Apollo Hospitals
-
మాజీ సీఈసీ నవీన్ చావ్లా ఇకలేరు
న్యూఢిల్లీ: మాజీ ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) నవీన్ చావ్లా(79) కన్నుమూశారు. అపొలో ఆస్పత్రిలో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారని మరో మాజీ సీఈసీ ఎస్వై ఖురేషి తెలిపారు. పది రోజుల క్రితం కలిసినప్పుడు బ్రెయిన్ సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరనున్నట్లు చెప్పారని గుర్తు చేసుకున్నారు. 1969 బ్యాచ్ ఐఏఎస్ అయిన చావ్లా 2005 నుంచి 2009 వరకు ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. అనంతరం 2009 ఏప్రిల్ నుంచి 2010 జులై వరకు సీఈసీగా పనిచేశారు. కమిషనర్గా ఆయన పక్షపాతంతో వ్యవహరించినట్లు బీజేపీ ఆరోపించింది. 2006లో లోక్సభలో అప్పటి ప్రతిపక్ష నేత ఎల్కే అడ్వాణీ 204 మంది ఎంపీల సంతకాలతో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు వినతి పత్రం సమర్పించారు. బీజేపీ ఆరోపణలపై 2009లో అప్పటి సీఈసీ ఎన్ గోపాలస్వామి కమిషనర్ బాధ్యతల నుంచి చావ్లాను తొలగించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు కూడా చేశారు. ఈ విషయమై బీజేపీ సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. దేశ 16వ సీఈసీ నవీన్ చావ్లా హయాంలో కీలక ఎన్నికలు సంస్కరణలు అమలయ్యాయి. స్త్రీ, పురుషతోపాటు థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ‘ఇతరులు’అనే కేటగిరీని తీసుకురావడం అందులో ఒకటి. సీఈసీతో సమానంగా కమిషనర్లను అభిశంసించాలన్నా పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమయ్యేలా రాజ్యాంగ సవరణ తేవాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. కాగా, నవీన్ చావ్లా 1992లో మదర్ థెరిసా జీవిత చరిత్రను రాశారు. 1997లో ప్రచురితమైన లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ మదర్ థెరిసా అనే పుస్తకానికి సహ రచయితగా ఉన్నారు. -
'ఇది మాకు దక్కిన గొప్ప ఆశీర్వాదం'.. ఉపాసన ట్వీట్
మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉంది. తాజాగా అయోధ్యలోని రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్లో పంచుకున్నారు. సనాతన ధర్మం గురించి మా తాత చాలా నేర్పించారని ఈ సందర్భంగా ఉపాసన గుర్తు చేసుకున్నారు. ఇక్కడ సేవ చేసే అవకాశం లభించడం మాకు గొప్ప ఆశీర్వాదం లాంటిదని పోస్ట్ చేశారు.ఆయన మాటల స్ఫూర్తితోనే అయోధ్య రామమందిరానికి వచ్చే భక్తులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు ఉపాసన తెలిపారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన అపోలో అత్యవసర సంరక్షణ కేంద్రాన్ని(అపోలో ఎమర్జన్సీ కేర్ సెంటర్) ప్రారంభించామని వెల్లడించారు. ఇప్పటికే తిరుమల, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్లో సేవలందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రామజన్మ భూమిలో సేవ చేయడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఉపాసన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. Thatha taught us that true Sanatan Dharma for us lies in healing with dignity & empathy. Inspired by his words we opened a free Emergency Care Centre at the Ram Mandir in Ayodhya.After successfully serving in Tirumala, Srisailam, Kedarnath, and Badrinath, we are blessed to… pic.twitter.com/YcCVf0ZM61— Upasana Konidela (@upasanakonidela) December 15, 2024 -
ఎల్కే అద్వానీకి అస్వస్థత
-
తెగిన చేతిని అతికించిన వైద్యులు
రోడ్డు ప్రమాదంలో పూర్తిగా తెగిపోయిన చేయి గోల్డెన్ అవర్ దాటిన తర్వాత అపోలో ఆస్పత్రికి రోగి.. 8 గంటల పాటు శ్రమించి అతికించిన వైద్య బృందం సాక్షి, హైదరాబాద్: రోడ్డుప్రమాదంలో పూర్తిగా తెగిపడిపోయిన చేయిని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్తి వైద్యులు విజయవంతంగా అతికించారు. గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన తొలి గంట)సమయం దాటిపోయిన తర్వాత కూడా అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించటం గమనార్హం. మంచిర్యాలకు చెందిన పవన్కుమార్ అనే వ్యక్తి అక్టోబర్ 11న బైక్పై వెళ్తుండగా ప్రమాదం జరిగి మోచేయి పై భాగంవరకు తెగి పడిపోయింది. తెగిన చేయిని ఓ కవర్లో చుట్టి అతడిని హుటాహుటిన మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అక్కడి డాక్టర్లు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి రిఫర్ చేశారు. పవన్కుమార్ను హైదరాబాద్కు తరలించే సమయానికి అప్పటికే గోల్డెన్ అవర్ కూడా దాటిపోయింది. అయినప్పటికీ 8 గంటల పాటు శ్రమించి క్లిష్టమైన మైక్రోవ్యాసు్కలర్ రీప్లాంటేషన్ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి చేయిని తిరిగి అతికించారు. సాధారణంగా వేలు కానీ, చిన్న అవయవం కానీ తెగిపడిపోతే సులువుగానే అతికించవచ్చని, పూర్తి చేయిని అతికించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు. శస్త్ర చికిత్స వివరాలను బుధవారం మీడియా సమావేశంలో అపోలో ఆస్పత్రి కన్సల్టెంట్ మైక్రో సర్జన్ డాక్టర్ జీఎన్ భండారి వెల్లడించారు. 26 రోజుల్లోనే పవన్ కోలుకున్నాడని తెలిపారు. అతికించిన చేయి వేళ్లు తిరిగి పనిచేసేందుకు ఆరు నెలల సమయం పడుతుందని, ఇందుకోసం మరికొన్ని శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. తెగిన వెంటనే జాగ్రత్త చేయాలి తెగిపోయిన శరీర భాగాలను అతికించే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భండారి అన్నారు. తెగిపోయిన శరీర భాగాలను నీటితో కడిగి, పాలిథీన్ కవర్ లేదా అల్యూమినియం కవర్లో ఉంచాలని తెలిపారు. ఆ కవర్ను ఐస్ప్యాక్లో పెట్టి తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. అయితే నేరుగా ఐస్లో ఉంచితే అవయవం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, అప్పుడు తిరిగి అతికించడం సాధ్యం కాదని వివరించారు. పుట్టుకతో లోపాలు, విరిగిపోయిన చేతులు, పక్షవాతం వంటి వ్యాధుల కారణంగా చేతులు, కాళ్లు పనిచేయకపోతే బ్రెయిన్ డెడ్ అయిన వారి భాగాలను అతికించే అవకాశం ఉందని తెలిపారు. మీడియా సమావేశంలో అపోలో హాస్పిటల్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ బాబు, శస్త్ర చికిత్సలో పాలుపంచుకున్న డాక్టర్ గురుప్రసాద్ (ప్లాస్టిక్ సర్జన్), డాక్టర్ వివేక్ రెడ్డి (ఆర్థోపెడిక్ సర్జన్), డాక్టర్ శరణ్య (అనస్తీషియా) తదితరులు పాల్గొన్నారు. -
రామ్ చరణ్ పెద్ద మనసు.. చిన్నారి ట్రీట్మెంట్ కోసం లక్షల్లో ఖర్చు
గ్లోబల్స్టార్ రామ్చరణ్ పెద్ద మనసు చాటుకున్నాడు. మెగాస్టార్కు వారసుడిగానే కాకుండా సాయంలోనూ చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. తన మంచి మనసుతో ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడి ప్రాణదాతగా నిలిచాడు. తమ కూతురు దక్కదని భావించిన ఆ తల్లిదండ్రులకు దేవుడిలా సాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.చిరంజీవి పుట్టినరోజు నాడే (ఆగష్టు 22) ఓ ఫోటో జర్నలిస్ట్ కుటుంబంలో చిన్నారి జన్మించింది. అయితే, పుట్టుకతోనే పల్మనరీ హైపర్టెన్షన్ (గుండె సంబంధిత) జబ్బుతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. పాప గుండెలో సమస్య ఉందని, బతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో చిన్నారిని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. లక్షల్లో ఖర్చయ్యే వైద్యం చేయించే స్థోమత ఆ తండ్రికి లేకపోవడంతో సతమతమవుతున్నారు. తీవ్రమైన ఆవేదనతో దిక్కుతోచనిస్థితిలో ఉన్న వారి విషయం రామ్ చరణ్ దృష్టికి వెళ్లడంతో 53 రోజులపాటు చికిత్సకు సాయమందించారు. ఆపై చిన్నారి చికిత్స కోసం రక్తం, ప్లేట్లెట్లు వంటివి చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుంచి సమకూర్చారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో చిన్నారి డిశ్చార్జ్ అయ్యింది. తమ కూతురు ఇక దక్కదని ఆందోళన చెందిన ఆ తల్లిందండ్రుల్లో రామ్చరణ్ సంతోషం నింపారు. -
అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మ
కాకినాడ క్రైం: ఆ యువకుడి అవయవ దానంతో ముగ్గురికి పునర్జన్మ లభించింది. పశి్చమగోదావరి జిల్లా తోకలపూడి గ్రామానికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి (19) స్వగ్రామం నుంచి విశాఖపటా్ననికి పరీక్ష రాసేందుకు ఈ నెల 21వ తేదీన బయలుదేరాడు. మార్గ మధ్యలో ఎర్రవరం హైవేపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించగా తగిన వైద్య సేవలు అందించినా తలకు తీవ్ర గాయం కావడంతో ఫలితం లేకపోయింది. బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో వైద్యులు డాక్టర్ ఎంవీ కిరణ్కుమార్, డాక్టర్ శివరామగాంధీ కుమారుడి పరిస్థితిని తండ్రి సుబ్రహ్మణ్యంకి వివరించి అవయవ దాన ప్రాధాన్యాన్ని వివరించారు. దీంతో సుబ్మహ్మణ్యం జీవన్దాన్ వెబ్సైట్లో తన కుమారుడి అవయవ దానానికి రిజిస్టర్ చేశారు. దీంతో రేవంత్ కిడ్నీని కాకినాడ అపోలో ఆసుపత్రికి, మరో కిడ్నీని విశాఖపట్టణం కేర్ ఆసుపత్రికి, కాలేయాన్ని షీలానగర్ అపోలో ఆసుపత్రికి తరలించి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. ఇందుకు కాకినాడ అపోలోలో ఆర్గాన్ హార్వెస్టింగ్ నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ సాయంతో సోమవారం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయవాలను సురక్షితంగా సకాలంలో తరలించారు. -
సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: వరద సహాయక చర్యల నిమిత్తం పలు సంస్థల నుంచి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నా యి. జీఎంఆర్ గ్రూప్ సంస్థల నుంచి రూ.2.5 కోట్లు విరాళంగా ప్రకటించారు. కెమిలాయిడ్స్ కంపెనీ చైర్మన్ రంగరాజు రూ.కోటి విరాళం ఇవ్వగా, శ్రీచైతన్య విద్యాసంస్థలు రూ.కోటి, విర్కో ఫార్మా రూ.కోటి, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీతారెడ్డి రూ.కోటి విరాళంగా అందజేసినట్లు శుక్రవారం సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్రెడ్డి వరద బాధితులకు తన వంతుగా నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ము ఖ్యమంత్రి ప్రత్యేక అధికారి (ఓఎస్డీ) వేముల శ్రీనివాసులును కలిసి రూ.1.85 లక్షల చెక్కు ను అందజేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వాణిజ్య సంఘాలు, కార్పొరేట్ సంస్థలు తమ వంతు విరాళాలు ఇచ్చి వరద బాధితుల పక్షాన నిలవాలని కోరారు. -
అపోలో కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్..70 మంది విద్యార్ధులకు అస్వస్థత?
చిత్తూరు జిల్లా అపోలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. కలుషిత ఆహారం తిన్న 70 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న యాజమాన్యం అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వా ఆస్పత్రికి తరలించింది. -
అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్గా మధు శశిధర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ ప్రెసిడెంట్, సీఈవోగా మధు శశిధర్ నియమితులయ్యారు. అపోలో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా 2023 అక్టోబర్లో ఆయన చేరారు. యూఎస్లోని క్లీవ్ల్యాండ్ క్లినిక్ సంస్థలో పలు హోదాల్లో పనిచేశారు. క్లీవ్ల్యాండ్ క్లినిక్ ట్రెడిషన్ హాస్పిటల్ ప్రెసిడెంట్గా విధులు నిర్వర్తించారు. ఇంటర్నల్ మెడిసిన్, పల్మనరీ, క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. -
అపోలో హాస్పిటల్స్ లాభం 60 శాతం అప్..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అధిక ఆదాయ ఊతంతో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ (కన్సాలిడేటెడ్) నికర లాభం 60 శాతం పెరిగి రూ. 245 కోట్లకు చేరింది. క్రితం క్యూ3లో సంస్థ లాభం రూ. 153 కోట్లు. ఇక సమీక్షాకాలంలో ఆదాయం రూ. 4,264 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ. 4,851 కోట్లకు చేరింది. షేరు ఒక్కింటికి రూ. 6 చొప్పున అపోలో హాస్పిటల్స్ మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ప్రివెంటివ్ హెల్త్కేర్, వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రజలకు సాధికారత కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 నాటికి అపోలో నెట్వర్క్ నిర్వహణలోని పడకల సంఖ్య 7,911కి చేరింది. ఆక్యుపెన్సీ 65 శాతానికి చేరింది. మూడో త్రైమాసికంలో ఫార్మసీకి సంబంధించి అపోలో హెల్త్ నికరంగా 119 కొత్త స్టోర్స్ ప్రారంభించడంతో మొత్తం స్టోర్స్ సంఖ్య 5,790కి చేరింది. గురువారం బీఎస్ఈలో కంపెనీ షేరు సుమారు 3 శాతం పెరిగి రూ. 6,432 వద్ద క్లోజయ్యింది. -
ఎమ్మెల్సీ చంద్రశేఖర్కి ప్రాణాపాయం లేదన్న వైద్యులు
-
యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్కు సర్జరీ
Updates.. కేసీఆర్ హెల్త్ బులెటిన్ మాజీ సీఎం కేసీఆర్కు ఎడమ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ శస్త్రచికిత్స నిర్వహించిన సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్లు, అనస్థీషియాలజిస్టుల బృందం విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ ► యశోద ఆస్పత్రి డాక్టర్ల ఆధ్వర్యంలో విజయవంతంగా ముగిసిన కేసీఆర్ తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స. ► మరికాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్న యశోద ఆస్పత్రి డాక్టర్లు ►యశోద ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్కు సర్జరీ ►కొద్దిసేపటి క్రితమే కేసీఆర్కు ప్రారంభమైన ఆపరేషన్ ►కేసీఆర్కు ఎడమ తుంటిలో ఫ్యాక్చర్ ►గత రాత్రి ఇంట్లో జారిపడ్డ కేసీఆర్ ►హుటాహుటిన రాత్రే ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు ► యశోద ఆసుపత్రి నాలుగో ఫ్లోర్లోని ఆపరేషన్ థియేటర్కు కేసీఆర్ను షిఫ్ట్ చేస్తున్న వైద్యులు ► కాసేపట్లో ఎడమ కాలు తుంటికి శస్త్ర చికిత్స అందించనున్న యశోద వైద్యులు ► కాసేపట్లో కేసీఆర్కు సర్జరీ ►యశోద ఆసుపత్రి నాలుగో అంతస్తులో ఆపరేషన్ ► మాజీ సీఎం కేసీఆర్ సేవలు భవిష్యత్తులో తెలంగాణకు అవసరం: మురళీధర్ రావు బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ ► ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం ► క్రియాశీలక రాజకీయాల్లోకి కేసీఆర్ ఆరోగ్యంగా వస్తారని ఆశిస్తున్నాం. యశోద ఆసుపత్రిలో హరీశ్ రావు కామెంట్స్ కేసీఆర్ గారికి యశోద ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. హిప్ రీప్లేస్మెంట్ చేయాలని వైద్యులు సూచించారు. ఈరోజు సాయంత్రం సర్జరీ జరుగుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉండటంతో డాక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేసీఆర్ అభిమానులు ఎవరూ ఆసుపత్రి వద్దకు రావద్దు. సాయంత్రం సర్జరీ జరిగిన తర్వాత డాక్టర్లు హెల్త్ బెలిటెన్ను విడుదల చేస్తారు. కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించిన కేటీఆర్ ►కేటీఆర్లో ట్విట్టర్లో..