
బంజారాహిల్స్ (హైదరాబాద్): రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్ తొలగించినట్లు వైద్యబృందం సోమవారం వెల్లడించింది.
మూడు రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామంది. సొంతంగానే శ్వాస తీసుకుంటున్న సాయిధరమ్.. అందరితో మాట్లాడగలుగుతున్నారని తెలిపింది. మరో రెండు, మూడురోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నట్లు పేర్కొంది. ఈనెల 10న దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి వెళ్తూ బైక్ స్కిడ్ అయి సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment