health condition
-
సునీతా విల్లియమ్స్ హెల్త్ అప్డేట్స్
-
Journalist Bharadwaj: సింగర్ కల్పన అనుభవిస్తున్న బాధలు
-
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం
-
మీరు మనుషులేనా ?.. ఆరోగ్యం బాగాలేకపోతే నీచ రాజకీయాలా
-
పోసానికి కూటమి వేధింపులు.. సీఐ ప్రకటనపై అనుమానాలు
-
అనారోగ్యంతో ఉన్న పోసాని కృష్ణమురళి పట్ల కూటమి ప్రభుత్వ దాష్టీకం
-
పోసాని కృష్ణమురళికి తీవ్ర ఆస్వస్థత
-
పోప్ ఆరోగ్యం విషమం
రోమ్: క్రైస్తవుల మత గురువు పోప్ ప్రాన్సిస్ ఆరోగ్యం విషమించింది. వైరస్, బ్యాక్టీరి యా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్ర శ్వాస సంబంధ వ్యాధిలో బాధపడుతున్న పోప్ గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 88 ఏళ్ల పోప్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. రక్తహీనత సమస్య మరింత ఎక్కువైంది. దీంతో తాజాగా ఆయనకు రక్తం ఎక్కించారు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయింది. పూర్తిస్తాయిలో శ్వాస తీసుకోలేని కారణంగా అధిక పీడనంతో ఆయనకు ఆక్సీజన్ సరఫరాను కొనసాగిస్తున్నారు. బ్రాంకైటిస్, న్యుమోనియాలతో కూడా పోప్ బాధపడుతున్నారు. -
జైలు నుండి విడుదల తర్వాత నందిగం సురేష్ ఫస్ట్ రియాక్షన్
-
సుప్రీంకోర్టుపైనే దుష్ప్రచారమా?
న్యూఢిల్లీ: నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పంజాబ్ రైతు సంఘం నాయకుడు జగ్జీత్సింగ్ దలేవాల్ ఆరోగ్య పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని పంజాబ్ ప్రభుత్వంపై మండిపడింది. పైగా సుప్రీంకోర్టు వల్లే దలేవాల్ దీక్ష కొనసాగిస్తున్నారంటూ పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నాయకులు మీడియాలో తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. దలేవాల్ దీక్షను భగ్నం చేయాలని తాము చెప్పడం లేదని, ఆయనను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించాలని మాత్రమే సూచిస్తున్నామని వెల్లడించింది. దలేవాల్ గత ఏడాది నవంబర్ 26న దీక్ష ప్రారంభించారు. గురువారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. ఆయనకు వైద్య చికిత్స అందించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను పంజాబ్ ప్రభుత్వ అధికారులు లెక్కచేయడం లేదని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల∙ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అలాగే రైతుల ఉద్యమంలో కోర్టు జోక్యం చేసుకోవాలని, కేంద్రానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దలేవాల్ దాఖలు చేసిన తాజా పిటిషన్నూ విచారించింది. ‘‘పంజాబ్ ప్రభుత్వ అధికారులు, కొందరు రైతు సంఘాల నేతలు మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దలేవాల్ దీక్షను భగ్నం చేయడానికి సుప్రీంకోర్టు ప్రయతి్నస్తోందని, అందుకు ఆయన ఒప్పుకోవడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలి్పస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారు. దలేవాల్ పట్ల రైతు సంఘాల నాయకుల వ్యవహారాల శైలి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన దీక్షను భగ్నం చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని మేము ఏనాడూ ఆదేశించలేదు. దలేవాల్ ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా ఆసుపత్రి తరించాలని మాత్రమే చెబుతున్నాం. ఆసుపత్రిలో ఆయన దీక్ష కొనసాగించుకోవచ్చు. దలేవాల్ ఆరోగ్యంపై మేము ఆందోళన చెందుతున్నాం. ఆయన రాజకీయ సిద్ధాంతాలకు సంబంధం లేదని నాయకుడు. కేవలం రైతుల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. రైతు నాయకుడిగా దలేవాల్ ప్రాణం ఎంతో విలువైంది. ఆసుపత్రిలో చికిత్స పొందేలా దలేవాల్ను ఒప్పించడానికి పంజాబ్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. మంత్రులు గానీ, అధికారులు గానీ ఒక్కసారైనా దీక్షా శిబిరానికి వెళ్లారా? రైతు సంఘాలతో సఖ్యత కుదుర్చుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదు’’ అని ధర్మాసనం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
Sakshi Little Stars: ఆశీస్సులే ఆయువు
ఆశ తొణుకుతున్నప్పుడుఆశీస్సు దానిని నిలబెట్టవచ్చు. ఔషధం ఓడుతున్నప్పుడు ప్రార్థన దానిని గెలిపించవచ్చు. అశ్రువు ఉబుకు తున్నప్పుడు ఆర్ద్రత దానిని మందస్మితం చేయవచ్చు. డబ్బు ఖర్చు లేని అనంత దయ, సేవ, ఆర్ద్రత, సాంత్వన మన వద్ద ఉంటాయి. నిజ హృదయంతో వెచ్చిస్తే పని చేస్తాయి. ఈ పిల్లలకు అవన్నీ కావాలి. ఈ పిల్లలు చిరంజీవులై వెలగాలి. ‘సాక్షి’ మీడియా చైల్డ్ సెలబ్రిటీలతో తనదైన ప్రయత్నం చేసింది. హైదరాబాద్ లక్డీకాపూల్లోని ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలలు ఒక పూట కువకువలాడారు. పకపక నవ్వారు.నవంబర్ 14 ‘బాలల దినోత్సవం’ నేపథ్యంలో ఎం.ఎన్.జె. కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 150 మంది చిన్నారులను పలకరించే ప్రయత్నం చేసింది సాక్షి మీడియా. ‘పొట్టేల్’. ‘సరిపోదా శనివారం’, ‘మన్మథుడు–2’ వంటి సినిమాల్లో నటించిన బాలతారలు ఖ్యాతి, సాన్విక, స్నితిక్, జాతీయ క్రీడాకారిణి కార్తీకలను తీసుకొచ్చి వారితో ముచ్చటించేలా చేసింది. చైల్డ్ సెలబ్రిటీలు వారి కోసం ఆటలు, పాటలు, డ్యాన్సులతో అలరించారు. అలాగే తమ ఆరోగ్యస్థితిని చైల్డ్ సెలబ్రిటీలతో పంచుకున్నారు.నాకు ప్రస్తుతం బాగానే ఉంది. డాక్టర్లు బాగా చూసుకుంటున్నారు. నాకు అల్లు అర్జున్ సినిమాలంటే ఇష్టం. నన్ను కలవడానికి వచ్చిన సెలబ్రిటీల కోసం పుష్ప సినిమా పాట పాడాను. నా కోసం సాన్విక కూడా పాట పాడింది. వారితో కలిసి మాట్లాడటం హ్యాపీగా ఉంది.– జశ్వంత్మేం సిద్దిపేట నుంచి వచ్చాం. హాస్పిటల్ అంటే నాకు భయం.. కానీ ఇక్కడ బాగానే ఉంది. సినిమాల్లో నటించే వారు మా కోసం రావడం సంతోషంగా ఉంది. నాకు కూడా సినిమాలంటే ఇష్టం. చివరగా శ్యాం సింగరాయ్ సినిమా చూశాను. త్వరగా నయమైతే స్కూల్కు వెళ్లాలనుంది. – రిషి ప్రియ, సిద్దిపేటచాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు చదువంటే చాలా ఇష్టం, ముఖ్యంగా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. స్పైడర్మ్యాన్ నా ఫేవరెట్. సాన్విక అక్కతో ఆడుకున్నాను, లెక్కలు చెప్పాను. – ఓ చిన్నారి, జహీరాబాద్ బద్దీపూర్నాకు ఫుట్బాల్, దాగుడుమూతలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అవన్నీ ఆడుకోలేకపోతున్నాను. ఇలా బాధ పడుతున్న సమయంలో వీరంతా వచ్చి నాతో ఆడుకున్నారు. చాలా ముచ్చట్లు చె΄్పారు. నన్ను షూటింగ్కు తీసుకెళతానని కూడా చె΄్పారు. – చేతన్విభిన్న పేర్లతో పలు రకాల కేన్సర్లు ఉన్నప్పటికీ అవన్నీ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సెస్, సాలిడ్ ట్యూమర్స్ అనే రెండు విభాగాల కిందకు వస్తాయి. చిన్నారుల్లో దీర్ఘకాలం పాటు హై ఫీవర్, చలి జ్వరం, బ్లీడింగ్, చిగుర్లలో రక్తస్రావం.. శరీరంలో, చాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వయసుకు తగ్గట్టు బరువు పెరగక పోవడం లేదా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. సాలిడ్ ట్యూమర్స్లో పిల్లలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం జరుగుతుంది. చికిత్స పొందుతున్న చిన్నారులకు క్యాన్సర్కు సంబంధించిన అవగాహన అంతగా ఉండకపోవడం వల్ల ఎక్కువగా భయం ఉండదు. కానీ నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం వల్ల మానసిక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం ప్రత్యేకంగా ప్లే స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇలాంటి వ్యాధితోనే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారులతో మమేకం చేస్తాం. – అనుదీప్, మెడికల్ ఆంకాలజిస్ట్అవగాహన వచ్చిందికేన్సర్ గురించి కొంచెం అవగాహన ఉంది. అందుకే గతంలోనే ఇలాంటి చిన్నారుల కోసం నేను రెండుసార్లు నా హెయిర్ డొనేషన్ చేశాను. కానీ ఇలాంటి ప్లేస్కు రావడం ఇదే మొదటి సారి. వీరి విల్ పవర్ చూశాక సమస్య ల నుంచి ఎలా రాణించాలో ఒక అవగాహన వచ్చింది. మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులతో ఆడుకోవాలనుంది.– కార్తీక, నేషనల్ ప్లేయర్హెయిర్ డొనేట్ చేస్తానుఈ హాస్పిటల్లో చిన్నారులను చూశాకే కేన్సర్ ఎంత ప్రమాదకరమైనదో తెలిసింది. వారిని చూస్తుంటే ఏడుపొచ్చేసింది. నేను కూడా గతంలో ఇలాంటి వారి కోసం హెయిర్ డొనేట్ చేశాను. మళ్లీ కూడా చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. –ఖ్యాతి, సరిపోదా శనివారం ఫేమ్వీరిని చూశాక లోపల ఎంతో బాధ కలిగినప్పటికీ దానిని దాచి వీరందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాను. పాటలు పాడాను, నాటు నాటు డ్యాన్స్ చేశాను. – సాన్విక, సరిపోదా శనివారంవీరందరినీ ఇలా చూస్తుంటే భయమేసింది. అందరికీ నయం అయి త్వరగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాను. అందరితో ఆడుకున్నాను, డ్యాన్సులు చేశాను. – స్నితిక్, పొట్టేల్ ఫేమ్భయం లేదు చికిత్సలు ఉన్నాయిఅనారోగ్యం అని తెలిశాక పరీక్షల నిర్థారణతో పాటు చికిత్సలో భాగంగా అన్ని సేవలు ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో ఉచితంగానే అందుతాయి. వ్యాధి దశను బట్టి చికిత్స కొనసాగుతుంది. ఈ చిన్నారులకు న్యూట్రిషన్ చాలా అవసరం. దీనికోసం కడల్స్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో మంచి న్యూట్రిషన్ అందిస్తున్నారు. చిన్నారుల వయస్సు, బరువును బట్టి ్రపొటీన్ ΄్యాకెట్స్, డ్రై ఫూట్స్ తదితరాలను అందిస్తున్నారు. కీమో, రేడియేషన్ వంటి చికిత్సల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్న వారికి చుట్టుపక్కల విడిదికి కూడా సహాయం చేస్తున్నారు. కేన్సర్ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తున్నప్పటికి అది 15 నుంచి 20 శాతం మాత్రమే. కేన్సర్లకు పలు రకాల కారణాలున్నాయి. కేన్సర్కు ఇతర దేశాల్లో అందిస్తున్న అధునాతన చికిత్సకు మనకు వ్యత్యాసం పెద్దగా ఏమీ లేదు. మన దగ్గర కూడా లేటెస్ట్ ట్రయల్స్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్లో చూడటానికి QR కోడ్ను స్కాన్ చెయ్యండి – డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళన
-
కవిత ఆరోగ్య పరిస్థితి.. ఢిల్లీకి కేటీఆర్..?
-
సీఎం జగన్కు నేతల సంఘీభావం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నం నేపథ్యంలో సోమవారం కేసరపల్లి క్యాంపునకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రికి సంఘీభావం తెలిపారు. హత్యాయత్నం ఘటనపై తీవ్ర విచారం వ్యక్తంచేసి, సీఎం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి రావటం ఖాయమని, బస్సుయాత్రకు వస్తున్న విశేష ఆదరణ చూసి తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడ్డారని పార్టీ నేతలు ముఖ్యమంత్రితో అన్నారు. ప్రజల ఆశీర్వాదంవల్లే అదృష్టవశాత్తూ దాడి నుంచి సీఎం తప్పించుకున్నారన్నారు. ఇలాంటి దాడులు యాత్రను, వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేవని ముఖ్యమంత్రి జగన్ నేతలతో అన్నారు. దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని ఆయన వారితో అన్నారు. ధైర్యంగా అడుగులు ముందుకువేద్దామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరంలేదన్నారు. ఇక సీఎంను కలిసిన వారిలో మండలి చైర్మన్ మోషేన్రాజు, మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు కేశినేని నాని, అయోథ్యరామిరెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాసరెడ్డి, మొండితోక జగన్మోహన్రావు, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కైలే అనిల్కుమార్, వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, కల్పలతారెడ్డి, విజయవాడ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్, మైలవరం అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, పెడన అభ్యర్థి ఉప్పాల రాము, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, డాక్టర్ దుట్టా రామచంద్రరావు తదితరులున్నారు. -
విషమంగానే తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి
-
ఆసుపత్రిలో కేసీఆర్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు తీవ్ర గాయమైన నేపథ్యంలో సీఎం రేవంత్ స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు రేవంత్ తెలిపారు. కేసీఆర్ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా, సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా..‘మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. అంతకుముందు, కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి వద్ద ప్రభుత్వం భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని… — Revanth Reddy (@revanth_anumula) December 8, 2023 ఇదిలా ఉండగా.. కేసీఆర్ గురువారం అర్ధరాత్రి తన ఫామ్హౌస్లోని బాత్రూమ్లో కాలు జారి పడిపోవడంతో ఎడమ కాలి తొంటికి తీవ్ర గాయమైంది. తుంటికి రెండు చోట్ల గాయమైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో, తుంటి భాగంగాలో స్టీల్ ప్లేట్ వేసే అవకాశం ఉంది. ఇక, కేసీఆర్ ఆరోగ్యంపై యశోద డాక్టర్లు హెల్త్ బులిటెన్ను విడుదల చేశారు. సిటీ స్కాన్ అనంతరం.. ఎడమ హిప్ రీప్లేస్మెంట్ అవసరమని వైద్యులు సూచించారు. ఇలాంటి కేసుల్లో కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమది వారాల రెస్ట్ అవసరమన్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సర్జరీ చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. -
కత్తిపోటుతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చిన్ని పేగుకు గాయం
-
చంద్రబాబుకు వచ్చింది స్కిన్ అలర్జీ మాత్రమే..కిడ్నీ, హార్ట్ మీద ఎఫెక్ట్ ఉండదు
-
జైల్లో చంద్రబాబు ఆరోగ్యంపై నారా కుటుంబం, టీడీపీ నేతల అబద్దాలు
-
నారా ఫ్యామిలీ నటనా చాతుర్యం
-
చంద్రబాబు ఆరోగ్యంపై పచ్చ డ్రామాలు
-
చంద్రబాబు ఆరోగ్యాంగా ఉన్నారు: జైలు అధికారులు
-
అస్వస్థతకు గురైనట్లు చెప్పి చంద్రబాబు సింపతీ కోసం ప్రయతిస్తున్నారు
-
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై లాయర్ ఇచ్చిన సర్టిఫికెట్
-
చంద్రబాబు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి..
-
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ పరిస్థితి విషమం
లక్నో: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) ఆరోగ్య పరిస్తితి ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు వుడ్ల్యాండ్ హాస్పిటల్స్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఉదయం బుద్ధవేవ్ ఛాతీ భాగానికి సీటీ స్కాన్ తీసినట్లు వైద్యులు పేర్కొన్నారు. సీనియర్ వైద్య నిపుణల బృందం భట్టాచార్యకు చికిత్స అందిస్తుందని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. అయితే మొత్తం మీద బుద్దదేవ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ ప్రాణాపాయం నుంచి బయటపడలేదని వైద్యులు తెలిపారు. రక్తపోటు అదుపులోకి రావడంతో చికిత్సకు ఆయన సహకరిస్తున్నారని చెప్పారు. కాగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో శనివారం కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ హాస్పిటట్లో చేరని విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా భట్టాచార్య పనిచేశారు. చదవండి: పార్లమెంట్లో ఆరని మణిపూర్ మంటలు.. -
డాన్స్ లో గ్రేస్, మాటల్లో మార్పుపై క్లారిటీ ఇచ్చిన సాయి తేజ్
-
శరత్బాబుకు సంతాపం తెలిపిన కమల్హాసన్.. కాసేపటికే ట్వీట్ డిలీట్
సీనియర్ నటుడు శరత్బాబు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన మరణించారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆరోగ్యం విషమించడంతో శరత్బాబు కన్నుమూశారంటూ ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలపై శరత్బాబు సోదరి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: సీనియర్ నటుడు శరత్ బాబుపై అసత్య వార్తలు.. సోదరి క్లారిటీ శరత్బాబు బతికే ఉన్నారని, ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయొద్దంటూ విఙ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఆమె పేర్కొంది. అయితే అప్పటికే శరత్బాబు చనిపోయాడంటూ వార్తలు బాగా వైరల్ కావడంతో పలువురు ఆయనకు సంతాపం కూడా వ్యక్తం చేశారు. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా ఇలాగే తప్పులో కాలేశారు. శరత్బాబుకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. 'నా ప్రియమైన పెద్దన్నయ్య శరత్బాబు నాకు మంచి స్నేహితుడు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన్ని కోల్పోవడం దురదృష్టకరం'.. అంటూ ట్వీట్ చేసి కాసేపటికే డిలీట్ చేశారు. అయితే అప్పటికే కమల్ చేసిన ఆ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. చదవండి: హీరోయిన్ మెహ్రీన్కు ఏమైంది? ఇలా మారిపోయిందేంటి? -
వివేకా హత్యకేసులో సాక్షి రంగన్నకు తీవ్ర అస్వస్థత
పులివెందుల: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వివేకా హత్య జరిగిన రోజు అక్కడే ఉన్న వాచ్మెన్ రంగన్న కోర్టుకు ఇచ్చిన 164 స్టేట్మెంట్లో కూడా వివేకాను ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్రెడ్డి, సునీల్యాదవ్, దస్తగిరి హత్యచేశారని చెప్పిన విషయం తెలిసిందే. అయితే, వయసు రీత్యా పలు అనారోగ్య కారణాల వల్ల వాచ్మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి దెబ్బతింది. దీంతో రంగన్న ఇంటివద్ద ఉన్న సెక్యూరిటీ పోలీసులు, కుటుంబసభ్యులు మంగళవారం పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడంతో రంగన్నను అంబులెన్స్లో తిరుపతి స్విమ్స్కు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా.. సీబీఐ విచారణకు హాజరైన వివేకా పీఏ కృష్ణారెడ్డి సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు వివేకా పీఏ కృష్ణారెడ్డిని మంగళవారం ప్రశి్నంచారు. హత్యకు ముందు వివేకానందరెడ్డి రాసిన లేఖను కృష్ణారెడ్డి దాచిపెట్టిన విషయంపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. మధ్యాహ్నం 3 గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన కృష్ణారెడ్డిని ఐదు గంటలకు పైగా ప్రశి్నంచారు. హత్య జరిగిన ప్రాంతంలో లభించిన కీలక ఆధారమైన ఆ లేఖను ఎందుకు దాయాల్సి వచి్చంది? ఎవరు ఆదేశాలిచ్చారు?. లేఖను ఎవరు తొలుత గుర్తించారు? తర్వాత దాన్ని ఎక్కడ దాచిపెట్టారు? లేఖ విషయం తొలుత ఎవరెవరితో పంచుకున్నారు? లేఖను ఎన్ని గంటలకు పోలీసులకు అప్పగించారు? అప్పటి వరకు లేఖను గోప్యంగా ఉంచడానికి ప్రత్యేక కారణాలేవైనా ఉన్నాయా?.. ఇలా అనేక అంశాలపై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అధికారుల ప్రశ్నలకు కృష్ణారెడ్డి ముక్తసరిగా సమాధానాలిచ్చినట్లు తెలిసింది. ఇటీవల పులివెందులలోని కృష్ణారెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లగా, ఆ సమయంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యుల నుంచే వివరాలు సేకరించారు. ఆ తర్వాత విచారణకు హాజరుకావాలని కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన మంగళవారం సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: వివేకా కేసులో సునీత భర్తను విచారించిన సీబీఐ -
వరల్డ్ కప్ కి కొత్త వికెట్ కీపర్ ఎవరంటే...?
-
నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమం
-
జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటికి సీరియస్? ఐసీయూలో చికిత్స!
జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కమెడియన్ చంటి. చలాకీతనం, తనదైన కామెడీ టైమింగుతో అలరించిన చంటి కొంతకాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. పలు కామెడీ షోస్ చేసిన చలాకీ చంటి సినిమాల్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. బిగ్బాస్ సీజన్-6లోనూ పాల్గొని మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. కానీ బిగ్బాస్ నుంచి బయటకు వచ్చాక ఏ షోలోనూ పెద్దగా కనిపించలేదు. అయితే ప్రస్తుతం ఆయన తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా పరిస్థితి సీరియస్గా ఉండటంతో ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. -
శరత్బాబుకు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్కు తరలింపు
ప్రముఖ నటుడు శరత్బాబు మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బెంగళూరులో చికిత్స పొందిన ఆయన తాజాగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం శరత్బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూ నుంచి జనరల్ రూంకు షిఫ్ట్ చేశామని వైద్యులు తెలిపారు. కాగా 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమల్లో 200కి పైగా సినిమాలలో నటించారు. హీరోగానే కాకుండా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు పాత్రలతో అలరించారు. -
నేనే కిడ్నీ ఇద్దామనుకున్నా.. కానీ వద్దన్నారు: పంచ్ ప్రసాద్ భార్య
జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే చికిత్స తీసుకుంటున్నా ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో సహకరించడం లేదు. ఇటీవల రోజు రోజుకు కొత్త అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముడుతున్నాయి. అయితే ప్రస్తుతం పంచ్ ప్రసాద్ అభిమానులకు ఓ శుభవార్త చెప్పింది ఆయన భార్య. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉండగా.. ఒక కిడ్నీ దొరికిందని ఆమె తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది. పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ.. 'ఫస్ట్ నేనే కిడ్నీ ఇద్దామనుకున్నా. ట్రాన్స్ప్లాంటేషన్కు ముందు నాకు అన్ని టెస్టులు చేశారు. అన్నింటిలోనూ మ్యాచ్ అయ్యాయి. కానీ ఆయనది వయసు చిన్నది కావడంతో డాక్టర్లు వద్దన్నారు. బయట నుంచి తీసుకుందాం అని చెప్పారు. మళ్లీ భవిష్యత్తులో సమస్యలు వస్తే మీ కిడ్నీ తీసుకునేలా ప్లాన్ చేద్దాం అన్నారు. ప్రస్తుతమైతే ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్తున్నాం. మీ అందరికీ చెప్పడానికి కారణం ఏంటంటే.. ఆయన ఆరోగ్యం కోసం ఇప్పటికీ చాలా టెస్టులు జరిగాయి. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఆయన అభిమానులందరికీ తెలియజేయడం కోసం వీడియో చేశా. మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీతో పంచుకుంటూ ఉంటా. ఇలాంటి వీడియోలు పెడుతున్నందుకు ఏం అనుకోవద్దు. ఇది కేవలం మా ఛానెల్ ఆదరిస్తున్న వారందరికీ తెలియజేయడం కోసమే. మీ అందరీ ఆశీర్వాదంతోనే ఆయన కోలుకుంటున్నారని భావిస్తున్నా' అని అన్నారు. -
ఆ సార్లకు తలవంచి ధన్యవాదాలు చెబుతున్నా: బలగం మొగిలయ్య
హైదరాబాద్: నిమ్స్లో ‘బలగం’ మొగిలయ్యకు చికిత్స కొనసాగుతుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు వైద్యనిపుణులు నిత్య పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. ఛాతి నొప్పి రావడంతో మెరుగైన చికత్స నిమిత్తం వరంగల్ నుంచి నిమ్స్కు తరలించిన సంగతి తెలిసిందే. ఆయన దీర్ఘకాలంగా డయాబెటిక్, బీపీ సమస్యలతో బాధ పడుతున్నాడు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఏడాది నుంచి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి మొగిలయ్య కంటి చూపునూ కోల్పోయారు. ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనను గురువారం నిమ్స్ పాత భవనంలోని ఎఫ్ బ్లాక్ స్పెషల్ రూమ్కు తరలించి డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆహారం కూడా తీసుకుంటున్నారని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. తన పనులు తాను చేసుకోలేని పరిస్థితుల్లో మొగిలయ్య ఉన్నాడని ఆయన భార్య కొమురమ్మ కన్నీటి పర్యంతమైంది. అయనకు మెరుగైన వైద్యం అందించడానికి సాయపడుతున్న మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఆయా సార్ల సాయంతో నిమ్స్కు వచ్చిన మొగిలయ్య ఆరోగ్యం గురించి మరెంతో మంది పెద్ద సార్లు ఆందోళన చెందుతున్నారని.. ఇప్పటికీ అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, నిర్మాత దిల్ రాజు, బలగం దర్శకులు వేణు ఇంకా ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. -
ప్రీతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాం
లక్డీకాపూల్ (హైదరాబాద్)/సాక్షి, వరంగల్: పీజీ వైద్యవిద్యార్థిని ️ప్రీతిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నామని నిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమెకు ప్రొటోకాల్ ప్రకారం వైద్య చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై శనివారం యాజమాన్యం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నిమ్స్ వైద్య బృందం సభ్యులు మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ప్రస్తుతం ఆమెకు ఎక్మో సపోర్ట్తో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ పరిస్థితిలో ఉన్న ప్రీతిని నిమ్స్కు తీసుకువచ్చారని వైద్యులు తెలిపారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్లు నిమ్స్కు వచ్చి ప్రీతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రీతి ర్యాగింగ్ ఘటనకు మతం రంగు పులిమి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రగతిభవన్లో కూడా పేదవర్గాలపై కనబడకుండా ర్యాగింగ్ జరుగుతోందని తెలిపారు.ప్రీతి విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిష్పాక్షికంగా విచారణ: మంత్రి హరీశ్రావు ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు భరోసా కల్పించారు. నిష్పాక్షికంగా పూర్తి విచారణ జరుగుతుందని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్యంపై మంత్రి సమీక్షించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, చికిత్స చేస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని ఆరా తీశారు. డాక్టర్ ప్రీతికి అత్యుత్తమ చికిత్స అందించాలని వైద్యులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సైఫ్ విషయంలో ఏం చేద్దాం?: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో అరెస్టయిన సీనియర్ విద్యార్థి సైఫ్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే ర్యాగింగ్, వేధింపుల కేసులో అరెస్టయి జైలుకెళ్లిన సైఫ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కాళోజీ హెల్త్వర్సిటీకి.. కేఎంసీ ప్రిన్సిపల్ మోహనదాస్ శనివారం లేఖ రాశారు. సోమవారంలోగా నిర్ణయం రావొచ్చని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా సైఫ్పై చర్యలు ఉంటాయని ప్రిన్సిపల్ శనివారం ‘సాక్షి’కి తెలిపారు. అలాగే, కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా కేఎంసీలో సోమవారం ర్యాగింగ్ నియంత్రణ కమిటీ సమావేశమై నివేదికను రూపొందించి పంపుతుందన్నారు. ప్రీతి కేసులో సైఫ్పై ఆరోపణలు రుజువైతే అతడి పీజీ అడ్మిషన్ను రద్దు చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఒకవేళ ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించేలా సైఫ్ వ్యవహార శైలి ఉందని రుజువైతే ఎంబీబీఎస్ పట్టా కూడా రద్దు కావచ్చంటున్నారు. ఏమైనా.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడి చర్యలుంటాయని మోహన్దాస్ తెలిపారు. ‘సర్’పై సర్వత్రా చర్చ: కేఎంసీ కాలేజీలో సీనియర్లను.. జూనియర్లు ‘సర్’అని పిలుస్తున్నారని, దీనిపై దృష్టి సారించాల్సి ఉందని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇలా పిలిపించుకోవడం ర్యాగింగ్ కిందికే వస్తుందని వరంగల్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అభిప్రాయపడింది. సీనియర్లు, జూనియర్ల మధ్య ‘సర్’అనే పదం చాలా గ్యాప్ తీసుకొస్తుందని నిపుణులు అంటున్నారు. -
ఇంకా విషమంగానే ఎంజీఎం మెడికో ప్రీతి ఆరోగ్యం
-
ప్రీతి ఆత్మహత్యయత్నం ఘటనపై కొనసాగుతున్న విచారణ
-
అత్యంత విషమంగానే ప్రీతి ఆరోగ్యం
-
డాక్టర్గా ప్రీతి హెల్త్ కండీషన్ నాకు తెలుసు: తమిళిసై కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: వరంగల్కు చెందిన పీజీ వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కాగా, ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్లో పేర్కొన్నారు. ప్రీతికి ఎక్మో సపోర్ట్తో చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ప్రీతి ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ఈ సందర్భంగా తమిళిసై.. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఒక డాక్టర్గా నేను ప్రీతి కండీషన్ అర్థం చేసుకోగలను. ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉంది.. ఆరోగ్యపరంగా తనకు ఎటువంటి సహాయం అందజేయాలో నిమ్స్ వైద్యులు అందిస్తున్నారు. ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేము. ప్రీతి ఆరోగ్యంతో బయటకు రావాలని అందరం ప్రార్థిద్దాము. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ ర్యాగింగ్ అని పేరెంట్స్ చెబుతున్నప్పటికీ ఇప్పుడే ఒక కంక్లూషన్కి రాలేము. ఆమె యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పాల్గొన్నట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఒక బెస్ట్ స్టూడెంట్ ఇలా అవ్వడం బాధాకరం. డాక్టర్లు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించిన గవర్నర్ తమిళిసై
-
వరంగల్ మెడికల్ పీజీ స్టూడెంట్ ప్రీతి పరిస్థితి అత్యంత విషమం
-
మెరుగైన చికిత్స కోసం తారకరత్నను విదేశాలకు తరలిస్తారా?
గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత వారం రోజులుగా ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు బులిటిన్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కాస్త కోలుకున్నా ఇంకా మెరుగుపడలేదు. గుండెపోటుకు గురైన సమయంలో దాదాపు 45 నిమాషాల పాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో న్యూరో సర్జన్లతో పాటు 10మంది వైద్యుల బృందం.. ఆయన హెల్త్ కండీషన్ను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రీసెంట్గా మెదడు స్కానింగ్ తీసిన వైద్యులు రిపోర్డుల ఆధారంగా ట్రీట్మెంట్ అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మెదడులో స్వెల్లింగ్ క్రమంగా తగ్గుతోందని, వాపు తగ్గిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో తారకరత్న కోలుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పరిస్థితిని బట్టి అవసరమైతే తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంస సభ్యులు ఉన్నట్లు సమాచారం. -
అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, బెంగళూరు: సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తాజాగా తారకరత్న హెల్త్ కండీషన్పై శనివారం మధ్యాహ్నం హృదయాలయ డాక్టర్లు బుటిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. కాగా, టీడీపీ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్బంగా తారకతర్న అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆయన ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. దీంతో, తారకరత్నను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం, నారాయణ హృదయాలయ డాక్టర్లు కుప్పం వెళ్లారు. వైద్య చికిత్సల అనంతరం.. శనివారం బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చే సరికే తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. నిన్న రాత్రి తారకరత్నను బెంగళూరు ఆసుపత్రికి తీసుకువచ్చాము. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స జరుగుతోంది. తారకరత్నకు ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నాము. గుండె నాళాల్లోకి రక్తప్రసరణ కావడం లేదు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది అని తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బెంగళూరులోనే ఉండి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. -
'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమం?
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తమిళ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విజయ్ పళ్లు విరిగిపోయాయని, దవడ ఎముక సైతం విరిగినట్లు తెలుస్తోంది. ముఖానికి కూడా బలంగా దెబ్బలు తగిలియని సమాచారం. ప్రస్తుతం ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని, కండిషన్ సీరియస్గా ఉండటంతో విజయ్ కుటుంబసభ్యులు ఇప్పటికే మలేషియాకు చేరుకోగా, అక్కడినుంచి చెన్నైకి తరలించినట్లు ఆమె భార్య ఫాతిమా తెలిపారు. కాగా మలేషియాలో ప్రస్తుతం బిచ్చగాడు-2 షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సీన్స్ చేసే క్రమంలో బోటు అదుపుతప్పి నేరుగా కెమెరా ఉన్న బోటులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కోరుకంటున్నారు. ప్రస్తుతానికి బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ వాయిదా పడినట్లే. మరోవైపు విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, త్వరలోనే కోలుకుంటారని పేర్కొన్నారు. -
నటుడు విక్రమ్ గోఖలే చనిపోయారంటూ వార్తలు.. స్పందించిన కుటుంబం
బాలీవుడ్ సీనియర్ నటుడు విక్రమ్ గోఖలే మృతిచెందినట్లు మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కుటుంబం స్పందించింది. గోఖలే ఇంకా బతికే ఉన్నారని, అయితే పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. విక్రమ్ గోఖలే ఇంకా బతికే ఉన్నారు. నిన్న సాయంత్రం కోమాలోకి వెళ్లారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ఉన్నారు. గుండె, కిడ్నీ సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఆయన కోసం ప్రార్థించండి అంటూ అని గోఖలే కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోఖలే పూణెలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉంది. అయితే అప్పటికే మీడియాలో, వెబ్సైట్లలో గోఖలే చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. బాలీవుడ్ ప్రముఖ నటులు అజయ్ దేవగణ్, రితేశ్ దేశ్ముఖ్, అలీ గోనీ, జావెద్ జాఫరీ తదితరులు కూడా ట్విట్టర్ ద్వారా సంతాపం కూడా తెలిపారు. ఈ క్రమంలో గోఖలే కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. బాలీవుడ్లో 'భూల్ భులయ్యా', 'దిల్ సే','దే దానా దాన్', 'హిచ్కీ', 'నికమ్మ', 'మిషన్ మంగళ్' వంటి బాలీవుడ్ హిట్ సినిమాల్లో ఆయన కనిపించారు. Prayers for Vikram Gokhale who has slipped into a Coma and is still very very critical according to his wife 🙏 #VikramGokhale — Sᴜᴢᴀɴɴᴇ Bᴇʀɴᴇʀᴛ (@suzannebernert) November 24, 2022 -
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి తాజా అప్డేట్
-
శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న కృష్ణ
-
సమంతకు ఏమైంది ..ఆమె వ్యాధి అంత తీవ్రమైందా..?
-
విషమంగానే ములాయం ఆరోగ్యం
లక్నో/గురుగ్రామ్: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్(82) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రి వర్గాలు గురువారం తెలిపాయి. ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఆరోగ్యం విషమించడంతో ములాయంను ఆదివారం మేదాంత ఐసీయూలో చేర్పించిన విషయం తెలిసిందే. -
మంత్రి విశ్వరూప్ను ఫోన్లో పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్.. శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శుక్రవారం మైల్డ్ స్ట్రోక్కు గురికావడంతో కుటుంబ సభ్యులు విశ్వరూప్ను వెంటనే రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. అయితే అనంతరం, విశ్వరూప్ను హెల్త్ కండీషన్ను పరిశీలించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. కాగా, శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంత్రి విశ్వరూప్ను ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా విశ్వరూప్ ఆరోగ్య పరిస్థితిపై సిటీన్యూరో వైద్యులను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. -
సీఎం స్టాలిన్ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు..
సాక్షి, చెన్నై: అంతుచిక్కని వ్యాధితో పోరాడుతూ శస్త్ర చిక్సిత అనంతరం సవిత ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్న చిన్నారి డానియాను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరామర్శించారు. తిరువళ్లూరు జిల్లా ఆవడి వీరాపురంలోని శ్రీవారి నగర్ ప్రాంతానికి చెందిన స్టీఫెన్రాజ్, సౌభాగ్య దంపతులకు 2012లో వివాహం జరిగింది. వీరికి డానియా అనే కుమార్తెతో పాటు ఓ కుమారుడు ఉన్నాడు. డానియా వీరాపురంలోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. బాలిక ముఖంపై నల్లమచ్చలు రావడంతో చిన్నారి అంతుచిక్కని వ్యాధికి గురైంది. మొదట సాధారణ రక్తం గడ్డగానే భావించి ఎగ్మోర్ చిన్నపిల్లల వైద్యశాలకు తీసుకెళ్లి చిక్సిత అందించారు. గత ఆరేళ్లుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల చుట్టూ తిరిగినా రోగం నయం కాలేదు. రోజులు గడిచే కొద్ది డానియా కుడికన్ను, దవడ, పెదవికి ఒక వైపు పూర్తిగా విచ్ఛిన్నం కావడం ప్రారంభమైంది. దీంతో డానియా సీఎం స్టాలిన్ అంకుల్–ఆదుకోండి అంటూ చేసిన విజ్ఞప్తి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో సీఎం వెంటనే బాలిక పరిస్థితిపై పూర్తి నివేదికను తెప్పించుకుని వైద్యసేవలను అందించాలని సూచించారు. స్థానిక మంత్రి నాజర్ బాలిక కుటుంబానికి తక్షణ సాయం అందించడంతో పాటు సవిత వైద్యశాలలో బాలిక అపరేషన్ను దగ్గరుండి పర్యవేక్షించారు. పూందమల్లి సవిత వైద్యశాల ఈనెల 23న విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసింది. ఇటీవల ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు బాలికను మార్చారు. దీంతో ముఖ్యమంత్రి స్టాలిన్ నేరుగా సవిత వైద్యశాలకు వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు. ‘‘ఆపరేషన్ విజయవంతమైంది. భయపడాల్సిన అవసరం లేదు. త్వరలోనే పాఠశాలకు వెళ్లొచ్చు. భవిషత్లోనూ వైద్యసేవలు అవసరమైతే సాయం అందిస్తాం’’ అని సీఎం బాలికకు భరోసా ఇచ్చారు. చదవండి: (భర్తతో గొడవ.. ఆస్పత్రిలో చేరిన జయలలిత మేనకోడలు దీప) -
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజాకు ఏమైంది? మరో హాస్పిటల్కు తరలింపు
తమిళసినిమా: సీనియర్ దర్శకుడు భారతీరాజా అనారోగ్యానికి గురై ఇటీవల ఒక చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం కుదురుగానే ఉంది. గుండెల్లో నెమ్ము చేరడం వల్ల అనారోగ్యానికి గురయ్యారని, రెండు రోజుల్లోనే సంపూర్ణ ఆరోగ్యంతో భారతీరాజా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు. అలాంటిది సడన్గా శుక్రవారం ఆయనకు మెరుగైన వైద్యం కోసం స్థానిక పోరూరులోని శ్రీరామచంద్రన్ ఆసుపత్రిలో చేర్చారు. భారతీరాజా కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వచ్చిన గీత రచయిత వైరముత్తు అనంతరం మీడియాతో మాట్లాడారు. భారతీరాజా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు భారతీరాజా శనివారం మధ్యాహ్నం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేరారు. అందులో ఇటీవల అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన తనకు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది మెరుగైన వైద్యాన్ని అందిస్తూ చాలా శ్రద్ధగా వైద్య సేవలను అందించడంతో తాను కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆసుపత్రిలోని విజిటర్స్ ప్రవేశానికి అనుమతి లేనందున తనను చూడడానికి ఎవరూ రావద్దని కోరుకుంటున్నానన్నారు. తాను ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే ప్రత్యక్షంగానూ, ఫోన్ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా పరామర్శించినా, తాను త్వరలో కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారన్నారు. అయితే భారతీరాజా అనారోగ్యానికి కారణం ఏమిటన్నది ఇప్పటి వరకు వైద్యులు గాని ఆయన కుటుంబ సభ్యులు గాని వెల్లడించలేదు. దీంతో దర్శకుడు భారతీరాజాకు ఏమైంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
కోటంరెడ్డికి సీఎం జగన్ పరామర్శ.. పనితీరుపై ప్రశంసల వర్షం
నెల్లూరు(సెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిని ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురి కావడం, నెల్లూరు అపోలో వైద్యశాల నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించడం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకున్న శ్రీధర్రెడ్డి నెల్లూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మంగళవారం ఫోన్ చేసి కోటంరెడ్డితో పలు విషయాలు చర్చించారు. అసలేమి జరిగింది, వైద్యులు ఏమి చెప్పారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నా.. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోటంరెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. రూరల్ నియోజకవర్గంలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం విషయాలపై చర్చించారు. చదవండి: (మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతు తీసుకోవడమే: సీఎం జగన్) మొదటి విడత ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పూర్తి చేశామని, త్వరలోనే రెండో విడత ప్రారంభిస్తానని ముఖ్యమంత్రికి కోటంరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, క్షేత్ర స్థాయిలో వాటి ఫలితాలు అనుభవిస్తున్న ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అత్యంత బలంగా ఉందని అన్ని సర్వేల్లో అత్యున్నత గ్రాఫ్ కనిపించిందని కోటంరెడ్డి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. రానున్న ఒకటిన్నర సంవత్సరంలో కూడా ఇదే విధంగా పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నెల్లూరు రూరల్కు సంబంధించి ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సి ఉన్నా.. తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోటంరెడ్డికి ముఖ్యమంత్రి చెప్పారు. -
Putin: పుతిన్ బతికేది మరో మూడేళ్లే!
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై పాశ్చాత్య దేశాలు, రష్యా నిఘా మీడియాలు చేస్తున్న హడావిడి ఏమాత్రం తగ్గట్లేదు. క్రెమ్లిన్ నేత పరిస్థితిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. తరచూ ఏదో ఒక కథనం బయటకు వస్తూనే ఉంది. ఈ తరుణంలో పుతిన్ టైం దగ్గర పడిందంటూ తాజాగా ఓ సంచలన కథనం వెలువడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ పరిస్థితి క్యాన్సర్తో క్షీణిస్తున్నట్లు తాజా కథనం వెలువడింది. ఎఫ్ఎస్బీ (Federal Security Service) అధికారి బోరిస్ కార్పిచ్కోవ్ పుతిన్ ఆరోగ్యంపై తాజాగా ఓ ప్రకటన విడుదల చేసినట్లు ఆ కథనం ఉంది. క్యాన్సర్ బాధితుడైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మహా అయితే మరో మూడేళ్లు మాత్రమే బతుకుతారని వైద్యులు తెలిపినట్లు ఆయన ప్రకటన ఉంది. పుతిన్ ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణిస్తోంది. రెండు నుంచి మూడేళ్లు మాత్రమే బతుకుతారని వైద్యులు అంటున్నారు. పుతిన్ క్రమంగా కంటిచూపు కూడా కోల్పోతున్నారని, తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నట్లు బోరిస్ వెల్లడించినట్లు ఆ కథనం ఉంది. పుతిన్ ప్రసంగాల టైంలో అక్షరాలను చాలా పెద్దదిగా రాసి ఇస్తున్నారని చెప్పారాయన. కళ్లద్దాలు ధరించేందుకు పుతిన్ ససేమిరా అంటున్నారని, దృష్టిలోపం ఉన్నట్లు అంగీకరించడం పుతిన్కు ఇష్టం లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. పుతిన్ కాళ్లుచేతులు వణకడం సమస్య పెరిగిపోయిందని తెలిపారు. తన కింద పనిచేసే సిబ్బందిపై చీటికీమాటికీ కోపగించుకుంటున్నారని, విపరీతమైన చిరాకుతో సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని సదరు నిఘా అధికారి చెప్పారు. ఇక యూకే ఇంటెలిజెంట్ అధికారి క్రిస్టోఫర్ స్టీల్ కూడా పుతిన్ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని తెలిపాడు. సమావేశాలను పూర్తి చేయకుండానే పుతిన్ మధ్యలో వెళ్లిపోతున్నాడని, ఆయన పరిస్థితి నానాటికీ దిగజారుతోంది అనడానికి ఇదే నిదర్శనమని క్రిస్టోఫర్ చెబుతున్నాడు. కళ్లు మూసుకున్నారేమో! ఇదిలా ఉంటే.. పుతిన్ ఆరోగ్యంపై ఇప్పటివరకు రష్యా స్పందించలేదు. కానీ, మరీ తారాస్థాయికి ప్రచారం చేరడంతో ఇప్పుడు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఘాటుగా స్పందించారు. పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న కథనాలు అంతా ఉత్త ప్రచారమే అని కొట్టిపారేశారు ఆయన. ‘‘ఆయన(పుతిన్) సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని తెలిపాడు. విచక్షణ ఉన్నవాడేవడూ.. ఇలా ప్రవర్తించడు, ఉత్త ప్రచారాలు చేయడు అంటూ పుతిన్ అనారోగ్య కథనాలపై సెటైర్లు వేశాడు లావ్రోవ్. ఈ అక్టోబర్కు పుతిన్కు 70 ఏళ్లు నిండుతాయి. అయినా రోజూ ఆయన వార్తల్లో కనిపిస్తున్నారు కదా. నిత్యం టీవీల్లోనూ ప్రసంగిస్తున్నారు. కొందరికి కళ్లు మూసుకుపోయినట్లు ఉన్నాయి. అయినా పుకార్లను పంచడం వాళ్లకేం(పాశ్చాత్య మీడియాను ఉద్దేశించి) కొత్త కాదు కదా అంటూ పుతిన్ ఆరోగ్యంపై ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు సెర్గీ లావ్రోవ్. -
ఉక్రెయిన్లో దయనీయ పరిస్థితి..!
