్యాంగ్’ మంచి చిత్రంలా నిలుస్తుంది’’ అన్నారు మహేశ్ఖన్నా. ఈ చిత్రానికి సంగీతం: జెబి. -
నిన్నే చూస్తూ
శ్రీకాంత్, హేమలత జంటగా వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై వీఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో హేమలతారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే చూస్తూ’. సుహాసిని, భానుచందర్, సుమన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమైంది. ‘‘మా వీరభద్ర క్రియేషన్స్పై నిర్మిస్తున్న రెండో చిత్రం ‘నిన్నే చూస్తూ’. సుహాసినిగారు మా సినిమాలో నటిస్తుండటం మా అదృష్టం. సీనియర్ నటులు సుమన్, భానుచందర్ చిత్రబృందంతో కుటుంబసభ్యుల్లా కలిసిపోయారు. అవుట్పుట్ బాగా వస్తోంది’’ అన్నారు నిర్మాత హేమలతా రెడ్డి. కిన్నెర, కాశీ విశ్వనాథ్, నిహాల్, వేణు మహేశ్, ఫణి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: రమణ్ రాథోడ్. -
తమిళ హీరోకి బిగ్ బి అవార్డు
తమిళ సినిమా: విలక్షణ నటుడు విజయ్సేతుపతి... అమితాబ్బచ్చన్ ఐకాన్ అవార్డును అందుకున్నారు. 15వ చెన్నై అంతర్జాతీయ చిత్రోత్సవాలు గత 14వ తేదీ నుంచి చెన్నైలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రోత్సవాలు గురువారంతో ముగిశాయి. గురువారం సాయంత్రం స్థానిక దేవి థియేటర్లో జరిగిన ముగింపు కార్యక్రమంలో ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందించారు. ఉత్తమ చిత్రం అవార్డును ఒరు కిడారియిన్ కరుణై మను గెలుచుకుంది. సురేశ్ చంగయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈరోస్ఇంటర్నేషనల్ మీడియా సంస్థ నిర్మించింది. ద్వితీయ ఉత్తమ చిత్రం – విక్రమ్వేదా గెలుచుకుంది. బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్ పేరుతో అందించే అవార్డు విజయ్సేతుపతిని వరించింది. అదే విధంగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మానగరం చిత్రం ప్రత్యేక జ్యూరీ అవార్డును గెలుచుకుంది. కురంగుబొమ్మై చిత్రంలో నటించిన ప్రముఖ దర్శకుడు భారతీరాజా ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు. నటనా శిక్షణ విద్యార్థుల కోసం నెలకొల్పిన అమ్మ అవార్డును డెయిసీ చిత్రం గెలుచుకుంది. ఈ చిత్రానికి ఏ.నారాయణమూర్తి దర్వకత్వం వహించారు. కార్యక్రమంలో నటుడు కే.భాగ్యరాజ్, సుహాసిని, మనోబాల సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురైన సంఘటన రాచకొండ నేరేడ్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విడాకుల కేసు విచారణ నిమిత్తం మల్కాజ్గిరి కోర్టుకు హాజరైన శ్రీధర్ అనే వ్యక్తిని అతని బావమరుదులు నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపారు. మూడేళ్ల క్రితం శ్రీధర్ కు మల్కాజ్గిరికి చెందిన సుహాసినితో వివాహం జరిగింది. అయితే రెండేళ్లుగా వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో సుహాసిని తన భర్త శ్రీధర్పై కేసు పెట్టడంతో విడాకుల వివాదం కోర్టులో నడుస్తోంది. ఇవాళ ఉదయం కోర్టుకు హాజరై కారులో వెళ్తుండగా శ్రీధర్పై నలుగురు వ్యక్తులు దాడి చేసి, కత్తితో నరికి చంపారు. కాగా తన కుమారుడి బావమరుదులైన వినయ్, విగ్నేష్ లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా తన కొడుకును చంపేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీధర్ తండ్రి అన్నారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. -
నిన్నే చూస్తూ..
కథానాయికగా ఓ వెలుగు వెలిగి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాక కూడా మంచి పాత్రలనే ఎంచుకుంటున్నారు సుహాసిని. ఇటీవల విన్న కథల్లో ‘నిన్నే చూస్తూ’ నచ్చి, ఆ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూతన నటుడు శ్రీకాంత్ హీరోగా, హేమలత (బుజ్జి ) హీరోయిన్గా వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి కె. గోవర్ధన్ రావు దర్శకుడు. ఈ చిత్రం మెదటి షెడ్యూల్ అమలాపురంలో జరుగుతోంది. నిర్మాత హేమలతారెడ్డి మాట్లాడుతూ – ‘‘ఇందులో సుహాసినిగారు కీలక పాత్ర చేస్తున్నారు. ఈ కథ విని సుహాసినిగారు హిట్ మూవీ అవుతుందన్నారు. అలాగే లేడీ ప్రొడ్యూసర్ నిర్మిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని కూడా ఆమె అభినందించారు’’ అన్నారు. ‘‘మంచి కథ, కథనాలు కుదిరాయి’’ అని దర్శకుడు తెలిపారు. భానుచందర్, సన, కాశీ విశ్వనాథ్, రజిత, ‘వెన్నెల’ కిశోర్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రమణ్ రాథోడ్. -
రౌండప్ చేశారు!
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం... ఇలా భాష ఏదైనా, పాత్ర ఏదైనా అందులో ఇట్టే ఒదిగిపోయి నటిస్తారు సుహాసిని. కాదు.. జీవిస్తారంటే బాగుంటుంది. క్యారెక్టర్ నటిగా మారిన తర్వాత కూడా మంచి రోల్స్ చేస్తున్నారామె. ఈ నెలలో మంచు మనోజ్ హీరోగా రిలీజైన ‘ఒక్కడు మిగిలాడు’లో మంచి పాత్రలో కనిపించారు. ఇప్పుడు రెండు కన్నడ సినిమాల్లో నటించేందకు పచ్చజెండా ఊపారు. వాటిలో ఒకటి తమిళ ‘పవర్ పాండి’కి రీమేక్. తమిళ హీరో, నిర్మాత అయిన ధనుష్ ఈ చిత్రం ద్వారానే దర్శకునిగా మారిన విషయం తెలిసే ఉంటుంది. సినిమాకి మంచి ప్రశంసలు రావడం, యూనివర్సల్ కథాంశం కావడంతో బాగుంటుందని కన్నడంలో రీమేక్ చేయాలనుకున్నారట. నందకిషోర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రాజ్కిరణ్ చేసిన పాత్రను అంబరీష్ చేయనున్నారు. ధనుష్ చేసిన గెస్ట్ రోల్ను సుదీప్, ఓ కీలక పాత్రను సుహాసిని చేయనున్నారు. ఈ చిత్రానికి ‘అంబి నింగె వయసాయితు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇది కాకుండా కన్నడ నటుడు అనంతనాగ్ నటించనున్న సినిమాలో ఆమె ఓ గెస్ట్ రోల్ చేయనున్నారని శాండిల్వుడ్ టాక్. అంటే ఒకటి గెస్ట్ రోల్ అయితే... రెండోవది ఇంపార్టెంట్ అన్నమాట. కన్నడంలో ఈ రెండు సినిమాలే కాదు.. తమిళంలో మూడు నాలుగు, మలయాళంలో ఒక సినిమా.. ఇలా సౌత్ని రౌండప్ చేస్తూ, సుహాసిని ఫుల్ బిజీగా ఉన్నారు. -
చింతలపూడి సమన్వయకర్తగా దమ్ము సుహాసిని
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తను నియమించింది. పార్టీకి చెందిన సీనియర్ నేత దమ్ము సుహాసినిని నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది. ఈసందర్భంగా సుహాసిని పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పార్టీ ఆశయాలతో పాటు, నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తనవంతు కృషిచేస్తానని అన్నారు. -
నేర్పించవా అంటున్న ఐశ్వర్యా అర్జున్
తమిళసినిమా: యాక్షన్కింగ్ అర్జున్ నటించిన చిత్రాలు గానీ, ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు గానీ వైవిధ్యంతో పాటు దేశానికి సంబంధించిన ఒక మంచి సందేశంతో కూడి ఉంటాయి. వాటిలో కమర్షియల్ అంశాలకు కొదవ ఉండదు. అలాంటి అర్జున్ తాజాగా తన వారసురాలు ఐశ్వర్యా అర్జున్ నట కెరీర్ను నిలబెట్టే విధంగా సొల్లితరవా ( నేర్పించవా) పేరుతో ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అయి తన శ్రీరామ్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఐశ్వర్య అర్జున్కు జంటగా నవ నటుడు శాంతన్కుమార్ నటిస్తున్న ఇందులో నటి సుహాసిని, దర్శకుడు కే.విశ్వనాథ్, ప్రకాశ్రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హాస్యభూమికల్ని నాన్ కడవుల్ రాజేంద్రన్, సతీష్, యోగిబాబు పోషిస్తున్న ఈ చిత్రాన్ని తమిళం, కన్నడం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. చిత్ర వివరాలను అర్జున్ తెలుపుతూ సొల్లితరవా చిత్ర కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయన్నారు. దేశానికి సంబంధించిన ఒక అంశంతో ప్రేమను జోడించి జనరంజకంగా రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. విధి నిర్వహణలో ఒక యువతీయువకుడు తమకు ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొని తమ ప్రేమను గెలిపించుకున్నారన్నదే సొల్లితరవా చిత్ర కథ అన్నారు. జెస్సీగిఫ్ట్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని చెన్నై, ధర్మస్థల, హైదరాబాద్, కేరళ, ఉత్తర భారతదేశంలోని పలు అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. చిత్రాన్ని దీపావళి సందర్భంగా తమిళం, కన్నడం భాషల్లో ఒకేసారి విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. -
నా కొడుకుకు సాయం చేయండి ప్లీజ్
తమిళసినిమా: నా కొడుకుకు ఎవరైనా సాయం చేయండి ప్లీజ్ అంటూ నటి సుహాసిని మణిరత్నం వేడుకున్నారు. అదేమిటీ ఆమెకలాంటి దుస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తవచ్చు. పరిస్థితుల ప్రభావం ఆమెనలా విజ్ఞప్తి చేసేలా చేసింది. దర్శకుడు మణిరత్నం, సుహాసిని దంపతులకు నందన్ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. అతనికి వారి తల్లిదండ్రుల మాదిరిగా సినిమాల్లో రాణించాలన్న ఆసక్తి లేదట. ఈ విషయాన్ని నటి సుహాసినే ఒక భేటీలో తెలిపారు. తన కొడుకుకు రాజకీయాల్లో రాణించాలన్న ఆసక్తి ఉందని చెప్పారు. కాగా నందన్ ఇటలీలో పాలిటిక్స్కు సంబంధించిన విద్య అభ్యసిస్తున్నాడు. ఇతడు కాంటర్స్ ఆఫ్ లెనినిజమ్ పేరుతో లెనిన్ గురించి 15 పేజీలతో కూడిన పుస్తకాన్ని తన 15వ ఏటనే రాశాడన్నది గమనార్హం. ఆదివారం నందన్ ఇటలీ దేశంలోని వెనిస్ నగరానికి వెళుతుండగా మార్గమధ్యలో వెలనో అనే ప్రాంతంలో తస్కరణకు గురయ్యాడు. తన వద్ద ఉన్న డబ్బు, ఇతర వస్తువులు దొంగతనానికి గురవడంతో ఏం చేయాలో పాలు పోక ఇక్కట్ల పాలయ్యాడు. ఈ సంఘటన గురించి తెలిసిన నటి సుహాసిని వెంటనే తన కొడుకుకు ఎవరైనా సాయపడగలరా అంటూ అతని ఫోన్ నంబరును పొందుపరస్తూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సాయం చేయగలిగిన వారే ఆ నంబరుకు ఫోన్ చేయాలని, అలా చేయనివారు ఫోన్ చేయవద్దని పేర్కొన్నారు. అందరూ ఫోన్ చేసి చార్జింగ్ అవ్వచేయవద్దనీ మనవి చేశారు. ఈ విజ్ఞప్తికి కొన్ని గంటల వ్యవధిలోనే మంచి స్పందన వచ్చిందట. నందన్కు సాయం అందిందట. వెంటనే నటి సుహాసిని ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. -
స్టార్ డైరెక్టర్ తనయుడికి చేదు అనుభవం..!