‘బాత్రూంలో పడిపోవడంతో కేసీఆర్ గారికి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని సందేశాలు పంపుతున్న వారందరికీ ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు. Sri KCR Garu needs to undergo a Hip Replacement Surgery today after he had a fall in his bathroom Thanks to all those who have been sending messages for his speedy recovery pic.twitter.com/PbLiucRUpi — KTR (@KTRBRS) December 8, 2023 మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా.. ►యశోదా ఆసుపత్రి దగ్గర భద్రతను పెంచిన ప్రభుత్వం ►కేసీఆర్కు మెరుగైన వైద్యం అందించాలని సూచించిన రేవంత్ ►మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ను విడుదల చేశారు. ఎడమ తుంటి మార్పిడి చేయాలని ప్రకటించిన వైద్యులు కేసీఆర్ కి సిటి స్కాన్ చేసి ఎడమ తుంటి విరిగినట్టు గుర్తించిన వైద్యులు సిటీ స్కాన్లతో సహా, హిప్ ఫ్రాక్చర్ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు. ఎడమ హిప్ రీప్లేస్మెంట్ అవసరమని సూచించిన వైద్యులు ఇలాంటి కేసుల్లో కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమది వారాల రెస్ట్ అవసరం ఆర్థోపెడిక్, అనస్థీషియా, జనరల్ మెడిసిన్, పెయిన్ మెడిసిన్తో సహా వైద్య బృందం అతన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సర్జరీ చేయనున్న వైద్యులు ►కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. Distressed to know that former Telangana CM Shri KCR Garu has suffered an injury. I pray for his speedy recovery and good health. — Narendra Modi (@narendramodi) December 8, 2023 ►మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శిని యశోద ఆసుపత్రికి పంపించారు సీఎం రేవంత్. ►తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయనకు చికిత్స కల్పించేందుకు హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ►గజ్వేల్ సమీపంలోని ఫామ్హౌస్లో శుక్రవారం తెల్లవారుజాము 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. బాత్రూమ్లో కాలుజారి పడిపోవడంతో ఆయన ఎడమ కాలి తుంటికి గాయాలైనట్లు తెలిసింది. తుంటికి రెండు చోట్ల గాయమైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో, తుంటి భాగంగాలో స్టీల్ ప్లేట్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ►కాగా, ప్రమాదంలో తుంటి బాల్ డ్యామేజీ అయినట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో, ఆయనను సోమాజిగూడలోని యశోదకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈరోజు సాయంత్రం మైనర్ సర్జరీ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక ట్రీట్మెంట్.. మొదటి హాస్పిటల్గా గుర్తింపు
అపోలో క్యాన్సర్ సెంటర్ సరికొత్త మైలురాయిని చేరుకుంది.దక్షిణాసియాలో మొట్టమొదటి సైబర్నైఫ్(CyberKnife® S7™ FIM) రోబోటిక్ రేడియో సర్జరీ సిస్టమ్ను అపోలో క్యాన్సర్ సెంటర్లో ప్రవేశపెట్టారు.సైబర్నైఫ్ సిస్టమ్ అనేది క్యాన్సర్, చికిత్స చేయలేని క్యాన్సర్ కణితులకు రేడియేషన్ థెరపీని అందించే నాన్-ఇన్వాసివ్ చికిత్స. ఇది మెదడు, ఊపిరితిత్తులు, వెన్నెముక, ప్రోస్టేట్ ,పొత్తికడుపు క్యాన్సర్లతో సహా శరీరం అంతటా క్యాన్సర్ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది. శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయంగా ఈ విధానం అందుబాటులో ఉంది. గతంలో రేడియేషన్తో చికిత్స పొందిన రోగులు, మెటాస్టాటిక్ గాయాలు పునరావృత క్యాన్సర్లు ఉన్నవారు కూడా సైబర్నైఫ్ చికిత్స తీసుకోవచ్చు. సైబర్నైఫ్ సిస్టమ్ అనేది రేడియేషన్ డెలివరీ పరికరాన్ని కలిగి ఉన్న ఏకైక రేడియేషన్ డెలివరీ సిస్టమ్. దీన్ని లీనియర్ యాక్సిలరేటర్ అని పిలుస్తారు, రేడియేషన్ థెరపీలో ఉపయోగించే హై-ఎనర్జీ X-కిరణాలు లేదా ఫోటాన్లను పంపిణీ చేయడానికి నేరుగా రోబోట్పై అమర్చబడుతుంది. ఇది వేలాది బీమ్ కోణాల నుంచి మోతాదులను అందించడానికి,శరీరంలో ఎక్కడైనా డెలివరీ ఖచ్చితత్వానికి కొత్త ప్రమాణాన్ని సెట్ చేయడానికి రోబోట్ను ఉపయోగిస్తారు. అపోలో క్యాన్సర్ సెంటర్లో గత 15 సంవత్సరాలుగా సైబర్నైఫ్ టెక్నాలజీని ఉపయోగించడంలో నైపుణ్యం కలిగిన నిపుణుల బృందం ఉంది. ఇప్పటివరకు, ఇక్కడ మూడు వేల క్యాన్సర్ కేసులను పర్యవేక్షించారు.ఇప్పుడు సైబర్నైఫ్ సిస్టమ్ను ప్రారంభించి క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన విధానాన్ని విప్లవాత్మకంగా ప్రారంభించి దక్షిణాసియాలో మొదటి సంస్థగా నిలిచింది.సైబర్నైఫ్లో సర్టిఫైడ్ ఫెలోషిప్ శిక్షణా కార్యక్రమాన్ని అందించినందుకు గానూ అపోలో క్యాన్సర్ సెంటర్ దేశంలోనే మొదటి సంస్టగా గుర్తింపు పొందింది. సీనియర్ కన్సల్టెంట్ – రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్ మహదేవ్ పోతరాజు మాట్లాడుతూ..సైబర్నైఫ్ చికిత్సలుసాధారణంగా 1-5 సెషన్లలో నిర్వహించబడతాయి. చికిత్స వ్యవధి సాధారణంగా 30-90నిమిషాల వరకు ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో అనస్థీషియా లేదా కోతలు అవసరం లేదు.చాలా మంది రోగులు చికిత్స సమయంలో రోజువారీ కార్యకలాపాలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది అని అన్నారు. -
900కుపైగా సినిమాల్లో నటన.. తొలి చిత్రానికే నంది అవార్డు
సాక్షి, హైదరాబాద్: కథానాయకుడిగా, సహాయ నటుడిగా, హాస్యనటుడిగా, కొన్ని చిత్రాల్లో ప్రతినాయకుడిగానూ నటించిన ‘ఆల్ రౌండర్’ చంద్రమోహన్ (82) ఇక లేరు. కొన్నాళ్లుగా ఆయన గుండె, కిడ్నీ సంబంధిత, మధుమేహం వ్యాధులతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 9.45కు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. తర్వాత ఆయన భౌతికకాయాన్నిఫిలింనగర్లోని స్వగృహానికి తీసుకెళ్లారు. అక్కడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు చంద్రమోహన్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రమోహన్కు భార్య జలంధర, కుమార్తెలు మధుర మీనాక్షి, మాధవి ఉన్నారు. జలంధర ప్రముఖ రచయిత్రికాగా.. మధుర మీనాక్షి సైకాలజిస్ట్గా అమెరికాలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో డాక్టర్గా పనిచేస్తున్నారు. అమెరికాలో ఉన్న మధుర మీనాక్షి వచ్చాక సోమవారం మధ్యాహ్నం చంద్రమోహన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన మేనల్లుడు, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. ‘రంగుల రాట్నం’తో మొదలై.. ఏపీలోని కృష్ణా జిల్లా పమిడిముక్కలలో మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు 1942 మే 23న జన్మించారు చంద్రమోహన్. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్రావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రఖ్యాత దర్శకుడు కె.విశ్వనాథ్ తమకు దగ్గరి బంధువు కావడంతో.. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చెన్నై వెళ్లారు. బీఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘రంగుల రాట్నం’(1966) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. హీరోగా సుమారు 175కుపైగా సినిమాలు చేశారు. మొత్తంగా తన 55 ఏళ్ల సినీ కెరీర్లో కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హాస్యనటుడిగా ఇలా దాదాపు 900కుపైగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. తనదైన నటనతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. విభిన్న పాత్రలతో.. ఎన్నో అవార్డులతో.. ‘సుఖదుఃఖాలు, కాలం మారింది, ఓ సీత కథ, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, పదహారేళ్ల వయసు, శంకరా భరణం’ వంటి క్లాసిక్ చిత్రాల్లో మెప్పించారు చంద్రమోహన్. ‘గంగ మంగ’, ‘లక్ష్మణ రేఖ’వంటి చిత్రాల్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘కోతలరాయుడు’ (2022) తెలుగులో చంద్రమోహన్ చివరి చిత్రం. తొలిచిత్రం ‘రంగుల రాట్నం’కు నంది అవార్డు అందుకున్నారు. 1987లో ‘చందమామ రావే’ సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు, సిరిసిరిమువ్వ’ సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. -
ఆనంద్ మహీంద్రాకే కంటతడి పెట్టిస్తోంది! వీడియో వైరల్
నిత్యజీవితంలో ప్రతి రోజూ మనసును తాకే సంఘనటనలు ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఇలాంటి సంఘటన దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా'ను సైతం కన్నీళ్లు పెట్టుకునే చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కార్తీక్ సింగ్ అనే ఒక చిన్నారి క్యాన్సర్ చికిత్స కోసం క్రమం తప్పకుండా ఆసుపత్రికి వస్తాడు, వచ్చిన ప్రతిసారి మహీంద్రా థార్ వీడియోలు చూడటం పట్ల, ఆ కారు గురించి మాట్లాడటం పట్ల ఎక్కువ ఆసక్తి కనపరిచేవాడు. అక్కడి వైద్యులతో తానూ పెద్దవాడైన తరువాత మహీంద్రా థార్ కొనుగోలు చేస్తానని చెప్పేవాడు. దీంతో ఆ చిన్నారి కోరికను నెరవేర్చారు. ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా స్వయంగా తన ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. నిజానికి ఈ వీడియోను అపోలో హాస్పిటల్స్ లక్నో షేర్ చేసింది. హాస్పిటల్ అధికారులు కార్తీక్కు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. దీని కోసం లక్నో సమీపంలోని డీలర్షిప్ను సందర్శించి అక్కడి సిబ్బందికి విషయాన్ని పూర్తిగా వివరించింది. డీలర్షిప్ కూడా వారికి సహాయం సంతోషించారు. కార్తీక్ తరువాత కీమో సెషన్ షెడ్యూల్ సమయానికి అతనిని పికప్ చేయడానికి మహీంద్రా థార్ అతని ఇంటికి వచ్చింది. అప్పటికే కారు క్యాబిన్ బెలూన్లతో నిండిపోయి ఉంది. ఇది చూసి కార్తిక్ ఎంతగానో సంతోషించాడు. నిజంగా హాస్పిటల్ సిబ్బంది తీసుకున్న చొరవ చాలా అభినందనీయం. ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత సంపన్న కుటుంబం.. ఒక షిప్ విలువే వేల కోట్లు! తమ కుమారుడిని సంతోషపెట్టేందుకు ఆసుపత్రి అధికారులు చేసిన ప్రయత్నాలకు తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ 'నాకు మాటలు రావడం లేదు, కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయంటూ' వెల్లడించాడు. మమ్మల్ని ఈ మంచి పనిలో భాగస్వామ్యం చేసినందుకు హాస్పిటల్ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తూ అభిఞ్ఞాదిస్తున్నారు. I’m speechless. Just tears in my eyes. Thank you @drsangitareddy Thank you Apollo Hospitals for an initiative with such humanity & for making us a part of it. और कार्तिक, मैं आपका सबसे बड़ा Fan हूं ! pic.twitter.com/d0Z1LETB9a — anand mahindra (@anandmahindra) September 23, 2023 -
అపోలో హాస్పిటల్స్ చేతికి ‘కోల్కతా’ ఆస్పత్రి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ తూర్పు రాష్ట్రాల్లో మరింతగా కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా కోల్కతాలో పాక్షికంగా నిర్మించిన ఓ ఆస్పత్రిని కొనుగోలు చేసింది. ఫ్యూచర్ ఆంకాలజీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి తమ అనుబంధ సంస్థ అపోలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ రూ. 102 కోట్లకు ఈ హాస్పిటల్ను కొనుగోలు చేసినట్లు సంస్థ వెల్లడించింది. కోల్కతా ప్రాంతంలో అపోలో హాస్పిటల్కు ఇది రెండో ఆస్పత్రి కాగా, తూర్పు ప్రాంతంలో అయిదోది. దీనితో కోల్కతా, భువనేశ్వర్, గువాహటివ్యాప్తంగా 1,800 పైచిలుకు పడకలతో అతిపెద్ద హెల్త్కేర్ ప్రొవైడర్గా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగలమని తెలిపింది. తూర్పు రాష్ట్రాల్లో వచ్చే 3 ఏళ్ల వ్యవధిలో పడకల సంఖ్యను మరో 700 మేరకు పెంచుకోనున్నామని, తద్వారా సదరు ప్రాంతంలో మొత్తం పడకల సంఖ్య 2,500కి చేరగలదని వివరించింది. తాజాగా కొనుగోలు చేసిన సోనార్పూర్లో ఆస్పత్రిని 325 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఇందులో తొలి దశ కింద 1.75 లక్షల చ. అ. విస్తీర్ణంలోని 225 పడకలు వచ్చే 12 నెలల్లో అందుబాటులోకి రాగలవని సంస్థ ఎండీ సునీతా రెడ్డి తెలిపారు. అధునాతన సాంకేతికతతో అత్యుత్తమ వైద్యసేవలు అందిస్తున్న అపోలో హాస్పిటల్స్ను రెండు దశాబ్దాలపైగా కోల్కతా, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఆదరిస్తున్నారని ఆమె చెప్పారు. -
గైనిక్ సర్జరీల్లోనూ రోబోలు
సాక్షి, హైదరాబాద్: వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రొబోటిక్ సర్జరీలు హైదరాబాద్లోనూ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. పేరొందిన దాదాపు ప్రతి ఆసుపత్రీ ఈ శస్త్రచికిత్సా విధానాన్ని ఉపయోగిస్తోంది. చికిత్సా వ్యయం ఎక్కువైనప్పటికీ ఎక్కువ మంది రోగులకు నప్పే అనేక ప్రయోజనాల వల్ల రానురానూ రొబోటిక్ సర్జరీల ఎంపిక కూడా పెరుగుతోంది. విభిన్న రకాల శస్త్రచికిత్సల్లో దోహదపడుతున్న రొబోటిక్ సర్జరీ గైనకాలజీ విభాగంలోనూ ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో గైనకాలజీ శస్త్రచికిత్సల్లో రోబోల వాడకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అపోలో ఆసుపత్రికి చెందిన కన్సెల్టెంట్ అబ్స్ట్రిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ అనురాధా పాండా మరిన్ని వివరాలు తెలియజేశారు. అవి ఏమిటంటే... మరింత కచ్చితత్వం... ‘‘గైనకాలజీలో రోబో అసిస్టెడ్ కీహోల్ సర్జరీని కొత్త ఆవిష్కరణగా చెప్పొచ్చు. సాధారణ లేపరోస్కోపిక్ సర్జరీలతో పోలిస్తే రోబో సాయంతో చేసే సర్జరీల్లో త్రీడీ విజన్ (త్రిమితీయ ఆకారం) ఎక్కువ కచ్చితత్వాన్ని అందిస్తుంది. శస్త్ర చికిత్సలకు ఉపయోగించే పరికరాలను 360 డిగ్రీల కోణంలో తిప్పడానికి వీలుండటం వల్ల శరీరంలో సంక్లిష్టమైన ప్రదేశాలను సైతం చేరుకోవచ్చు. ఈ శస్త్రచికిత్సా విధానంలో తక్కువ రక్త నష్టంతోపాటు నొప్పి, ఇన్ఫెక్షన్ ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. తద్వారా రోగులు ఆసుపత్రిలో ఉండాల్సిన వ్యవధి కూడా తగ్గుతుంది. ఈ శస్త్రచికిత్సల్లో సర్జన్ ఒక కంప్యూటర్ కన్సోల్ నుంచి పనిచేస్తారు. తన చేతి కదలికలతో రొబోటిక్ చేతులను కదిలిస్తూ ఆపరేషన్ నిర్వహిస్తారు. ‘‘క్లిష్టమైన హిస్టెరెక్టమీ (గర్భాశయం తొలగింపు) ఆపరేషన్లకు రోబో సాయాన్ని ఉపయోగించవచ్చు. ప్రత్యేకించి ఊబకాయంతో ఉన్న రోగి పొత్తికడుపుపై పలు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఈ విధానాన్ని ఉపయోగిస్తారు. కచ్చితత్వం, తక్కువ నొప్పితోపాటు చిన్న కోతల ద్వారానే శస్త్రచికిత్స చేయడానికి ఈ విధానం వీలు కల్పిస్తుంది’’అని డాక్టర్ అనురాధా పాండా వివరించారు. గైనిక్ రొబోటిక్ సర్జరీలతో ప్రయోజనాలు... మయోమెక్టమీ అనేది గర్భాశయ కండరాల గోడ (ఫైబ్రాయిడ్) నుంచి నిరపాయకరమైన కణుతులను తొలగించడానికి ఉపయోగించే ఒక ప్రక్రియ. రొబోటిక్ సర్జరీ ఫైబ్రాయిడ్ కుట్టు తొలగింపునకు కూడా వీలు కల్పిస్తుంది. ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం వెలుపల గర్భాశయ లైనింగ్ వంటి కణజాలాలు పెరిగే పరిస్థితి. ఈ కణజాలాలు హార్మోన్లకు ప్రతిస్పందిస్తాయి. పీరియడ్స్ సమయంలో రక్తస్రావం, నొప్పి ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ఒక సవాలు వంటిది. దీనికోసం పెల్విస్, పెల్విక్ సైడ్ వాల్స్లో లోతుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రోబో అసిస్టెడ్ ఎండోమెట్రియోసిస్ శస్త్రచికిత్స ద్వారా మరింత కచ్చితమైన రీతిలో అండాశయ తిత్తిని తొలగించడం సాధ్యపడుతుంది. పేగు, మూత్రాశయం, మూత్ర నాళానికి అతుక్కొని ఉండే డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఎండోమెట్రియోసిస్ వ్యాధి చికిత్సలోనూ రొబోటిక్ సర్జరీ తక్కువ సంక్లిష్టతతో కూడుకుంటున్నదని పలు అధ్యయనాలు తెలిపాయి. హిస్టెరెక్టమీ సర్జరీ తర్వాత కొందరిలో తలెత్తే వాల్ట్ ప్రోలాప్స్ అనే పరిస్థితిని సరిదిద్దడంలోనూ రొబోటిక్ సర్జరీ ఉపకరిస్తుంది. ఊబకాయ రోగుల్లో శస్త్రచికిత్సలకు లేపరోస్కోపీతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ వారి అనారోగ్యాన్ని, ఆసుపత్రిలో ఉండే వ్యవధిని తగ్గిస్తుంది. లేపరోస్కోపీతో పోల్చినప్పుడు రొబోటిక్ శస్త్రచికిత్స ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే భవిష్యత్తులో ఈ చికిత్సా విధానం వాడకం మరింత విస్తృతమైతే ఈ సర్జరీల ధరలు తగ్గే అవకాశం ఉంది. -
ఉపాసన తాతగారికి రూ.కోటి చెక్ అందించిన ‘జైలర్’ నిర్మాత
సూపర్ స్టార్ రజనీకాంత్ ఖాతాలో చాలా కాలం తర్వాత ‘జైలర్’తో ఓ హిట్ పడింది. అది ఆషామాషీ హిట్ కాదు.. ఇటీవల కాలంలో తమిళ్లో ఇలాంటి విజయం సాధించిన సినిమానే లేదు. ఆగస్ట్ 10న విడుదలైన ఈ చిత్రం.. నెల రోజులు పూర్తికాకముందే ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను రాబట్టి..సూపర్ స్టార్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన చిత్రమిది. వాస్తవానికి ఈ స్థాయి విజయాన్ని ఈ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కూడా ఊహించలేదు. ప్రిరిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువగా వసూళ్లు వచ్చాయట. అందుకే చిత్ర నిర్మాత కళానిధి మారన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. లాభాల్లోని కొంత భాగాన్ని హీరో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్కి పంచేశారు. అంతటితో ఆగకుండా ఖరీదైన కార్లను గిఫ్ట్గా అందించారు. జైలర్ విజయంలో కీలక పాత్ర వహించింది ఈ ముగ్గురే కాబట్టి..వారికి లాభాల్లోని కొంత మొత్తం ఇవ్వాల్సిందేనని నిర్మాత ఇలా చేశారట. కేవలం చిత్రబృందానికే కాకుండా లాభాల్లోని కొంత డబ్బును సామాజిక సేవ చేయడానికి ఉపయోగించాలని నిర్మాత కళానిధి మారన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా అపోలో హాస్పిటల్స్కు రూ.కోటి చెక్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ తరఫున నిర్మాత కళానిధి మారన్ భార్య కావేరి.. మంగళవారం అపోలో హాస్పిటల్స్ చైర్మన్, ఉపాసన కొణిదెల తాతయ్య డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డిని కలిసి కోటి రూపాయల చెక్ అందజేశారు. 100 మంది నిరుపేద పిల్లలకు గుండె శస్త్ర చికిత్సల కోసం ఆ డబ్బును అందించారట. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ సంస్థ ట్విటర్ ద్వారా తెలియజేసింది. సన్ పిక్చర్స్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాల్లో వచ్చిన లాభాలను ఇలాంటి మంచి పనులకు ఉపయోగించడం గొప్ప విషయమని కామెంట్ చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని హిట్ చిత్రాలను నిర్మించి, లాభాల్లో కొంత మొత్తాన్ని ఇలా సామాజిక సేవకు ఉపయోగించాలని కోరుకుంటున్నారు. On behalf of Sun Pictures, Mrs. Kavery Kalanithi handed over a cheque for Rs.1 Crore to Dr. Prathap Reddy, Chairman, Apollo Hospitals, towards heart surgery for 100 under privileged children. #Jailer #JailerSuccessCelebrations pic.twitter.com/o5mgDe1IWU — Sun Pictures (@sunpictures) September 5, 2023 -
మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత.. అపోలోకు తరలింపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ను విడుదల చేశారు. వివరాల ప్రకారం.. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో కుంటుంబ సభ్యులు వెంటనే ఆయనను బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాస్త అసౌకర్యం, నీరసం ఉందని కుమారస్వామి చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Health bulletin on HD Kumaraswamy | "Currently, he is hemodynamically stable, comfortable and coherent and has been kept under close observation," Apollo Specialty Hospital, Jayanagar pic.twitter.com/qMDI9wlyqz — ANI (@ANI) August 30, 2023 ఇక, చికిత్స అనంతరం అపోలో వైద్యులు మాట్లాడుతూ.. కుమార స్వామి తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కుమారస్వామికి చికిత్స జరుగుతోందని అపోలో హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. ఆయనకు అన్ని రకాల టెస్ట్లు నిర్వహించినట్లు తెలిపారు. చికిత్స చేస్తున్నామని.. ఆ చికిత్సకు కుమారస్వామి ఆరోగ్యం కూడా బాగానే సహకరిస్తోందని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తామని చెప్పిన డాక్టర్లు.. అది ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం పలువురు ప్రముఖులు బెంగళూరులోని అపోలో ఆస్పత్రికి చేరుకుని కుమారస్వామిని పరామర్శించారు. Former Karnataka Chief Minister HD Kumaraswamy admitted to Apollo Hospital in Bengaluru as he suffers a high temperature. A health bulletin released by the hospital says that the former CM is responding to treatment and is on the road to recovery. #HDKumaraswamy #Karnataka… pic.twitter.com/uDdhqa7x0c — NewsFirst Prime (@NewsFirstprime) August 30, 2023 గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయనకు ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజులనుంచి ఆయన పలు మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలార్ జిల్లా పర్యటకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. తీరికలేని పని వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవలే కుమార స్వామికి గుండె సంబంధిత ఆపరేషన్ కూడా జరిగింది. దీంతో కుటుంసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ రద్దు.. -
వారి కోసం ఉపాసన కీలక నిర్ణయం.. !
ఉపాసన కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెగా కోడలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేశారు. అయితే మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. తన బిడ్డ వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించింది. (ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!) అయితే సామాజిక ఉపాసన సేవలోనూ ఎప్పుడు ముందుంటుంది. తన సేవలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటోంది. అలానే ఒంటరి తల్లుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఓపీడీ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అపోలో చిల్డ్రన్స్ పేరిట జూబ్లీహిల్స్లోని ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో ఉపాసన చేస్తున్న సేవలను నెటిజన్స్ అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. 'హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో అపోలో చిల్డ్రన్స్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా.. ఒంటరి తల్లుల కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (OPD) సేవలను పరిచయం చేయడం గర్వకారణం. ప్రతి ఒక్కరూ 040 -23607777 నంబర్కు కాల్ చేసి మీ స్లాట్ను బుక్ చేసుకోండి. ఈ సేవలు ప్రతి ఆదివారం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు అందుబాటులో ఉంటాయి. సంతాన సాఫల్యతతో ఎదురయ్యే సవాళ్లను, ఒంటరి తల్లులను చూసి నేను తీవ్రంగా చలించిపోయా. ప్రత్యేక శిశువైద్యుల బృందం, అత్యాధునిక సాంకేతికతతో, అపోలో హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం వారి ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో మీ కుటుంబాలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రతి బిడ్డకు సమగ్ర సంరక్షణ అందే విధంగా పెంపొందించే వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉపాసన నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. (ఇది చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఈరోజు ఫోకస్ లో అపోలో హాస్పిటల్స్, స్పైస్ జెట్...!
-
తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నారి వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. గత నెల నామకరణం ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. ఇక కుమార్తెతో కలిసి టైమ్ స్పెండ్ చేస్తున్న ఈమె.. తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలానే ఒంటరి తల్లుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ప్రెగ్నెన్సీ జర్నీ 'ప్రతి తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ తల్లిదండ్రులు ఎంతో తల్లడిల్లిపోతారు. అదే బిడ్డ తిరిగి ఆరోగ్యంగా మారితే వాళ్ల సంతోషానికి అవధులుండవు. అలాంటి మధుర క్షణాలు.. పిల్లల పేరెంట్స్ కు అందిస్తున్న డాక్టర్స్ కు నా తరఫున ధన్యవాదాలు. నా ప్రెగ్నెన్సీ టైంలో చాలామంది నాకు సలహాలు ఇచ్చేవారు' (ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!) నాకు బాధేసింది 'నా వరకు పర్లేదు కానీ కొందరు మహిళలకు ఇలాంటి అండ దొరకదు. అది తెలిసి నేను చాలా బాధపడ్డాను. మరీ ముఖ్యంగా సింగిల్ మదర్స్ కు ఇలాంటి విషయాల్లో సపోర్ట్ ఉండదు. కాబట్టి వీకెండ్స్ లో నా ఆస్పత్రిలో ఒంటరి తల్లులకు ఉచితంగా ఓపీడీ చికిత్స అందించబోతున్నాం. ఇలాంటి ఓ ఎమోషనల్ జర్నీలో నా వంతు సహాయం అందించడానికి రెడీగా ఉన్నాను. ఇది చాలామందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా' అని ఉపాసన చెప్పుకొచ్చింది. క్లీంకార రాకతో రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 2012లో పెళ్లయింది. అయితే ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో అభిమానుల దగ్గర మిగతా వాళ్ల వరకు చాలా కామెంట్స్ చేశారు. వాటన్నింటికీ ఎండ్ కార్డ్ వేస్తూ గతేడాది డిసెంబరులో ఉపాసన ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. ఈ జూన్ లో పాపకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీతోపాటు ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. ప్రస్తుతం అందరూ పాపతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) (ఇదీ చదవండి: వరుస రీమేక్స్పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) -
గద్దర్ మరణం: మహాబోధి విద్యాలయంలో రేపు గద్దర్ అంత్యక్రియలు
Updates.. గద్దర్ మృతి పట్ల ఆయన భార్య విమల బోరున విలపించారు. ► రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంతిమయాత్ర కొనసాగనుంది. మహాబోధి విద్యాలయంలో రేపు గద్దర్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ► అల్వాల్లో గద్దర్ స్థాపించిన స్కూల్ గద్దర్ అంత్యక్రియలు. మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్ భార్య విమల సూచించారు. ► గద్దర్ మృతిపట్ల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు దిగ్భాంతి వ్యక్తం చేశారు. కాలికి గజ్జెకట్టి తెలంగాణ ఉద్యమంలో తన ఆట,పాటలతో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించారని కొనియాడారు. తన పాటలతో కోట్లాది మంది హృదయాలను ఉత్తేజపరిచిన గద్దర్ మరణం తెలంగాణకు తీరని లోటన్నారు. ► గద్దర్ మృతి బాధాకరం: ప్రియాంక గాంధీ. గద్దర్ మృతికి ప్రియాంక గాంధీ ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. ఆయన మృతి చాలా బాధాకరం అని ట్వీట్ చేశారు. Saddened to hear about the passing of Shri Gummadi Vittal Rao garu, the iconic poet and relentless activist. His unwavering dedication to social causes and the fight for Telangana's statehood was truly inspiring. Gaddar ji's powerful verses echoed the aspirations of millions,… pic.twitter.com/Zaq7Ev7zv6 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 6, 2023 ►ప్రజా యుద్ధనౌక అందించిన స్ఫూర్తి చరిత్ర మరవదని డైరెక్టర్ ఎన్. శంకర్ అన్నారు. గద్దర్ మృతికి దర్శకుడు ఎన్. శంకర్ సంతాపం తెలిపారు. ‘పల్లె పాట మీద ప్రేమ ప్రేమపెంచుకుని, జనం పాటను గుండెకు హత్తుకుని, పోరుపాటను ఎగిరే ఎర్రజెండా కు అద్దిన, ప్రజల గుండె గొంతుక ప్రజా యుద్ధనౌక అందించిన స్ఫూర్తి చరిత్ర మరవదు.. గద్దరన్న ఏ లోకంలో వున్నా.. అన్న పాట అన్ని కాలాల్లో వినిపిస్తూనే ఉంటుంది.. జోహార్ గద్దరన్న’ అని యన్. శంకర్ చెప్పారు. ► గద్దర్ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే, కేసీఆర్ సంతాపం తెలిపారు. గద్దర్ మరణం బాధాకరం. ప్రజాయుద్ధనౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్ నిలిచారు. తెలంగాణ గొప్ప ప్రజాకవిని కోల్పోయింది. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. తన జీవితాన్ని గద్దర్ ప్రజలకే అంకితం చేశారు. తన ఆటపాటలతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించారు. ► గద్దర్ పార్ధీవదేహం ఉన్న ఎల్బీ స్టేడియం వద్దకు హరగోపాల్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గద్దర్ జ్ఞాపకాలు మరిచిపోలేం. విప్లవ ఉద్యమానికి గద్దరే స్ఫూర్తి. బలహీనవర్గాల పీడిత ప్రజల కోసం పోరాడిన వ్యక్తి గద్దర్. ► గద్దర్ మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గద్దర్ మరణం చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. గద్దర్ తన గళంతో కోట్లాది మందిని ఉత్తేజపరిచారు. గద్దర్ మరణం తీరని లోటు. గద్దర్ లేని లోటు తీర్చలేనిది, పూడ్చలేనిది. తెలంగాణ ఉద్యమంలో మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చారు. ప్రజల్లో జానపదం ఉన్నంత కాలం గద్దర్ పేరు నిలిచిపోతుంది. ► అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. మెతుకు సీమ ముద్దు బిడ్డ నేలకొరిగారు. నమ్మిన సిద్దాంతం కోసం నాలుగు దశాబ్దాలు పోరాడారు. మా ఉమ్మడి మెదక్ జిల్లాకు తీరని లోటు. గద్దర్ పాటలు తెలంగాణ ప్రజలను చైతన్యం చేశాయి. ► గద్దర్ మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. ► ఎల్బీ స్టేడియానికి గద్దర్ పార్థివదేహం తరలింపు. ప్రజల సందర్శనార్థం గద్దర్ పార్థివదేహన్ని అక్కడికి తరలించారు. గేట్ నెంబర్-6 వద్ద పార్ధివదేహన్ని ఉంచారు. గద్ధర్ పార్థివదేహం వెంట విమలక్క, సీతక్క, రేవంత్ రెడ్డి, వీహెచ్ ఉన్నారు. ► కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. గద్దరన్న మృతి వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. ఉద్యమ నాయుకులు ఎక్కడి నుంచి వచ్చినా వారు ఏ పార్టీలో ఉన్నా ఆ భావం ఉంటుంది. ప్రజా సమస్యల పోరాడిన వ్యక్తి ఇలా కన్నుమూయడం చాలా బాధాకరం. గద్దరన్న భార్య కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఆమెకు ఇప్పుడు మనమందరం బాసటగా ఉండాలి. ► కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సంతాపం తెలిపారు. గద్దర్ మృతి చాలా బాధాకరం. ప్రజా గొంతుక మూగబోయింది. ► గద్దర్ మృతిపై నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ► గద్దర్ మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం. సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు, లక్షలాది ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం. వారి గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్న కి లాల్ సలాం ! 🙏🙏 సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటల తో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర… pic.twitter.com/a7GtDUFYeD — Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2023 ► గద్దర్ మృతిపై గవర్నర్ తమిళిసై సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ కవి, విప్లవ వీరుడు, ఉద్యమకారుడు గద్దర్ @గుమ్మడి విట్టల్ రావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతితో తెలంగాణ రాష్ట్రం తన అద్భుతమైన కవితా శైలితో, నాయకత్వ పటిమతో చెరగని ముద్ర వేసిన ఒక ప్రముఖ కవిని, ఉద్యమకారుడిని కోల్పోయిందని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ సమయంలో, ప్రజాయుద్ధనాయకుడిగా రాజకీయాలలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ చిరస్మరణీయం. మృతుల కుటుంబ సభ్యులకు, అనుచరులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ► మహారాష్ట్ర మాజీ గవర్నర్ సి.హెచ్ విద్యాసాగర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపైన మడమ తిప్పని పోరాటం చేసిన యోధుడు గద్దర్. కోట్లాది మందిని ఆకర్షించిన కంఠం మూగబోవడం మనస్తాపాన్ని కలిగించింది. సిద్ధాంత పరమైన వైరుద్యం ఉన్నప్పటికి ప్రజా సమస్యల కోసం వారు ఎంతో మంది నాయకులను కలవడం జరిగింది. గద్దర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ, వారు మనోధైర్యంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ► తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా యుద్ధ నౌకగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటుచేసుకున్న విప్లవ గాయకుడు గద్దర్ కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన గద్దర్.. తెలంగాణ ఉద్యమంలోనూ తన పాటతో, తన మాటతో.. సరికొత్త ఊపును తీసుకొచ్చారు. విశ్వవిద్యాలయాల వేదికగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన పడిన సమయంలో.. ‘పొడుస్తున్న పొద్దమీద నడుస్తున్న కాలమా!’ అన్న గద్దర్ పాట ఓ సంచలనం. తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో చాలా సందర్భాల్లో వేదిక పంచుకునే అవకాశం లభించింది. రాష్ట్ర సాధనకు సంబంధించిన ఎన్నో అంశాలను పరస్పరం పంచుకునే అవకాశం కూడా దొరికింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2012లో నేను చేపట్టిన ‘తెలంగాణ పోరుయాత్ర’ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో గద్దర్ నాతో కలిసి నడిచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ► గద్దర్ మృతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా.. తెలంగాణ ఉద్యమనేత గద్దర్ మరణ వార్త విని చాలా బాధపడ్డాను. తెలంగాణ ప్రజలపై ఆయనకున్న ప్రేమే అణగారిన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసేలా చేసింది. ఆయన వారసత్వం మనందరికీ స్ఫూర్తిదాయకంగా కొనసాగాలి అని కామెంట్స్ చేశారు. Saddened to hear about the demise of Shri Gummadi Vittal Rao, Telangana’s iconic poet, balladeer and fiery activist. His love for the people of Telangana drove him to fight tirelessly for the marginalised. May his legacy continue to inspire us all. pic.twitter.com/IlHcV6pObs — Rahul Gandhi (@RahulGandhi) August 6, 2023 ► అమీర్పేట్ ఆసుపత్రి నుంచి అల్వాల్లోని భూదేవీనగర్కు గద్దర్ పార్థీవదేహాన్ని తరలిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, కళాకారులు అపోలో ఆసుపత్రి వద్ద గుమ్మిగూడారు. ► అపోలో ఆసుపత్రికి చేరుకున్న టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న. ► గద్దర్ మృతిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. ఉద్యమ గళం మూగబోయింది. ప్రజా యుద్ధ నౌక కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర కీలకం. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. నా పోరాటానికి ఆయనే స్ఫూర్తి. ప్రజా సమస్యలపై గద్దర్ పోరాటం అజరామరం. తనదైన పాటలతో ఎంతో మందిని ఉత్తేజపరిచారు. అనేక పాటలతో ఆనాడు ఉద్యమానికి ఊపు తెచ్చారు. ఆయనకు నివాళులు. ► గద్దర్ మృతి నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వద్ద అరుణోదయ ఉద్యమకారణి విమలక్క కంటతడిపెట్టారు. అనంతరం విమలక్క మీడియాతో మాట్లాడుతూ.. కామ్రేడ్ గద్దరన్నకు రెండు రాష్ట్రాల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుండి వినమ్రంగా విప్లవ జోహార్లు. తాను బ్రతికనంత కాలం గద్దరన్న ప్రజల పాటగా నిలబడ్డాడు. గద్దరన్న ఒక లెజెండ్. ప్రజల పాట గద్దరన్న. ప్రజల ఆట, మాట గద్దరన్న. అమరుల కుటుంబాలకు గద్దరన్న అండగా నిలబడ్డారు. గద్దరన్నను ఇలా బెడ్ మీద చూస్తానని అనుకోలేదు. ఆయన కుటుంబాకు ప్రగాఢ సానుభూతి. జోహార్ గద్దరన్న అని అన్నారు. ► గద్దర్ మరణించడానికి గల కారణాలపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. గద్దర్ మృతికి గల ప్రధాన కారణాలను వెల్లడించారు. ప్రధానంగా ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలతోనే గద్దర్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. జూలై 20న తీవ్రమైన గుండెజబ్బుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు.. ఆగస్టు 3వ తేదీన బైపాస్ సర్జరీ చేశారు. అయినప్పటికీ ఆయనకు గతంలో ఉన్న ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో కోలుకోలేక మృతి చెందారని బులెటిన్లో వైద్యులు ప్రకటించారు. ► గద్దర్ మృతిపై నటుడు ఆర్. నారాయణ మూర్తి స్పందించారు. ‘ఒక అన్నమయ్య పుట్టారు.. దివంగతులయ్యారు ఒక రామదాసు పుట్టారు.. దివంగతులయ్యారు ఒక పాల్ రబ్సన్ పుట్టారు.. దివంగతులయ్యారు ఒక గద్దర్ పుట్టారు.. డివంగతులయ్యారు ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది’ అని అన్నారు. ► గద్దర్ మృతి నేపథ్యంలో విమలక్క, వీహెచ్ అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే, పలువురు రచయితలు, కళాకారులు కూడా అపోలోకు తరలివెళ్లారు. గద్దర్ లేరన్న వార్త తమను షాక్కు గురిచేసిందని రచయితలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం గద్దర్ కన్నుమూశారు. అయితే, గద్దర్ ఇటీవలే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలోనే గద్దర్ తుదిశ్వాస విడిచారు. ఇక, గద్దర్ మృతిపై పలువరు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. -
గద్దర్ మృతికి ప్రధాన కారణమిదే!
తెలంగాణ ప్రజల గొంతుక మూగబోయింది. ఇన్ని రోజులు తన పాటలతో ఊర్రూతలూగించిన ప్రజా గాయకుడు గద్దర్ ఇకలేరు. అనారోగ్యం కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆదివారం ఆగస్టు 6న అమీర్పేట్లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు విఠల్ రావు కాగా.. 1949 జూన్ 5న తూప్రాన్లో జన్మించారు. (ఇది చదవండి: ఒక శకం ముగిసింది.. గద్దర్ మరణంపై ఆర్ నారాయణమూర్తి దిగ్భ్రాంతి) అయితే రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో గుండె ఆపరేషన్ సక్సెస్ అయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. కానీ అంతలోనే ఆయన మృతిచెందడం విషాదకరంగా మారింది. ఆయన మరణించడానికి గల కారణాలపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. గద్దర్ మృతికి గల ప్రధాన కారణాలను వెల్లడించారు. ప్రధానంగా ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలతోనే గద్దర్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. జూలై 20న తీవ్రమైన గుండెజబ్బుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు.. ఆగస్టు 3వ తేదీన బైపాస్ సర్జరీ చేశారు. అయినప్పటికీ ఆయనకు గతంలో ఉన్న ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో కోలుకోలేక మృతి చెందారని బులెటిన్లో వైద్యులు ప్రకటించారు. (ఇది చదవండి: గద్దర్ మరణం.. కన్నీరు పెట్టిన విమలక్క) -
వస్తానని మాట ఇచ్చావు.. మరి ఇదేంటి గద్దర్ అన్నా!
ప్రజా పాట ఆగిపోయింది.. ప్రజా ‘యుద్ధనౌక’ అలసిపోయింది. ఇక సెలవు అంటూ దిగికేగింది. తెలంగాణ రాష్ట్రం సాధనలో కీలక పాత్ర పోషించిన గద్దర్ ఇక లేరు. ఈరోజు(ఆదివారం) ఆయన తుదిశ్వాస విడిచారు. అపోలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గుండె సంబంధిత అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన గద్దర్.. గత నెల 31 తేదీన ప్రజలకు ఒక లేఖ రాశారు. తాను త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలోకి వస్తానంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు అదే ప్రజల్ని తీవ్రంగా బాధిస్తోంది. తిరిగి వస్తావని మాట ఇచ్చావు కదా.. గద్దర్ అన్నా.. మరి ఇదేంటి అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇటీవల గద్దర్ రాసిన లేఖ ఇదే.. గుమ్మడి విఠల్ నాపేరు. గద్దర్ నాపాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయస్సు 25 సంవత్సరాలు. ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా "మా భూములు మాకే" నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను. నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది. ఈ గాయానికి చికిత్సకై అమీర్ పేట/ బేగంపేట లోని శ్యామకరణ్ రోడులో అపోలో స్పెక్ట్రా (Apollo Spectra) హాస్పిటల్ లో ఇటీవల చేరాను. జూలై ఇరువై నుండి నేటి వరకు అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుట పడుతున్నాను. విషాదం.. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత గుండె చికిత్స నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ డి. శేషగిరిరావు, డాక్టర్ వికాస్, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎన్. నర్సప్ప (అనిస్తీషియా), డాక్టర్ ప్రఫుల్ చంద్ర నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతున్నది. గతంలో నాకు డాక్టర్ జి. సూర్య ప్రకాశ్ గారు, బి. సోమరాజు గారు వైద్యం చేశారు. పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను. నా యోగ క్షేమాలు విచారించడానికి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అమీర్ పేట్, హైదరాబాద్ కు చెందిన కింది నెంబర్ : 8978480860 (ఫ్రంట్ ఆఫీస్) కు సందేశం పంపవల్సిందిగా విజ్ఞప్తి. ఇట్లు ప్రజా గాయకుడు మీ గద్దర్ 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Folk Singer Gaddar: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యం కారణంగా ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం గద్దర్ తుదిశ్వాస విడిచారు. కాగా, గద్దర్ చనిపోయినట్టు ఆయన కుమారుడు సూర్యం తెలిపారు. అయితే, గద్దర్ రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో గుండె ఆపరేషన్ సక్సెస్ అయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. ఇంతలోనే ఆయన మృతిచెందడం విషాదకరంగా మారింది. ► ఇక, తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. గద్దర్ 1949లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని తుప్రాన్లో జన్మించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్రావు. నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాలో విద్యాభ్యాసం చేశారు. హైదరాబాద్లో ఇంజినీరింగ్ చదివారు. గద్దర్కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ► 1969 ఉద్యమంలో కూడా గద్దర్ పాల్గొన్నారు. మా భూమి సినిమాలో వెండితెరపై గద్దర్ కనిపించారు. జననాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్ కూడా ఒకరు. 1971లో నర్సింగరావు ప్రోత్సాహంతో ఆపర రిక్షా అన్న పాటును గద్దర్ రాశారు. అనేక పాటు స్వరపరిచారు. ► ఉద్యమ సమయంలో వచ్చిన జైబోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దుమీద అనే పాట ఎందరినో ఉత్తేజపరిచింది. తన పాటతో గద్దర్ ఎంతో మందిని ఉత్తేజపరిచారు. ► 1975లో కెనరా బ్యాంకులో గద్దర్ ఉద్యోగం చేశారు. హన్మాజీపేట స్వగ్రామం. 1984లో కెనరా బ్యాంక్లో క్లర్క్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం.. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్ పోరాడారు. ► 1997 ఏప్రిల్ 6న గద్దర్పై హత్యాయత్నం జరిగింది. ఈ క్రమంలో నకిలీ ఎన్కౌంటర్లను గద్దర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ► ప్రజా సాహిత్య పురస్కారం కూడా గద్దర్ అందుకున్నారు. ఒరేయ్ రిక్షా సినిమాలో నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అనే పాటకు నంది అవార్డు వచ్చింది. ► గద్దర్ మృతి నేపథ్యంలో విమలక్క, వీహెచ్ అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. అలాగే, పలువురు రచయితలు, కళాకారులు కూడా అపోలోకు తరలివెళ్లారు. గద్దర్ లేరన్న వార్త తమను షాక్కు గురిచేసిందని రచయితలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► గద్దర్ మృతిపై సీఎల్పి నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ప్రజా గాయకుడు ప్రజా యుద్ధనౌక మూగబోయింది.. అన్నా.. 🫂🙏🏻😭#Gaddar pic.twitter.com/hBVSs6e9D9 — Bhatti Vikramarka Mallu (@BhattiCLP) August 6, 2023 -
ప్రజాగాయకుడు గద్దర్కు అస్వస్థత
హైదరాబాద్: ప్రముఖ కవి, ప్రజా గాయకుడు గద్దర్(74) అస్వస్థతకు లోనయ్యారు. చికిత్స కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆయన ఏ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరాన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ప్రజా శాంతి పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించిన ఆయన గత నెలలో కొత్త పార్టీ ప్రకటించారు. గద్దర్ ప్రజా పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టి.. ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఆ టైంలో తెలిపారాయన. -
ఎంత ఆనందించానో మాటల్లో చెప్పలేను.. వీడియో షేర్ చేసిన ఉపాసన
ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఏడాది జూన్లో ఉపాసన- రామ్ చరణ్ తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత మెగా ఇంట్లోకి వారసురాలు అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్తో పాటు మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే మెగా వారసురాలి బారసాల కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. తన మనవరాలి పేరును మెగాస్టార్ చిరంజీవి అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్-ఉప్సీల బిడ్డకు క్లీంకార అనే పేరును పెట్టినట్లు వెల్లడించారు. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?) అయితే ఉపాసన జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనకు పుట్టబోయే బిడ్డకోసం ముందుగానే గదిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. గది వాతావరణం ప్రకృతి ఒడిలో ఉన్న ఫీలింగ్ కలిగేలా గోడలను అందంగా తీర్చిదిద్దారు. దీని కోసం ప్రత్యేక డిజైనర్లు పనిచేశారు. ఆస్పత్రిలో ఉన్నా కూడా ఇంట్లో ఉన్నట్లు ఫీలయ్యేలా ఉపాసన గదిని తీర్చిదిద్దారు. పుట్టిన బేబీ చూడగానే బొమ్మలు, పక్షులు, చెట్లు కనిపించేలా కర్టన్స్ డిజైన్ చేయించారు. ఫారెస్ట్ను తలపించేలా డిజైనర్స్ దీనిని తయారు చేశారు. వాటిని తన బిడ్డకు గదిలో కనిపించేలా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: అలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం.. కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్) ఉపాసన ట్వీట్లో రాస్తూ..'అమ్రాబాద్ ఫారెస్ట్, వేద వైద్యం ద్వారా ప్రేరణ పొందిన ఈ సుందరమైన ప్రదేశాలలో నేను జన్మనివ్వడం. నా క్లీంకారను పెంచడం ఎంత ఆనందించానో మీకు చెప్పలేను. ధన్యవాదములు పవిత్రా రాజారామ్.' అంటూ పోస్ట్ చేసింది. Can’t tell u how much I enjoyed giving birth & raising my klin Kaara in these lovely spaces inspired by the Amrabad Forest & Vedic healing. Thank you Pavitra Rajaram 🤗 pic.twitter.com/Yaki3DWiNL — Upasana Konidela (@upasanakonidela) July 14, 2023 -
డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!
మెగా కుటుంబం, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మధుర క్షణాలు ఈ నెల 20న ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లయిన 11 ఏళ్లకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులయ్యారు. జూన్ 20న మంగళవారం మెగా కోడలు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భం కోసం మెగా ఫ్యామిలీతో ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ప్రత్యేకమైన సందర్భానికి జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్ వేదికైంది. (ఇది చదవండి: మెగాప్రిన్సెస్కు ఘనస్వాగతం, ఫోటో షేర్ చేసిన ఉపాసన) కాగా.. డెలివరీ కోసం ఒకరోజు ముందుగానే మెగా కుటుంబం అపోలో ఆస్పత్రికి చేరుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోనూ ఉపాసన తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ఆస్పత్రిలో వీల్ చైర్పై వెళ్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. 'అంతేకాకుండా ఐదు రోజుల క్రితం జరిగిన అత్యంత మధురమైన క్షణమిదే. మీ అందరికీ ప్రేమకు ధన్యవాదాలు.' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. వీడియోతో పాటు మై లిటిల్ ప్రిన్సెస్ రావడానికి ముందు అంటూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ఆదిపురుష్పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే..) Moments before the #MegaPrincess arrived ❤️ Love this emotion video of #UpasanaKonidela. We spot #RamCharan𓃵 at the end too! 😍🫶🏼pic.twitter.com/1FYOijRvtS — ᴠᴇɴᴋᴀ𝟽ᴋᴜᴍᴀʀᴍsᴅɪᴀɴ (@venkysayzzz) June 25, 2023 -
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్.. కూతురితో రామ్చరణ్, ఉపాసన (ఫొటోలు)
-
Live: రామ్ చరణ్, ఉపాసన ప్రెస్ మీట్
-
Ram Charan-Upasana: అపోలో ఆస్పత్రిలో మెగా ఫ్యామిలీ సందడి (ఫొటోలు)
-
మెగా వారసురాలు అంటూ.. వీడియోలు షేర్ చేస్తున్న ఫ్యాన్స్
ప్రముఖ నటుడు రామ్చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. నేడు (జూన్ 20)న పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చింది. దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్ అందుకు వేదిక అయింది. ఇప్పటికే అక్కడకు చిరంజీవి చేరుకున్నారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ కూడా సంబరాలు మొదలుబెట్టారు. చిరంజీవి మరోసారి తాత అయ్యారు. పెళ్లైన పదకొండు ఏళ్ల తర్వాత రామ్చరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులు అయ్యారు. ఇంకేముంది మెగా వారసురాలు వచ్చేసింది అంటూ.. ట్వీట్స్తో తమ ఆనందాన్ని సోషల్మీడియా ద్వారా ఫ్యాన్స్ పంచుకుంటున్నారు. కొణిదెల ఇంట మూడో తరం రావడంతో ఆ బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలని పలు దేవాలయాల్లో వారు పూజలు చేయడం ప్రారంభించారు. పండంటి బిడ్డ పుట్టడంతో రామ్ చరణ్ రెండు నెలలు షూటింగ్కు కూడా బ్రేక్ ఇచ్చేశాడు. తన కూతురితో ఆయన ఆనందంగా గడపనున్నారు. (ఇదీ చదవండి: మహేష్ బాబుతో గొడవలు.. థమన్ రియాక్షన్ ఇదే) కంగ్రాట్స్ అన్న వదిన అంటూ చిరంజీవి సినిమాకు సంబంధించిన ఒక వీడియోను అభిమానులు షేర్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా అపోలో ఆస్పత్రి వద్ద హార్ట్ సింబల్లో ఉండే బెలూన్స్ ఎగురవేశారు. ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: తమన్నా చేసిన పనితో ఆందోళనలో జైలర్ యూనిట్) Biggest Mega Festival of #MegaPrincess Kick starting 🥁🥁#RamCharanUpasanaBabyGirl@AlwaysRamCharan @upasanakonidela ✨️💕 pic.twitter.com/h7ZX5JXPTG — Trends RamCharan™ (@TweetRamCharan) June 20, 2023 మెగా వారసురాలు 👧❤️ Congratulations @AlwaysRamCharan & @upasanakonidela garu ❤️#RamCharanUpasanaBabyGirl pic.twitter.com/SpK2q0LZKJ — RC CELEBRATIONS™ (@RC_celebrations) June 20, 2023 Congratulations @AlwaysRamCharan & @upasanakonidela anna and Vadina ❤️... #MegaPrincess pic.twitter.com/qfKm3l6Ty4 — Thodagottina TELUGODU ⚡ (@jashwanthvamsi) June 20, 2023 -
తల్లిదండ్రులైన రామ్ చరణ్- ఉపాసన దంపతులు
ప్రముఖ నటుడు రామ్చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో నేడు వారి ఆనందం రెట్టింపు అయింది. ఈ విషాయాన్ని అధికారికంగా ప్రకటించారు. మంగళవారం (జూన్ 20)న మెగా ఇంట్లోకి స్టార్ బుజ్జాయి అడుగు పెట్టింది. మెగా కుటుంబంలో బుడి బుడి అడుగులకు అపోలో హాస్పిటల్ వేదిక అయింది. ఉపాసన, పుట్టిన పాపాయి ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఇప్పటికే రామ్ చరణ్, సురేఖ హాస్పిటల్కు చేరుకున్నారు. డెలీవరీ అయ్యేంత వరకు ఉపాసనతోనే చరణ్ ఉన్నారని తెలుస్తోంది . మొత్తంగా అయితే మెగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన చరణ్-ఉపాసనలకు వారు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగా ప్రిన్సెస్ పేరిట పూజలు, అర్చనలు చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షలు రవణం స్వామినాయుడు ఇప్పటికే పిలుపునిచ్చారు. (చదవండి: మనవరాలి జాతకం అద్భుతం.. చిరంజీవి) -
Video: డెలివరీ డేట్ ఫిక్స్...ఆసుపత్రికి ఉపాసన!
మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ తొలి బిడ్డను స్వాగతించేందుకు సిద్ధమయ్యారు. మరికొద్ది గంటల్లో చిరంజీవి ఇంట్లోకి కొత్త మెంబర్ అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఉపాసనకు జూన్ 20న డెలివరీ డేట్ ఇవ్వడంతో.. మంగళవారం పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. రేపు ఉదయం డెలివరీ నేపథ్యంలో ఇప్పటికే రామ్ చరణ్ దంపతులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో మెగా ఫ్యామిలీలోకి వారసుడు వస్తాడా? వారసురాలు వస్తుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా చరణ్- ఉపాసనలకు 2012లో వివాహమైన సంగతి తెలిసిందే. వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న వెల్లడించారు. ఉపాసన ప్రస్తుతం నిండు గర్భిణీ. అయినప్పటికీ ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటూ మెగా ఫ్యాన్స్ కోసం పలు విషయాలను షేర్ చేస్తున్నారు. అయితే దాదాపు పెళ్లైన పది సంవత్సరాలకు ఈ జంట ఓ బిడ్డకు జన్మనివ్వబోతుండటంతో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. ఇక ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘జూనియర్ చరణ్ కోసం ఎదురుచూస్తున్నాం. ‘అడ్వాన్స్ కంగ్రాట్స్’ అంటూ పలువురు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే బిడ్డ పుట్టబోయే ముందు తన పూర్తి సమయాన్ని ఉపాసనతో గడపాలని, అందుకోసం ఆగస్టు నెల వరకు షూటింగ్కు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఇక ఈ సినిమా అనంతరం చరణ్.. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో నటించనున్నారు. చదవండి: Janhvi Kapoor: జాన్వీకి కొత్త కష్టాలు.. ఓటీటీల వల్ల! The Mega couple reach the hospital as @upasanakonidela is expected to deliver the first child with @AlwaysRamCharan tomorrow 💕#RamCharan #Upasana #GlobalStarRamCharan #GameChanger pic.twitter.com/WhGrc8qA0u — SivaCherry (@sivacherry9) June 19, 2023 -
ఎంబీబీఎస్ పూర్తి అయ్యి 16 ఏళ్లట. ఇప్పటికీ అదే జీతమట!
కొందరి ఉద్యోగంలో ఉన్నతి ఉండక, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే! అన్నట్లుగా ఉంటుంది. ఏం చేద్దాం అన్న కలిసిరాదు. కనీసం ఏళ్లుగా చేస్తున్నాడు కదా అని యజమాన్యం కూడా జాలి చూపదు. ఆ ఉద్యోగి నా వల్ల కాదని రాజీనామ చేసేంత వరకు పరిస్థితి అంతే అన్నట్లు ఉంటుంది. అచ్చం అలాంటి పరిస్థితిని ఓ డాక్టర్ ఎదర్కొంటున్నాడు. వివరాల్లోకెళ్తే..హైదరాబాద్లోని అపోలా హాస్పటల్స్లో పనిచేస్తేన్న బిహార్కి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ అరకొర జీతాన్ని ఎంత పొదుపుగా వాడాలో నేర్చుకున్నాని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. తాను 2004లో ఎంబీబీఎస్ పూర్తి చేశానని, 16 ఏళ్ల నుంచి ఒకే జీతం అందుకున్నట్లు తెలిపాడు. ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటి నుంచి అంతే జీతం అని చెబుతున్నాడు. దీంతో తన కుటుంబసభ్యులు ఎవరూ కూడా చూసేందుకు రావడం కూడా మానేసిట్లు తెలిపాడు. అలాగే తన నాన్న పనిచేసే ప్రభుత్వ కార్యాలయం ఫ్యూన్ జీతం, కొడుకు జీతం ఒకటేనని అమ్మ బాధపడుతుంటుందని ఆవేదనగా చెప్పుకొచ్చాడు. తాను తమిళనాడులోని వెల్లూరులో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు వైద్యుడు సుధీర్ తెలిపారు. తాను అడ్మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఐదేళ్లు ఎంబీబీఎస్ పూర్తి అయ్యే వరకు కూడా తన ఖర్చులన్నీ తానే నిర్వహించుకున్నట్లు తెలిపాడు. ఆర్థిక స్తోమత లేని కారణంగా తన కుటుంబ సభ్యులెవరూ ఆ సమయంలో తనను చూసేందకు కూడా వచ్చేవారు కాదని చెప్పుకొచ్చారు. ఒక జూనియర్ డాక్టర్ తను జీవించడానికే ఇంతలా కష్టపడుతున్నప్పుడూ.. ఎలా సామాజిక సేవ చేయగలను అని పోస్ట్ పెట్డడంతో రిప్లైగా సదరు వైద్యుడు సుధీర్ తన గురించి వివరించాడు. ఈ విషయం నెట్టిట వైరల్ అవ్వడంతో నెటిజన్లు భారతదేశంలో వైద్యులకు తగిన జీతాలు లభించడం లేదని ఒకరు, పేషంట్ల దగ్గర నుంచి భారీగా వసూలు చేసే ఆస్పత్రి యాజమాన్యం వైద్యులకు మాత్రం తగిన జీతాల ఇవ్వదంటూ మండిపడుతూ ట్వీట్ చేశారు. Apollo Hospitals' doctor says his salary was Rs 9,000 10 years after completing MBBS #MedTwitter #equity #investments https://t.co/mI1FmfE6xp — Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) April 6, 2023 (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి) -
మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నా.. ఉపాసన ట్వీట్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఉపాసన తల్లి కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మెగా ఫ్యామిలీ. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతుండటంతో మెగా ఇంట సంతోషం నెలకొంది. ఇటీవలే స్నేహితులు ఆమెకు సీమంతం వేడుక కూడా నిర్వహించారు. ఆ ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియాతో పంచుకున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. తమకు పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది ఉపాసన. తన ప్రసవానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. అయితే ఇటీవల ఉపాసన డెలివరీ ఎక్కడనే విషయంపై నెటిజన్లు కొన్నిరోజులుగా ఉత్సాహం చూపిస్తున్నారు. విదేశాల్లో డెలివరీకి ప్లాన్ చేస్తున్నారంటూ రూమర్స్ సృష్టించారు. తాజాగా ట్వీట్తో వాటన్నింటికీ చెక్ పెట్టారు ఉపాసన. ఇండియాలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలిపారు. ఇటీవలే ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్’ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు రామ్చరణ్ అమెరికా వెళ్లారు. ప్రముఖ అమెరికన్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లోనూ ఆయన సందడి చేశారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు. ఆ సమయంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘ఉపాసన కొద్ది రోజులపాటు అమెరికాలో ఉంటుంది. అప్పుడు మీరు అందుబాటులో ఉండాలి’ అని అన్నారు. దీనికి ఆస్టన్ స్పందిస్తూ.. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడమంటే తనకు అదో గౌరవమని.. ఎక్కడ అందుబాటులో ఉండమన్నా సిద్ధం’’ అని తెలిపారు. దాంతో, ఉపాసన డెలివరీ అమెరికాలో జరగుతుందనే ప్రచారం సాగింది. తాజాగా ఉపాసన ట్విటర్లో రాస్తూ..' డాక్టర్ జెన్ ఆస్టన్ మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నా. దయచేసి ఇండియాలోని మా అపోలో ఆస్పత్రుల ఫ్యామిలీలో చేరండి. డాక్టర్ సుమనా మనోహర్, డాక్టర్ రూమా సిన్హాతో కలిసి మా బిడ్డ ప్రసవంలో భాగం కావాలని కోరుకుంటున్నా.' అంటూ ఆ వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ టేక్ కేర్ సిస్టర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు. కాగా.. 2012లో ఉపాసన- రామ్ చరణ్ వివాహం జరిగింది. ఉపాసన తాతయ్య, అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి కావడం విశేషం. అందుకే అపోలో ఆస్పత్రిలోనే బిడ్డను ప్రసవించనున్నట్లు ఉపాసన ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Dr Jen Ashton, ur too sweet. Waiting to meet you. Pls join our @HospitalsApollo family in India along with Dr Sumana Manohar & Dr Rooma Sinha to deliver our baby 🤗❤️ A big shout out to all the viewers of @ABCGMA3 & @AlwaysRamCharan ‘s fans & well wishers. U are much loved https://t.co/byeGqOllsK — Upasana Konidela (@upasanakonidela) February 25, 2023 -
బాండ్ల జారీ ద్వారా రూ.105 కోట్లు: అపోలో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో ఐసీఐసీఐ బ్యాంక్నకు నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా రూ.105 కోట్లు సమీకరించనున్నట్టు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైసెస్ బుధవారం తెలిపింది. ఒక్కొక్కటి రూ.10 లక్షల విలువైన 1,050 ఎన్సీడీలను జారీ చేసేందుకు డైరెక్టర్ల కమిటీ ఆమోదం తెలిపిందని కంపెనీ వెల్లడించింది. ఎన్ఎస్ఈ హోల్సేల్ డెట్ మార్కెట్లో వీటిని లిస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
అపోలో ఆస్పత్రి నుంచి వైఎస్ షర్మిల డిశ్చార్జ్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, షర్మిలకు 15 రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఆమరణ నిరాహార దీక్షకు వైఎస్ షర్మిల పూనుకోగా, శనివారం అర్ధరాత్రి పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి అపోలో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆదివారం అక్కడ చికిత్స పొందారు షర్మిల. దీక్ష కారణంగా లో బీపీ, బలహీనత ఉండటంతో వైఎస్ షర్మిలను అపోలో ఆస్పత్రిలో చేర్పించినట్లు నిన్నటి బులిటెన్లో వైద్యులు తెలిపారు. -
NIMS Director: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్కు..!
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యానికి గురైన నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.మనోహర్ పూర్తి అరోగ్యంతో తిరిగి వచ్చారు. సోమవారం ఆయన డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన గుండెపోటు రావడంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. అప్పటి వరకు నిమ్స్ డీన్ డాక్టర్ ఎస్.రామ్మూర్తికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 2వ తేదీతో ఆయన ఇంచార్జి డైరెక్టర్ గడువు ముగియడంతో మనోహర్ తిరిగి బాధ్యతలను చేపట్టారు. వివాద రహితుడిగా ముద్రపడిన మనోహర్ తాజాగా వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ వైద్య ప్రమాణాలను సొంతం చేసుకున్న నిమ్స్కు డైరెక్టర్ మాత్రం తనకు అనారోగ్యం వస్తే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ వ్యవహారాన్ని నిమ్స్ ఉద్యోగ వర్గాలు సహా రాజకీయపక్షాలు సైతం తీవ్రంగా పరిగణించాయి. ఎమర్జెన్సీ సమయంలో ఇంటికి సమీపంలో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందడం తప్పుకాదని.. అయితే కోలుకున్న తర్వాత కూడా అదే ఆస్పత్రిలో వైద్యసేవలు పొందడం మాత్రం కచ్చితంగా నిమ్స్ ఆస్పత్రిని అవమానించడమేనంటూ మండిపడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మనోహర్ స్థానంలో కొత్త డైరెక్టర్ని నియమించేందుకు సమాలోచనలు చేసింది. ఒక దశలో అర్హులైన వారి ఎంపికకు సెర్చ్ కమిటీని వేసేందుకు సైతం ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అయితే అధికారికంగా మనోహర్ తన పదవి నుంచి వైదొలగకపోవడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మనోహర్ మళ్లీ బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చదవండి: (Hyderabad Doctor: పెళ్లికి ముందే మరొక యువతితో సంబంధం.. అయితే..) -
బంజారాహిల్స్లో కారు బీభత్సం.. నడిరోడ్డుపై పల్టీ కొట్టి..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్లో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పక్కనే ఉన్న దేవాలయాన్ని కారుతో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో యువకుడికి గాయాలుగా ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్-12లో ఆదివారం ఉదయం ఓ యువకుడు హల్చల్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ హై స్పీడ్లో కారుతో దేవాలయాన్ని ఢీకొట్టాడు. దీంతో, కారు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. కాగా, ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు అతడిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
నిమ్స్ డైరెక్టర్కు అపోలోలో చికిత్స.. ప్రభుత్వ ఆసుపత్రులపై చిన్నచూపు?
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) డైరెక్టర్ మనోహర్ రెండు రోజుల క్రితం గుండెపోటుతో హైదర్గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరడం వివాదాస్పదంగా మారింది. ప్రతిష్టాత్మక ఆసుపత్రికి డైరెక్టర్గా ఉన్న మనోహర్... తమ దవాఖానాను కాదని ప్రైవేటులో చికిత్స పొందుతుండడం చర్చనీయాంశంగా మారింది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి ప్రతిష్టను మసకబార్చే చర్యగా నిమ్స్ ఉద్యోగులతో పాటు వైద్యరంగంలోని వారు కూడా దీన్ని తప్పుబడుతున్నారు. సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎవరు ఏ ఆసుపత్రిలోనైనా.. మరెక్కడైనా చికిత్స పొందవచ్చు. అయితే సాక్షాత్తూ ఒక ఆసుపత్రికి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న వ్యక్తే ఆ ఆసుపత్రిని కాదని మరో చోట వైద్యసేవలు పొందడం సామాన్య ప్రజలకు అది ఎలాంటి సందేశం ఇస్తుంది? అంటూ పలువురు నిమ్స్ డైరెక్టర్ చికిత్స ఉదంతాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఉదంతాలు ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ నిమ్స్కు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడం చర్చకు దారి తీసింది. అయితే ఈ దఫా ఏకంగా డైరెక్టరే నిమ్స్ను కాదని నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించడం మరింత వివాదంగా మారింది. వ్యక్తిగత, కుటుంబ వైద్యుడు అపోలోలో పనిచేస్తుండడం వల్లనే అక్కడ చికిత్సకు వెళ్లినట్టుగా డైరెక్టర్ సన్నిహితులు చెబుతున్నారు. అయితే గతంలో ఇలాంటి సందర్భాల్లో సదరు వ్యక్తిగత వైద్యులే నిమ్స్కు వచ్చి ట్రీట్మెంట్స్ ఇచ్చిన దాఖాలాలున్నాయని మరికొందరు అంటున్నారు. నిజానికి నిమ్స్ కార్డియాలజీ విభాగానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది. ఎక్కడెక్కడి నుంచో రోగులు నిమ్స్కు వచ్చి చికిత్స తీసుకుని కోలుకుని వెళుతుంటారు. చదవండి: హైదరాబాద్లో రాగల 24 గంటల్లో భారీ వర్షం ఈ పరిస్థితుల్లో సాక్షాత్తూ నిమ్స్ డైరెక్టర్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరడం ఆసుపత్రి పేరు ప్రతిష్టలకు నష్టం కలుగజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారిన ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో బుధవారం రోజంతా చర్చోపచర్చలు నడిచాయి. ఎక్కువ మంది డైరెక్టర్ చేరికను తప్పుపట్టగా కొందరు సమర్థిస్తూ కూడా మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల పిల్లలు చదవకపోవడం లాంటి పోలికల దగ్గర్నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు సైతం ప్రైవేటు ఆసుపత్రుల్నే ఆశ్రయిస్తుండడం దాకా ఈ చర్చల్లో భాగమయ్యాయి. ఏదేమైనా ఈ తరహా ఉదంతాలు పునరావృతం కాకుంటే మేలని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై, ఉన్నతాధికారులపై ఉందని, వారు వ్యక్తిగత చికిత్సల కోసం ప్రభుత్వాసుపత్రులను ఎంచుకోవడం ద్వారా ప్రజలకు స్ఫూర్తిని అందించాలని అందరూ కోరుకుంటున్నారు. -
‘నిమ్స్ డైరెక్టర్కు అపోలోలో చికిత్సా?’
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్కు ఛాతీ నొప్పి రావడంతో అపోలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారన్న వార్త వినడానికే విచిత్రంగా ఉందని ఏఐసీసీ సభ్యుడు కొనగాల మహేశ్ అభిప్రాయపడ్డారు.తెలంగాణ నలుమూలల నుంచి పేద, మధ్యతరగతి వర్గాల ఆరోగ్య ఆశాజ్యోతి అయిన నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ ఆ ఆస్పత్రిని కాదని ప్రైవేటు ఆస్పత్రిలో చేరడం నిమ్స్లో పనిచేసే డాక్టర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. అక్కడ పనిచేసే టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని కూడా అవమానపరచినట్లేనని బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ హోదాలో నిమ్స్ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం పెంచాల్సింది పోయి ఆయనే కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లడాన్ని బట్టి నిమ్స్లో మౌలిక సౌకర్యాలు లేవని అర్థమవుతోందని విమర్శించారు. చదవండి: ఈటలపై సస్పెన్షన్ వేటు? -
వందల కోట్ల కొనుగోలు, అపోలో చేతికి నయతి హెల్త్కేర్ ఆస్పత్రి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ (ఏహెచ్ఈఎల్) ఉత్తరాదిలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా నయతి హెల్త్కేర్ అండ్ రీసెర్చ్ ఎన్సీఆర్కి గురుగ్రామ్లో ఉన్న ఆస్పత్రి అసెట్ను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 450 కోట్లు. 5.3 ఎకరాల్లోని ఈ కాంప్లెక్స్ను 650 పడకల వరకూ విస్తరించే అవకాశం ఉంటుందని ఏహెచ్ఈఎల్ తెలిపింది. దీన్ని 24 నెలల్లో సమగ్ర హెల్త్కేర్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేయనున్నట్లు అపోలో హాస్పి టల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. -
అపోలో, బసవతారకంలో ఉచిత వైద్యం అందించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని అపోలో, బసవతారకం కేన్సర్ ఆస్పత్రులు.. ఉచిత ఇన్ పేషంట్, ఔట్ పేషంట్ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది. దీనిపై డీఎంహెచ్ఓ పర్యవేక్షణ ఉంటుందని వివరించింది. ఈ మేరకు తాజా జీవో ప్రతిని మంగళవారం తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది. రాష్ట్ర సర్కార్ నుంచి తక్కువ ధరలకు భూమి తీసుకున్న టైంలో.. జరిగిన ఎంవోయూల మేరకు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం అందజేయాలని, కనీసం కరోనా కష్టకాలంలోనైనా దీన్ని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓమిమ్ మానెక్షా డెబారా, తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ‘ఎంఓయూల ప్రకారం రెండు ఆస్పత్రులు పేదలకు ఉచితంగా పడకలను కేటాయించి వైద్యం చేయకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. జరిమానా విధింపు అవకాశం కూడా ఉంది. అపోలోకు భూమి ఇచ్చినప్పుడు 15% బెడ్స్ పేదలకు ఉచిత కేటాయించేలా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు 1981లో జీవో 517 జారీ అయ్యింది. ఇక బసవతారకం ఆస్పత్రికి 7.35 ఎకరాలను 1989లో ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేలకు లీజుకు ఇచ్చినందుకు గాను 25% పడకలు, రోజూ 40% ఔట్పేషంట్లకు ఉచిత వైద్యం చేసేలా 1989లో జీవో 437 జారీ అయ్యింది. ఇవి అమలు చేసే విధానాన్ని వివరిస్తూ ఈ నెల 16న రాష్ట్ర సర్కార్ మరో జీవో 80 జారీ చేసింది’అని ఏజీ వివరించారు. అనంతరం విచారణను ఆగస్టు 8న వాయిదా వేసింది. జీవో 80లోని ముఖ్యాంశాలు ♦ అపోలో, నందమూరి బసవతారకం మెమోరియల్ కేన్సర్ ఆస్పత్రులు వరుసగా 15%, 25% పడకలను పేదల కోసం కేటాయించాలి. ♦ ఇది దాతృత్వం కాదు.. ఇది వారి కర్తవ్యం. ♦ ఎందుకంటే హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన భూములను ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ఈ ఆస్పత్రుల ఏర్పాటు కోసం తక్కువ ధరకు ఇచ్చింది. ♦ ప్రధాన మంత్రి జీవన్ ఆరోగ్య యోజన, ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించాలి. ♦ బసవతారకం ఆస్పత్రి 40% పేదలకు తప్పకుండా ఓపీ సేవలు ఉచితంగా అందించాలి. ♦ ఇవన్నీ సరిగా అమలవుతున్నాయా.. లేదా.. అన్నది డీఎంహెచ్ఓ అప్పుడప్పుడు పరిశీలించి ధ్రువీకరించాలి. ♦ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆహార భద్రత కార్డుదారులు ఉచిత ఓపీకి అర్హులు. ఇదీ చదవండి: ఇక అరచేతిలో ఆర్టీసీ బస్సు -
డైరెక్టర్ మణిరత్నంకు కరోనా.. ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం కరోనా బారిన పడ్డారు. స్వల్ప అస్వస్థత కారణంగా పరీక్షలు చేయించుకున్న ఆయనకు కోవిడ్ పాజిటివ్గా తేలినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యానికి సంబంధించి విషయాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే మరణిరత్నం ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య, నటి సుహాసిని ప్రకటన ఇవ్వనున్నట్లు తమిళ మీడియా పేర్కొంది. ప్రస్తుతం మరణిత్నం పొన్నియన్ సెల్వన్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: నటి కల్యాణితో విడాకులు.. కారణమేంటో చెప్పిన డైరెక్టర్ ఈ మూవీ షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జూలై 8న పొన్నియన్ సెల్వన్ టీజర్ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకినట్లుగా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆయన చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బలిటెన్ రావాల్సి ఉంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే.. -
దగ్గుబాటికి గుండెపోటు
సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళ వారం గుండెపోటుకు గురయ్యారు. హుటా హుటిన ఆయనను జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసి 2 స్టెంట్లు వేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న దగ్గుబాటిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించారు. -
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఆయన స్వగ్రామం శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా బొజ్జల పనిచేశారు. చదవండి: ఉత్తరాంధ్రపై మరోసారి అక్కసు వెల్లగక్కిన చంద్రబాబు 1994-99లో రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014లో చంద్రబాబు క్యాబినెట్లో అటవీ శాఖ మంత్రిగా బొజ్జల పని చేశారు. 2004-09లో కాంగ్రెస్ నేత ఎస్సివి నాయుడు చేతిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్రెడ్డి శ్రీ కాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
వాస్క్యులర్ వ్యాధులు–శస్త్ర చికిత్సలు..
శారీరకంగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలంటే, మంచి వాస్క్యులర్ (నాడీ వ్యవస్థ) ఆరోగ్యాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం అంటున్నారు అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్కు చెందిన వాస్క్యులర్ –ఎండోవాస్క్యులర్ సర్జన్, డా. సి. చంద్ర శేఖర్. ఈ వ్యాధుల వివరాలు అందించే చికిత్సల విషయాలను ఆయన ఇలా తెలియజేస్తున్నారు.. రక్త సరఫరాపై ప్రభావం... రక్తనాళాలు కణజాలాల నుండి వ్యర్థాలను తొలగిస్తాయి శరీరమంతటికీ ఆక్సిజన్, పోషకాలను తీసుకువెళతాయి. అయితే వాస్క్యులర్ వ్యాధులు సాధారణంగా ఈ రక్త నాళాలను ప్రభావితం చేస్తాయి, ఈ ఫలకం (కొవ్వు, కొలెస్ట్రాల్తో తయారైనది) సిరలు లేదా ధమనుల లోపల రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది . రక్త నాళాలకు ఏదైనా నష్టం జరిగి రక్తం ప్రవహించకుండా నిరోధించడం వలన ప్రాణాంతక అంతర్గత రక్తస్రావం లేదా స్ట్రోక్ వంటి వివిధ సమస్యలు కలుగుతాయి. శస్త్రచికిత్సలతో... చిన్నపాటి వాస్కులర్ వ్యాధులను జీవనశైలి మార్పుల ద్వారా సరిచేయవచ్చు, అయితే కొంతమందికి మందులు లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు. వాస్కులర్ వ్యాధుల చికిత్సకు అందుబాటులో ఉన్న వాస్కులర్ సర్జరీలు... ► యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ అనే ప్రక్రియలో కాథెటర్–గైడెడ్ బెలూన్ని ఉపయోగించి ఇరుకైన ధమనిని తెరుస్తారు. ఈ విధానం కనిష్ట ఇన్వాసివ్ ప్రక్రియ. ► అథెరెక్టమీ: ఇది రక్తనాళాల నుండి ఫలకాన్ని కత్తిరించడానికి, తొలగించడానికి అనుమతించే ఒక ప్రత్యేకమైన కాథెటర్ను నిరోధించబడిన ధమనిలోకి చొప్పించే మరొక అతితక్కువ ఇన్వాసివ్ ప్రక్రియ, ► ఆర్టెరియోవెనస్ ఫిస్టులా: ముంజేయిలోని సిర నేరుగా ధమనికి అనుసంధానించి, సిరను బలంగా వెడల్పుగా చేస్తుంది ► ఆర్టెరియోవెనస్ గ్రాఫ్ట్: ఈ రకమైన శస్త్రచికిత్సలో సింథటిక్ ట్యూబ్ ద్వారా ధమనిని సిరకు కనెక్ట్ చేయడం జరుగుతుంది. ► ఓపెన్ అబ్డామినల్ సర్జరీ: ఈ శస్త్రచికిత్సలో పొత్తికడుపు గుండా వెళ్ళే ప్రదేశంలో చిన్న కోత ఉంటుంది. సమస్య ఉన్న ప్రాంతం చుట్టూ రక్త ప్రవాహాన్ని మళ్లించడానికి దీన్ని చేస్తారు. ► థ్రోంబెక్టమీ: ఈ ప్రక్రియలో సిర లేదా ధమని నుంచి రక్తం గడ్డకట్టడం తొలగించబడుతుంది. సరైన రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడంలో ఈ ప్రక్రియ సహాయపడుతుంది. దీనికి బదులుగా ఒక్కోసారి యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ కూడా చేయవచ్చు. ► వాస్కులర్ బైపాస్ సర్జరీ: బైపాస్ గ్రాఫ్టింగ్ అనేది దెబ్బతిన్న నాళాన్ని దాటవేసే రక్త ప్రవాహానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది. వెర్టెబ్రోబాసిలర్ వ్యాధి, పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి, మూత్రపిండ వాస్కులర్ వ్యాధి, మెసెంటెరిక్ వాస్కులర్ వ్యాధి ఉన్న రోగులకు దీన్ని చేస్తారు. ఓపెన్ కరోటిడ్ , ఫెమోరల్ ఎండార్టెరెక్టమీ: ఈ ప్రక్రియలో కాళ్లు లేదా మెదడులకు రక్తాన్ని అందించే ధమనుల లోపలి పొరలో ఉన్న ఫలకాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం జరుగుతుంది. ► ఈ శస్త్రచికిత్సలు రోగి జీవితాన్ని మెరుగుపరుస్తాయి, రోగుల శారీరక పరిస్థితిని బట్టి శస్త్ర చికిత్స అనంతరం కోలుకోవడానికి 1–2 వారాలు అవసరం కావచ్చు –డా. సి. చంద్ర శేఖర్,వాస్కులర్ – ఎండోవాస్కులర్ సర్జన్, అపోలో స్పెక్ట్రా ఆసుపత్రి -
మెగా కోడలు ఉపాసనకు ప్రతిష్టాత్మక అవార్డు
మెగా కోడలు, అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ ఉపాసన కొణిదెల ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఆమె చేసే సేవా, సామాజీక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవనక్కర్లేదు. అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ ద్వారా ఆమె నిత్యం హ్యుమన్ లైఫ్, వైల్డ్ లైఫ్ కోసం ఆమె నిత్యం కృషి చేస్తుంటారు. ఈ క్రమంలో ఆమెకు ప్రతిష్టత్మక అవార్డు నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డు వరించింది. గ్రామీణా ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపు 2022 ఏడాదికి గానుఈ పురస్కారాన్ని ఉపాసన అందుకున్నారు. చదవండి: తెలుగు సినిమాల్లో అసలు నటించను: బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్ ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ..ఓ గొప్ప కార్యక్రమంలో తమల్ని భాగం చేసిన తాతయ్య, అపోలో ఆస్పత్రుల ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే ఈ అవార్డ్ ఘనత దక్కుతుందని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వైద్య సేవలను మెరుగుపర్చాలనే ఆయన లక్ష్యమే తనకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటుండగా..సతీమణి ఉపాసన తన కెరీర్లో భర్త గర్వించే పురస్కారాలు అందుకోవడం విశేషం. చదవండి: నేను కూడా ఈ వ్యాధితో బాధపడ్డాను, మానసికంగా కుంగిపోయా: హీరోయిన్ -
మంత్రి గౌతమ్ రెడ్డి మరణం.. ఆసుపత్రి వద్ద దృశ్యాలు
-
అపోలో ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ప్రతాప్ సి. రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. 'వైద్యరంగంలో ఆధునిక భారత ఆరోగ్య సంరక్షణ రూపశిల్పిగా పరిగణించబడుతున్న ప్రతాప్ సి. రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ ఆయన సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నట్లు' పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ శనివారం ట్వీట్ చేశారు. Warm greetings on the 91st birthday to Sri Pratap C Reddy Garu, Founder-Chairman of Apollo hospitals, a revered fatherly figure in the medical fraternity and widely regarded as an architect of modern Indian healthcare. May God bless him with a happy and healthy life ahead. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 5, 2022 చదవండి: (Anantapur: అనంత గర్భం.. అరుదైన ఖనిజం) -
నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో.. అపోలో హాస్పిటల్స్కి గోల్డెన్ ఛాన్స్ !
Apollo Hospitals may replace Indian Oil: హెల్త్ సెక్టార్లో దశాబ్ధాల అనుభవం కలిగిన అపోలో హాస్పిటల్స్కి వైద్యపరంగా ఎన్నో మైళ్లు రాళ్లు అధిగమించింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో సైతం మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో లిస్టయిన కంపెనీలను స్మాల్క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ కంపెనీలుగా పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో లార్జ్ క్యాప్ కంపెనీల్లో టాప్ 50 కంపెనీల షేర్ల విలువ, బదలాయింపు, ట్రేడింగ్లు ఎంతో కీలకం. నిత్యం వార్తల్లో మార్కెట్ హెచ్చు తగ్గులకు సంబంధించి వచ్చే వార్తలు కూడా ఈ టాప్ 50 కంపెనీలకు సంబంధించినవే ఉంటాయి. ఎన్ఎస్ఈ టాప్ 50 లిస్టులో చోటు సాధించడం ఆశామాషీ వ్యవహారం కాదు. ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఈ ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఉంది. ఎడిల్వైజ్ ఆల్టర్రేటివ్ రీసెర్చ్ అందిస్తున్న వివరాల ప్రకారం ప్రతీ ఏడు ఫిబ్రవరి మధ్యలో ఎన్ఎస్ఈ తన టాప్ 50 జాబితాను సవరిస్తుంది. కంపెనీల పనితీరు, షేర్ల ట్రేడింగ్ ఆధారంగా కొన్ని కంపెనీలు కొత్తగా ఈ లిస్టులో చేరుతుండగా మరికొన్ని స్థానం కోల్పోతాయి. కాగా ప్రస్తుత అంచనాల ప్రకారం ఫిబ్రవరిలో చేపట్టే సెమీ యాన్యువల్ ఇండెక్స్ రివ్యూలో అపోలోకి టాప్ 50 కంపెనీల జాబితాలో చోటు దక్కవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఇండియన్ ఆయిల్ స్థానాన్ని అపోలో భర్తీ చేయవచ్చని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కథనం ప్రచురించింది. ఇటీవల కాలంలో అపోలో హాస్పిటల్స్ షేర్లు మార్కెట్లో ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతున్నాయి. అపోలో షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతీ రోజు 175 మిలియన్ డాలర్ల ట్రేడింగ్ ఈ షేర్ల మీద జరుగుతోంది. వీటికి సంబంధించి రోజువారి సగటు ట్రేడింగ్ వాల్యూమ్ 1.7గా ఉంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ నుంచి పెట్టుబడులు వెనక్కి తరలిపోతున్నాయి. తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అపోలోకి టాప్ 50లో చోటు దక్కడం ఖాయమంటున్నారు. -
‘ఒమిక్రాన్పై అలాంటి ప్రచారం అస్సలు మంచిది కాదు.. వారికి మరింత ప్రమాదం’
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ వేరియంట్ తేలికపాటిదేనని, ప్రమాదకరం కాదని.. ఈ వైరస్ సోకినా పెద్దగా ఇన్ఫెక్షన్లు లేనందున భయపడాల్సిన పని లేదనే భావన ప్రజల్లోకి వెళ్లడం ఆందోళన కలిగించే విషయమని అపోలో గ్రూప్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ కె.హరిప్రసాద్ అన్నారు. ఒమిక్రాన్ వేరియంట్పై ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రమాదకరరీతిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ వేరియంట్ అయినా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తేనే వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్పై జరుగుతున్న వివిధ రకాల ప్రచారం నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.. వేగంగా వ్యాప్తి చెందే రకం ఇది కోవిడ్–19లో ప్రస్తుతం వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ మునుపటి వేరియంట్లతో పోలిస్తే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. మంచి రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తిలోకి ఈ వైరస్ ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కానీ ఆ వ్యక్తి నుంచి ఇతరులకు ఈ వైరస్ వేగంగా సోకుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ సోకితే వచ్చే ఇన్ఫెక్షన్ తేలికపాటి లక్షణాలను కలిగిస్తున్నట్లు గుర్తిస్తున్నాం. ఇది సోకిన ప్రజలు దానిని ఒక చిన్నపాటి జలుబుగా భావిస్తున్నారు. వాస్తవానికి ఒమిక్రాన్ కారణంగా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని తెలియకపోతే, వారు సాధారణ వ్యక్తుల్లాగే బయట సమాజంలో తిరుగుతారు. తద్వారా అనేక మంది ఇతర వ్యక్తులకు ఇన్ఫెక్షన్ సోకే పరిస్థితి ఏర్పడుతుంది. సాధారణ విషయంగా భావించవద్దు ఒమిక్రాన్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించదు, మరణాలకు దారితీయదనే భావన ప్రజల్లో క్రమంగా సాధారణంగా మారుతోంది. ప్రస్తుతం ఈ వైరస్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నా (అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు) ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొందరికి ఐసీయూ సంరక్షణ కూడా అవసరమవుతోంది. ఇతర దేశాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. డెల్టా అత్యంత ప్రమాదకరమని అందరికీ తెలుసు. సెకండ్ వేవ్లో ఆ వేరియంట్ మనకు భయంకరమైన అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పటికీ కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. మున్ముందు ఇది భారీ నష్టాలకు కారణమయ్యే అవకాశం ఉందని గ్రహించాలి. వ్యక్తులుగా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. పౌరులుగా ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి, అది కలిగించే నష్టాన్ని వీలైనంతగా తగ్గించడానికి ప్రభుత్వానికి సహకరించాలి. జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్కరూ మాస్కును సరైన రీతిలో ధరించాలి. గుంపులుగా గుమిగూడకుండా.. ఎక్కువ మంది పాల్గొనే సమావేశాలకు దూరంగా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. తక్కువ లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్ష చేయించుకోవాలి. పరిస్థితులను బట్టి ముందస్తుగానే వైద్య సహాయం తీసుకోవాలి. హోమ్ ఐసోలేషన్ పాటించాలి. నిబంధనల ప్రకారం ఇమ్యునైజేషన్ డోస్లను (బూస్టర్లతో సహా) తీసుకోవాలి. -
కైకాల కుమారుడికి సీఎం జగన్ ఫోన్
సాక్షి, అమరావతి: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కైకాల కుమారుడికి ఫోన్ చేశారు. కైకాల చిన్న కుమారుడు, కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)కు సీఎం జగన్ ఫోన్ చేసి.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రస్తుతం కైకాల హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అదే విధంగా రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదవండి: Smart Policing: స్మార్ట్ పోలీసింగ్లో సర్వేలో ఏపీ అరుదైన రికార్డు.. కైకాల కుమారుడి ఫోన్ చేసిన సినీ ప్రముఖులు సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, సీనియర్ నటుడు రావు రమేష్ కన్నడ సూపర్ స్టార్ యష్, మరో స్టార్ శివ రాజ్ కుమార్లు కైకాల కుమారుడికి ఫోన్ చేసి కైకాల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కైకాలకు ఏమీ కాదని, తామంతా ఉన్నామని సినీ ప్రముఖుల ధైర్యం చెప్పారు. మరోవైపు కైకాల కోలుకుంటున్నారని, ఎలాంటి ఇబ్బంది లేదని, దయచేసి పుకార్లు సృష్టించి ప్రజలను, కైకాల అభిమానులను ఆందోళనకు గురి చేయవద్దని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. -
నటుడు కైకాల ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా
CM YS Jagan Inquires About Kaikala Satyanarayana Health Condition: నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్పై వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా కైకాల ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కైకాల కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడటంతో నొప్పులు ఎక్కువగా ఉండటంతో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బీపీ లెవల్స్ చాలా తక్కువగా ఉండటంతో వాసో ప్రెజర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. కైకాలను ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పరిశీలిస్తోందని తెలిపారు. -
కైకాల ఆరోగ్యంపై ఆడియో సందేశం ఇచ్చిన కూతురు రమాదేవి
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు వెంటిలెటర్పై చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి కాస్తా విషమంగా ఉందని, ఆయనను కాపాడేందుకు కృషి చేస్తున్నామంటూ రెండు రోజుల క్రితం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. చదవండి: కైకాల సత్యనారాయణకు వెంటిలేటర్పై చికిత్స దీంతో ఆయన ఆరోగ్యంపై రకరకాలుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి, ఒక దశలో ఆయన పరిస్థితి విషమించిందని, పరిస్థితి చేచారిందంటూ సోషల్ మీడియాల్లో ప్రచారం మొదలు పెట్టారు. ఇక ఈ పుకార్లకు చెక్ పెడుతూ కైకాల కూతురు రమాదేవి ఓ ఆడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: నిక్తో ప్రియాంక విడాకులు? తల్లి మధు చోప్రా క్లారిటీ అంతేగాక తన తండ్రి కైకాల ఆరోగ్యం కొంత మెరుగుపడిందని, ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నట్లు ఆమె చెప్పారు. ఇక ఆయన ఆరోగ్యంపై అనవసరపు ప్రచారం చెయోద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక ఆయన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లను కూడా ఎవరూ నమ్మోద్దని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవరం లేదని ఆమె స్పస్టం చేశారు. కాగా ప్రస్తుత సమాచారం ప్రకారం కైకాల సత్యనారాయణ అపోలోలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఆయన చికిత్సకి స్పందిస్తున్నారు. త్వరలోనే కైకాల కోలుకుంటారని వైద్యులు చెప్తున్నారు. -
నటుడు కైకాల ఆరోగ్య పరిస్థితి మరింత విషమం
Kaikala Satyanarayana Health Condition: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో ఈ రోజు ఉదయం ఆయన అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉండటంతో వైద్యులు వెంటిలెటర్పై చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు అపోలో వైద్యులు కైకాల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారని, ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే కైకాల ఆరోగ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని అపోలో వైద్యులు తమ ప్రకటనలో వెల్లడించారు. చదవండి: బ్రేకప్లు, విడాకులు మన స్టార్ హీరోయిన్స్కు కలిసోచ్చాయా?! -
ఆక్సిజన్ సపోర్టు తొలగింపు: కళ్లు తెరచి చూస్తున్న సాయితేజ
సాక్షి, హైదరాబాద్: మెగా హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన పూర్తిగా కోలుకున్నట్లు బుధవారం వైద్యులు తెలిపారు. సాయితేజ్కు వెంటిలేటర్ తొలగించారు. తేజ్ ఆరోగ్యం మెరుగవడంతో కళ్లు తెరిచి చూస్తుండడంతో బుధవారం ఆక్సిజన్ సపోర్టు సైతం తీసేసినట్లు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని పేర్కొన్నారు. కాగా కొన్ని రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. సొంతంగానే శ్వాస తీసుకుంటూ అందరితో మాట్లాడగలుగుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. చదవండి: సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించిన నరేశ్ -
పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్
బంజారాహిల్స్ (హైదరాబాద్): రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్ తొలగించినట్లు వైద్యబృందం సోమవారం వెల్లడించింది. మూడు రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామంది. సొంతంగానే శ్వాస తీసుకుంటున్న సాయిధరమ్.. అందరితో మాట్లాడగలుగుతున్నారని తెలిపింది. మరో రెండు, మూడురోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నట్లు పేర్కొంది. ఈనెల 10న దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి వెళ్తూ బైక్ స్కిడ్ అయి సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. -
'సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారు..వెంటిలేటర్ తొలగించాం'
Sai Dharam Tej Latest Health Bulletin: హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో హాస్పిటల్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సాయి ధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని, వెంటిలేర్ను కూడా తొలిగించినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అయితే చికిత్స నిమిత్తం మరికొన్ని రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంటారని వెల్లడించారు. కాగా కొన్ని రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయిన అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. ఇటీవలో ఆయన కాలర్ బోన్కు శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే. చదవండి : కాబోయే భర్తకు గ్రాండ్గా సర్ప్రైజ్ ఇచ్చిన నయనతార ‘మా’ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నిబంధనలు ఇవే -
సాయి తేజ్: ఐసీయూలో కొనసాగుతున్న చికిత్స, నిలకడగా ఆరోగ్యం
యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్కు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతుంది. ఆదివారం అపోలో వైద్యులు అయన కాలర్ బోన్కు శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న(సోమవారం)హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు సర్జరీ విజయవంతమైందని, ఆయనను మరో 36 గంటల పాటు ఆబ్జర్వేషన్లో ఉంచాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాయి తేజ్ను ఐసియూలోనే ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చదవండి: ఐసీయూలో అయినా వ్యక్తి ప్రైవసీకి గౌరవం ఇవ్వండి: నిఖిల్ అపోలో అసుపత్రి వైద్యులు డా. అలోక్ రంజన్ నేతృత్వంలోని వైద్య బృందం తేజ్ను క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే నిన్న ఆయన వెంటిలెటర్ తొలగించాలని అనుకున్నప్పటిక సాయి స్పృహలోకి వచ్చాకే తొలగిస్తామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తేజ్అరోగ్యం నిలకడగా ఉంది, చికిత్సకు స్పందిస్తున్నారని, రోజు రోజుకు ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు అపోలో వైద్యులు పేర్కొన్నారు. -
సాయి తేజ్ మూడు రోజుల్లో బయటకు వస్తారు: మోహన్బాబు
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ బైక్పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన నటుడు సాయిధరమ్ తేజ్ హైదరాబాద్లోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. తాజాగా సినీ నటుడు మంచు మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి సోమవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చారు. సాయిధరమ్ తేజ్ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయిబాబా ఆశీస్సులతో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆయన తిరిగి బయటికి వస్తాడు అని చెప్పారు. చదవండి: ‘ఢిల్లీలో ఏమన్న చేసుకోండ్రి.. మా రాష్ట్రంలో ఏందీ లొల్లి’ ఆదివారం తేజ్కు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు ప్రకటించారు. 36 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. కాగా శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా రోడ్డుపై ఇసుక ఉండడంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయి అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్కాకి -
నిలకడగా సాయి తేజ్ ఆరోగ్యం, ఇంకా 36 గంటలు అబ్జర్వేషన్లో..
అపోలో ఆసుత్రిలో చికిత్స పొందుతున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. నిన్న (ఆదివారం) సాయి తేజ్కు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అపోలో వైద్యులు సోమవారం సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ‘‘సాయి తేజ్ మెల్లి మెల్లిగా కోలుకుంటున్నారు. నిన్న ఆయన కాలర్ బోన్కు చేసిన ఆపరేషన్ విజయంతం అయ్యింది. చదవండి: Sai Dharam Tej Accident: సాయి తేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్, హెల్త్ బులెటిన్ విడుదల ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మొదట్లో ఉన్న దానికంటే వెంటిలేటర్ అవసరం ఇప్పుడు తగ్గింది. ఇంకా ఆయనను 36 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాల్సి ఉంది’’ అని అపోలో వైద్యులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళుతుండగా రోడ్డుపై ఇసుక ఉండటంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయిన అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. -
ఇవాళ కూడా ఐసీయూలోనే సాయిధరమ్ తేజ్: వైద్యులు
-
సాయి తేజ్ యాక్సిడెంట్.. సీసీ టీవీ పుటేజీ వీడియో వైరల్
Sai Dharam Tej Accident Video: మెగా హీరో సాయి తేజ్ శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు 108 సాయంతో మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. (చదవండి: వెంటిలేటర్పైనే సాయిధరమ్తేజ్.. కొనసాగుతున్న చికిత్స) ప్రస్తుతం సాయిధర్మ్ తేజ్కు ప్రాణాపాయం లేదని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితిపై అపోలో వైద్యులు శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నేడు కూడా ఐసీయూలోనే సాయి తేజ్కు చికిత్స అందిస్తామని వెల్లడించారు. రేపు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ పుటేజీని పోలీసులు విడుదల చేశారు. ఆ వీడియో మీ కోసం.. -
వెంటిలేటర్పైనే సాయిధరమ్తేజ్.. కొనసాగుతున్న చికిత్స
Sai Dharam Tej Health Condition: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్తేజ్కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇంకా వెంటిలేటర్పైనే సాయిధరమ్తేజ్కు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు శనివారం ఉదయం తాజా హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇవాళ కూడా ఐసీయూలోనే సాయిధరమ్తేజ్కు చికిత్స అందిస్తామని వెల్లడించారు. రేపు మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు. ప్రయాణానికి ముందు సాయిధరమ్ తేజ్ ఆహారం తినడంతో.. ప్రమాద వల్ల పుడ్పైప్ నుంచి ఊపిరితిత్తుల పైప్ వరకు ఆహారం చేరింది. ఊపిరితిత్తుల వద్ద ఇరుక్కున్న ఆహారాన్ని వైద్యులు రాత్రి తొలగించారు. ప్రమాదం వల్ల ఒత్తిడికి గురైన సాయిధరమ్తేజ్ కుడివైపు ఊపిరితిత్తులు జీసీఎస్ స్కోర్ తక్కువగా ఉన్నట్లు వైద్యులు గమనించారు. శరీర భాగాల్లో ఎక్కడైనా అవయవాలు దెబ్బతిన్నాయా అనేదానిపై వైద్యులు పరిశీలిస్తున్నారు. ఇవీ చదవండి: సాయిధరమ్తేజ్ కోలుకుంటున్నారు: చిరంజీవి షటప్.. ఉమాదేవికి ఇచ్చిపడేసిన ప్రియాంక సింగ్ -
సాయిధరమ్తేజ్ కోలుకుంటున్నారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: అభిమానులు ఆందోళన పడవద్దని.. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సాయిధరమ్తేజ్ కోలుకుంటున్నారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.. రెండు రోజుల్లో సాయిధరమ్ తేజ్ తిరిగి వస్తాడని చిరంజీవి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేనల్లుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న సమాచారంతో శుక్రవారం రాత్రి చిరంజీవి, పవన్కల్యాణ్, అల్లు అరవింద్ వెంటనే మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి వచ్చారు. మెడికవర్ ఆసుపత్రి వైద్యులను అడిగి సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సాయితేజ్ కోలుకుంటున్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. మెరుగైన వైద్యం కోసం మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రి నుండి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి సాయిధరమ్తేజ్ను తరలించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాయిధరమ్తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు రోడ్డు ప్రమాదంలో హీరో సాయి ధరమ్ తేజ్కు తీవ్రగాయాలు -
సాయిధరమ్తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్: సాయిధర్మ్ తేజ్కు ప్రాణాపాయం లేదని.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ఆయన పరిస్థితిపై అపోలో వైద్యులు అర్ధరాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ విరిగిందని.. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామన్నారు. 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు. ప్రముఖ టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. జూబ్లీ హిల్స్ రోడ్డు నంబర్-45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్పై వెళ్తుండగా అతను ఈ ప్రమాదానికి గురయ్యారు. కుడి కన్నుపై, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్రగాయాలయినట్లు డాక్టర్లు తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీ: అపోలో రూ.2 కోట్ల విరాళం
సాక్షి, అమరావతి: సీఎం సహాయ నిధికి అపోలో హస్పిటల్స్ గ్రూపు కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ కింద కనెక్ట్ టు ఆంధ్రాకు మరో కోటి రూపాయలు విరాళం ఇచ్చింది. మొత్తంగా రూ.2 కోట్ల విరాళాలకు సంబంధించిన చెక్కులను గురువారం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతా రెడ్డి, ప్రెసిడెంట్ (ప్రొక్యూర్మెంట్ అండ్ కార్పొరేట్ డెవలప్మెంట్) నరోత్తమ్ రెడ్డి, సీఈఓ (ఏహెచ్ఈఆర్ఎఫ్) కె ప్రభాకర్, సీఈఓ (నాలెడ్జ్ వెర్టికల్) శివరామకృష్ణన్లు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్కు అందజేశారు. ఇవీ చదవండి: పవర్ ‘ఫుల్ ఆదా’ ఏపీ: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం -
అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారా?
-
Kathi Mahesh : ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ మృతి
సాక్షి, చెన్నై : ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. త్వరలోనే కుదుటపడుతుందనుకున్న ఆయన ఆరోగ్యం విషమించింది. అకస్మాత్తుగా శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో తుదిశ్వాస విడిచారు. కత్తి మహేశ్ మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తల, కంటి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. కత్తి మహేశ్కు మెరుగైన వైద్యం అందించేందుకు ఏపీ ప్రభుత్వం మానవతా కోణంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17లక్షల రూపాయలు అందచేసింది. అయినా కూడా మహేశ్ ప్రాణాలు దక్కలేదు. ‘బిగ్ బాస్ సీజన్ 1’లో కత్తి మహేశ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్-1 ద్వారా సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కత్తి మహేశ్. అంతకుముందు నందు హీరోగా నటించిన పెసరట్టు అనే సినిమాను తెరకెక్కించారు. కాగా, హృదయ కాలేయం, నేనే రాజు.. నేనే మంత్రి, కొబ్బరి మట్ట వంటి చిత్రాల్లోనూ నటించారు. -
వ్యాక్సిన్ తీసుకున్నాక పాజిటివ్: అపోలో జేఎండీ సంగీతారెడ్డి
సాక్షి, హైదరాబాద్: అపోలో జేఎండీ సంగీతారెడ్డికి కరోనా సోకింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జూన్ 10న తాను కోవిడ్-19 బారిన పడ్డానని సంగీతారెడ్డి ట్వీట్ చేశారు. వ్యాక్సిన్ తీసుకుని.. ఎన్ని జాగ్రత్తలు పాటించినా తనకు కరోనా సోకడం షాక్కు గురి చేసిందని పేర్కొన్నారు. వ్యాధినిర్ధారణ, చికిత్స రెండూ కీలకమైన అంశాలని తెలిపారు. కరోనా వల్ల విపరీతమైన జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరానని ఆమె తెలిపారు. అయితే కాక్టెయిల్, రీజెనెరాన్ థెరపీద్వారా కోలుకుంటున్నాను అన్నారు. వ్యాక్సిన్ కరోనాను అడ్డుకోలేదు...కానీ వైరస్ ప్రభావం తీవ్రం కాకుండా నిరోధిస్తుందని సంగీతారెడ్డి తెలిపారు. అందువల్ల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు మరవొద్దు అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన డాక్టర్లు, నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు. After 500 days of dodging #COVID19 I tested +VE on June10th My initial reaction was of shock & dismay - Why me? I was careful & #vaccinated Hospitalized with high fever I took the cocktail #Regeneron therapy within the early window period & it has made a dramatic difference (1/2) pic.twitter.com/Qybrl61CUQ — Dr. Sangita Reddy (@drsangitareddy) June 14, 2021 చదవండి: రోజుకు పది లక్షల వ్యాక్సిన్లు పంపిణీకి సిద్ధం : అపోలో -
హైదరాబాద్లో స్పుత్నిక్ టీకాలు షురూ!
బంజారాహిల్స్: రష్యా తయారీ స్పుత్నిక్–వి టీకాల కార్యక్రమం హైదరాబాద్లో సోమవారం ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో తొలిడోసును డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఫార్మా సంస్థకు చెందిన ఒక ఉద్యోగికి వేశారు. మన దేశంలో ప్రస్తు తం స్పుత్నిక్ టీకాలను రెడ్డీస్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆ సంస్థతో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ భాగస్వా మ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం రెడ్డీస్ ల్యాబ్స్ దిగుమతి చేసుకున్న మొదటి బ్యాచ్ 1.50 లక్షల స్పుత్నిక్ డోసులను వేయనున్నామని, నెల రోజుల వ్యవధిలో మొత్తంగా 10 లక్షల డోసులు రానున్నా యని అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి వెల్లడించారు. తమ నెట్వర్క్ వ్యాప్తం గా టీకా కేంద్రాలను తెరిచి, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అపోలో హాస్పిటల్స్, అపోలో క్లినిక్స్ సహా 60కిపైగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆస్పత్రి ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ డివిజన్ అధ్యక్షుడు కె.హరిప్రసాద్ తెలిపారు. రెడ్డీస్ ల్యాబ్స్ బ్రాండెడ్ మార్కెట్స్ సీఈవో ఎంవీ రమణ మాట్లాడుతూ.. తొలి బ్యాచ్ టీకాను హైదరాబాద్, విశాఖలో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని, త్వరలోఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, కోల్కతాలో మొదలుపెడతామని వెల్లడించారు. -
96 శాతం పోలీసులకు వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకు 96 శాతం మంది పోలీసులకు మొదటి డోసు వ్యాక్సిన్, 76 శాతం మందికి రెండో డోస్ పూర్తయినట్టు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏపీ పోలీస్ శాఖ, అపోలో ఆస్పత్రి వైద్యుల సమన్వయంతో మంగళవారం వెబినార్ ద్వారా ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ఫ్రంట్లైన్ వారియర్స్ను రక్షించుకోవడం ద్వారా సమాజానికి భద్రత కలుగుతుందన్నారు. వైరస్ను జయించిన పోలీస్ సిబ్బంది ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. అపోలో ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సాయిప్రవీణ్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడడంలో ఏపీ పోలీస్ శాఖ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రీసెర్చ్, అనుభవం పంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. క్రిటికల్ కేసులకు వైద్యం అందించడం, సూచనలు చేయడం వంటి సౌకర్యాలను పోలీస్ సిబ్బందికి అందిస్తామన్నారు. వైద్యులు సుబ్బారెడ్డి, మంజులరావు పోలీసులకు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్, డీఐజీ పాలరాజు, రిటైర్డ్ ఐపీఎస్, వెల్ఫేర్ ఓఎస్డీ రామకృష్ణ, పలువురు సీనియర్ ఐపీఎస్లు పాల్గొన్నారు. -
కనకారెడ్డికి పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: అవయవమార్పిడి ద్వారా గుండె ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న కనకారెడ్డి పూర్తి ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జికి సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్లో ఈ నెల 2న గ్రీన్ చానెల్ సాయంతో ఎల్బీ నగర్ కామినేనిలో బ్రెయిన్డెడ్ అయిన దాత గుండెను తెచ్చి మరో వ్యక్తికి ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన విషయం తెలిసిందే. ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసిన డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే సోమవారం మీడియాతో మాట్లాడారు. మెట్రో రైల్ ద్వారా అవయవాలను తరలించడం ప్రపంచంలో ఇదే మొదటిసారన్నారు. 8గంటల పాటు గుండె మార్పిడి జరిగిందని, ప్రస్తుతం కనకారెడ్డి ఆరోగ్యంగా ఉన్నా రని తెలిపారు. ఈ సర్జరీ జరగడానికి జీవన్దాత ఆర్గనైజేషన్ ఎంతో కృషి చేసిందన్నారు. ఇలాంటి సర్జరీల్లో 75శాతమే సక్సెస్ రేటు ఉంటుందని, ఇప్పటి వరకు నగరంలో 60 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు జరగ్గా అందులో 42 అపోలో హాస్పిటల్లోనే జరిగా యన్నారు. అవయవదానం చేసిన రైతు నర్సిరెడ్డి కుటుంబానికి తగిన సాయం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గోఖలే కోరారు. నగర ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ... గత సంవత్సరం ప్రత్యేక పరిస్థితుల్లో 25 సార్లు గ్రీన్ చానెల్ను ఏర్పాటు చేశామని, భవిష్యత్లోనూ పోలీస్ వ్యవస్థ నుంచి సహకారం అందిస్తా మన్నారు. చికిత్స జరిగిన 2 రోజుల వరకు తనకు ఏ విషయం తెలియదని, దేవుడిలా డాక్టర్లు తనకు పునర్జన్మనిచ్చారని కనకారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. గుండె దానం చేసిన రైతు కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.హరిప్రసాద్, హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో సీఈవో అనిల్కుమార్, ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన అపోలో బృందం పాల్గొన్నారు. చదవండి: (హైదరాబాద్ మెట్రో రైల్లో తొలిసారి గుండె తరలింపు) -
సీఎం జగన్ ఆదేశాలు: వైద్యురాలికి చికిత్స
సాక్షి, విజయవాడ: తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒంగోలు రిమ్స్ డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మద్రాస్ అపోలో ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. (చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..) కొద్దిరోజుల్లోనే డాక్టర్ ధనలక్ష్మి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. ఆమె ఆరోగ్య పర్యవేక్షణకు ఒంగోలు నుండి ప్రత్యేకంగా మత్తు వైద్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్ను అందుబాటులో ఉంచారు. (చదవండి: పంచాయతీ ఎన్నికలు: పురోహితులకు డిమాండ్) స్పెషల్ కేసుగా తీసుకొని డాక్టర్ ధనలక్ష్మికి అత్యవసర వైద్యం అందించి ప్రాణాపాయం నుండి కాపాడడానికి అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం భట్ల గూడూరు గ్రామానికి చెందిన డాక్టర్ ధనలక్ష్మి.. కోవిడ్ సమయంలో ఆరు నెలలు కాలానికి వైద్య సేవలు అందించడానికి తాత్కాలిక పద్ధతిలో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ డెంటల్ డాక్టర్గా ఉద్యోగ బాధ్యతలను ఆమె నిర్వహిస్తున్నారు. -
హైదరాబాద్ మెట్రో రైల్లో తొలిసారి గుండె తరలింపు
సాక్షి, హైదరాబాద్: చావు బతుకుల్లో ఉన్న ఒక వ్యక్తికి హైదరాబాద్ మెట్రో ఆపద్బంధువుగా నిలిచింది. అత్యవసరంగా గుండెను తరలించి నిండు ప్రాణాన్ని కాపాడే ప్రయత్నంలో తన వంతు సహకారం అందించింది. మెట్రో సహకారంతో.. విపరీతమైన ట్రాఫిక్ ఉండే మహా నగరంలో ఓ మూలన ఉన్న ఆస్పత్రి నుంచి మరో మూలన ఉన్న ఆస్పత్రికి కేవలం 37 నిమిషాల్లోనే వైద్యులు గుండెను తరలించగలిగారు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ పరిధిలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన రైతు వరకాంతం నర్సిరెడ్డి (45) గత నెల 31 అస్వస్థతకు గురై హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కామినేని ఆస్పత్రిలో చేరాడు. సోమవారం అతని బ్రెయిన్ డెడ్ అయినట్లు గుర్తించిన వైద్యులు విషయం కుటుంబ సభ్యులకు చెప్పారు. జీవన్దాన్ ప్రతినిధుల కౌన్సెలింగ్తో వారు అతని అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి గుండె మార్పిడి శస్త్రచికిత్స అత్యవసరమని గుర్తించి నర్సిరెడ్డి గుండెను అతనికి అమర్చాలని నిర్ణయించారు. అంబులెన్స్లో ఎల్బీ నగర్ నుంచి జూబ్లీహిల్స్కు సకాలంలో గుండెను తీసుకురావడం కష్టమని భావించిన అపోలో వైద్యులు మెట్రో రైలు అధికారులను సంప్రదించారు. ప్రత్యేక రైలు ఏర్పాటుకు వారు ఓకే చెప్పడం, పోలీసులు సైతం సహకరించడంతో గుండె తరలింపు ప్రక్రియకు మార్గం సుగమం అయ్యింది. మెట్రో రైలులో గుండెను తరలిస్తున్న వైద్యులు ఆద్యంతం ఉత్కంఠ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఎల్భీనగర్–నాగోల్ మార్గంలో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీసుల పహరా, అంబులెన్స్కు పైలెటింగ్ చేయడానికి పోలీసు వాహనాలు దారి పొడవునా సిద్ధమయ్యాయి. వైద్యులు నర్సిరెడ్డి గుండెను సేకరించిన తర్వాత.. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ గోఖలే నేతృత్వంలో అరుగురు సభ్యుల వైద్య బృందం సాయంత్రం 4.36 గంటల ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య అంబులెన్స్లో కామినేని ఆస్పత్రి నుంచి బయలుదేరారు. కేవలం ఐదు నిమిషాలలోనే నాగోల్ మెట్రో స్టేషన్కు చేరుకున్నారు. మరో నిమిషంలో స్టేషన్లో సిద్ధంగా ఉంచిన ప్రత్యేక మెట్రో రైల్లోకి చేరుకున్నారు. వెంటనే బయలుదేరిన రైలు.. మార్గం మధ్యలోని 16 మెట్రో స్టేషన్లలో ఎక్కడా ఆగకుండా గ్రీన్ఛానల్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ వరకు మొత్తం 21 కి.మీ మార్గాన్ని 28 నిమిషాల లోపుగానే రైలు చేరుకుంది. రైలును ఈ సమయంలో గంటకు 40 కేఎంపీహెచ్ వేగంతో నడిపారు. అక్కడి నుంచి అంబులెన్స్లో రెండున్నర నిమిషాల్లోనే అపోలో ఆస్పత్రికి తరలించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి అపోలో వరకు కూడా పోలీసులు గ్రీన్ఛానెల్ ఏర్పాటు చేశారు. డాక్టర్ గోఖలే నేతృత్వంలోని వైద్య బృందం సాయంత్రం 5.15 గంటలకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్రారంభించింది. నగరంలో మెట్రోలో గుండెను తరలించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా నగరంలో మార్పిడి చేసే అవయవాల తరలింపు, అత్యవసర వైద్యసేవలకు మెట్రో సేవలను వినియోగించుకోవాలంటూ.. ట్రాఫిక్ రద్దీ, వీఐపీల రాకపోకలతో అంబులెన్స్లు నిలిచిపోవడాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. గుండెను సకాలంలో తరలించాం ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన గుండెను బ్రెయిన్ డెడ్ వ్యక్తి శరీరం నుంచి తీసిన నాలుగు గంటల్లోగా తిరిగి అమర్చాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుండెను సకాలంలో అపోలోకు చేరవేసేందుకు మెట్రో జర్నీ ఉపకరించింది. – డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే, గుండె మార్పిడి నిపుణులు, అపోలో ఆస్పత్రి ప్రజా సేవకు మెట్రో ముందుంటుంది ప్రజాసేవలో మెట్రో ఎప్పుడూ ముందుంటుంది. ఓ నిండు ప్రాణం కాపాడేందుకు మా వనరులను వినియోగించేంలా మాకో అవకాశం దక్కింది. నాగోల్–జూబ్లీహిల్స్ మధ్య రైలును ఏ స్టేషన్లోనూ ఆపకుండా గ్రీన్ఛానల్ ఏర్పాటు చేశాం. – కేవీబీ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ -
మెట్రో: అపోలో ఆస్పత్రికి చేరుకున్న గుండె
సాక్షి, హైదరాబాద్: గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం తొలిసారిగా వైద్యులు హైదరాబాద్ మెట్రోరైలును వినియోగించారు. ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీహిల్స్ అపోలోకు గుండెను తరలించారు. కాగా నల్లగొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు నర్సిరెడ్డి బ్రెయిన్డెడ్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో గుండె అవసరమున్న వ్యక్తికి డాక్టర్ గోఖలే నేతృత్వంలో శస్త్రచికిత్స చేయనున్నారు. అయితే ట్రాఫిక్ సమస్య కారణంగా గుండె తరలింపు జాప్యం అయ్యే అవకాశం ఉన్నందున, నాగోల్ నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్తో పీఏ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా గుండె తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. -
గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు మెట్రో రైలు వినియోగం
సాక్షి, హైదరాబాద్: గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం తొలిసారిగా మెట్రోరైలును వినియోగించనున్నారు. అపోలో హాస్పిటల్ వైద్యుడు గోకులే నేతృత్వంలో జరిగే శస్త్ర చికిత్స కోసం గుండెను మెట్రో రైలులో తరలిచించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మెట్రోతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి చికిత్సకు వైద్యులు సిద్దం చేస్తున్నారు.