According WHO healthcare situation: ఉక్రెయిన్ పై రష్యా గత నెలరోజుల పైగా దాడి చేస్తూనే ఉంది. వైమానిక క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఈ యుద్ధం కేవలం ఉక్రెయన్కి ప్రాణ, ఆస్తి నష్టం మాత్రమే కలగించలేదు, అంతకుమంచిన తీవ్ర దుష్పరిణామాను మిగిల్చింది. ఈ నిరవధిక దాడుల కారణంగా ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. స్వచ్ఛమైన నీరు, ఆహారం లేకపోవడంతో ప్రజలు అనారోగ్యానికి గురుయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ వైమానికి దాడుల కారణంగా కాలుష్యం ఎక్కువై నీరు, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోందని చెబుతోంది. ప్రస్తుతం రష్యా బలగాలు మారయుపోల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు ముమ్మరం చేశారు. నిజానికి 2011లో మారియుపోల్ తొలి కలరా వ్యాధిని గుర్తించారు. మళ్లీ ఈ యుద్ధం కారణంగా ఆ వ్యాధి మరింత ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మార్చి 18 నాటికి లుహాన్స్క్ ప్రాంతంలో దాదాపు లక్ష మందికి నీటి సౌకర్యం లేదని తెలిపింది. అయితే ప్రభుత్వేతర నియంత్రిత ప్రాంతాలలో కూడా దాదాపు 4 లక్షల మందికి నీటి సరఫరా లేదని వెల్లడించింది. ఈ యుద్ధం కారణంగా చాలామంది వ్యక్తులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అందువల్ల డిజార్డర్ డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. గర్భనిరోధకం అందుబాటులో లేకపోవడం వల్ల లైంగిక పరంగా హింసకు గురయ్యే ప్రమాదం పోంచి ఉందని తెలిపింది. అదీగాక లైంగికంగా సంక్రమించే వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుందని డబ్ల్యూహెచ్ఓ అంటోంది. ప్రమాదకరమైన సంక్రమిత అంటు వ్యాధులు కోవిడ్-19 కేసులు ఈ బాంబుల దాడుల కారణంగా ఒకే షెల్టర్లో కోవిడ్ -19 పేషంట్లకు వైద్యం అందించాల్సిన స్థితి ఏర్పడుతుంది. అది కాక ఈ బాంబు దాడుల కారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ఎక్కువయ్యే అవకాశం ఉంది. మార్చి 17 కల్లా ఉక్రెయిన్లో సుమారు 27,671 కోవిడ్ -19 కేసులు 384 మరణాలు సంభవించాయని నివేదిక పేర్కొంది. అయినా ఈ యుద్ధ తీవ్రత కారణంగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడం, చికిత్స అందించడం కూడా కష్టమేనని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. మీజిల్స్ కేసులు మార్చి 22న, రొమేనియాకు వచ్చి శిబిరాల్లో ఉంటున్న ఉక్రేనియన్ శరణార్థులలో మూడు అనుమానిత మీజిల్స్ కేసులు గుర్తించనట్లు నివేదిక తెలపింది. ప్రసవానంతర సంరక్షణ వచ్చే మూడు నెలల్లో ఉక్రెయిన్లో దాదాపు 80 వేల మంది మహిళలు జన్మనిస్తారని అంచనా. ప్రసూతి సంరక్షణకు అంతరాయం ఏర్పడి ప్రసూతి నియోనాటల్ సమస్యల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అదీగాక ప్రసూతి ఆసుపత్రులతో సహా ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై దాడుల కారణంగా సిజేరియన్ వంటి విధానాలను నిర్వహించడం, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ అందించడం వంటి ప్రసూతి సమస్యలను నిర్వహించే సామర్థ్యం కూడా తగ్గిందని డబ్ల్యూహెచ్ఓ నివేదికలో వెల్లడించింది. (చదవండి: ఫస్ట్ స్టేజ్ మిలటరీ ఆపరేషన్ ఫినిష్... అదే మా లక్ష్యం!) -
లాలూ ప్రసాద్ హెల్త్ కండీషన్ సీరియస్.. టెన్షన్లో తేజస్వీ యాదవ్!
సాక్షి, న్యూఢిల్లీ: బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. మంగళవారం సాయంత్రం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో రాంచీలోని రిమ్స్ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన ఆరోగ్యం మెరుగుపడటంతో ఈరోజు ఉదయం ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం సడెన్గా మళ్లీ లాలూ ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించినట్టు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్కు తెలిపారు. తేజస్వీ మీడియాతో మాట్లాడుతూ.. లాలూ జీ ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. మంగళవారం రాంచీలో చికిత్స పొందుతున్న సమయంలో ఇన్ఫెక్షన్ స్థాయి 4.5 గా ఉందని.. అనంతరం ఢిల్లీలో పరీక్షించినప్పడు అది 5.1కు పెరిగిందని తెలిపారు. తాజాగా బుధవారం మధ్యాహ్నం పరీక్షించినప్పడు ఇన్ఫెక్షన్ స్థాయి 5.9కు చేరుకుందని వెల్లడించారు. మరోవైపు.. దాణా కుంభకోణం, డోరండా ట్రెజరీ నుండి 139 కోట్ల రూపాయలను అపహరించిన కేసులో ఇటీవలే ప్రత్యేక సీబీఐ కోర్టు.. లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 60 లక్షల జరిమానాను విధించింది. దీంతో ఆయనను బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో రిమ్స్కు తరలించారు. Lalu Prasad Yadav Ji is undergoing treatment in AIIMS, Delhi. His creatinine level was 4.5 when he was in Ranchi. It increased to 5.1 when it was tested in Delhi. It reached 5.9 when tested again. So the infection is increasing: Tejashwi Yadav, RJD leader and son of Lalu Yadav pic.twitter.com/f1iMxN1vdX — ANI (@ANI) March 23, 2022 -
క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన్ను.. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) నుంచి ఢిల్లీ ఎయిమ్స్కు హుటాహుటిన తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. క్రియాటిన్ లెవల్ పడిపోవడంతో మెరుగైన ఆరోగ్యం కోసం లాలూను మంగళవారం ఎయిమ్స్కు తరలించాలని జైలు అధికారులకు రిఫర్ చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర ప్రసాద్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు ఏప్రిల్ 1వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను జార్ఖండ్ హైకోర్టు మార్చి 11వ తేదీన కొట్టేసింది. 73 ఏళ్ల లాలూకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో ఆయన్ని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఆంబులెన్స్లో లాలూను ఎయిమ్స్కు తరలించే అవకాశం ఉంది. -
ఎడమ చేయి లాగుతున్నట్టుగా ఉందని కేసీఆర్ చెప్పారు: వైద్యులు
-
సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రెండు రోజులుగా సీఎం కేసీఆర్ నీరసంగా ఉన్నారని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఎడమ చేయి లాగుతున్నట్లుగా ఉందని కేసీఆర్ చెప్పారని పేర్కొన్నారు. ఈ ఉదయం కేసీఆర్ కాల్ చేసి సమస్య వివరించారని తెలిపారు. ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేసుకోవాలని సూచించగా సీఎం ఒప్పుకున్నారన్నారు. ఆయనకు తొలుత ఈసీజీ, ఆ తర్వాత 2డి ఎకో పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. చదవండి: CM KCR: సీఎం కేసీఆర్కు అస్వస్థత! ఈసీజీ, 2డి ఎకో పరీక్షల్లో అంతా నార్మల్గా ఉన్నట్లు తేలిందని వైద్యులు తెలిపారు. ఎందుకైనా మంచిదని యాంజియోగ్రామ్ చేశామన్నారు. ఆ పరీక్షల్లో ఎలాంటి బ్లాక్ లేదని తేలిందన్నారు. ఎడమ చేయి ఎందుకు లాగుతుందన్న కారణంగా ఎంఆర్ఐ చేశామన్నారు. మెడకు సంబంధించి ఎంఆర్ఐ, అలాగే బ్రెయిన్ ఎంఆర్ఐ కూడా చేశామని యశోద వైద్యులు వెల్లడించారు. ‘‘షుగర్, బీపీ పరీక్షలు కూడా చేశాం. కంట్రోల్లో ఉండడానికి సూచనలిచ్చాం. ప్రస్తుతానికి పెద్ద సమస్య ఏం లేదు. వారం పాటు విశ్రాంతి సూచించాం. సర్వికల్ స్పెన్ ఎంఆర్ఐలో కొంత రూట్ నర్వ్ పెయిన్ ఉన్నట్లు గమనించామన్నారు. వారం రోజుల విశ్రాంతితో సీఎం కేసీఆర్ నార్మల్ అవుతారని’’ వైద్యులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ డిశ్చార్జి యశోద ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జి అయ్యారు. ఆయన ప్రగతి భవన్కు చేరుకున్నారు. వారం పాటు విశ్రాంతి తీసుకోవాలని కేసీఆర్కు వైద్యులు సూచించారు. -
సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ నన్ను కదిలించింది: కైకాల సత్యనారాయణ
Legendary actor Kaikala Satyanarayana: గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్ లో చేరిన టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న ఆయన.. తన అనారోగ్య సమయంలో సహాయం అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్కి ఓ లేఖ రాశారు. ‘బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధకు పట్ల నేను చాలా సంతోషిస్తున్నానని ఆయన అన్నారు. మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు, వైద్య ఖర్చులను తీర్చడానికి ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారు. ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చింది. మీరు చూపిన ఈ శ్రద్ధ మీకు కళాకారుల పట్ల మరియు వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది. ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుంది’ అని కైకాల లేఖలో పేర్కొన్నారు. తాను సంతకం చేయలేక పోవడంతో, తన కుమారుడు ఈ కృతజ్ఞతా లేఖపై సంతకం చేశారని ఆయన వెల్లడించారు. అంతే కాక తనకు బాగోనప్పుడు తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. అలాగే అభిమానుల ప్రార్థనలే తనని మళ్ళీ మాములు మనిషిని చేశాయని ఆయన అన్నారు. -
మాజీ ప్రధాని ప్రాణాలకు ముప్పు.. విదేశాలకు వెళ్లడానికి అనుమతివ్వండి
ఢాకా: గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, విపక్షనేత, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు(బీఎన్పీ) ఖలేదా జియా(76)ను వైద్యం కోసం విదేశాలకు పంపించకపోతే.. ఆమె జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు ఆమెకు విదేశాల్లో అత్యాధునిక వైద్య చికిత్స చేయడం చాలా ముఖ్యం అని లేకుంటే జియా జీవితానికే ప్రమాదం అని తెలిపారు. ఆమెకు లివర్ సిర్రోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 2018లో అవినీతి ఆరోపణలపై దోషిగా తేలిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకురాలైన జియాను దేశం విడిచి వెళ్లకుండా కోర్టు నిషేధించింది. గత రెండు వారాల్లో ఆమెకు మూడుసార్లు భారీ అంతర్గత రక్తస్రావం జరిగినట్లు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా జియాకు చికిత్స అందిస్తోన్న ప్రధాన వైద్యుడు ఫకృద్దీన్ మొహమ్మద్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. ‘‘మా దగ్గర అత్యాధునిక వైద్య సాంకేతికత అందుబాటులో లేదు. ముఖ్యంగా రక్తస్రావాన్ని నియంత్రించడానికి, ఆపడానికి కావాల్సిన అత్యాధునిక వైద్య సదుపాయాలు మా దేశంలో లేవు’’ అని తెలిపారు. (చదవండి: లైంగిక ఆరోపణలకు రివెంజ్!.. నటి అరెస్ట్తో ఉలిక్కిపాటు) వచ్చే వారంలో జియాకు మరో అంతర్గత రక్తస్రావం అయ్యేందుకు 50 శాతం అవకాశం ఉందని, వచ్చే ఆరు వారాల్లో 70 శాతం ఉందని సిద్ధిఖీ తెలిపారు. ఇది ఇలానే కొనసాగితే ఆమె ప్రాణాలకే ప్రమాదం అన్నారు. ‘‘జియా ప్రాణాలు కాపాడాలంటే.. అధునాతనమైన వైద్య చికిత్స ‘టిప్స్’(TIPS) చేయించాలి. అది కేవలం అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. అందుకే వైద్యం నిమిత్తం విదేశాలకు వెళ్లడానికి జియాకు అనుమతివ్వాలి’’ అని సిద్ధిఖీ కోరారు. (చదవండి: సినిమా కథను తలపించే లవ్స్టోరీ.. ప్రియుడి కోసం భారత్కు.. అతడి మరణంతో...) కోవిడ్ నుంచి కోలుకున్న ఐదు నెలల తర్వాత జియా మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో 2021, నవంబర్ 13 నుంచి జియాను ఢాకా ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో బీఎన్పీ కార్యకర్తలు, మద్దతుదారులు ఆమెను చికిత్స కోసం విదేశాలకు వెళ్లడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. చదవండి: చదువు కోసం వెళ్తారు.. ఉగ్రవాదులుగా తిరిగొస్తారు -
కైకాల కుమారుడికి సీఎం జగన్ ఫోన్
సాక్షి, అమరావతి: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కైకాల కుమారుడికి ఫోన్ చేశారు. కైకాల చిన్న కుమారుడు, కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)కు సీఎం జగన్ ఫోన్ చేసి.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రస్తుతం కైకాల హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అదే విధంగా రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చదవండి: Smart Policing: స్మార్ట్ పోలీసింగ్లో సర్వేలో ఏపీ అరుదైన రికార్డు.. కైకాల కుమారుడి ఫోన్ చేసిన సినీ ప్రముఖులు సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, సీనియర్ నటుడు రావు రమేష్ కన్నడ సూపర్ స్టార్ యష్, మరో స్టార్ శివ రాజ్ కుమార్లు కైకాల కుమారుడికి ఫోన్ చేసి కైకాల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కైకాలకు ఏమీ కాదని, తామంతా ఉన్నామని సినీ ప్రముఖుల ధైర్యం చెప్పారు. మరోవైపు కైకాల కోలుకుంటున్నారని, ఎలాంటి ఇబ్బంది లేదని, దయచేసి పుకార్లు సృష్టించి ప్రజలను, కైకాల అభిమానులను ఆందోళనకు గురి చేయవద్దని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. -
నటుడు కైకాల ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా
CM YS Jagan Inquires About Kaikala Satyanarayana Health Condition: నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్పై వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా కైకాల ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కైకాల కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడటంతో నొప్పులు ఎక్కువగా ఉండటంతో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే బీపీ లెవల్స్ చాలా తక్కువగా ఉండటంతో వాసో ప్రెజర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. కైకాలను ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పరిశీలిస్తోందని తెలిపారు. -
గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఫోన్లో ఆరా తీశారు. బుధవారమే గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన సీఎం జగన్ సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని అన్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: (Andhra Pradesh: సంస్కరణలకు శుభారంభం) కాగా, 88 ఏళ్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 17న మధ్యాహ్నం 1 గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు. అయితే గవర్నర్కు నవంబర్ 15న కోవిడ్ పాజిటివ్గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. కాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు శనివారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డెంగ్యూతో బాధపడుతున్నారని, అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఎయిమ్స్ అధికారులు శనివారం తెలిపారు. మన్మోహన్సింగ్ ప్లేట్లెట్ల సంఖ్య వృద్ధి చెందుతోందని వైద్యులు తెలిపారు. చదవండి: కేంద్రమంత్రిపై మన్మోహన్ సింగ్ కుమార్తె ఆగ్రహం..‘వాళ్లేం జూలో జంతువులు కాదు’ కాగా మాజీ ప్రధాని జ్వరం, నీరసం వంటి అనారోగ్య సమస్యలతో బుధవారం ఎయిమ్స్లో చేరారు. డెంగ్యూ జ్వరం బారినపడిన మాజీ ప్రధాని.. ఎయిమ్స్ ఆస్పత్రిలోని కార్డియో న్యూరో సెంటర్లోని ఓ ప్రైవేట్ వార్డులో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ నితీష్ నాయక్ మార్గదర్శకత్వంలోని కార్డియాలజిస్ట్ బృందం మాజీ ప్రధాని ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. చదవండి: వైరల్: వీడెవడ్రా బాబు.. నాకే పోటీగా వచ్చేలా ఉన్నాడు.. -
నిలకడగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మాజీ ప్రధాని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. బుధవారం ఆయన అస్వస్థతకు గురవటంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకొని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మన్మోహన్ సింగ్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ట్విటర్లో పేర్కొన్నారు. I pray for the good health and speedy recovery of Dr. Manmohan Singh Ji. — Narendra Modi (@narendramodi) October 14, 2021 -
ఆక్సిజన్ సపోర్టు తొలగింపు: కళ్లు తెరచి చూస్తున్న సాయితేజ
సాక్షి, హైదరాబాద్: మెగా హీరో సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన పూర్తిగా కోలుకున్నట్లు బుధవారం వైద్యులు తెలిపారు. సాయితేజ్కు వెంటిలేటర్ తొలగించారు. తేజ్ ఆరోగ్యం మెరుగవడంతో కళ్లు తెరిచి చూస్తుండడంతో బుధవారం ఆక్సిజన్ సపోర్టు సైతం తీసేసినట్లు చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం కుదుటపడుతుందని పేర్కొన్నారు. కాగా కొన్ని రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చారు. సొంతంగానే శ్వాస తీసుకుంటూ అందరితో మాట్లాడగలుగుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. చదవండి: సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్పందించిన నరేశ్ -
పూర్తిగా కోలుకున్న సాయిధరమ్ తేజ్
బంజారాహిల్స్ (హైదరాబాద్): రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. ఆయన స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్ తొలగించినట్లు వైద్యబృందం సోమవారం వెల్లడించింది. మూడు రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామంది. సొంతంగానే శ్వాస తీసుకుంటున్న సాయిధరమ్.. అందరితో మాట్లాడగలుగుతున్నారని తెలిపింది. మరో రెండు, మూడురోజుల్లో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నట్లు పేర్కొంది. ఈనెల 10న దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి వెళ్తూ బైక్ స్కిడ్ అయి సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. -
సాయి తేజ్ మూడు రోజుల్లో బయటకు వస్తారు: మోహన్బాబు
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ బైక్పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడిన నటుడు సాయిధరమ్ తేజ్ హైదరాబాద్లోని అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని పరామర్శించేందుకు సినీ ప్రముఖులు తరలివస్తున్నారు. తాజాగా సినీ నటుడు మంచు మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి సోమవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చారు. సాయిధరమ్ తేజ్ను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయిబాబా ఆశీస్సులతో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆయన తిరిగి బయటికి వస్తాడు అని చెప్పారు. చదవండి: ‘ఢిల్లీలో ఏమన్న చేసుకోండ్రి.. మా రాష్ట్రంలో ఏందీ లొల్లి’ ఆదివారం తేజ్కు శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నాడని వైద్యులు ప్రకటించారు. 36 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. కాగా శుక్రవారం సాయంత్రం సాయి ధరమ్ తేజ్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా వైపు వెళ్తుండగా రోడ్డుపై ఇసుక ఉండడంతో అతడి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయి అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన కాలర్ బోన్ ఫ్యాక్చర్ కాగా ఛాతి, కుడి కన్నుపై గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? ఇది చూస్తే మీ స్ట్రెస్ హుష్కాకి -
సాయిధరమ్తేజ్ కోలుకుంటున్నారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: అభిమానులు ఆందోళన పడవద్దని.. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సాయిధరమ్తేజ్ కోలుకుంటున్నారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.. రెండు రోజుల్లో సాయిధరమ్ తేజ్ తిరిగి వస్తాడని చిరంజీవి పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయిధరమ్తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేనల్లుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్న సమాచారంతో శుక్రవారం రాత్రి చిరంజీవి, పవన్కల్యాణ్, అల్లు అరవింద్ వెంటనే మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి వచ్చారు. మెడికవర్ ఆసుపత్రి వైద్యులను అడిగి సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సాయితేజ్ కోలుకుంటున్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. మెరుగైన వైద్యం కోసం మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రి నుండి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి సాయిధరమ్తేజ్ను తరలించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాయిధరమ్తేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు రోడ్డు ప్రమాదంలో హీరో సాయి ధరమ్ తేజ్కు తీవ్రగాయాలు -
ఎంపీ రెడ్డప్పను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్పను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి శనివారం పరామర్శించారు. ఎంపీ రెడ్డప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయన్ను ఢిల్లీలోని ఫోర్టీస్ హాస్పిటల్లో చేర్పించారు. ఆయనకు వైద్యులు గుండె ఆపరేషన్ చేశారు. -
కిమ్ తల వెనుక మిస్టీరియస్ స్పాట్!
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(37) ఆరోగ్యంపై మళ్లీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన తల వెనుక భాగంలో బ్యాండేజీ, తర్వాత పెద్ద మచ్చ కనిపించడమే ఇందుకు కారణం. అది మిస్టీరియస్ స్పాట్ అంటూ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. జూలై 24 నుంచి 27 దాకా జరిగిన కొరియన్ పీపుల్స్ ఆర్మీ కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తల వెనుక భాగంలో బ్యాండేజీ ఉన్న దృశ్యాలు టీవీలో ప్రసారమయ్యాయి. తర్వాత ఈ బ్యాండేజీ లేదు. దానికింద ఉన్న మచ్చ కనిపించింది. కిమ్కు ఏం జరిగినా, ఆయన ఏం చేసినా, ఎవరితో మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో బాగా లావుగా కనిపించిన కిమ్ జోంగ్ ఉన్న జూన్లో చాలా సన్నబడ్డారు. ఈ వార్త ఉ.కొరియా శత్రుదేశాల్లో చర్చనీయాంశమైంది. భారీ కాయంతో కంటికి నిండుగా కనిపించే తమ అధినేత బక్క పలుచగా మారడాన్ని చాలామంది ఉత్తర.కొరియన్లు తట్టుకోలేకపోయారట. కొందరైతే కన్నీరు పెట్టుకున్నారట! కిమ్ ఆరోగ్యం విషయంలో ప్రస్తుతం అసాధారణ సంకేతాలేవీ లేవని, ఆయన బాగానే ఉన్నారని ఉత్తర కొరియాకు శత్రు దేశమైన దక్షిణ కొరియా నేషనల్ ఇంటలిజెన్స్ సర్వీసు చెబుతోంది. కిమ్ జోంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్కు తల వెనుక భాగంలో టెన్నిస్ బంతి సైజ్లో కణితి ఉండేది. -
జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఈటలకు చికిత్స
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో వైద్యులు ఈటలకు చికిత్స అందిస్తున్నారు. ఈటల రాజేందర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, వివేక్ పరామర్శించారు. కాగా హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తున్న సమయంలో ఈటల రాజేందర్ అస్వస్థకు గురైన విషయం తెలిసిందే. ఈటల రాజేందర్కు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆయనకు ఆక్సిజన్, బీపీ స్థాయిలు పడిపోయినట్లు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే ఈటల రాజేందర్ను హైదరాబాద్ తరలించారు. ఈటల అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన ప్రజాదీవెన పాదయాత్రకు బ్రేక్ పడింది. -
ఆ వార్తలను నమ్మకండి : నటుడు చంద్రమోహన్
కథానాయకుడిగా ఇండస్ర్టీలోకి వచ్చి ఆ తర్వాత సహాయ నటుడిగా, హాస్య నటుడిగా ఎన్నో విలక్షణమైన పాత్రలతో మెప్పించారు నటుడు చంద్రమోహన్. 55ఏళ్ల సినీ ప్రయాణంలో దాదాపు 900లకు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఆదివారం 81వ వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..ఐదు దశాబ్దాల పాటు సినీ జీవితంలోనే ఉన్నాను. కేవలం హీరో పాత్రలు మాత్రమే చేయాలని కాకుండా, అన్ని రకాల పాత్రలను పోషించాను. ఈ క్రమంలో నిర్విరామంగా పనిచేస్తూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాను. రాఖీ సినిమా షూటింగ్ అయిన వెంటనే బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. దువ్వాడ జగన్నాథమ్ సినిమా సమయంలో కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు షూటింగ్ కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక నా వల్ల నిర్మాతలు ఇబ్బందిలో పడటం నాకిష్టం లేదు. అందుకే రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని పేర్కొన్నారు. అయితే ఆయన ఇక సినిమాలకు దూరం కావడంతో చంద్రమోహన్ ఆరోగ్యంపై పలు వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలను నమ్మవద్దని నటుడు చంద్రమోహన్ తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇక 'మీ అభిమానానికి, ఆశీస్సులకు ఎప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటా. అదే నాకు శ్రీరామ రక్ష' అని పేర్కొన్నారు. చదవండి : 'ప్రభుదేవాతో గొడవలు'..క్లారిటీ ఇచ్చిన నిర్మాత ఎంఎస్ రాజు Maha Samudram: గూని బాబ్జీగా రావు రమేశ్.. ఫస్ట్లుక్ వైరల్ -
ఒంట్లో బాగోలేదని: బామ్మను ఇంట్లోకి అనుమతించని మనుమరాలు
సాక్షి, వేములవాడ: ఆమె శతాధిక వృద్ధురాలు.. నిలువనీడలేదు.. మండుటెండలు.. పైగా అనారోగ్యం.. జీవిత చరమాంకంలో ఆ బామ్మకు ఎంత కష్టం! మాతృ దినోత్సవం రోజునే ఈ ముసలమ్మకు ఎంత కష్టం! తలదాచుకునేందుకు దిక్కులేక బిక్కుబిక్కుమంటోంది.. రోడ్డు పక్కన టెంట్ కింద మూలుగుతోంది. ఎములాడ రాజన్నకు కూడా ఆమె మూగరోదన వినిపించనట్టుంది! ‘బామ్మా.. మా ఇంటికి రా’అని ఆపన్నహస్తం అందించేవారే కరువయ్యారు. మానవత్వం మంటగలిసింది. వివరాలు... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన పంబి వెంకటస్వామి తన తల్లి తులసమ్మ(103), భార్యతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం తులసమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఆమె చనిపోతే తమకు అరిష్టమని భావించి ఇంటి యజమానులు వారిని బయటకు వెళ్లగొట్టారు. దీంతో వెంకటస్వామి తల్లి, భార్యను తీసుకుని అదే పట్టణంలో ఉంటున్న తన కుమార్తె సునీత ఇంటికి వెళ్లాడు. అయితే, సునీత, ఆమె కుమారుడు శ్రీకాంత్, కూతురు.. బామ్మను ఇంట్లోకి రానివ్వలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న బామ్మకు ఏమైనా అయితే మంచిది కాదని భావించి, ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. దీంతో వెంకటస్వామి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సూచనతో మళ్లీ అద్దె ఇంటికి వెళ్లినా యజమానులు అనుమతించలేదు. గత్యంతరంలేక మళ్లీ తన కూతురి ఇంటికి వెళ్లాడు. మళ్లీ ఆమె ససేమిరా అనడంతో రోడ్డు పక్కన టెంట్ వేసుకొని దాని కిందే తన తల్లితో కలసి తలదాచుకుంటున్నారు. పోలీసులు స్పందించి వెంకటస్వామి కూతురు, మనుమడు, మనుమరాలుకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చదవండి: వేల ఏళ్ల క్రితమే కరోనా కజిన్ సిస్టర్! -
ఆందోళన వద్దు: నిలకడగానే సీఎం కేసీఆర్ ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్లో భాగంగా ఎర్రవల్లిలోని తన ఫామ్హౌజ్లో ఉన్న సీఎం కె.చంద్రశేఖర్రావు ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు బుధవారం రాత్రి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వచ్చారు. ఫామ్హౌజ్ నుంచి నేరుగా ఆస్పత్రికి వచ్చిన కేసీఆర్కు సీటీస్కాన్, సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు ఆరు రకాల పరీక్షలు చేసేందుకు వైద్యులు రక్త నమూనాలు సేకరించారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీరావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఇన్ఫెక్షన్ రేటు ఏ మేరకు ఉందన్న విషయం తెలుసుకునేందుకు సీటీ స్కానింగ్ చేశారు. సీఎం కేసీఆర్ ఊపిరితిత్తులు సాధారణంగానే ఉన్నాయని, ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని సీటీ స్కాన్ అనంతరం డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. రక్త పరీక్షలకు సంబంధించిన నివేదికలు గురువారం అందుతాయని వైద్యులు తెలిపారు. సీఎం ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. పరీక్షల అనంతరం సీఎం తిరిగి ఎర్రవల్లి ఫామ్హౌజ్కు వెళ్లిపోయారు. యశోద ఆస్పత్రికి వచ్చిన సీఎం కేసీఆర్ వెంట ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోశ్ కుమార్ తదితరులు ఉన్నారు. -
తండ్రి కేసీఆర్ను కలిసిన మంత్రి కేటీఆర్?
మర్కూక్ (గజ్వేల్): సీఎం కేసీఆర్ను ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ మంగళవారం కలిసినట్లు సమాచారం. కరోనా నిబంధనల మేరకు కేటీఆర్ భౌతికదూరం పాటిస్తూ తండ్రిని పలకరించినట్లు తెలిసింది. అనంతరం కేటీఆర్ అక్కడి నుంచి హైదరాబాద్కు తరలివెళ్లారని సమాచారం. సీఎం కోలుకోవాలని పూజలు యాదగిరిగుట్ట: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మంగళవారం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. ఉదయం ఆలయ మహా మండపంలో కేసీఆర్ గోత్ర, నామాలతో ప్రత్యేకంగా హోమాది పూజలు చేశారు. సమస్త ప్రజానీకం కరోనా నుంచి విముక్తి పొందాలని, వైరస్ నివారణ జరగాలని ధన్వంతరి హోమం జరిపించారు. యాదాద్రీశుడి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో కోలుకోవాలని పూజలు చేసినట్లు ఆచార్యులు తెలిపారు. పూజల్లో ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. యాదాద్రి ఆలయంలో సీఎం కేసీఆర్ కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు, ఆలయ అధికారులు కేసీఆర్కు గుత్తా, పోచారం పరామర్శ సాక్షి, హైదరాబాద్: కరోనా లక్షణాలతో బాధపడుతూ వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్లో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఫోన్ ద్వారా వేర్వేరుగా పరామర్శించారు. ‘కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. భయపడాల్సిన అవసరం లేదు’ అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల దీవెన, భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని గుత్తా, పోచారం ఆకాంక్షించారు. సీఎం ఆరోగ్య స్థితిపై మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆరా తీశారు. సీఎం త్వరగా కోలుకుని తిరిగి ప్రజల సేవలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అర్చకులను కోరారు. నాంపల్లి యూసుఫైన్ దర్గాలో మంత్రి మహబూబ్అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్ తదితరులు సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చదవండి: పక్కాగా తెలంగాణ అంతటా కర్ఫ్యూ చదవండి: కరోనా టీకా.. జనాభాలో యవ్వనులే అధికం -
బీజేపీ నేత మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మోత్కుపల్లి చికిత్స కోసం సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మోత్కుపల్లికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వ్యైదులు పేర్కొన్నారు. చదవండి: టెస్టులు సరే.. మరి భౌతిక దూరం ఏదీ? -
వీడియో రిలీజ్ చేసిన ఎమ్మెల్యే రోజా
-
వీడియో రిలీజ్ చేసిన ఎమ్మెల్యే రోజా
సాక్షి, తిరుపతి: ఆపరేషన్ల కారణంగా ఇంకో నెల రోజులు విశ్రాంతి అవసరమని పేర్కొంటూ ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒక వీడియో విడుదల చేశారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న జగనన్నకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్ధులను భారీ మెజారిటీతో గెలిపించి.. సీఎం జగన్కు కానుకగా ఇవ్వాలన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతోందని రోజా పేర్కొన్నారు. రెండు మేజర్ సర్జరీలు చేసుకొని చెన్నై మలర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోజా.. గత శనివారం డిశ్చార్జ్ అయ్యారు. సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకొని సంతోషంగా చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకు ఆమె చెన్నై ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటారని ఆర్కేసెల్వమణి తెలిపారు. చదవండి: ఇతను కాస్త డిఫరెంట్... ఆటోలో గార్డెన్ ‘జగనన్న స్మార్ట్ టౌన్’కు దరఖాస్తు చేసుకోండి -
ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్ పరామర్శ
సాక్షి, తిరుపతి: ఇటీవల చెన్నై అడయార్లోని ఫోర్టీస్ మలర్ ఆస్పత్రిలో సర్జరీలు చేయించుకున్న ఏపీఐఐసీ చైర్పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విషయాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ఐదు రోజులుగా చెన్నైలో రోజా చికిత్స పొందుతున్నారు. రెండు మేజర్ ఆపరేషన్లు జరగడంతో ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు. చదవండి: జగనన్నను కలిశాకే.. ఈ కాళ్లకు చెప్పులు ఐటీ మౌలిక వసతుల కల్పనపై దృష్టి: గౌతమ్రెడ్డి -
‘మీ భార్యకు ఎలా ఉంది ఉద్దవ్జీ?’ ప్రధాని ఆరా
ముంబై: కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖుల ఆరోగ్య వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీస్తున్నారు. వారి ఆరోగ్యం, అందుతున్న వైద్యం, యోగక్షేమాలు తదితర అంశాలపై సంబంధీకులతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కరోనా బారినపడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే ఆరోగ్యం గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. మార్చి 23వ తేదీన ఆమె కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తీవ్రమైన దగ్గు ఉండడంతో ఆమె ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఆమె ఆరోగ్య విషయాలు ఆరా తీశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు. ఆమె దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. దీంతో పాటు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ ఆరోగ్య పరిస్థితిని ప్రధాని మోదీ తెలుసుకున్నారు. దేవెగౌడ, ఆయన భార్య చెన్నమ్మకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారు కుటుంబసభ్యులతో కలిసి హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నట్లు మోదీ బుధవారం ట్వీట్ చేశారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. వారి ఆరోగ్యంపై కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రత్యేక దృష్టి పెట్టారు. వారికి చికిత్స అందిస్తున్న వైద్యులతో సంప్రదింపులు చేస్తున్నట్లు యడియూరప్ప తెలిపారు. చదవండి: అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి సతీమణి -
ఢిల్లీ ఎయిమ్స్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
-
మార్చి 30న రాష్ట్రపతి కోవింద్కు బైపాస్ సర్జరీ..
సాక్షి,న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై శనివారం ఆర్మీ ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సాధారణ వైద్య పరీక్షల అనంతరం రామ్నాథ్ కోవింద్ను ఢిల్లీలోని ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బైపాస్ సర్జరీ నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. దీంతో మార్చి 30న ఏయిమ్స్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. కాగా శుక్రవారం రామ్నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో ఆయనను వెంటనే ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోవింద్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని కోరిన వారందరికీ కృతజ్ఙతలు తెలియజేశారు. The President has been under observation after a routine medical checkup. He thanks all who enquired about his health and wished him well. — President of India (@rashtrapatibhvn) March 27, 2021 -
కాఫీ తాగడం మంచిదా..? కాదా..?
ఉదయాన్నే కాఫీ తాగందే కొంతమందికి ఏమి తోచదు. మరికొంతమందికి కాస్తంత కాఫీ, అలసిన శరీరానికి ఓ టానిక్ లా పనిచేస్తుంది. ఇంకొందరికి కాఫీ అంటే ఇష్టంతో.. కప్పుల మీద కప్పుల కాఫీ తాగేస్తుంటారు. మరి కాఫీ తాగడం మంచిదా? కాదా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికే.. యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ సైంటిస్టులు మానవ శరీరంపై కాఫీ ప్రభావం గురించి పరిశోధన చేపట్టారు. దాదాపు 200కు పైగా గణాంకాలు సేకరించారు. కాఫీ తాగని వారితో పోలిస్తే, రోజుకు మూడు కప్పుల వరకు కాఫీ తాగే వారికి గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ. అంతేకాదు, క్యాన్సర్తో పాటు కాలేయ వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గాయని వెల్లడించారు. అయితే యూకే ’జాతీయ ఆరోగ్య పథకం’ (ఎన్హెచ్ఎస్) ప్రకారం.. గర్భిణులు రోజుకు 200 మిల్లీ గ్రాము కన్నా ఎక్కువగా, అంటే రెండు మగ్గుల ఇన్స్టెంట్ కాఫీ కన్నా ఎక్కువ తీసుకుంటే వారికి గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని సూచించారు. కాఫీపై జరిపిన పరిశోధనల్లో రోజుకు 400 మి.గ్రా. లేదా అంతకన్నా తక్కువ కెఫీన్ – లేదా 3 నుంచి 4 కప్పుల కాఫీ తాగితే ఎలాంటి ముప్పూ లేదని తేలింది. పరిమితంగా కాఫీ సేవించడం సురక్షితమే. -
కోలుకున్న వనజీవి రామయ్య
-
కోలుకున్న వనజీవి రామయ్య
సాక్షి, హైదరాబాద్ : శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురై ఆసుపత్రి లో చేరిన ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ వనజీవి రామయ్య కోలుకున్నారు. బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు బంధువులు చెప్పుతున్నారు. రేపు కేసీఆర్ జన్మదినం సందర్బంగా ఆసుపత్రి ప్రాంగణంలో రామయ్య మొక్కలు నాటుతారని తెలుస్తోంది. ఈనెల 13న రెడ్డిపల్లిలోని తన నివాసంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గురైన రామయ్యను ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ రెండు గంటల పాటు చికిత్స జరిగినప్పటకీ.. మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. రామయ్య అస్వస్థతకు గురయ్యారని తెలుసుకోని ప్రకృతి ప్రేమికులు ఆందోళన చెందారు. ఆయన తోందరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారు. నిరంతరం మొక్కల గురించి ఆలోచించే రామయ్య.. గత కొంతకాలంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతు వస్తున్నారు. ఏంత ఇబ్బంది ఉన్న మొక్కలను నాటే కార్యక్రమంను మాత్రం ఏ రోజు వాయిదా వేయరు. ప్రతి రోజు మొక్కలను నాటుతునే ఉండాలన్నది ఆ కోరిక. అంతేకాదు తన చివరి శ్వాస పోయే వరకు కూడా మొక్కలను నాటుతునే ఉంటానని ఇటివలే సాక్షి ఇంటర్వ్యూలో కూడ రామయ్య చెప్పుకోచ్చారు. 50ఏళ్ల నుంచి మొక్కలను నాటుతూ వస్తున్న రామయ్య.. ఇప్పటి వరకు 3కోట్ల మొక్కలను నాటారు. రామయ్య కోలుకున్నారన్న విషయం తెలుసుకున్న ప్రకృతి ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం జగన్ ఆదేశాలు: వైద్యురాలికి చికిత్స
సాక్షి, విజయవాడ: తీవ్ర అనారోగ్యానికి గురై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒంగోలు రిమ్స్ డెంటల్ డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మద్రాస్ అపోలో ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. (చదవండి: టీడీపీ కిడ్నాప్ డ్రామా బట్టబయలు..) కొద్దిరోజుల్లోనే డాక్టర్ ధనలక్ష్మి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు. ఆమె ఆరోగ్య పర్యవేక్షణకు ఒంగోలు నుండి ప్రత్యేకంగా మత్తు వైద్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్ను అందుబాటులో ఉంచారు. (చదవండి: పంచాయతీ ఎన్నికలు: పురోహితులకు డిమాండ్) స్పెషల్ కేసుగా తీసుకొని డాక్టర్ ధనలక్ష్మికి అత్యవసర వైద్యం అందించి ప్రాణాపాయం నుండి కాపాడడానికి అన్ని చర్యలు చేపట్టినట్టు మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం భట్ల గూడూరు గ్రామానికి చెందిన డాక్టర్ ధనలక్ష్మి.. కోవిడ్ సమయంలో ఆరు నెలలు కాలానికి వైద్య సేవలు అందించడానికి తాత్కాలిక పద్ధతిలో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ డెంటల్ డాక్టర్గా ఉద్యోగ బాధ్యతలను ఆమె నిర్వహిస్తున్నారు. -
సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు
సాక్షి, హైదరాబాద్: ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులన్నీ నార్మల్గా (సాధారణంగా)నే ఉన్నట్లు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గురువారం ఛాతిలో మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో సీఎంకు ఆస్పత్రిలో చెస్ట్ సీటీ, అబ్డామినల్ అల్ట్రాసౌండ్, కిడ్నీ కెయుబీ, లివర్ ఫంక్షనింగ్, డయాబెటిస్, ఇతర రక్త, మూత్ర పరీక్షలు చేసిన విషయం తెలిసిందే. సీటీ స్కాన్ పరీక్షలో ఊపిరితిత్తుల్లో మైల్డ్ ఇన్ఫెక్షన్ నిర్ధారణ కాగా.. ఆ మేరకు వైద్యులు యాంటీబయాటిక్ మందులు వాడాలని సీఎంకు సూచించిన విషయం విదితమే. రక్తపరీక్షల రిపోర్టులు శుక్రవారం వెలువడ్డాయి. రిపోర్టులన్నీ నార్మల్గా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్యానికి ఢోకాలేదని ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. చదవండి: (సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్) -
మద్యం మానేస్తే వచ్చే మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ను కట్టడి చేయడం కోసం విధించిన లాక్డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగం విపరీతం అయింది. ఎంతంటే, ఒక్క ఆస్ట్రేలియాలోనే ఎప్పటికన్నా 2020 సంవత్సరంలో మద్యం విక్రయాలు రెండు బిలియన్ పౌండ్లు (దాదాపు 20 వేల కోట్ల రూపాయలు) పెరిగాయట. మద్యపానం వల్ల మంచికన్నా చెడే ఎక్కువన్న విషయం తెలిసిందే. మద్యం మానేస్తే 31 రోజుల్లో మనువుల ఆరోగ్యం ఎంతో మెరగుపడుతుందని పోషక నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకనే ఆస్ట్రేలియా వాసులు ప్రతి ఏడాది ‘డ్రై జనవరి’ పేరిట మద్యం తీసుకోకుండా ఉపవాసం పాటిస్తున్నారు. ఆఖరి పెగ్గు తీసుకున్న గంట నుంచి ఆరోగ్యకరమైన మార్పులు కనిపిస్తాయని, కొన్ని రోజులు, వారాలు దూరంగా ఉన్నట్లయితే ఆరోగ్యం మరింత మెరగుపడుతుందని డైటీషియన్లు, ఫిట్నెస్ కోచ్లు తెలియజేస్తున్నారు. మద్యానికి దూరంగా ఉన్నట్లయితే కాలేయం బాగా పని చేస్తుందని, శరీర బరువు తగ్గుతుందని, మంచి నిద్ర వస్తుందని, జ్ఞాపక శక్తి పెరగుతుందని వారంతా చెబుతున్నారు. మద్యం మానేస్తే శక్తి, సామర్థ్యాలు పెరగడమే కాకుండా ఆర్థికంగా డబ్బు ఎంతో కలసి వస్తోందని ‘డ్రై జనవరి’ పాటిస్తున్న ఆస్ట్రేలియా వాసులు సూచిస్తున్నారు. ప్రతి ‘డ్రై జనవరి’లో 70 శాతం మంది ఆస్ట్రేలియా వాసులు మద్యానికి దూరంగా ఉంటుండగా, ఈ సారి లాక్డౌన్ కారణంగా ఆ సంఖ్య యాభై శాతానికి దిగువకు పడిపోయింది. అందుకే మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. మద్యం వల్ల రక్తపోటు పెరిగి గుండె పోటు వచ్చే అవకాశాలు పెరగడంతోపాటు, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పడిపోతుందని, లైంగిక సుఖాన్ని కలగజేసే ‘టెస్టోస్టెరోన్’ ఎంజైమ్ తగ్గిపోతుందని, మహిళలో పీరియడ్స్ పడిపోతాయని, కడుపుల్లో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా వైద్యులు తెలియజేస్తున్నారు. -
డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్కు అస్వస్థత
సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్షులు స్టాలిన్ శుక్రవారం అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. గంట తరువాత కోలుకుని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లారు. తాను ప్రాతి నిథ్యం వహిస్తున్న కొలత్తూరులో సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. తుపాన్, భారీ వర్షాలకు నష్టపోయిన వారికి స్టాలిన్ సహాయకాలు పంచి పెడుతుండగా అకస్మాత్తుగా మైకం వచ్చి పడిపోయారు. దీంతో పార్టీ శ్రేణులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. బీపీ ఎక్కువైనందున మైకం కమ్మిందని వైద్యులు తెలిపారు. ప్రా«థమిక చికిత్స అనంతరం కొద్దిసేపటి తరువాత కోలుకున్నారు. అక్కడి నుంచి కుటుంబవైద్యులతో పోరూరులోని శ్రీరామచంద్ర ఆస్పత్రికి వెళ్లారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మీడియా ద్వారా స్టాలిన్ పార్టీ శ్రేణులకు తెలిపారు. డీఎంకే ఆందోళన: చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న టోల్గేట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ డీఎంకే శ్రేణులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. చెన్నై షోళింగనల్లూరులో నిరసన సభ నిర్వహించారు. చెన్నై కార్పొరేషన్ సరిహద్దులో పది కిలోమీటర్ల తరువాత మాత్రమే టోల్గేట్లు ఉండాలని చట్టం ఉంది. కేంద్రప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం షోళింగనల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పెరుంగుడి, తరైపాక్కం 200 అడుగుల రోడ్డు, షోళింగనల్లూరులోని కరుణానిధిరోడ్డు ప్రాంతాల్లో టోల్గేట్లను నిర్వహిస్తున్నట్లు డీఎంకే ఆరోపిస్తోంది. టోల్గేట్లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ డీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అగ్రనేతలు కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారు. ఇదే డిమాండ్పై శుక్రవారం ఉదయం 10 గంటలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో కలిసి షోళింగనల్లూరులో ఆందోళనకు దిగారు. -
కిడ్నీలు ఫెయిల్ అవుతాయన్నారు
‘బాహుబలి’ సినిమాలోని భల్లాలదేవా పాత్రకు సరైన కటౌట్ రానానే. బాహుబలి ప్రభాస్ కటౌట్కి సరైన కటౌట్ రానానే అనిపించుకున్నారు. అలా ధైర్యసాహసాలు ఉన్న శక్తిమంతుడిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన రానా ఆ మధ్య అనారోగ్యం పాలయ్యారనే వార్తలు రావడం తెలిసిందే. ఇప్పటివరకూ తన ఆరోగ్యం గురించి బహిరంగంగా మాట్లాడని రానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పారు. ‘‘నా జీవితం ఫాస్ట్ ఫార్వార్డ్ (వేగంగా)లో వెళుతున్న సమయంలో చిన్న పాజ్ (కుదుపు/చిన్న గ్యాప్) వచ్చింది. నా ఆరోగ్య సమస్య ఏంటంటే పుట్టినప్పటి నుండే నాకు బీపీ (బ్లడ్ప్రెజర్) ఉంది. దాంతో గుండె చుట్టూ ఉండే పొర పెళుసుబారిపోతుందని, తర్వాత కిడ్నీలు ఫెయిల్ అవుతాయని డాక్టర్లు అన్నారు. ఈ సమస్య ఉండటం వల్ల 70 శాతం స్ట్రోక్ రావచ్చని, 30 శాతం వరకు ప్రాణహాని ఉందని కూడా చెప్పారు’’ అంటూ ఎమోషన్కి గురయ్యారు రానా. ఇదిలా ఉంటే లాక్డౌన్లో రానా పెళ్లి మిహికాతో జరిగిన విషయం తెలిసిందే. రానా ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి. ప్రస్తుతం ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్తో సూపర్గా బిజీగా ఉంటున్నారు రానా. -
తరుణ్ గొగోయ్ పరిస్థితి విషమం
గువాహటి : అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగోయ్ ఆరోగ్యం విషమించింది. కరోనా అనంతర సమస్యలతో ఆయన గువాహటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈనెల 2 నుంచి చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్పై గొగోయ్కి చికిత్స అందిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిస్వ శర్మ శనివారం వెల్లడించారు. శ్వాస తీసుకోవడంలో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, కీలక అవయవ వ్యవస్థలు వైఫల్యం చెందాయని తెలిపారు. ఆగస్ట్ 25న∙గొగోయ్కి కోవిడ్గా నిర్ధారణ అయింది. -
రాజశేఖర్ చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారు: జీవిత
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన భార్య జీవితా రాజశేఖర్ స్పందించారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. రాజశేఖర్ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుగ్గా ఉంది. వైద్యానికి ఆయన సహకరిస్తున్నారు. మొదట చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారు. వైద్యులు, మేము కూడా చాలా భయపడ్డాము. డాక్టర్లు అనుక్షణం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతోంది. తొందరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది' అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకున్న అభిమానులందరికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. (కరోనా: పైకి అంతా బాగున్నా.. లోలోపల ఏదో టెన్షన్) -
‘చాలా బాగున్నాను’
న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ తాను వేగంగా కోలుకుంటున్నట్లు ప్రకటించారు. అందరి దీవెనలతో తన ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన తన ఇంటి ముందు నిలబడి రికార్డు చేసిన వీడియో ద్వారా వెల్లడించారు. గత వారం గుండెపోటుకు గురైన కపిల్కు యాంజియోప్లాస్టీ సర్జరీ జరిగింది. ‘నా 83 కుటుంబానికి...వాతావరణం ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. మీ అందరినీ కలవాలని ఉత్సాహంగా ఉన్నా. ప్రస్తుతం నా ఆరోగ్యం చాలా బాగుంది. మీ దీవెనలకు నా కృతజ్ఞతలు. సాధ్యమైనంత త్వరలో అందరినీ కలుసుకుంటా. ఈ ఏడాది చివరి దశకు వచ్చింది. వచ్చే ఏడాది అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నా’ అని కపిల్ అన్నారు. -
రాజశేఖర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై సిటీ న్యూరో సెంటర్ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. రాజశేఖర్ చికిత్సకు స్పందిస్తున్నారని, ప్లాస్మా థెరపీ కూడా చేశామని తెలిపారు. అలాగే సైటో సోర్బ్ అనే పరికరం ద్వారా కూడా చికిత్స చేస్తున్నామని వారు వెల్లడించారు. చదవండి: నిలకడగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం గతంతో పోల్చితే ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, నిరంతరం వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని డాక్టర్ రత్న కిషోర్ తెలిపారు. కాగా అక్టోబర్ 17న ఇద్దరు కూతుళ్లు, భార్య జీవితతో సహా రాజశేఖర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జీవిత, కూతుళ్లు శివానీ, శివాత్మిక ఇద్దరూ కోలుకోగా రాజశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చదవండి: ఐసీయూలో హీరో రాజశేఖర్ -
ఆస్పత్రిలో చేరిన అమితాబ్; కొడుకు క్లారిటీ:
తనపై సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ చేసినా తనదైన శైలిలో స్పందిస్తుంటారు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్. ట్రోల్స్పై ఆగ్రహానికి లోనవకుండా చాకచక్యంగా బదులిస్తారు. ఈ క్రమంలో బిగ్బీ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇటీవల బిగ్బీ అనారోగ్యానికి గురయ్యారని, అమితాబ్ బచ్చన్కు గాయం అవ్వడం వల్ల ఆసుపత్రిలో చేరారని సోమవారం నాడు కొన్ని వార్తలు వెలువడ్డాయి. శనివారం నుంచి ఆస్పత్రిలోనే అక్కడే ఉన్నట్లు, ప్రస్తుతం వైద్యులచేత చికిత్స తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ విషయం తెలియడంతో అభిమానులు కొంచెం కంగారు పడిపోయారు. అయితే బచ్చన్ కుంటుంబం నుంచి అయితే దీని గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. చదవండి: సోషల్ మీడియా ట్రోల్స్: అభిషేక్ స్పందన తాజాగా తండ్రి ఆరోగ్యంపై ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ స్పందించారు. బిగ్బీ అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వదంతులను కొట్టిపారేశారు. అమితాబ్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.. నేను కూడా అడుగతాను. ఎందుకంటే నాన్న నా ముందే కూర్చొని ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్నది ఖచ్చితంగా నాన్న డూప్లికేట్ అయ్యి ఉంటారు. అని పేర్కొన్నారు. కాగా జులైలో అమితాబ్ కుటుంబం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బిగ్బీతోపాటు, అభిషేక్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్య కరోనా పాటిజివ్గా తేలి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. 20 రోజుల చికిత్స అనంతరం మెల్లమెల్లగా అందరూ కోలుకున్నారు. ఇక అభిషేక్ చివరగా బ్రీత్: ఇంటూ ది షాడోస్లో కనిపించారు. అదే విధంగా ఆయన నటించిన ‘బిగ్బుల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. చదవండి: బిగ్బీ పోస్టుకు కత్రినా కైఫ్ ఫ్యాన్స్ ఫిదా! -
విషమంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఏ ఒక్కరినీ వదలకుండా ఎటాక్ చేస్తోంది. వైరస్ బారినపడి ఇప్పటికే పలువురు ప్రముఖలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సైతం వైరస్తో పోరాటం చేస్తున్నారు. ఈ నెల 14న ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించింది. కరోనాతో పాటు డెంగ్యూ కూడా ఎటాక్ చేయడంతో గడిచిన 24 గంటల్లో మరింత విషమంగా ఉందని లోక్నాయక్ జయప్రకాశ్ నాయక్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. రక్తకణాల సంఖ్య తగ్గిపోవడంతో పాటు శరీరంలో ఆక్సిజన్శాతం పడిపోయిందని పేర్కొన్నారు. (రికవరీ రేటు పైపైకి) మెరుగైన వైద్య సదుపాయం కోసం మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించామని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. మనీశ్ ఆరోగ్య పరిస్థితిపై పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఈయన క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు దేశ రాజధానిలో పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నప్పటికీ.. కోలుకునే వారి సంఖ్య పెరగడం కొంతమేర ఊరటనిస్తోంది. తాజా గణాంకాలతో ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 60 వేలు దాటింది. -
నాన్న ఆహారం తీసుకుంటున్నారు: ఎస్పీ చరణ్
చెన్నై: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ' ఆరోగ్యం నిలకడగగా ఉంది. నాన్న ఇప్పుడిప్పుడే ఆహారం తీసుకుంటున్నారు. అయితే ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నారు. ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థ, శక్తి మరింత మెరుగుపడాల్సిన ఉంది. మిగలిన వ్యవస్థలన్నీ సాధారణంగా ఉన్నాయి. ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు. రోజూ 10 నుంచి 15 నిమిషాలు ఫిజియోథెరపీ చేస్తున్నారు. (ఎస్పీ బాలు కోసం మేమంతా: సెలబ్రిటీలు) ఆస్పత్రి సిబ్బంది సహాయంతో రోజూ 15-20 నిమిషాలు లేచి కూర్చుంటున్నారు. శుక్రవారం నుంచి ఆహారం తీసుకుంటుండటంతో ఆయన మరింత వేగంగా కోలుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నా తండ్రికి, కుటుంబ సభ్యులకు ఎంతో సహకరించిన ఎంజీఎం హెల్త్కేర్లోని వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆగస్టు 5నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. (నాన్న ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది) -
నాన్న ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది: ఎస్పీ చరణ్
చెన్నై : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం రోజురోజుకు మరింత మెరుగవుతుందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో వీడియో రూపంలో స్పందించిన ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత నిలకడగా ఉందన్నారు. ‘నాన్న ఊపిరితిత్తులు మెరుగుపడుతున్నట్లు ఎక్క్రేలో కనిపిస్తుందన్నారు. ఫిజియోథెరపీలో చురుకుగా పాల్గొంటున్నాడు. 20 నిమిషాల పాటు కూర్చోగలుగుతున్నాడు. త్వరలోనే ద్రవ పదార్థాలు అందించవచ్చని వైద్యులు చెప్పారు’ అని పేర్కొన్నారు. (బాలుకి కరోనా నెగిటివ్.. కాబాలుకి కరోనా నెగిటివ్.. కానీ) ఇప్పటి వరకు తమకు తోడుగా, అండగా ఉన్నవారందరికీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కష్ట సమయాల్లో తమ కుటుంబ పట్ల మీరు చూపించిన ప్రేమ, అనురాగాలకు ధన్యవాదాలు. ఇలాగే ప్రతి ఒక్కరూ ఎస్పీ బాలు ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరారు. కాగా ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా వ్యాధి సోకడంతో ఆగస్టు 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్గా తేలిన ఎస్పీ బాలు అప్పటి నుంచి హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. ఇటీవల కరోనా నెగిటివ్ అని తేలడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. (చికిత్సకు స్పందిస్తున్న ఎస్పీ బాలు) View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on Sep 14, 2020 at 5:24am PDT -
మరింత విషమంగా ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని ఆయనకు వైద్యం చేస్తున్న ఢిల్లీ కంటోన్మెంట్ ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని తెలిపారు. ఆయన ఇంకా వెంటిలేటర్పైనే కొనసాగతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. ప్రణబ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జి ట్వీట్ చేశారు. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. (ప్రణబ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు) తండ్రిని గుర్తు చేసుకుంటూ శర్మిష్ఠ ముఖర్జీ శనివారం భావోద్వేగ ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది ప్రణబ్ ముఖర్జీ కచ్చితంగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి నాన్నా, బాబాయ్ కలిసి మా గ్రామంలోని పూర్వీకుల ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగురవేసేవారని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా ప్రణబ్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దూరం కాలేదన్నారు. ఈ ఏడాది మాత్రం ఆయన హాజరు కాలేకపోయారు. వచ్చే ఏడాది మళ్లీ నాన్న జెండా ఆవిష్కరిస్తారనే నమ్మకం తనకుంది అంటూ గత ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రణబ్ ఫోటోలను ఆమె షేర్ చేసిన సంగతి తెలిసిందే. -