దిగ్గజ దర్శకుడు మణిరత్నం, సీనియర్ నటి సుహాసినల కొడుకు నందన్కు వెనిస్ లో చేదు అనుభవం ఎదురైంది. వెనిస్ పర్యటనలో ఉన్న నందన్ ను దొంగలు దోచుకున్నారు. చేతిలో ఒక్క పైసా కూడా లేకపోవటంతో అతను ఎయిర్ పోర్ట్ కు చేరుకోవటం కూడా కష్టమైంది. విషయం తెలుసుకున్న సుహాసిని ట్విట్టర్ ద్వారా సాయం కోరటంతో అక్కడివారు స్పందించి నందన్ కు సాయమందించారు. తన అభ్యర్థనను మన్నించి తన కుమారుడికి సాయమందించిన వారికి సుహాసిని కృతజ్ఞతలు తెలియజేసింది. నందన్ హోటల్ కు చేరుకున్నట్టుగా తెలిపిన సుహాసిని అతను సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. sos anyone near venice airport ? can u help our son who was robbed in Belunno .he needs to reach airport pls help — Suhasini Maniratnam (@hasinimani) 27 August 2017 anyone near venice st mark square police station Pls pls help — Suhasini Maniratnam (@hasinimani) 27 August 2017 ppl who can't help in venice pls don't call the number i posted earlier as your drain out his battery & he ll lose contact — Suhasini Maniratnam (@hasinimani) 27 August 2017 people from india pls don't call and harass some one who already is in distress — Suhasini Maniratnam (@hasinimani) 27 August 2017 Help is on the way for our son. So those from Twitter who offered help. Thank you. He's fine now — Suhasini Maniratnam (@hasinimani) 27 August 2017 Our son checked into a hotel. He is safe tonight — Suhasini Maniratnam (@hasinimani) 27 August 2017 -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - సుహాసిని
-
వేధింపులకు వివాహిత బలి
మరదలిపై మోజుపడ్డ భర్త రెండో పెళ్లి కోసం తీవ్రస్థాయిలో ఒత్తిడి భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య ఓడీ చెరువు: మరదలిని తాను రెండో పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోవాలంటూ భర్త వేధించడంతో భరించలేకపోయిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఓడీ చెరువు మండలం గజ్జిబండ తండాలో మంగళవారం చోటు చేసుకుంది. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. గజ్జిబండతండాకు చెందిన మోహన్నాయక్తో సుహాసిని(23)కి నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమార్తె, మూడు నెలల వయసు గల కవల (మగ) పిల్లలు ఉన్నారు. పెళ్లయిన రెండేళ్ల తర్వాత నుంచి మోహన్నాయక్కు మరదలి (భార్య చెల్లి)పై కన్నుపడింది. ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడు. భార్య ఒప్పుకోకపోవడంతో తరచూ గొడవపడుతూ వేధించేవాడు. గురువారం రాత్రి ఇద్దరూ మరోసారి ఘర్షణపడ్డారు. భర్త వేధింపులతో మనస్తాపానికి గురైన సుహాసిని పక్కగదిలోకి వెళ్లి పురుగుమందు తాగింది. శుక్రవారం ఉదయం గదిలో నుంచి బయటకు రాకపోవడంతో భర్త తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే మృతి చెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. -
సంసారం ఒక చదరంగం...
నాటి సినిమా ప్రతి సంసారంలో సుఖాలు అనే తెల్లగడులు, కష్టాలు అనే నల్లగడులు ఉంటాయి. రాజు అనే కుటుంబ పెద్ద అయిన తండ్రి, మంత్రి అనే సలహాలిచ్చే తల్లి, ఏనుగులు అనే కొడుకులు, గుర్రాలు అనే కోడళ్లు, ఇంకా కూతుళ్లు అల్లుళ్లు మనమలు మనమరాండ్రు అనే బంట్లు... వీళ్లంతా ఒక్కోసారి తెల్లపావులుగా మరోసారి నల్లపావులుగా ఈ కష్టసుఖాలు తెచ్చే ఆనందాలను, అవరోధాలను చాకచక్యంగా పరిగ్రహిస్తూ ఆటను రక్తి కట్టించాల్సి ఉంటుంది. ఎక్కడ తప్పటడుగు పడినా ఎక్కడ తప్పుడు ఎత్తు వేసినా అసలుకే ఎసరు వస్తుంది. ప్రపంచంలో ఎందరో గ్రాండ్ మాస్టర్లు ఉండొచ్చు. కాని ఈ సంసారం అనే చదరంగాన్ని ఈ దేశంలో అనునిత్యం ఆచి తూచి ఆడే సగటు తల్లిదండ్రులను మించి గ్రాండ్ మాస్టర్లు ఉండరు. అలాంటి ఒక తల్లిదండ్రుల కథే ‘సంసారం ఒక చదరంగం’. పెద్దకొడుకు కోరే లెక్కా జమ.... విశాఖలోని అప్పల నరసయ్య (గొల్లపూడి మారుతీరావు) ఒక సగటు ఉద్యోగి. ఇతనికి ముగ్గురు కొడుకులు. ప్రకాష్ (శరత్బాబు), రాఘవ (రాజేంద్రప్రసాద్), కాళిదాసు (హాజా షరీఫ్). వీళ్ళు కాకుండా ఒక కూతురు (కల్పన). ఇంట్లో తల్లి గోదావరి (అన్నపూర్ణ), కోడలు ఉమ (సుహాసిని) ఈ కుటుంబానికి రెండు కళ్లై సంసారాన్ని సమన్వయంతో నడుపుకుంటూ వస్తుంటారు. పెద్ద కొడుకు ప్రకాష్ జీతం నెలకు 1725 రూపాయలు. అతను తన జీతంలో నుంచి 800 రూపాయలు ఇంటి ఖర్చులకు ఇస్తుంటాడు. రెండో కొడుకు రాఘవ జీతం 550. అతను తన జీతం నుంచి నాలుగొందల రూపాయలు ఇస్తుంటాడు. పెద్దాయన నరసయ్య తన జీతం ఈ డబ్బుతో కలిసి ఇంటి బడ్జెట్ను మేనేజ్ చేస్తుంటాడు. కాని పెద్ద కొడుకు ప్రకాష్కు ఇది ఇబ్బందిగా ఉంటుంది. చీటికి మాటికి తననే డబ్బు అడుగుతున్నారని ఇంటి బడ్జెట్లో ఎక్కువ వాటా తనే వేయాల్సి వస్తోందని అతని ఇబ్బంది. మనిషి పిసినారి. ఆటో మీద రెండు రూపాయలు ఇవ్వడం కూడా ఇష్టపడనివాడు చెల్లెలి పెళ్లి చూపులకు మిఠాయి ఖర్చులు ఇమ్మంటే ఇవ్వగలడా? కాని అయిష్టంతోనే ఆ పనులన్నీ చేయాల్సి వస్తుంటుంది. మూడో కొడుకు కాళిదాసు చిన్న పిల్లవాడు. పదో క్లాసు మీద దండయాత్రలు చేసేవాడు కాబట్టి వాడి ప్రమేయం ఏమీ లేదు. పైకి అంతా సజావుగా ఉన్న ఇల్లు నివురు గప్పిన నిప్పులా ఉంది. అగ్గి రాజుకునేలా ఉంది. రాజును నేలకూల్చే సందర్భం ఏదో వెయిట్ చేస్తూ ఉంది. చివరకు అది రానే వచ్చింది. మాటల తుఫాను... పెద్ద కోడలు ఉమ పురిటికని పుట్టింటికి వెళ్లింది. పెద్ద కొడుక్కి ఇది మంచి అవకాశంగా అనిపించింది. ఆ నెలలో ఇంటి ఖర్చులకు కేవలం నాలుగు వందలే ఇస్తాడు. ‘ఇదేంట్రా’ అని తల్లి ఆశ్చర్యపోతుంది. ‘ఇన్ని రోజులు ఇద్దరం ఉన్నాం. ఎనిమిది వందలు ఇచ్చాం. ఇప్పుడు ఉమ పుట్టింటికి వెళ్లింది. నేను ఒక్కణ్ణే. కనుక నాలుగు వందలు ఇస్తున్నాను’ అంటాడు పెద్దకొడుకు. తండ్రి ఇది విని వ్యంగ్యంగా చురకలు వేస్తాడు. పెద్ద కొడుక్కి రోషం ముంచుకు వస్తుంది. ‘రేపు నాకు బిడ్డ పుడుతుంది. నా సంసారాన్ని కూడా నేను చూసుకోవాలి. ఈ దుబారా ఖర్చు నేను పెట్టలేను’ అంటాడు. ‘కన్న తల్లిదండ్రులను తోడబుట్టినవాళ్లను చూసుకోవడం దుబారా అవుతుందా?’ అని తండ్రి ప్రశ్నిస్తాడు. ‘అంత రోషపడేవాళ్లు నా దగ్గర 18 వేలు తీసుకుంటే తప్ప కూతురు పెళ్లి చేయలేకపోయారే. అప్పుడేమైంది రోషం’ అంటాడు కొడుకు. ‘లెక్కా పత్రాలు చూస్తున్నావా? నీ చదువుకు పెట్టిన ఖర్చు నీ ఉద్యోగం కోసం పెట్టిన ఖర్చు నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేయడానికి చేసిన ఖర్చు నీకు యాక్సిడెంట్ అయితే నా రక్తం ఇచ్చి నిన్ను కాపాడుకున్న ఖర్చు... ఇవన్నీ కూడా లెక్క చూడాలా’ అని తండ్రి అంటాడు. ‘అవును. చూడాల్సిందే. మీరు చూసిన దానికి చేసిన దానికి సరిపోయింది. మర్యాదగా చెల్లెలి పెళ్లి కోసం నా దగ్గర తీసుకున్న పద్దెనిమిది వేలు కక్కండి’ అంటాడు కొడుకు. ఒక తండ్రి మీద అంతకు మించి అసహ్యమైన ఎత్తు ఉండదు. ఆ తండ్రి లోలోపల కూలిపోతాడు. కునారిల్లిపోతాడు. ఆత్మాభిమానం పొడుచుకుని వచ్చి ‘నీ డబ్బులు నీ అణాపైసలతో ముఖాన కొడతాను. అందాక ఈ ఇంట్లో నుంచి బయటకు పోరా కుక్కా’ అంటాడు. ఘోరం జరిగిపోతుంది. నిండుగా ఉండే ఇల్లు రెండు ముక్కలవుతుంది. ఇంటి మధ్యన ఒక పెద్ద గీత గీయబడుతుంది. అటువైపు కొడుకు కోడలు. ఇటువైపు మిగిలిన కుటుంబ సభ్యులు. అటువాళ్లు ఇటు రావడానికి కాని ఇటువాళ్లు అటు వెళ్లడానికి వీల్లేదు. ఒకరికి మరొకరు చచ్చినవాళ్లతోనే సమానం. ఆ సంసారం రిపేరు చేయలేని విధంగా అల్లరిపాలైంది. దీనికి విరుగుడు ఏమిటి? కోడలి అవస్థ కూతురి పొగరు... ఈ కథలోనే ఇంకో రెండు ఉపకథలున్నాయి. ఇంటి కూతురికి కాస్తంత పొగరు. ఎవరినీ లెక్క చేయదు. అన్యమతస్తుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. పోయినామె పోయినట్టుగా ఉండగా అక్కడ మొగుణ్ణి, మామగారిని అలక్ష్యం చేసి ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఇంటి నుంచి వచ్చేసి పుట్టింట్లో తిష్ట వేస్తుంది. రెండో కొడుకు రాఘవ చేసుకున్న అమ్మాయి (ముచ్చర్ల అరుణ)ది ఇంకో కష్టం. కొత్త కోడలిగా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమెకు ప్రైవసీ లేదు. మూడో కొడుకు కాళిదాసు చదువు భారం ఆమె నెత్తిన పడుతుంది. ఆ పిల్లవాడు అర్ధరాత్రి వరకూ ఆమెనే అంటి పెట్టుకుని ఉంటే భర్తతో గడిపే సమయం చిక్కక అతనితో గొడవ పడి పుట్టింటికి వెళ్లి అక్కడ తండ్రి చేత చివాట్లు తిని తిరిగి అత్తింటికి చేరి అసంతృప్తితో రగిలిపోతూ ఉంటుంది. ఈ ఉపకథలు కూడా ఇంటి మధ్య గీతకు కారణమయ్యి ఆ సంసారాన్ని బజారున పడేశాయి. కోడలమ్మ... చిలకమ్మ... ఇప్పుడు ఈ ఇంటిని కాపాడగలిగింది ఇద్దరే ఇద్దరు. ఒకరు పుట్టింటి నుంచి తిరిగి వచ్చిన కోడలు ఉమ. ఇంకొకామె ఆ ఇంట్లో ఎప్పటి నుంచో పని మనిషిగా ఉన్న చిలకమ్మ (షావుకారు జానకి). పండండి బిడ్డను ఎత్తుకొని ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఇంటికి వచ్చిన ఉమ ఇంటి నడిమధ్యన గీసిన గీతను చూసి హతాశురాలవుతుంది. ఇంట్లో ఉన్న పరిస్థితులకు అవాక్కవుతుంది. పరిస్థితులు చక్కదిద్దడానికి నడుం బిగిస్తుంది. ఈలోపు పిసినారి ప్రకాష్కు ఒక్కొక్క సంగతే తెలిసి వస్తాయి. తాను ఇచ్చే ఎనిమిది వందలు ఇంటి ఖర్చులో ఏ మూలకూ సరిపోవనీ ఆ డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఇన్నాళ్లు ఒక్క తన సంసారానికే ఖర్చయ్యిందని తెలిసొస్తుంది. లాండ్రీ బిల్లు, వెచ్చాల బిల్లు, ఒకవేళ తాను ఉంటున్న పోర్షన్కు అద్దె కట్టాల్సి వస్తే చాలా ఖర్చు తన నెత్తిన పడుతుందని గ్రహిస్తాడు. ఉమ్మడి సంసారం వల్లే తాను సౌకర్యంగా ఉన్నానని విడి కాపురం పెడితే అన్నీ ఖర్చులే అని తెలిసి లోలోన గింజుకుంటాడు. తండ్రిని క్షమాపణ కోరే పరిస్థితికి వస్తాడు. చిలకమ్మ, ఉమ కలిసి కూతురి మామగారితో నాటకం ఆడి కూతురి కళ్లు తెరిపించి ఆమెను అత్తగారింటికి పంపుతారు. భార్యను తీసుకొని విహారానికి వెళ్లమని మరిది రాఘవకు సలహా ఇచ్చి వాళ్లకు ప్రైవసీ కల్పించి ఆ మేరకు ఆ కాపురాన్ని చక్కదిద్దుతుంది ఉమ. కథ క్లయిమాక్స్కి వచ్చింది. చర్చ రేపిన సినిమా... 1987లో వచ్చిన ‘సంసారం ఒక చదరంగం’ సినిమా సమాజంలో ఒకస్థాయి చర్చను రేపగలిగింది. ఉమ్మడి కుటుంబాల ఉనికి ప్రశ్నార్థకమవుతున్న ఆ తరుణంలో పెళ్లయిన కొడుకుల విడికాపురాల జోరు పెరుగుతున్న ఆ రోజుల్లో ఈ సినిమా ఒక తరుణోపాయాన్ని సూచించగలిగింది. ‘విడిగా వెళ్లినా పర్వాలేదు కలిసి ఉండటమే ముఖ్యం’ అని చెప్పగలిగింది. సినిమా అంతా ఒకెత్తయితే క్లయిమాక్స్ ఒక్కటీ ఒకెత్తు. ఇందులో కోడలి నిర్ణయం ప్రేక్షకులకు నచ్చపోయినా ఆ ‘ఎత్తు’ విఫలమైనా సినిమా కుదేలయ్యేది. కాని ప్రేక్షకులు ఆమె నిర్ణయాన్ని అంగీకరించారు. ఆదరించారు. అందుకే సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా ప్రభావంతో కలిసిన ఉమ్మడి కుటుంబాలున్నాయి. ఆరోగ్యకరంగా విడిపోయిన కుటుంబాలు ఉన్నాయి. తమను తాము తరచి చూసుకొని చక్కదిద్దుకున్న కుటుంబాలు ఉన్నాయి. ఒక సినిమా ప్రేక్షకుల మీద ప్రభావం చూపగలదు అనడానికి ‘సంసారం ఒక చదరంగం’ ఒక మంచి ఉదాహరణ. మానవ జీవితానికి ‘కుటుంబమే’ ఆయువుపట్టు. ఆ కుటుంబం మెరుగ్గా ఉండటానికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తూనే ఉన్నాడు మనిషి. అలాంటి ఒక ఆలోచన సినిమా ద్వారా అందుకోవడమే ఇక్కడి విశేషం. ఇవాళ పెళ్లికి ముందే ‘మా అబ్బాయికి వేరే ఇల్లు చూశాను. పెళ్లయిన వెంటే విడి కాపురం పెట్టిస్తాను’ అనే తండ్రులు ఎందరో ఉండటం మనం చూస్తున్నాం. పెళ్ళిళ్లయ్యాక విడిపోవడానికి మన సమాజం మానసికంగా సిద్ధమైంది. విడిపోయినా కలిసి ఉండటం నేర్చుకుంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పాపులర్గా చెప్పి అందుకు కావలసిన భూమికకు మొదటి మెట్టుగా నిలిచిన మంచి సినిమా శక్తివంతమైన సినిమా ‘సంసారం ఒక చదరంగం’. కోడలి నిర్ణయం... కలతలు సమసిపోయాయి. కొడుకు క్షమాపణ అడిగాడు. తండ్రి క్షమించాడు. ముక్కలైన సంసారం ఒక్కటైంది. గీత చెరిపి అందరూ కలిసిపోయే సమయం వచ్చింది. కాని హటాత్తుగా పెద్ద కోడలు ఉమ దీనిని వ్యతిరేకిస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ‘ఏం?’ అని అడుగుతారు. ‘మళ్లీ గొడవలు జరగవని గ్యారంటీ ఏమిటి?’ అని ప్రశ్నిస్తుంది. ‘ఇలా విడిపోవడం వల్ల ఎంత క్షోభ పడ్డామో అందరికీ తెలిసొచ్చిందిగా... మళ్లీ అలాంటి క్షోభ ఎదురైతే తట్టుకునే శక్తి మనకు ఉందా’ అని అడుగుతుంది. ‘వద్దు... కలిసి ఉండి రోజూ కొట్టుకుని చావడం కన్నా... విడిపోయి కలిసి ఉందాం. మేము వేరు కాపురం పెడతాం. అలాగని విడిపోం. ప్రతి ఆదివారం వచ్చి కలిసి వెళతాం. మీరు వచ్చిపోతూ ఉండండి. కాస్త ఎడంగా ఉంటేనే అభిమానాలు సజీవంగా ఉంటాయి. అలా సంతోషంగా ఉందాం’ అని నిర్ణయం చెబుతుంది. కథ ముగుస్తుంది. ఒకరి ఇళ్లకు ఒకరు వచ్చిపోతూ సంతోషంగా ఉంటారు. – కె -
భార్య రూపం కన్నా హృదయం ముఖ్యమని చెప్పే
నాటి సినిమా సినిమాలు చాలా వస్తుంటాయి. కొన్ని సినిమాలే కొంగు బిగిస్తాయి. కాలం నాసికపై చెమక్కున మెరిసిస సినిమా ‘ముక్కుపుడక’. స్త్రీ సహనానికి, ధిక్కారానికి గుర్తు ఈ సినిమా. భార్య ఆత్మిక సౌందర్యాన్ని చూడలేని గుడ్డి భర్తలకు చెంపదెబ్బ. మంగతాయారు (సుహాసిని) జడ కుక్కతోకలా ఉంటుంది. ఎంత దువ్వినా, రిబ్బన్తో కట్టినా, ఆఖరుకు రాళ్లు కట్టి వేలాడగట్టినా దాని వంకర వంకరే. సరి కాదు. అందుకే మంగతాయారును చూడటానికి వచ్చినవాళ్లంతా వచ్చింది వచ్చినట్టుగా పరార్ అవుతుంటారు. మళ్లీ ఇటువైపు చూడటానికి భయపడుతుంటారు. పైగా అమ్మాయి నలుపు. దిష్టి చుక్క పెడితే కనపడకుండా పోయేంత రంగు. ఎవరు చేసుకుంటారు? కాని పొరుగూర్లో పెంటా పరబ్రహ్మం (గొల్లపూడి మారుతీరావు) అనే పల్లెటూరి పెద్దమనిషి ఉంటాడు. అతడు మంగతాయారు తండ్రి (పి.ఎల్.నారాయణ)కి చిన్నప్పటి స్నేహితుడు. ఇలా పెళ్లికెదిగిన కూతురు ఉందని ఇంకా పెళ్లి కావడం లేదని స్నేహితుడు బాధ పడటం చూసి తన కడుపున ప్రసాద్ (భానుచందర్) అనే ఒక కొడుకు పుట్టాడనీ వాడికిచ్చి చేస్తానని అప్పటికప్పుడు మాట ఇస్తాడు. కండువా ఇచ్చి పుచ్చుకుంటాడు. కాని అసలైన కుక్కతోక ఇక్కడే ఈ ప్రసాద్ దగ్గరే ఉంది. అతడు ఊహల్లో ఉండే మనిషి. భార్యంటే అందంగా ఉండాలని అప్సరసలా వెలిగిపోతుండాలని భావిస్తుంటాడు. తాను చేసుకోబోయే అమ్మాయి కోసం ఒక అందమైన ముక్కుపుడక చేయించి జేబులో పెట్టుకుని తిరుగుతుంటాడు. అతడు ఊహించేది ఒకటి. జరిగేది మరొకటి. అంత అప్సరసను ఊహించుకుంటే భార్యగా మంగతాయారు వచ్చింది. వచ్చిన మంగతాయారును అతడు పురుగులా చూశాడు. చీదరించాడు. ఆమె హృదయం, మంచితనం, తన పట్ల ప్రదర్శించే అనురాగం, తన తల్లిదండ్రుల పట్ల చూపిస్తున్న భక్తి... ఇవన్నీ అతడికి పట్టలేదు. ఆమెకు రంగు లేదు. కనుక ఆమె తనకు అక్కర్లేదు. అందుకని అతడు ట్రాన్స్ఫర్ అనే మిషతో మద్రాసు చెక్కేశాడు. అక్కడే రీనా (విజయశాంతి) అనే కొలీగ్కి తనకు పెళ్లి కాలేదని, ఎవరూ లేరని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుని కాపురం పెడతాడు. ఏ ఇంట్లో అయితే భర్త కాపురం ఉన్నాడో అదే ఇంట్లో భర్తను వెతుక్కుంటూ వచ్చిన మంగతాయారు పని మనిషిలా చేరుతుంది. తాళి కట్టిన వాడు మరో స్త్రీని పెళ్లి చేసుకున్నాడని తెలిసినా ఆవేశపడదు. అభిరుచికి తగిన అమ్మాయిని వెతుక్కుని సంతోషంగా ఉన్నాడని సంతృప్తి పడుతుంది. కట్టుకున్న భార్య తన ఎదుటే పని మనిషిలా మారి ఇంత అవస్థ పడుతున్నా సహనం ప్రదర్శిస్తున్నా కుక్కతోక కుక్కతోకలానే ఉంటుంది. మారదు. కాని నిజం ఏదో ఒకనాడు బయటపడుతుంది. బయటపడిననాడు ప్రళయం వస్తుంది. ఎవర్నైతే మోసం చేసి చేసుకున్నాడో ఆ అమ్మాయి– రీనా– ఉగ్రరూపం దాలుస్తుంది. అతణ్ణి చంపడానికి సిద్ధపడుతుంది. అప్పుడు అతణ్ణి కాపాడేది ఎవరు? ఇంకెవరు మంగతాయారే. భర్త ప్రాణాల కోసం ఎప్పుడూ యముడి పాశానికి అడ్డం నిలిచేది స్త్రీయే. కాని భార్య ప్రాణం కోసం ప్రాణాలు అడ్డు వేసిన భర్త పురాణాల్లో కనిపించడు. అదీ భారతీయత. మృగ లక్షణాలు పూర్తిగా వదులుకోలేని పురుషుణ్ణి భారతీయ స్త్రీ ఇలాగే మార్చుకుంటూ వస్తోంది. చాలాసార్లు నయాన. ఎప్పుడైనా భయానా. రిజల్ట్ మాత్రం గ్యారంటీ. కథ క్లయిమాక్స్కు వచ్చింది. తన దగ్గర ఉన్న ముక్కుపుడక పెట్టుకోదగ్గ స్త్రీ మంగతాయారే అనీ, భర్తగా తాను మసలుకోవాల్సిన స్త్రీ కూడా మంగతాయారే అని ప్రసాద్ గ్రహిస్తాడు. రీనా త్యాగం చేసి వాళ్ల జీవితాల నుంచి తప్పుకుంటుంది. ప్రసాద్, మంగతాయారు ట్రైన్ ఎక్కి స్వగ్రామం బయలుదేరడంతో కథ ముగుస్తుంది.1982లో వచ్చిన ‘ముక్కుపుడక’ పెద్ద హిట్. కాని ఇది నేరుగా తెలుగు సినిమా కాదు. మణివణ్ణన్ తమిళంలో ‘గోపురంగళ్ సైవతిలై’ అనే ఈ సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించి అక్కడ పెద్ద హిట్ చేస్తే భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బేనర్పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి రీమేక్ చేశారు. తమిళాన్ని మక్కికి మక్కి ఫాలో కాకుండా తెలుగుదనంతో రీమేక్ చేయడంతో ప్రేక్షకులకు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చింది. అప్పటికి తెలుగుతెరకు కొత్త అయిన సుహాసిని, అప్పుడప్పుడే రైజింగ్లోకి వస్తున్న గొల్లపూడి మారుతీరావు విజృంభించి నటించడం వల్ల కూడా ఈ సినిమా బాగా ఆడింది. ‘సెప్పుచ్చుకుని కొట్టానంటే’... అనే మేనరిజంతో గొల్లపూడి ఈ సినిమాలో చెలరేగిపోతారు. అలాంటి క్యారెక్టర్లు ఇప్పుడు ఎన్ని కనిపిస్తున్నాయనేది ప్రశ్న. ఈ సినిమాలో పని మనిషిగా పడి ఉన్న భార్యకు పూలు తెచ్చి బయటకు కనపడకుండా పెట్టుకో అంటాడు భర్త. అప్పుడామె ‘ఎలా? ఇదేమైనా ఏడుపా... లోపల్లోపల ఏడవడానికి?’ అంటుంది. గణేశ్ పాత్రో సంభాషణల పదును అలాంటిది. ఇందులో పాటలు జె.వి.రాఘవులు చేసిన ‘చినుకు చినుకుగా చిగురు మెత్తగా’ పాట పెద్ద హిట్. అలాగే ‘మగువ మనసుకే గుర్తు మగువ ముక్కుపుడక’ పాటను ఆ రోజుల్లో ఆడవాళ్లందరూ కూనిరాగం తీసేవారంటే అబద్ధం కాదు. భారతీయ సినిమాల్లో భర్తను గెలుచుకోవడం అనేది ఎప్పుడూ హిట్ సబ్జెక్టే. అది యముడి నుంచి కానివ్వండి, ఉగ్రవాదుల నుంచి కానివ్వండి, దుర్వ్యసనాల నుంచి కానివ్వండి, పరాయి స్త్రీ నుంచి కానివ్వండి భర్తను కాపాడుకుంటే అది హిట్. ఎందుకంటే ఈ దేశంలో స్త్రీ జీవితం అంటే ఆమె వైవాహిక జీవితం మాత్రమే కాబట్టి. ఆ జీవితానికి ఆధారమైన భర్తను తీర్చిదిద్దుకోవడంలో ఆమె ఒకోసారి భూదేవిగా మరోసారి కాళికాదేవిగా మారుతుంటుంది. ఈ సత్యం గ్రహించినవాడు జాగ్రత్తగా ఉంటాడు. తెలుసుకోనివాడు చెప్పుదెబ్బలు తిని దారికొస్తుంటాడు. అన్నట్టు భర్తలూ... మీ భార్యకు మంచి ముక్కపుడక కొనిచ్చి ఎంత కాలమైంది? మణివణ్ణన్ ‘ముక్కుపుడక’ తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన మణివణ్ణన్ ఆ రోజుల్లో కొత్తరకం సినిమాలతో, కథలతో తమిళంలో సంచలం సృష్టించాడు. ముఖ్యంగా సత్యరాజ్ను సూపర్స్టార్ చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. సెట్లో సీన్పేపర్ లేకుండా సీన్లు షూట్ చేసే దర్శకుడిగా ఇతడికి పేరు. మణివణ్ణన్ భారతీరాజా శిష్యుడు. చివరి రోజుల్లో భారతీరాజాకూ ఇతనికి స్పర్థలు వచ్చాయి. భారతీరాజా మణివణ్ణన్ గురించి కొన్ని పరుషమైన వ్యాఖ్యలు మీడియాలో చేయగా ఆ వెంటనే కొద్దిరోజులకు మణివణ్ణన్ మృతి చెందడంతో మృతికి భారతీరాజా వ్యాఖ్యలు కూడా కారణం అని కొందరు విమర్శలు చేశారు. అది రాఘవగారి మేనరిజమ్.. ‘ముక్కుపుడక’ సినిమాలో నాది చాలా మంచి పాత్ర. అందులో ‘సెప్పుచ్చుకు కొట్టానంటే’.. అనే మేనరిజం ఉంటుంది. అది నిర్మాత రాఘవ(ప్రతాప్ ఆర్ట్స్)గారిది. దానిని గమనించి కొంచెం ఎగ్జాగరేట్ చేసి కోడి రామకృష్ణగారి సలహా మేరకు మెప్పించగలిగాను. తెలుగు సినిమాల్లో నటుడుగా నేను మరింత స్థిరపడటానికి ఆ క్యారెక్టర్ ఉపయోగపడింది. భార్యను పనిమనిషిగా మార్చి మరో స్త్రీని పెళ్లాడిన కొడుకును గమనించి తండ్రిగా నేను రగిలిపోతాను. ‘ఆ నా కొడుకును ఈ చేతులతో సంపేద్దును. కాని ఏం చేయను. ఒక ఆడకూతురి తాళి వాడి చేతుల్లో ఉండిపోయింది’ అనే డైలాగ్ చెప్తాను. చాలా మంచి డైలాగ్. – గొల్లపూడి మారుతీరావు ఎన్నో సినిమాలకు మాతృక భార్య కురూపి అయి భర్త నక్క వేషాలు వేసే సినిమాలకు ‘ముక్కుపుడక’ మాతృక. దీని స్ఫూర్తితోనే కె.భాగ్యరాజ మరో మూడేళ్లకు అంటే 1985లో ‘చిన్నవీడు’ సినిమా తీశాడు. ఇందులో భార్య లావుగా ఉంటే భర్తకు నచ్చక చిన్నిల్లు పెడతాడు. తమిళంలో డబ్ అయ్యాక తెలుగులో పెద్ద హిట్. దీని స్ఫూర్తితోనే బాలూ మహేంద్ర ‘సతీ లీలావతి’ (1995) తీశాడు. దీని స్ఫూర్తితోనే ఇ.వి.వి. సత్యనారాయణ ‘కితకితలు’ (2006) తీశాడు. ఈ రెండు సినిమాల్లో కూడా భార్య లావుగా ఉంటే భర్త రెండో పెళ్లి ప్రయత్నాలు చేసి చివరకు బుద్ధి తెచ్చుకుంటాడు. పాటలు హిట్ ఈ సినిమాలోని ‘చినుకు చినుకుగా చిగురు మెత్తగా’ పాట హిట్. అలాగే ‘మగని మనసుకే గురుతు మగువ ముక్కుపుడక’ పాటను ఆ రోజుల్లో పాడుకోని ఆడవారు లేరు. – కె -
పెళ్లికి కానుకగా చెక్కు!
పెద్దపల్లి: పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెళ్లిళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. వధువరుల తల్లిదండ్రులు పెళ్లి ఖర్చులకు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే....పెళ్లికి విచ్చేసిన అతిథుల ఇబ్బందులు మరో రకంగా ఉన్నాయి. శుభకార్యానికి హాజరైతే తప్పనిసరిగా కానుక ఇస్తుంటాం. ప్రస్తుతం నోట్ల రద్దుకు తోడు నెల ప్రారంభసమయం కావడంతో చిన్నపాటి ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది. తాజాగా పెద్దపల్లిలోని బంధువుల ఇంట్లో జరిగిన పెళ్లికి హాజరైన కమాన్పూర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఈర్ల సురేందర్కు ఇదే పరిస్థితి ఎదురైంది. పెళ్లి కూతురు సుహాసినికి కానుకగా నగదు ఇవ్వడానికి తన దగ్గర లేకపోవడంతో రూ.5వేల చెక్కును అందజేశారు. ఒకటిన జీతం తీసుకునేందుకు పెద్దపల్లి బ్యాంకుకు వెళ్లాడు. క్యూలైన్ పొడవుగా ఉండడంతో, ఆయన వెంటనే చెక్ తెప్పించి కానుక ఇచ్చారు. -
నలుగురూ స్నేహితులే!
నటనలో, అందంలో ఈ నలుగురూ నలుగురే. సుమారు ముప్ఫై ఏళ్లుగా దక్షిణాది సినిమాల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా సినిమాలు చేశారు. అప్పట్లో అగ్ర హీరోయిన్లు ఎవరు? అనడిగితే... ఊర్వశి, రాధిక, ఖుష్బూ, సుహాసిని.. ఈ నలుగురి పేర్లూ తప్పకుండా వినిపించేవి. వీళ్ల మధ్య పోటీ సినిమాల వరకే. మేకప్ తీసేసిన తర్వాత నలుగురూ స్నేహితులే. హెల్దీ కాంపిటీషన్ అనమాట. ఎయిటీస్ రీ-యూనియన్ పేరుతో ప్రతి ఏడాది గెట్ టుగెదర్ పార్టీలు నిర్వహిస్తుంటారు. ఇప్పుడీ నలుగురి గురించి ప్రస్తావన ఎందుకంటే... వీళ్లంతా కలసి ఓ సినిమాలో నటించనున్నారని చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. నలుగురు సీనియర్ హీరోయిన్లు ఓ సినిమాలో నటించడం వింతేముంది? అనుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే.. ఈ నలుగురూ కలసి నటిస్తున్న ఫస్ట్ సినిమా ఇది. ఇంకొకటి.. నిజ జీవితంలో స్నేహితులైన వీళ్లు సినిమాలోనూ స్నేహితులుగానే నటించనున్నారు. జేమ్స్ వసంతన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా హిందీ ‘జిందగీ నా మిలేగీ దొబారా’ తరహాలో ఫన్నీ ఎంటర్టైనర్గా ఉంటుందట. ఈ నలుగురి క్యారెక్టరైజేషన్లను 90వ దశకంలో వాళ్లు నటించిన హిట్ సినిమాల్లోని క్యారెక్టర్స్ ఇన్స్పిరేషన్తో డిజైన్ చేశారట. వచ్చే వారమే ఆస్ట్రేలియాలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని, సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ అంతా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రియల్ లైఫ్లో ఈ నలుగురూ స్నేహితులు కావడంతో సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. -
స్టార్ స్టార్ సూపర్స్టార్ -సుహాసిని
-
అనుమానంతో భార్య హత్య
భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు యాకుత్పురా: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తను మొఘల్పురా పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డబీర్పురాలోని మీర్చౌక్ డివిజన్ ఏసీపీ కార్యాలయంలో శనివారం ఏసీపీ ఎం. శ్రీనివాస్ రావు మొఘల్పురా ఇన్స్పెక్టర్ ఆర్. దేవేందర్తో కలిసి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా దెగ్లూర్ బిజ్లివాడి ప్రాంతానికి చెందిన వి. జైపాల్రెడ్డి (30), సుహాసిని (26) దంపతులు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. గతేడాది ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో జైపాల్రెడ్డి కుటుంబంతో కలిసి నగరానికి వచ్చి మురాద్మహల్లో నివాసముంటూ అట్టల ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కాగా భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. ఇరువురి పెద్దలు కలుగజేసుకొని సర్దిచెప్పారు. ఇదిలా ఉండగా ఇదే విషయమై ఈ నెల 14న తెల్లవారుజామున జైపాల్ రెడ్డి భార్యతో గొడవకు దిగి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం తన భార్యకు చాతిలో నొప్పి వచ్చిందంటూ 108కు ఫోన్ చేశాడు. వాహన సిబ్బంది వచ్చి సుహాసినీని పరిశీలించి మృతి చెందిందని తిరిగి వెళ్లిపోయారు. జైపాల్ రెడ్డి గుట్టు చప్పుడు కాకుండా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళుతున్నానని స్థానికులకు చెప్పి శవాన్ని కూకట్పల్లి వరకు ఆటోలో తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మరో వాహనంలో మహారాష్ట్రలోని సొంత గ్రామానికి తీసుకెళ్లాడు. సుహాసినికి తీవ్ర నొప్పి రావడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులను నమ్మించాడు. కాగా సుహాసిని సోదరుడు నరేశ్ రెడ్డికి అనుమానం రావడంతో వెంటనే మొఘల్పురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహారాష్ట్రలోని మర్కల్ పోలీసులకు సమాచారం అందించి శవాన్ని దహనం చేయకుండా చూడాలని సూచించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. పోలీసులు మృతదేహన్ని ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు చాకచక్యంగా ఛేదించిన ఎస్సై రాజేష్, హెడ్ కానిస్టేబుల్ ఖాజావలీ, కానిస్టేబుల్ సురేష్లను ఏసీపీ అభినందించి రివార్డుకు సిఫారసు చేశారు. -
'జనతా గ్యారేజ్'లో సుహాసిని
నాన్నకు ప్రేమతో సినిమా తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జనతాగ్యారేజ్. మిర్చి, శ్రీమంతుడు లాంటి భారీ హిట్స్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావటంతో జనతా గ్యారేజ్పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఆ అంచనాలను మరింతగా పెంచేస్తూ సినిమా కాస్టింగ్ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా, మరో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మరో సీనియర్ నటి జనతా గ్యారేజ్ టీంతో జాయిన్ అయ్యింది. గతంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రాఖీ, బాద్ షా సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన సుహాసిని, జనతా గ్యారేజ్లోనూ నటించనుంది. ఈ సినిమాలో మోహన్ లాల్కు జోడిగా సుహాసినిని ఎంపిక చేశారు. ముందుగా ఈ పాత్రకు తమిళ నటి దేవయానిని సంప్రదించినా, చివరి నిమిషంలో సుహాసినిని ఫైనల్ చేశారు. గతంలో ఎన్టీఆర్, సుహాసిని కలిసి నటించిన రెండు సినిమాలు మంచి విజయం సాధించటంతో సెంటిమెంట్ పరంగా కూడా జనతా గ్యారేజ్కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. -
ఇది ఇంటింటి కథ
ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ లైఫ్’. పోసాని కృష్ణమురళి, ‘చంటిగాడు’ ఫేమ్ సుహాసిని జంటగా శ్రీ గౌరీదేవి సినీచిత్ర పతాకంపై రామకృష్ణ వీర్నాల దర్శకత్వంలో ఎన్. దేవీ చరణ్ ఈ సినిమా నిర్మించారు. ‘‘మెసేజ్ ఓరియం టెడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా రూపొందిన చిత్రమిది. ఈ చిత్రానికి మొదట ‘నా పెళ్ళాం... నా ఇష్టం’ అనే పేరు పెట్టాం. అభ్యంతరాలు రావడంతో ‘హ్యాపీలైఫ్’అనే టైటిల్ నిర్ణయించాం. త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తాం’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: వెంకీ, సంగీతం: రమేశ్. -
పడినా లేచింది!
సినిమాల్లో హీరోయిన్గా చాన్స్ రావడం అంత తేలిక కాదు. ఒకవేళ వచ్చినా... హీరోయిన్గా స్థిరపడటం అన్నది అంత సులువూ కాదు. అందుకే ఎంతోమంది అమ్మాయిలు ఒకట్రెండు సినిమాలు చేసి మాయమైపోతుంటారు. సుహాసిని విషయంలోనూ అదే జరిగింది. ‘చంటిగాడు’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సక్సెస్ను చవి చూసింది. కొన్ని అవకాశాలనూ అందుకుంది. కానీ నిలదొక్కుకోలేకపోయింది. అయితే తను చాలామంది లాగా ఇంకా అవకాశాలు వస్తాయేమో అని చూస్తూ కూచో లేదు. సినిమాలు మాత్రమే చేస్తానంటూ మడి కట్టుకు కూర్చోలేదు. బుల్లితెర వైపు దృష్టి సారించింది. వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుంది. సీరియళ్లలో బిజీ అయి పోయింది. ‘అపరంజి’తో మొదలైన ఆమె టెలివిజన్ విజయ ప్రస్థానం... నిరాటంకంగా కొనసాగిపోతూనే ఉంది. ఒకే సమయంలో రెండు మూడు సీరియళ్లలో పని చేస్తూ... తన కెరీర్గ్రాఫ్ ఇక్కడ కూడా పడిపోకుండా చక్కగా నిలబెట్టుకుంటోంది సుహాసిని. పడినా లేవడం అంటే ఏమిటో మిగతా వాళ్లకి చూపిస్తోంది! -
సీనియర్ నటీమణుల ఆధ్వర్యంలో క్వీన్
సీనియర్ నటి సుహాసిని మణిరత్నం మాటలతో నటి రేవతి చేతలతో ఒక చిత్రం రూపుదిద్దుకుంటోందనేది తాజా సమాచారం. విశేషం ఏమిటంటే ఈ ఇద్దరూ బహు భాషా నటీమణులన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుహాసిని నటిగానే కాకుండా ఇందిర చిత్రంతో దర్శకురాలిగా తానేమిటో నిరూపించుకున్నారు. ఇక రేవతి కూడా ఆంగ్లం, హిందీ, మలయాళం భాషల్లో దర్శకురాలిగా సృజనాత్మకమైన చిత్రాలను తెరకెక్కించారు. సినిమానే శ్వాస అన్నంతగా ప్రేమించే వీరిద్దరూ ఒక తమిళసినిమాకు పని చే స్తుండడం నిజంగా విశేషమే అవుతుంది. అదీ ఒక స్త్రీ ప్రధాన ఇతివృత్తంగా జరిగే కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన చిత్రం క్వీన్. కంగనారావత్ను క్రేజీ హీరోయిన్గా బాలీవుడ్లో నిలబెట్టిన చిత్రం ఇదని చెప్పవచ్చు. ఈ చిత్ర దక్షిణాది పునర్నిర్మాణ హక్కుల్ని సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ పొందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ చిత్రంలో కంగనారావత్ పాత్రలో నటించే అదృష్టం దక్కిం చుకునే దక్షిణాది నటి ఎవరు?దానికి కెప్టెన్సీ బాధ్యతలను వహించేది ఎవరు? అన్న ఆసక్తికరమైన ప్రచారం జరుగుతూనే ఉంది. వీటిలో మొదటి ప్రశ్నకు జవాబు వెల్లడైంది.ఈ చిత్రం తమిళ వెర్షన్కు నటి సుహాసిని మణిరత్నం సంభాషణలను, మరో నటి రేవతి దర్శకత్వాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నటి సుహాసిని బెంగళూర్లో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో వెల్లడించారు. చిత్ర ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు చెప్పారు.అయితే ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్నది బయట పెట్టలేదు. క్వీన్ చిత్ర రీమేక్లో నటించడానికి పలువురు దక్షిణాది ప్రముఖ హీరోయిన్లు పోటీపడుతున్నారని సమాచారం. క్వీన్ చిత్రం కథేమిటంటే బయట ప్రపంచం తెలియని 24 ఏళ్ల పంజాబీ యువతి రాణికి పెళ్లి నిశ్చయమవుతుంది.అయితే వివాహం రెండు రోజులు ఉందనగా పెళ్లికొడుకు మన పెళ్లి జరగదు. మన దారులు వేరు అని చెప్పడం, ఆ తరువాత పెళ్లికి ముందే ప్రణాళికను సిద్ధం చేసుకుని హనీమూన్కు వెళ్లడం, అక్కడ ఆమెకు ఎదురైన సంఘటనలే చిత్ర ఇతివృత్తం. దీని తమిళ తెర రూపానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. -
హిందీలో వెయిటింగ్!
దక్షిణాది ప్రేక్షకులకు సుహాసిని గురించి పరిచయ వాక్యాలు అవసరంలేదు. హిందీలో చేయకపోయినా దక్షిణాదిన తెచ్చుకున్న పేరు ఆమెను అక్కడ పాపులర్ చేసింది. నటిగా ఆమె కెరీర్ మూడు దశాబ్దాలకు పైనే. ఇన్నేళ్లల్లో ఒక్క హిందీ చిత్రం కూడా చేయని సుహాసిని ఇప్పుడు అక్కడ ‘వెయిటింగ్’ అనే చిత్రంలో నటించారు. ‘లండన్ పారిస్ న్యూయార్క్’ ఫేమ్ అనూ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కల్కి కొచ్లిన్, నజీరుద్దీన్ షా ముఖ్య పాత్రలు చేశారు. ఇందులో నజీరుద్దీన్ భార్యగా సుహాసిని నటించారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ఈ నెల 11న జరిగే దుబాయ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించనున్నారు. -
బాలయ్య రాకపోవడంతో ఇన్కంప్లీట్గా అనిపించింది!: ఖుష్బూ
చిరంజీవి లుంగీ డ్యాన్స్ అదిరింది... వెంకటేశ్ స్టెప్పులు సింప్లీ సూపర్... మోహన్లాల్ మ్యాజిక్ వర్కవుట్ అయ్యింది... జయసుధ, సుమలత, సుహాసిని, రాధిక, రాధ తదితర నటీమణుల హంగామాకి హద్దే లేకుండాపోయింది. ఇంతకీ ఈ సందడంతా జరిగింది ఎక్కడో తెలుసా? చెన్నయ్ మహానగరంలో. అక్కడి ఆలివ్ బీచ్లో గల నీనా రెడ్డి గెస్ట్ హౌస్లో. మొత్తం 34 మంది నటీనటుల ఆట, పాటలతో, జోక్స్తో, కామెడీ స్కిట్స్తో ఆ గెస్ట్ హౌస్ ఓ కొత్త శోభను సంతరించుకుంది. 1980లో వెండితెరను ఏలిన నాయకా నాయికలంతా ఐదేళ్లుగా ‘ఎయిటీస్ రీ యూనియన్’ పేరుతో ప్రతి ఏడాదీ కలుసుకుంటున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ రంగానికి చెందిన తారలు కలుసుకుని పండగ చేసుకుంటారు. ఈ ఏడాదికి సంబంధించిన ఈ సెలబ్రేషన్స్ చెన్నయ్లో జరిగాయి. సుమన్, సీనియర్ నరేశ్, మోహన్, ప్రభు, శరత్కుమార్, జయరామ్, భానుచందర్, సరిత, లిజి, రేవతి, రమ్యకృష్ణ, శోభన... ఇలా పలువురు తారలు హాజరయ్యారు. కాగా, ప్రతి ఏడాదీ బాలకృష్ణ కూడా హాజరవుతుంటారని, ఈసారి షూటింగ్ కోసం బల్గేరియా వెళ్లడం వల్ల రాలేదని, దాంతో సెలబ్రేషన్స్ ఇన్కంప్లీట్గా అనిపించిందని ఖుష్బూ పేర్కొన్నారు. ఈసారి తమ పార్టీకి కొత్త అతిథులు కూడా వచ్చారని ఆమె పేర్కొన్నారు. హిందీ నటుడు జాకీ ష్రాఫ్, నటి పూనమ్ ధిల్లాన్ కూడా ఈ సౌత్ స్టార్స్ రీ-యూనియన్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ నెలలోనే పుట్టిన రోజులు జరుపుకున్న చిరంజీవితో పాటు మరో ఆరుగురితో కేక్ కట్ చేయించారు. ఖుష్బూ, సుహాసిని, లిజీ 10 రోజుల పాటు కష్టపడి ఈ సెలబ్రేషన్స్కి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ‘మౌలిన్ రోగ్’ అనే థీమ్తో జరిగిన ఈ పార్టీలో తారలందరూ రెడ్ అండ్ బీజ్ కలర్ డ్రెస్సుల్లో కళకళలాడారు. కేవలం డ్రెస్లు మాత్రమే కాదు.. ఆ పార్టీ కోసం వాడిన వస్తువులన్నీ దాదాపు ఎరుపురంగులో ఉండేట్లు చూసుకున్నారు. తారలందరూ తమ స్టార్ స్టేటస్ని పక్కన పెట్టి, హ్యాపీగా ఎంజాయ్ చేశారు. కొసమెరుపు ఏంటంటే.. ఈ పార్టీలో లుంగీ డ్యాన్స్ కోసం హీరోలు కట్టుకున్న లుంగీలను జాకీ ష్రాఫ్ తీపి గుర్తుగా ముంబయ్ తీసుకెళ్లారు. -
ఆగస్టు 15 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: అర్జున్ (నటుడు), సుహాసిని (నటి), అద్నాన్ సమి (గాయకుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. దీనికి అధిపతి రాహువు. కోర్టు వివాదాలు, పెండింగ్లో ఉన్న పోలీస్ కేసులు ఈ సంవత్సరం పరిష్కారమవుతాయి. అందువల్ల ఎంతో రిలీఫ్గా అనిపిస్తుంది. ఆస్తులు కొనుక్కోవాలని, ఉన్న ఆస్తులను అభివృద్ధి చేయాలని కంటున్న కలలు నెరవేరతాయి. వారసత్వంగా రావలసిన ఆస్తులు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. మీ పుట్టిన తేదీ 15. ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల జీవితం ఉత్సాహవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. శుక్ర, రాహువుల కలయిక వల్ల జీవితం చాలా బాగుంటుంది. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. పిల్లల పెళ్లిళ్లు తదితర బాధ్యతలు పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మీకన్నా పై స్థాయి వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఆపోజిట్ సెక్స్ వారితో నెరిపే సంబంధాల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. లక్కీ నంబర్స్: 1,4,6,9; లక్కీ డేస్: శుక్ర, శని, ఆదివారాలు; లక్కీ కలర్స్: వైట్, బ్లూ, క్రీమ్, వయొలెట్; లక్కీ మంత్స్: ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్. సూచనలు: అవివాహిత యువతుల పెళ్లి ఖర్చులు భరించడం, అనాథలకు, వికలాంగులకు తగిన విధంగా సహాయం చేయడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
అంబరీష్తో జాగ్రత్త
నటుడు అంబరీష్తో జాగ్రత్తగా ఉండాలని నటి సుహాసిని చెప్పినట్లు నటి సుమలత చెప్పారు. సినీ రంగంలో సహ నటీనటుల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి సంసార జీవితాల్లో చాలా మట్టుకు సమస్యలమయంగా సాగుతున్నది అనేది ఎవరూ కాదనలేని విషయం అలాగని సంతోషంగా జీవిస్తున్న వారు లేరని చెప్పలేం. అలా జీవితాన్ని అన్యోన్యంగా మలచుకునే నటి జంటల్లో కన్నడ నటుడు అంబరీష్, నటి సుమలత ఒకరు. సుమలత 1990 ప్రాంతంలో తమిళం, తెలుగు, కన్నడం చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందారు. ఇక అంబరీష్ కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్స్టార్గా రాణించారు. ఈయన తమిళంలోనూ కొన్ని చిత్రాలు చేశారు. నటుడు రజనీకాంత్కు మంచి మిత్రుడు. అంబరీష్, సుమలత ఒకరి నొకరు ప్రేమించుకున్నారు. ఆ సమయంలో అంబరీష్తో జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించిన వారిలో నటి సుహాసిని కూడా ఉన్నారట. ఈ విషయాన్ని నటి సుమలత స్వయంగా చెప్పడం విశేషం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గతాన్ని నెమరువేసుకున్న ఆమె తన సుదీర్ఘ వివాహ జీవితం గురించి చెబుతూ వివాహానికి ముందు తన భర్త అంబరీష్తో కలసి పలు చిత్రాల్లో నటించానన్నారు. ఆయనతో తన జీవితాన్ని పంచుకోవాలని భావించినప్పుడు నటి సుహాసినితో పాటు పలువురు అంబరీష్తో జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించారన్నారు. తన మేకప్మన్ కూడా అంబరీష్కు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారన్నారు. అయినా అంబరీషే తనకు నచ్చడంతో ఆయన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఇప్పటి వరకు తమ దాంపత్య జీవితం హాయిగా సాగుతోందని చాలా సంతోషంగా జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. -
సర్వే సత్యనారాయణ కుమార్తె ఓటమి
-
సర్వే సత్యనారాయణ కుమార్తె ఓటమి
కంటోన్మెంట్: కంటోన్మెంట్ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కుమార్తె సుహాసిని ఓటమి పొందారు. 2వ వార్డు రసూల్ పురలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సుహాసినిపై టీఆర్ఎస్ అభ్యర్థి సదాకేశవ రెడ్డి గెలుపొందారు. సుహాసిని పై సదాకేశవ రెడ్డి 1534 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మరోవైపు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా 1వ వార్డులో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు. కంటోన్మెంట్ 8 వార్డులకు 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్ఎస్ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. -
చిరంజీవి దోశ.. ఉలవచారు
‘హైదరాబాద్ వస్తే చట్నీస్లో ‘చిరంజీవి దోశ’ను టేస్ట్ చేయకుండా వెళ్లను. ఈ హోటల్లో తయారయ్యే ఓ దోశను చిరంజీవి అమితంగా ఇష్టపడేవారు. దీంతో అది చిరంజీవి దోశగా మెనూలో టాప్ ప్లేస్ కొట్టేసింది’ అంటూ సిటీ గురించి తన స్వీట్మెమరీస్ కలబోసుకుంది నటీమణి సుహాసిని. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, కన్నడ వెండితెరలపై అందమైన హాసంతో చెరగని ముద్ర వేసిన ఆమె.. ఓ కార్యక్రమంలోపాల్గొనేందుకు సిటీకి వచ్చినప్పుడు ‘సాక్షి సిటీప్లస్’తో ఈ బ్యూటీఫుల్ సిటీ గురించి చేసిన స్వీటీ చిట్చాట్.. ..:: వాంకె శ్రీనివాస్ మంచుపల్లకి సినిమా షూటింగ్ కోసం 1982లో తెల్లవారుజామున ఆరు గంటలకే చెన్నై నుంచి హైదరాబాద్కి ఫ్లయిట్లో వచ్చా. అదే ఫస్ట్ టైమ్. నగరం మంచు దుప్పట్లో ఉంది. నాకు అప్పటికి తెలుగు, హిందీ రావు. లక్డీకాపూల్లోని అశోక హోటల్లో దిగా. ఆ తర్వాత జర్నలిస్ట్ కాలనీలోని ఓ భవనంలో షూటింగ్.. చిరంజీవిని తొలిసారి చూడటం అదే. ఆ సమయంలో జర్నలిస్ట్ కాలనీవాసులు చూపిన ఆప్యాయత ఓ స్వీట్ మెమరీ. రోజూ సాయంత్రం డిన్నర్కు ఆహ్వానించే వాళ్లు. అప్పుడే సిటీలో మా పిన్నివాళ్లు ఉంటున్నారన్న విషయం తెలిసింది. నేను ఉంటున్న అశోక హోటల్కు సమీపంలోనే వాళ్ల ఇల్లు.. కాలినడకన అక్కడికి వెళ్లి కాలక్షేపం చేసేదాన్ని. అప్పుడు ఫిల్మ్నగర్ లేదు. ఏఎన్నార్ ఆహ్వానం ఇక్కడకు వచ్చినప్పుడల్లా నిర్మాత హరికృష్ణ కుటుంబసభ్యులతో సరదాగా గడిపేదాన్ని. దివంగత హీరో నాగేశ్వరరావు జూబ్లీహిల్స్లోనే ఉండేవారు. నేకిక్కడకు వచ్చిన ప్రతిసారీ ఏఎన్నార్ తన ఇంటికి ఆహ్వానించే వారు. చాలా ఏళ్ల క్రితం పై మాటే.. ఏఎన్నార్ గారి ఇంటికి వెళ్లినపుడు నాగార్జున గురించి ప్రస్తావన వచ్చింది. అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్న నాగార్జునను సినిమాల్లోకి తేవడం ఇష్టం లేదని నాగేశ్వరరావు నాతో చెప్పారు. అయితే బంధువులు, స్నేహితులు హీరోను చేయాలని పట్టుబడుతున్నారని అన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన నాగార్జునతోపరిచయమైంది.అంతా కాస్మొటిక్ కల్చర్ హైదరాబాద్ నెలకు రెండుసార్లు వస్తుంటాను. అప్పట్లో ఇక్కడ తెలుగు కల్చర్ కళ్లకు కట్టేది. ఇప్పుడు కాస్త కాస్మొటిక్ కల్చర్ పెరిగినట్టుంది. అప్పట్లో ఎటు చూసినా పచ్చని చెట్లే.. ఇప్పుడా వాతావరణం లేదు. సిటీకి వచ్చిన ప్రతిసారి చట్నీస్ నుంచి చిరంజీవి దోశ తెప్పించుకొని టేస్ట్ చేస్తా. ఉలవచారు కనిపిస్తే లొట్టొలేస్తూ తాగేయాల్సిందే. గ్రీన్పార్క్ హోటల్లో ఆచారి వెజిటబుల్ (తెలుగులో ‘ఊరగాయ’ అంటారు) రుచి చూడనిదే ఈ సిటీ నుంచి తిరిగి వెళ్లను. చెన్నై తర్వాత నా ఫేవరెట్ సిటీ హైదరాబాదే. తెలుగుదనం ఉట్టిపడే, అందానికి వన్నెతెచ్చే కాటన్ చీరలను ఈ సిటీలోనే కొంటా. బంజారాహిల్స్లోని తూతూ తనేజా కాటన్ చీరలంటే చచ్చేంత ప్రాణం నాకు. బ్యూటీఫుల్ బిల్డింగ్స్.. ఈ సిటీలో భవనాలు అందంగా ఉంటాయి. నృత్య ప్రదర్శన నిమిత్తం వచ్చినపుడు ఫలక్నుమా ప్యాలెస్ చూశా. వాహ్.. నిర్మాణశైలి కట్టిపడేసింది. మొఘల్ తరహా నిర్మాణశైలి భవనాల సౌందర్యం చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ముస్లింల సంప్రదాయ శైలి నిర్మాణాలు భలే కళాత్మకంగా ఉంటాయి. తొలినాళ్లలో ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ బ్యాంగిల్స్ కోసం చార్మినార్కు పరుగెత్తేదాన్ని. సినిమాల్లో పేరొచ్చాక.. వెళ్లడం తగ్గించా.. అభిమానుల తాకిడి తట్టుకోలేక!. నేను హీరోయిన్గా చేసినపుడు తెలుగు వారు ఎలా అభిమానించారో ఇప్పటికీ అదే అభిమానం చూపుతున్నారు. ఫేస్బుక్లో ఫొటోలు అప్లోడ్ చేయాలని తరచూ అడుగుతుంటారు. -
మలబార్ ఫెస్టివల్ తొలి వీక్లీ డ్రా
విజేత హైదరాబాద్ వాసి తిరుపతి: ప్రముఖ ఆభరణాల రిటైల్ చెయిన్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ నిర్వహిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫెస్టివల్(ఎంజీడీఎఫ్) తొలి వీక్లీ డ్రా తిరుపతిలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ బ్రాండ్ అంబాసిడర్ ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్ హాజరయ్యారని మలబార్ గోల్డ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ మలబార్ గోల్డ్ నిర్వాహకులు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించి, విజేతలైన వారికి విలువైన బహుమతులు ప్రదానం చేయడం శుభపరిణామం అన్నారు. ఈ డ్రాలో హైదరాబాద్కు చెందిన సిహెచ్. సుహాసిని 250 గ్రాముల బంగారాన్ని గెల్చుకున్నారని సంస్థ ఏపీ, టీఎస్ మార్కెటింగ్ హెడ్ కల్యాణ్రామ్ పేర్కొన్నారు. ఈ నెల 12న ప్రారంభమైన ఈ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఫెస్టివల్ (ఎంజీడీఎఫ్) జనవరి 31వరకూ జరుగుతుందని వివరించారు. తమ అవుట్లెట్లలో రూ.30,000 కొనుగోలు చేసిన వారికి స్క్రాచ్ అండ్ విన్ కూపన్ ఇస్తామని, బంగారు నాణాన్ని కచ్చితంగా గెల్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వీక్లీ డ్రాలు జరుగుతాయని, విజేతలు బహుమతులుగా బంగారు కడ్డీలు గెల్చుకోవచ్చని పేర్కొన్నారు. బంపర్ డ్రాలో విజేతకు కిలో బంగారం బహుమతిగా ఇస్తామని వివరించారు. ఈ ఫెస్టివల్లో 50 కేజీల వరకూ బంగారాన్ని బహుమతులుగా ఇస్తున్నామని పేర్కొన్నారు. -
కోపముంటే నన్ను చంపాల్సింది...నా పిల్లలేం పాపం చేశారు?
ఏ బంధాన్నైనా తెంచుకోవడం సులభం... కలుపుకోవడం కష్టం. అది తెలిసే ఏ భార్యా తన వైవాహిక బంధాన్ని తెంచుకోవాలని అనుకోదు. పిల్లల బాగు కోసమో... సమాజం ఏమంటుందో అన్న భయానికో ఆ అడుగు వేయదు. కానీ భర్త మృగంగా మారి హింసిస్తున్నప్పుడు కూడా అలా తలొగ్గి ఉండటం ఎంతవరకూ సబబు? జీవితమంతా కాపాడతాడనుకున్న మనిషి, జీవితాన్నే కాలరాస్తున్నప్పుడు... కీడెంచి మేలెంచకుండా మౌనంగా ఉండిపోవడం ఎంతవరకూ సమంజసం? కాస్త కష్టమైనా ముందే ఓ కఠిన నిర్ణయం తీసేసుకుంటే అనర్థాలు ఆగవా? మహిళల్ని సంరక్షించడానికే 498 ఎ చట్టాన్ని చేశానంటోంది ప్రభుత్వం. మహిళలు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఆ చట్టాన్ని రద్దు చేయమని అంటోంది పురుష సమాజంలోని ఓ వర్గం. అలా చేయడం ఎంతవరకూ సమర్థనీయం? ఇప్పుడివన్నీ మాట్లాడ్డానికి కారణం సుహాసిని. ఈ ప్రశ్నలన్నీ తలెత్తడానికి కారణం... ఆమె జీవితంలో సంభవించిన పెను విషాదం! సుహాసిని తన బిడ్డల కోసం నరకం లాంటి జీవితాన్ని స్తబ్దుగా నెట్టుకొచ్చింది. చివరికి ఆ స్తబ్దతే ఆమె జీవితంలో మిగిలింది. కట్టుకున్న భర్తే కాలయుముడై తన కన్నబిడ్డల ప్రాణాల్ని హరిస్తే... కన్నీరు మున్నీరవుతున్న ఆ కన్నతల్లితో ‘సాక్షి’ జరిపిన సంభాషణ ఇది! ఎలా ఉన్నారు సుహాసినిగారూ? సుహాసిని: కళ్లు మూసినా, తెరిచినా పిల్లలే గుర్తొస్తున్నారు. వాళ్లు నా పక్కనే ఉండి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తోంది. పోయినవారం... సరిగ్గా ఇదే రోజు (ఇంటర్వ్యూ చేసిన రోజు)... నా పిల్లల్ని నేను చూసుకున్న చివరి రోజు... అసలా రోజు ఏం జరిగిందో చెబుతారా? ఎప్పటిలానే వచ్చాడు. పిల్లల్ని తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత మళ్లీ ఒక్కడే వచ్చాడు. పిల్లలేరని అడిగితే, గుడిలో భోంచేస్తున్నారని చెప్పాడు. నన్నూ రమ్మన్నాడు. నేను రాను, పిల్లల్ని తీసుకు రమ్మని చెప్పాను. వెళ్లిపోయాడు. కానీ ఎంతసేపటికీ తీసుకురాలేదు. ఎన్ని మెసేజులు ఇచ్చినా రిప్లై లేదు. నాలుగున్నర వరకూ చూసి ఫోన్ చేశాను. పోలీసులు లిఫ్ట్ చేశారు. తను రైలుకింద పడి సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు. షాకయ్యాను. పిల్లలేమైపోయారో తెలియలేదు. నన్ను ఏడిపించడానికి ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడనుకున్నాను. కానీ తన ఫోన్లో ఉన్న మెసేజ్ని చూశాకగానీ అర్థం కాలేదు... జరిగిన దారుణం! పిల్లల్ని తీసుకెళ్లేపు్పుడు తనలో ఏ మార్పూ కన్పించలేదా? లేదు. ఎప్పటిలానే వచ్చాడు, తీసుకెళ్లాడు. ఇంత దారుణానికి ఒడిగడతాడనుకోలేదు. పిల్లలు సరదా పడ్డారని ఆ రోజు బ్యాంగ్బ్యాంగ్ సినిమాకి తీసుకెళ్తానన్నాను. దాంతో వెళ్లడానికి వాళ్లిష్టపడలేదు. వెళ్లిరండి, సినిమాకి సాయంత్రం తీసుకెళ్తాలే అని సర్దిచెప్పి పంపించాను. (కన్నీళ్లతో) కానీ వాళ్లు మళ్లీ రారని, నేనెప్పటికీ వాళ్లను చూడలేనని అనుకోలేదు. ఆయన ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నారంటారు? నేను తనకి దూరంగా వచ్చేశానని, తన దగ్గరకు వెళ్లడం లేదని నామీద కక్ష కట్టాడు. ఆ కసితోనే వాళ్లను పొట్టనబెట్టుకున్నాడు. వాళ్ల అమాయక ముఖాలు చూసయినా జాలి వేయలేదతనికి! తనలో హింసా ప్రవృత్తి ముందెప్పుడూ కనిపించలేదా? తను శాడిస్టని తెలుసు. కానీ పిల్లల్ని చంపుకునేంత కసాయివాడని మాత్రం తెలియలేదు. పెళ్లయిన నాటి నుంచీ నన్ను చిత్ర హింసలు పెట్టాడు. ఎంతసేపూ డబ్బు డబ్బు డబ్బు. సంపాదించినదంతా తన చేతిలోనే పెట్టేదాన్ని. నా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్కులు... అన్నీ తన దగ్గరే ఉండేవి. వారానికింత అని పాకెట్ మనీ ఇచ్చేవాడు. ఫోన్ రీచార్జ్ కూడా తనే చేసేవాడు. చివరికి నా సంతకాలు ఫోర్జరీ కూడా చేసేవాడు. అడిగితే చిత్రవధ చేసేవాడు. తొమ్మిదేళ్లు నరకం చూశాను. ఇంట్లోవాళ్లకు చెప్పలేదా? చెప్పినా సర్దుకుపొమ్మన్నారా? వాళ్లెప్పుడూ అలా చెప్పలేదు. నేనే సర్దుకుపోవడానికి ట్రై చేసేదాన్ని. మావాళ్లు మాట్లాడినప్పుడు బాగా చూసుకుంటాననేవాడు. వాళ్లు వెళ్లాక మళ్లీ మామూలే. అతని తరఫు వాళ్లయితే వాళ్ల ఎదురుగానే నన్ను కొడుతున్నా అడ్డుపడేవారు కాదు. మా అత్తగారుమాతోనే ఉండేది. నన్ను చిత్రహింస పెడుతున్నా ఏనాడూ కొడుకుని వారించలేదావిడ. ఇవాళ అతడు నా పిల్లల్ని పొట్టనబెట్టుకుంటే వాళ్లలో ఏ ఒక్కరూ ఫోన్ చేసి పలకరించలేదంటే ఏమనాలి! మీరొక ఇండిపెండెంట్ ఉమన్ అయివుండీ, పిల్లల్ని పెంచుకోగల స్తోమత ఉండీ ఆ హింస ఎందుకు భరించారు? ఇన్ని సంవత్సరాల తర్వాత కేసు ఎందుకు పెట్టారు? విడిపోతే ఎక్కువ సంపాదిస్తోందని అహంభావం అని అందరూ అనుకుంటారేమోనని భయం. దానికితోడు నా పిల్లలకు తండ్రిని దూరం చేయకూడదని కూడా అనుకున్నాను. కానీ తను పిల్లల్ని కూడా హింసించడం మొదలుపెట్టాడు. టీవీ చూడనిచ్చేవాడు కాదు. ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ ఏదీ తిననిచ్చేవాడు కాదు. రోజూ పప్పన్నమే. తినకపోతే కొట్టేవాడు. వాతలు పెట్టేవాడు. తట్టుకోలేక పోయాను. పైగా అతణ్ని చూసి వారిలోనూ అలాంటి ప్రవృత్తి పెరుగుతుందేమోనని భయపడ్డాను. అందుకే వచ్చేశాను. అయినా వదలకుండా వేధిస్తుంటే కేసు పెట్టక తప్పలేదు. కానీ అది తప్పుడు కేసంటూ ఉత్తరాలు రాశాడు కదా? తప్పుడు కేసు పెట్టేదాన్నే అయితే తొమ్మిదేళ్లు ఆ హింస భరించేదాన్ని కాదు. నేనెప్పుడూ కాపురాన్ని సరి చేసుకోవాలని, అతణ్ని మార్చుకోవాలనే చూశాను. ఇక భరించలేని పరిస్థితి వచ్చాక కేసు పెట్టాను. 498 ఎ చట్టాన్ని తీసేయమంటూ ఎవరెవరికో ఉత్తరాలు రాశాడు. కానీ ఆ చట్టం లేకపోతే నాలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి! చూశారుగా తనెంత దారుణమైన మనిషో! కాల్ రికార్డ్స్ చూస్తే... తాను చనిపోతానని ముందే హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది కదా? ఎప్పుడూ అలా బెదిరిస్తూనే ఉండేవాడు. నన్ను తన దారిలోకి తెచ్చుకోవడానికి అదొక అస్త్రం తనకి. అందుకే పట్టించుకోలేదు. అయినా ఆ రికార్డ్స్ ఇప్పటివి కావు. ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ రికార్డ్ చేసి, అన్నిటినీ అతికి మీడియా వాళ్లకు పంపించాడు. అందుకే అందులో నా మాటలేం సరిగ్గా ఉండవు. తను నన్ను బతిమాలుతున్న మాటలే ఉంటాయి. అవి కావాలని మాట్లాడి రికార్డ్ చేసుకున్నాడు, తాను మంచివాడినని నిరూపించుకోవడం కోసం. అందులో నిజమెంతో తెలుసుకోకుండా మీడియా ప్రసారం చేసేసింది. ఆ కాల్ రికార్డ్లో... కాగితం మీద సంతకం పెట్టనని పదే పదే అన్నాడు కదా, ఏమిటా కాగితం? తనకి నా మీదసలు ప్రేమే లేదు. నేను తన దగ్గరికి ఎందుకు వెళ్లను అని పంతం! అందుకే మా పెద్దవాళ్లు... నాకేదైనా అయితే తనదే బాధ్యత అని రాసిన కాగితం మీద సంతకం పెట్టమన్నారు. కానీ అతను పెట్టడని నాకు ముందే తెలుసు. ఎందుకంటే, హింసించడం అతడి తత్వం. అలా చేయకుండా అతడు ఉండలేడు. మరి ఇన్ని తెలిసీ పిల్లల కస్టడీకి మీరు ఎందుకు ఒప్పుకున్నారు? నేను ఒప్పుకోలేదు. అతను మంచివాడు కాదని మొత్తుకున్నాను. కానీ కోర్టు నా మాట వినలేదు. ఇప్పుడేమయ్యింది! నా పిల్లల్ని కోర్టు తెచ్చివ్వగలదా?! ఒకవేళ కేసు పెట్టకుండా ఉన్నా.. అతడితోనే కలిసున్నా పిల్లలు దక్కివుండేవారని ఇప్పుడనిపిస్తోందా? ఏది ఎందుకు జరిగిందో ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. నాకు నా పిల్లలు కావాలి. వాళ్లు లేని జీవితాన్ని నేను ఊహించలేకపోతున్నాను. వాళ్ల కోసం ఎన్నో భరించాను. వాళ్ల కోసమే బతికాను. ఇప్పుడు వాళ్లే లేకుండా పోయారు. ఇక నా జీవితానికి అర్థమేముంది? అతనికి అంతగా నామీద కోపముంటే నన్ను చంపాల్సింది. నా పిల్లల్నెందుకు చంపాలి? వాళ్లేం పాపం చేశారు? సుహాసిని సంధించిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి గురుప్రసాద్ బతికి లేడు. పోనీ ఆ ప్రశ్నకు సమాధానం మన దగ్గరయినా ఉందా?! అభం శుభం తెలియనివాళ్లు. అమ్మానాన్నలు ఎందుకు గొడవ పడుతున్నారో కూడా అర్థం చేసుకోలేని పసివాళ్లు. అన్యాయంగా అసువులు బాశారు. విరించి, విహారిలే కాదు... తల్లిదండ్రుల సమస్యలకి, వారి మధ్య కోపతాపాలకి మధ్య జీవితాలను, ప్రాణాలను కోల్పోతున్న చిన్నారులు చాలామందే ఉన్నారు. తల్లి పసుపుతాడు బిడ్డలకు ఉరితాడు అవ్వడం న్యాయమా? తండ్రి పంతం పిల్లల ప్రాణాలు తీసే యమపాశమవ్వడం ధర్మమా? ఆలోచించండి! సంభాషణ: సమీర నేలపూడి ఈ పరిస్థితిని ముందే అంచనా వేయవచ్చు! ఒక వ్యక్తి మానసిక స్థితిని బట్టి, ప్రవర్తనను బట్టి జరగబోయే అనర్థాలను ముందుగానే అంచనా వేయవచ్చు. భర్త హింసిస్తున్నా సమాజం ఏమనుకుంటుందోనన్న భయంతోనో, తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారన్న ఉద్దేశంతోనో మౌనంగా భరించే మహిళలు చాలామంది ఉన్నారు. అయితే అతడలా ప్రవర్తించడానికి కారణం వ్యక్తిత్వ లోపం కావచ్చు. ఏదైనా మానసిక వ్యాధి కావచ్చు. ఒక్కసారి వైద్యుడిని కలిసి భర్త ప్రవర్తన గురించి చెబితే, అతడికేదైనా మానసిక సమస్య ఉందా అన్నది వాళ్లు కనిపెడతారు. దానికి చికిత్స చేయిస్తే అతడు మంచిగా మారవచ్చు. ఇలాంటి ఘోరాలకు పాల్పడకపోవచ్చు. ఒకవేళ వారు ట్రీట్మెంట్కి ఒప్పుకోకపోతే, మెంటల్హెల్త్ యాక్ట్ (సెక్షన్ 23)ని ఆశ్రయించవచ్చు. దాని ప్రకారం... ఒక వ్యక్తిలో తనను తాను కానీ, ఇతరులను కానీ హింసించే లక్షణాలు ఉంటే అతడికి బలవంతంగా కూడా చికిత్స చేయించవచ్చు. కాబట్టి హింసాత్మక ప్రవృత్తి కనిపించగానే వైద్యుల సలహా తీసుకుంటే... ఇలాంటి ఘోరాలు జరగకుండా అడ్డుకునే అవకాశం దొరుకుతుంది. - డాక్టర్ శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై., సైకియాట్రిస్టు చట్టాల్ని తప్పు పట్టకూడదు! ఎంత నాణ్యమైన బియ్యంలోనైనా ఒకటో రెండో రాళ్లు ఉంటాయి. మంచి ముత్యాల్లో కూడా ఒకటి రెండు నకిలీవి తగులుతుంటాయి. అందుకని మొత్తాన్నీ పారేయలేం కదా! చట్టాలూ అంతే. అప్పటి పరిస్థితులను బట్టి, అంతవరకూ చూసిన కేసుల్ని బట్టి రూపొందుతాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. ఒకటో రెండో తప్పుడు కేసులు వచ్చాయని అసలు ఆ చట్టమే సరికాదంటే ఎలా? 498 ఎ అక్కడక్కడా దుర్వినియోగం అవుతోందన్నది నిజమే కావచ్చు. కానీ, కొందరలా చేశారని చట్టాన్నే లేకుండా చేస్తే నిజమైన బాధితుల పరిస్థితేం కావాలి! కాకపోతే మారుతున్న పరిస్థితులను బట్టి, మానసిక ప్రవృత్తులను బట్టి చట్టాల్లో మార్పులు జరగాలి. భర్త తనని వేధిస్తున్నాడని ఓ భార్య కేసు పెట్టినప్పుడు... అతడి ప్రవర్తన మీద నిఘా ఉంచాలి. ఆమె చెప్పింది నిజమని తేలితే ఆలస్యం చేయకుండా తీర్పు వెలువరించాలి. ఎందుకంటే ఆలస్యం జరిగేకొద్దీ మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. అది కొన్నిసార్లు హింసకు పాల్పడేలా ప్రేరేపిస్తుంది. ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణమవుతుంది! - ఎస్.ప్రదీప్ కుమార్, న్యాయవాది -
మమకారమా... ప్రతీకారమా!
‘బాల భోగం... రాజభోగం’ అంటారు. ఎందుకంటే ప్రతి ఇంటా అమ్మానాన్నల్ని శాసించేది వాళ్లే. అడిగింది తక్షణం తెచ్చి ఇవ్వకపోయినా, తమకు ఆకలేసిన సంగతిని గ్రహించలేని అజ్ఞానాన్ని ప్రదర్శించినా వాళ్లకు కోపం వస్తుంది. దేశాన్నేలే రాజుకైనా అసమ్మతి ఉంటుందేమోగానీ అలాంటి వేషాలు పిల్లల ముందు సాగవు. విసుక్కున్నా, కసురుకున్నా చివరకు లొంగిరావలసింది అమ్మానాన్నలే. కంటిపాపల్లా, ఇంటిదీపాల్లా ఉండే పిల్లల్ని తిట్టడానికీ, కొట్టడానికీ ప్రయత్నిస్తేనే మనుషులా, రాక్షసులా అని నలుగురూ తిట్టిపోస్తారు. అలాంటిది కల్లాకపటం తెలియని ప్రేమతో పెనవేసుకున్న కన్నబిడ్డల్ని చంపేంత కిరాతకానికి ఒడిగట్టిన తండ్రిని ఏమనవచ్చు? హైదరాబాద్లోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న రాఘవేంద్ర గురుప్రసాద్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయనతో పాటు ఉండాల్సిన ఇద్దరు పిల్లల ఆచూకీ తెలియడంలేదని రెండురోజులక్రితం వార్తలు వచ్చినప్పుడు అందరూ ‘అయ్యో పాపం’ అనుకున్నారు. ఉన్నత విద్యావంతుడిగా, బాధ్యతగల ఆచార్యుడిగా ఉన్నవాడు ఇలా అర్ధంతరంగా ప్రాణం తీసుకోవాల్సినంత పరిస్థితులు ఏమొచ్చాయో అని బాధపడ్డారు. అతను ఆత్మహత్య చేసుకున్నది సికింద్రాబాద్ జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్పై. ఆ రైల్వే స్టేషన్లోని సీసీ టీవీ కెమెరాల్లో గురుప్రసాద్ ఒక్కడే కనిపించాడు గనుక పిల్లల్ని ఎవరికో అప్పగించి తానొక్కడే వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని అంచనావేశారు. గంటలు గడుస్తున్నా అయినవారి ఇళ్లలో ఎక్కడా ఆ పిల్లల ఆచూకీ లభ్యం కాకపోవడంతో బంధువులు కంగారుపడ్డారు. ఏదో కీడు శంకించారు. చివరకు వారి అనుమానాలే నిజమయ్యాయి. భార్యతో తగాదాపడి పంతాలకూ, పట్టింపులకూ పోయి... చివరకు వాటితో ఏమాత్రమూ సంబంధంలేని ముత్యాల్లాంటి ముద్దు బిడ్డల్ని గురుప్రసాద్ బలితీసుకున్నాడు. పెళ్లనేది కేవలం భార్యాభర్తల సహజీవన బంధం మాత్రమే కాదనీ... విస్తృతార్థంలో అది ఇద్దరూ ఉమ్మడిగా పౌర సమాజంపట్ల నెరవేర్చవలసిన బాధ్యతని అంటారు. కానీ ఆ బాధ్యతను నెరవేర్చడానికి దగ్గరయ్యే ఇద్దరూ సాధారణంగా భిన్న కుటుంబాల్లో, భిన్న వాతావరణాల్లో పెరిగేవారు గనుక ఇద్దరి దృక్పథాల్లో తేడాలుంటాయి. సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం లేదు గనుక సహజీవనానికి దగ్గరయ్యే ఇద్దరిలోనూ దాని ప్రభావం కూడా ఉంటుంది. సర్దుకుపోయే మనస్తత్వాలైనప్పుడు ఆ ఇద్దరికీ ఇవన్నీ పెద్ద సమస్యలుగా అనిపించకపోవచ్చు. కనుక వాటి ప్రభావం వారి జీవితాలపై పెద్దగా పడకపోవచ్చు. కానీ అవతలివారిపై ‘ఏం చేసైనా’ ఆధిపత్యాన్ని సాధించాలనుకున్నప్పుడు అది సహజీవనాన్ని ఛిద్రం చేస్తుంది. అలాంటి మనస్తత్వం ఉన్నవారితో కాపురం చేయడం దుర్భరమవుతుంది. ఈ ఆధిపత్యధోరణులే బహుశా గురుప్రసాద్, సుహాసిని దంపతుల మధ్య దూరాన్ని పెంచాయి. తాను కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం తొమ్మిదేళ్లపాటు అతడు పెట్టిన చిత్రహింసల్ని భరించానని, చివరకు ఏడాదిక్రితం 498ఏ కింద కేసు పెట్టాల్సి వచ్చిందని ఆమె చెబుతున్నారు. సుహాసిని చెబుతున్న మాటల్లో నిజమెంతో... గురుప్రసాద్ ఎలాంటివాడో, అతని మానసిక స్థితి ఎలాంటిదో తెలియడానికి పెద్ద పరిశోధన అక్కరలేదు. భార్య దగ్గరినుంచి పిల్లల్ని తీసుకెళ్లడానికి ముందే వారిని చంపడానికి అతను చేసుకున్న ఏర్పాట్లు...అందుకు సంబంధించిన పనులు జరిపిస్తూనే ఆమెతో జరిపిన ఫోన్ సంభాషణలు అతని హంతక మనస్తత్వాన్ని పట్టి ఇస్తాయి. ఆర్థిక ఇబ్బందుల మూలంగానో, అహం దెబ్బతినో ఆత్మహత్యలకు సిద్ధపడటం ఇటీవలికాలంలో పెరిగింది. కానీ, అలా చనిపోదల్చుకున్నవారు ఇతరులకు, అందునా కన్నబిడ్డలకు హాని తలపెట్టడం చాలా అరుదు. పెంపకంలో ఆడపిల్లలు, మగపిల్లలమధ్య చూపుతున్న వ్యత్యాసం ఇలాంటి దారుణాలకు కారణమవుతున్నది. నడి బజారులో ఆడపిల్లలపై జరుగుతున్న యాసిడ్ దాడులకైనా, ఇళ్లల్లో మహిళలపై సాగే హింసకైనా మూలం అక్కడే ఉన్నదని సామాజిక విశ్లేషకులు చెబుతున్న మాట. ఇలాంటి సంస్కృతిని ఒంటబట్టించుకోబట్టే పెరిగి పెద్దయి భార్య స్థానంలో వచ్చినవారిని కాల్చుకుతినడం అలవాటుగా మారుతున్నదని వారంటున్నారు. అనురాగం ఉండాల్సినచోట అహంకారమూ... ఆత్మీయత ఉండాల్సినచోట పచ్చి విద్వేషమూ పెచ్చరిల్లితే ఏ కుటుంబమైనా కుప్పకూలుతుంది. అమ్మానాన్నల విభేదాలు పిల్లల పెరుగుదలపైనా, వారి మానసిక స్థితిగతులపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈమధ్యనే మన హైకోర్టు ఒక జంట మధ్య తలెత్తిన సమస్య విషయంలో కౌన్సెలింగ్ ఇచ్చింది. చివరకు సర్దుకుపోవడానికి ఆ ఇద్దరూ అంగీకరించారు. అయితే, అన్ని కేసుల్లోనూ ఇది సాధ్యంకాకపోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తలు తగాదా పడినప్పుడు దానికి పరిమితమై ఆలోచించి పరిష్కరించడం కాక...వారిద్దరి మానసిక స్థితి ఎలాంటిదో అంచనావేసే స్థితి ఉండాలి. గురుప్రసాద్లో సొంత బిడ్డల్ని చంపుకొనేంత ఉన్మాదం హఠాత్తుగా ఏర్పడి ఉంటుందా? అతని మానసిక స్థితిని సైతం ముందుగా విశ్లేషించగలిగితే ఆ ఉన్మాదం జాడల్ని పసిగట్టడం పెద్ద కష్టమా? వాస్తవానికి ఇలాంటి స్థితిని ఎంతో కొంత అంచనా వేయబట్టే సుహాసిని అతనికి దూరం జరిగివుంటారు. ‘నీ ఇంటికి వస్తే నువ్వు నన్ను... నా ఇంటికి వస్తే నేను నిన్ను చంపుకుంటామని అనుకుంటున్నావు. మనమేమైనా కసాయిలమా?’ అని ఫోన్లో అన్న సమయానికే పిల్లలకోసం గురు ప్రసాద్ ప్లాట్లో గోతులు తవ్వించి పెట్టాడు. ఈమధ్యే హైదరాబాద్లో ఇలా భార్యనూ, కన్నబిడ్డనూ హతమార్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. ఇలాంటి ఉదంతాలు సమాజాన్ని మొద్దుబారుస్తాయి. సున్నితత్వాన్ని దెబ్బతీస్తాయి. కనుక ఈ తరహా ఉన్మాదానికి తావులేని స్థితి ఏర్పడాలని అందరూ కోరుకుంటారు. -
భార్యనూ చంపాలనుకున్నాడా?
సాక్షి, హైదరాబాద్: రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఇక్ఫాయ్ ప్రొఫెసర్ రాఘవేంద్ర గురుప్రసాద్ తన భార్య సుహాసినిని సైతం అంతమొందించాలనుకున్నాడా? పథకంలో భాగంగా ముందుగా ఇద్దరు పిల్లలను చంపిన తరువాత సుహాసినిని ఎలాగైనా తన ఇంటికి తీసుకెళ్లి చంపాలనుకున్నాడా? అతని ఇంట్లో పోలీసులకు లభించిన తాడు ఆమెను చంపడానికే తెచ్చాడా అనే అనుమానాలకు.. ఆ రోజు అతను భార్యను తీసుకెళ్లడానికి యత్నించిన తీరు బలం చేకూరుస్తోంది. గురుప్రసాద్ తన ఇద్దరు కుమారులు విఠల్ విరించి(9), నందవిహారి (5)లను చంపి సోమవారం సికింద్రాబాద్ జేమ్స్స్ట్రీట్ రైల్వే ట్రాక్పై ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం 10.30-11.30 గంటల మధ్యలో మేడ్చల్కు తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి హత్య చేసి అక్కడే పూడ్చి పెట్టిన గురుప్రసాద్ మధ్యాహ్నం 12.30 గంటలకు మల్కాజ్గిరిలోని సుహాసిని ఇంటికి వెళ్లాడు. పిల్లలు గుడిలో భోజనం చేస్తున్నారని, నీవు కూడా వస్త్తే పిల్లలతో కలిసి వద్దామని బతిమాలాడాడు. అయితే సుహాసిని అంగీకరించకపోవడంతో అతని పథకం బెడిసికొట్టినట్టు కనిపిస్తోంది. కోర్టు ఆదేశాలతో కొడుకులను శనివారం తీసుకెళ్లిన గురుప్రసాద్ అదే రోజు ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి పూజ నెపంతో గొయ్యి చిన్నారులిద్దర్ని చంపి మేడ్చల్లోని తన సొంత ప్లాట్లో ఖననం చేయాలనుకున్న గురుప్రసాద్ హత్యకు ఒక రోజు ముందే అక్కడ గొయ్యి తీయించాడు. మృతదేహాల ఖననం కోసం అని చెబితే గొయ్యి తీసే వారికి అనుమానాలు వస్తాయని భావించిన గురుప్రసాద్ ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేయాల్సి ఉందని అబద్ధాలు చెప్పి కూలీలతో గొయ్యి తీయించాడని తెలుస్తోంది. కూలీలను కూడా మేడ్చల్లోని అడ్డాకూలీపై నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం. హత్యకు దారితీసిన పరిస్థితులు, గురుప్రసాద్ ఒక్కడే ఈ ఘటనలో పాల్గొన్నాడా లేదా ఎవరి సహకారం తీసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఇందులో కేవలం గురుప్రసాద్ ఒక్కడికే సంబంధం ఉందని తేలితే కేసును మూసివేస్తామని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా పాలుపంచుకున్నారని తెలిస్తే వారిని కూడా అరెస్టు చేస్తామంటున్నారు. చిన్నారుల మెడపై వేటు కత్తిలాంటి పదునైన ఆయుధంతో మెడ నరకడంతో చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ధ్రువీకరించారు. పెద్దకుమారుడి మెడపై రెండు, చిన్నకుమారుడి మెడపై మూడు సార్లు ఆయుధంతో వేటేసినట్లు గుర్తించామన్నారు. విషప్రయోగం, మత్తుమందు ఆనవాళ్లను గుర్తించేందుకు శరీరభాగాలను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపామని, పది రోజుల్లో నివేదిక వచ్చే అవకాశం ఉందన్నారు. విషప్రయోగం, మత్తుమందు వంటి ప్రయోగాలు జరిగితే ముందునుంచే చంపేవాడని భావిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యుడు మోహన్సింగ్ నేతృత్వంలో మంగళవారం చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి తల్లి సుహాసినికి అప్పగించారు. చిన్నారుల మెడపై వేటు వేసిన పదునైన కత్తి మాత్రం ఇంకా లభించలేదు. హత్య జరిగిన స్థలంలో చిన్నపాటి కత్తి మాత్రం పోలీసులకు లభ్యమైంది. అయితే ఈ కత్తితో మెడపై వేటువేయడం అసాధ్యమని పోలీసులు భావిస్తున్నారు. నన్ను కూడా రమ్మన్నాడు: సుహాసిని గురుప్రసాద్ తనను కూడా చంపేందుకు ఎత్తగడ వేశాడని ఆయన భార్య సుహాసిని మంగళవారం మీడియాకు తెలిపింది. శనివారం మధ్యాహ్నం అతడు తమ ఇంటికి వచ్చాడని, తనను కూడా వెంట రమ్మన్నాడని చెప్పింది. తాను పిల్లల కోసమే బతుకుతున్నానని, వారు లేకుండా ఈ ప్రాణాలు ఎందుకంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ‘తొమ్మిదేళ్లు భర్త కొడితే భరించాను. అత్తకూడా కొట్టడంతో ఇల్లు వదిలి పుట్టింటికి చేరుకున్నాను. ఆమె కూడా గురుప్రసాద్కే మద్దతు పలుకుతూ నాకు చీవాట్లు పెట్టేది’ అని సుహాసిని కన్నీటిపర్యంతమైంది. ట్యాబ్ కొనిస్తానని ఆశ పెట్టడంతో పిల్లలు సంతోషంగా తండ్రితో కలిసి వెళ్లారని ఇంతటి ఘోరానికి పాల్పడతాడని ఊహించలేదని చెప్పింది. గాంధీ మార్చురీ వద్ద చిన్నారుల మృతదేహాలను చూసి ఆమె భోరున విలపించింది. చిన్నారుల మృతదేహాలను బన్సీలాల్పేట శ్మశానవాటికలో ఖననం చేశారు. గురుప్రసాద్తో సుహాసిని వివాహం ఘనంగా జరిపించామని పెళ్లయిన రెండో రోజు నుంచే గురుప్రసాద్ వేధింపులు మొదలయ్యాయని ఆమె తమ్ముడు స్వరూప్, అక్క గీత, మేనత్త సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు అన్నం తినకపోయినా శాడిస్ట్లా అగ్గిపుల్ల కాల్చి వాతలు పెట్టేవాడని చెప్పారు. -
'మచ్చిక చేసుకుని మట్టుబెట్టాడు'
హైదరాబాద్: ఇక్ఫాయ్ ప్రొఫెసర్ గురుప్రసాద్ తన ఇద్దరు కుమారులను మచ్చిక చేసుకుని మట్టుబెట్టాడని ఆయన భార్య సుహాసిని వాపోయారు. తొమ్మిదేళ్లుగా అతడి పెట్టిన చిత్రహింసలు భరించలేకే పుట్టింటికి వచ్చినట్టు ఆమె తెలిపారు. కన్న కొడుకులను కర్కశంగా చంపడానికి అతడికి చేతులెలా వచ్చాయంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. కాగా, గురుప్రసాద్ ఇద్దరు కుమారుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మెడపై వేట కొడవళ్లతో నరికి చంపినట్టు వైద్యులు గుర్తించారు. తాను ఆత్మహత్య చేసుకునేముందు గురుప్రసాద్ తన ఇద్దరు కుమారులను హత్యచేసి పాతిపెట్టాడు. వీరి మృతదేహాలను సోమవారం వెలికితీశారు. -
సుహాసిని వేధింపుల వల్లే గురుప్రసాద్ ఆత్మహత్య?
హైదరాబాద్: భార్య సుహాసిని వేధింపుల వల్లే ఇక్ఫాయ్ ప్రొఫెసర్ రాఘవేంద్ర గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నట్లు అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా గురు ప్రసాద్ తన ఇద్దరు పిల్లలు విఠల్ విరించి(9), నందవిహారి(5)లను హత్య చేసి, ఆ తరువాత తనూ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తమ కోడలు సుహాసిని వ్యవహరించిన తీరు వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు వారు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎవరో ఒకరి తప్పు మాత్రమే ఉంటుందని చెప్పలేమని పలువురు అంటున్నారు. పూర్తీగా సుహాసిని వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు భావించలేమని అంటున్నారు. ఇద్దరి తప్పు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇద్దరు పిల్లలను చంపడంలోనే అతని మానసిక పరిస్థితి అర్ధమవుతోందని న్యాయవాది కిరణ్ అన్నారు. విభేదాలు, విడిపోవడం వల్ల తను ఎంత బాధపడ్డాడో, తన భార్య కూడా అదే విధంగా బాధపడాలన్న ఉద్దేశంతోనే అతను పిల్లలను హత్య చేసి ఉంటాడని అన్నారు. 498ఏ చట్టం దుర్వినియోగం అవుతున్నట్లు తెలిపారు. భర్త వల్ల ఇబ్బందులు ఎదురైతో భార్యలు భర్తతోపాటు అత్త,మామ, ఆడబిడ్డ.. ఇలా కుటుంబ సభ్యులు అందరిపైన కేసు పెడుతున్నారని చెప్పారు. ఆ చట్టంలో మార్పు తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. ఈ రోజు ఉదయం సాక్షి టీవీ చిట్చాట్లో సినిమా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ఒక కుటుంబంలో ఇటువంటి సంఘటన జరగడం బాధాకరం అన్నారు. ఇంతటి దారుణానికి పాల్పడే ముందు ఒక్కసారి ఆలోచించాలన్నారు. పిల్లల గురించి ఆలోచన చేయకపోవడం బాధాకరం అన్నారు. కష్టసుఖాలు ఉంటుంటాయని చెప్పారు. ఎవరైనా ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు వాటిని జయించడానికి ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. గురుప్రాసాద్ పిల్లలు చక్కగా, ముద్దుగా ఉన్నారని, వారిని హత్య చేయడం చాలా బాధవేసిందన్నారు. ఎవరూ ఇటువంటి దారుణానికి ఒడికట్టవద్దని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. **