ఈ క్లిష్ట సమయం నుంచి బయటపడతాం: మాన్యత
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్దత్ ఆరోగ్యంపై ఆయన భార్య మాన్యత దత్ ఒక ప్రకటన చేశారు. తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు ఆ ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 'ఈ కఠిన సమయాన్ని దాటేందుకు మీ అందరి తోడు కావాలి. గతంలో కూడా ఎన్నో ఆపదల నుంచి మా కుటుంబం బయపడింది. ఈ ఇబ్బందికర పరిస్థితిని కూడా దాటేస్తాం. సంజయ్అభిమానులందరికి నా విజ్ఞప్తి ఒక్కడే. దయచేసి పుకార్లను నమ్మకండి, వాటిని ప్రచారం చేయకండి. సంజయ్ ఆరోగ్యానికి సంబంధించి క్రమం తప్పకుండా మీకు అప్డేట్ అందిస్తాం. నా పిల్లలకు మాత్రమే కాదు ..తల్లిదండ్రులు చనిపోయాక సంజయ్ కుటుంబం మొత్తానికి తండ్రిలా ఉన్నాడు. తనకి క్యాన్సర్ అని తెలియగానే మొత్తం కుటుంబం కదిలిపోయింది. అయితే మేం అందరం కలిసి పోరాడాలని నిశ్చయించుకున్నాం. ఈ క్లిష్ట సమయాన్ని సానుకూల దృక్పదంతో ఎదుర్కోవాలనుకుంటున్నాం. ఈ సుదీర్ఘ పోరాటంలో అభిమానుల ప్రార్థనలు, ఆశీర్వాదాలు కావాలి. మీ ప్రార్థనలు, దేవుని ఆశిస్సులతో ఈ క్లిష్ట సమయం నుంచి బయటపడతాం' అని మాన్యత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. (సంజయ్ ఎప్పుడూ పోరాట యోధుడే: మాన్యత దత్) అయితే తన ఆరోగ్య చికిత్స నిమిత్తం షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకుంటున్నట్లు అభిమానులకు తెలియజేస్తూ సంజయ్ దత్ ఓ పోస్టును విడుదల చేశారు. దీంతో సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్తో భాదపడతున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. సంజయ్ త్వరగా కోలుకొని మరోసారి తెరమీద కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ దత్ గతేడాది.. కళంక్, ప్రస్తానం, పానిపట్ చిత్రాలతో అలరించారు. తాజాగా 1991లో మహేశ్ బట్ దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ సడక్కు సీక్వెల్గా తెరకెక్కుతున్న సడక్ 2లో నటిస్తున్నారు. ఆదిత్యారాయ్ కపూర్, ఆలియా భట్ ప్రధాన పాత్రలో.. పూజాభట్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ భట్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆయన సోదరుడు ముఖేశ్ భట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (క్యాన్సర్ శాపం) 🙏🏻 pic.twitter.com/tinDb6BxcL — Sanjay Dutt (@duttsanjay) August 11, 2020 -
‘ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదు’
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఏ మాత్రం మార్పు లేదని ఆర్మీ హాస్పటల్ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నారని వెల్లడించింది. ఈ మేరకు ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ హాస్పటల్ హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ల బృందం ఎప్పటికపుడు పరిశీలిస్తున్నట్లు తెలిపింది. (విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం) ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ప్రణబ్కు కోవిడ్–19 పాజిటివ్గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. . ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 వరకు భారతదేశ 13వ రాష్ట్రపతిగా ఉన్నారు. (కుదుటపడుతున్న ప్రణబ్ ఆరోగ్యం') -
విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆర్మీ ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించారు. ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలించిందని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రణబ్ శరీరం వైద్యం అందించడానికి సహకరిస్తూ స్థిరంగా ఉందని తెలిపారు. ఢిల్లీ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్ ఈ నెల 10వ తేదీన చేరిన విషయం తెలిసిందే. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. అదే రోజు ఆయనకు కోవిడ్–19 పరీక్షలు జరపగా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. -
‘నాన్న కోసం ప్రార్ధించండి’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ప్రజలకు తానిచ్చిన దానికంటే వారి నుంచి తాను ఎంతో పొందానని నాన్న తరచూ చెబుతుండేవారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ అన్నారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థించాలని ఆయన ప్రజలను కోరారు. ఢిల్లీలోని ఆర్మీ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రి 96 గంటల అబ్జర్వేషన్ వ్యవధి శుక్రవారంతో ముగుస్తుందని చెప్పారు. ప్రణబ్జీ చికిత్సకు స్పందిస్తున్నారని అభిజిత్ ట్వీట్ చేశారు. ప్రణబ్ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్ధితి విషమంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని, ఆయన ఇంటెన్సివ్ కేర్లో వెంటిలేటర్పైనే ఉన్నారని ఆర్మీ ఆస్పత్రి పేర్కొంది. రక్తపోటు, మధుమేహం సహా కీలక ఆరోగ్య సంకేతాలన్నీ నిలకడగా ఉన్నాయని తెలిపింది. మరోవైపు తన తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించలేదని, ప్రణబ్జీ కళ్లలో కొంత మెరుగుదల కనిపించిందని ఆయన కుమార్తె షర్మిష్ట పేర్కొన్నారు. కాగా బ్రెయిన్ సర్జరీకి ముందు తనకు కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయిందని ప్రణబ్ ముఖర్జీ ట్వీట్ చేశారు. ప్రణబ్ సత్వరమే కోలుకోవాలని బెంగాల్లోని ఆయన స్వగ్రామంలో ప్రార్ధనలు నిర్వహించారు. ఇక బీర్బం జిల్లాలో ఆయన బంధువులు మూడు రోజుల పాటు మృత్యుంజయ హోమం జరిపారు. చదవండి : ప్రణబ్ ఆరోగ్యంపై తప్పుడు వార్తలను నమ్మొద్దు -
ప్రణబ్ ముఖర్జీ : ఎంత నొప్పితో బాధపడుతున్నా..
కోల్కతా : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. అయితే ఎంతో నొప్పిని సైతం ఓర్చుకొని ప్రశాంతంగా ప్రణబ్ కనిపించేవారని 13 ఏళ్ల క్రితం ఆయనకు వైద్యం చేసిన డాక్టర్ బసుదేవ్ మొండాల్ అన్నారు. '' 2007లో ముర్షిదాబాద్ నుంచి కోల్కతా వెళ్తుండగా నాడియా జిల్లాలో ప్రణబ్ ముఖర్జీ కారు ప్రమాదానికి గురైంది. ఓ ట్రక్కును ఢీ కొట్టడంతో కారు ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో అప్పటి విదేశాంగ మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆయన్ను దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ సిటీ స్కాన్, ఎక్స్ రే వంటి సౌకర్యాలు లేనందున ఆయన్ని మా నర్సింగ్ హోంకు తీసుకువచ్చారు. (మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం) అంతకుముందే నాకు పరిస్థితిని వివరించి అన్ని సౌకర్యాలు ఉండేలా ఏర్పాటు చేయాల్సిందిగా ఫోన్ రావడంతో చాలా అలర్ట్ అయ్యాను. అన్నీ సిద్ధం చేశాను. ఆ సమయంలో ముఖర్జీ తలకు బలమైన గాయం కావడంతో తీవ్రంగా బాధపడుతున్నప్పటికీ పైకి మాత్రం చాలా ప్రశాంతంగా, వినయంగా కనిపించారు. ఇక పరీక్షలు అదృష్టవశాత్తూ ఆయనకు అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నాం. ఆ తర్వాత అయన్ని అక్కడినుంచి కోల్కతా లోని ఓ ప్రైవేటు ఆసుప్రతికి తరలించారు. ఈ ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత 2016లో ఓ కార్యక్రమం సందర్భంగా ప్రణబ్ ముఖర్జీని ఆహ్వనించడానికి వెళ్లాను. అప్పటికీ ఆయన రాష్ర్టపతిగా ఉన్నారు. నన్ను చూడగానే గుర్తుపట్టి, చాలా ఆప్యాయంగా పలకరించారు. నా సేవలను గుర్తిచేస్తూ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా కార్యక్రమానికి హాజరవుతానన్న వాగ్ధానాన్ని కూడా నిలబెట్టుకున్నారు'' అంటూ డాక్టర్ మొండల్ ప్రణబ్ ముఖర్జీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక బ్రెయిన్ సర్జరీ అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రణబ్కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ) -
విషమంగా ప్రణబ్ ఆరోగ్యం: షర్మిష్ట
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన్ను వెంటిలేటర్పైనే ఉంచి చికిత్స కొనసాగిస్తున్నామని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్ఆర్) హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రణబ్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో తన తండ్రి త్వరగా కోలుకోవాలని కూతురు షర్మిష్టా ముఖర్జీ ప్రార్ధించారు. తన తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘గతేడాది ఆగష్టు 8న నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ రోజు మా నాన్న భారత రత్న అవార్డును అందుకున్నారు. కానీ సరిగ్గా సంవత్సరానికి ఆగష్టు 10న ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ సమయంలో దేవుడు ఆయనకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. మా తండ్రికి ధైర్యాన్ని, బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మా నాన్న ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నవారందరికీ ధన్యవాదాలు’ అని షర్మిష్టా బుధవారం ట్వీట్ చేశారు. (విషమంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం) సోమవారం ప్రణబ్కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడంతో ఆపరేషన్ చేసిన ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ డాకర్లు దానిని తొలగించారు. బ్రెయిన్ సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుల చూపించలేదని, అంతేగాక ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని మంగళవారం సాయంత్రం వైద్యులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని ప్రణబ్ పూర్వీకుల గ్రామంలో గ్రామస్తులు మాజీ రాష్ట్రపతి త్వరగా కోలుకునేందుకు మంగళవారం మహా మృత్యుంజయ యజ్ఞాన్ని ప్రారంభించారు. కాగా ప్రణబ్ కోవిడ్ బారిన పడిన విషయాన్ని ఆయన కార్యాలయం సోమవారం ట్విటర్లో వెల్లడించిన విషయం తెలిసిందే. 2012-2017 మధ్యకాలంలో ప్రణబ్ముఖర్జీ భారత 13వ రాష్ట్రపతిగా సేవలు అందించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ) -
విషమంగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత క్షీణించింది. 84 ఏళ్ల ప్రణబ్ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నారని ఇక్కడి ఆర్మీ ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి వర్గాలు మంగళవారం వెల్లడించాయి. మెదడులో రక్తం గడ్డకట్టడంతో సర్జరీ కోసం సోమవారం ప్రణబ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ‘ప్రణబ్ ముఖర్జీ పరిస్థితి విషమంగా ఉంది. ప్రాణాపాయ స్థితి ఉండటంతో బ్రెయిన్ క్లాట్ను తొలగించడానికి సోమవారం అత్యవసరంగా శస్త్రచికిత్స చేశాం. ఆయన ఆరోగ్యం మెరుగుపడకపోగా.. మరింత క్షీణించింది. వెంటిలేటర్ సపోర్ట్పై ఉన్నారు’అని ఢిల్లీలోని కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఆర్ అండ్ ఆర్ ఆస్పత్రి తెలిపింది. ఆరోగ్యం బాగాలేక ప్రణబ్ సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో చేరారు. అప్పుడు చేసిన పరీక్షల్లో మెదడులో రక్తగడ్డకట్టినట్లు తేలింది. కోవిడ్–19 పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. కరోనా పాజిటివ్ ఉన్నా మెదడులో రక్తం గడ్డ పెద్దది కావడంతో వెంటనే వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం వివిధ విభాగాలకు చెందిన నిపుణులు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. 2012–2017 మధ్యకాలంలో ప్రణబ్ భారత రాష్ట్రపతిగా వ్యవహరించారు. -
మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
న్యూఢిల్లీ : బ్రెయిన్ సర్జరీ అనంతరం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రణబ్కు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ప్రణబ్ ఆరోగ్యంపై మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే ఆయన ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని అన్నారు. కాగా మాజీ రాష్ట్రపతికి సోమవారం బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. మెదడులో ఒక చోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేసి దాన్ని తొలగించారు. (ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం) అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. (మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ) -
వీవీ ఆరోగ్యంపై వాస్తవ నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: విప్లవ రచయిత వరవరరావు(వీవీ) ఆరోగ్యపరిస్థితిపై దాపరికం లేకుండా వాస్తవ నివేదికను వెంటనే తమకు అందజేయాలని ఆయన కుటుంబసభ్యులు సోమవా రం మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. గత వారం రోజుల్లో ఆయన్ను తలోజా జైలు నుంచి వివిధ ఆస్పత్రులకు తరలించి కేవలం కరోనా పాజిటివ్ మాత్రమే వచ్చిందని తెలిపారన్నారు. నానావతి ఆస్పత్రిలో చేర్చక ముందే ఆయన తలకు కుట్లుపడ్డాయని అక్కడి వైద్యులు గుర్తించారని వీవీ భార్య హేమలత, కుమార్తెలు సహజ, అనల, పవన పేర్కొన్నారు. వీవీ తనంతట తానుగా ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నందున సహకరించేందుకు కుటుంబసభ్యులలో ఒకరిని అనుమతించాలని కోరారు. -
జైలులోనే చంపుతారా?
సాక్షి, హైదరాబాద్: నవీ ముంబైలోని తలోజా జైలులో విచారణ ఖైదీగా నిర్బంధంలో ఉన్న ప్రముఖ విప్లవకవి పి.వరవరరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, తక్షణమే ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని ఆయన సహచరి హేమలత, కుమార్తెలు సహజ, అనలా, పావన విజ్ఞప్తి చేశారు. 79 ఏళ్ల వరవరరావు తీవ్ర అనా రోగ్యంతో బాధపడుతున్నా చికిత్స అందించకుండా జైలులోనే చంపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత మే 28న జైలులో వరవరరావు స్పృహ కోల్పోవడంతో జేజే ఆస్పత్రికి తరలించారని, సోడి యం, పొటాషియం లెవల్స్ బాగా పడిపోయాయని కోర్టుకు ఆస్పత్రి నివేదించిందని వెల్లడించారు. 3 రోజు లకే ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి ఎన్ఐఏ తిరిగి జైలుకు తరలించిందన్నారు. జూన్ 24న, ఆ తర్వాత జూలై 2న వరవరరావు తమతో జైలు నుంచి ఫోన్ చేసి బలహీనమైన గొంతుతో అసంబద్ధంగా హిందీలో మాట్లాడారని వెల్లడించారు. చివరిసారిగా శనివారం ఆయన తమకు ఫోన్ చేసినా తీవ్ర అనారోగ్యం వల్ల సరిగ్గా మాట్లాడలేక పోయారని తెలిపారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా, పొంతన లేకుండా మాట్లాడారని హేమలత, కుమార్తెలు కన్నీరుమున్నీర య్యారు. వరవరరావు 8 ఏళ్ల వయస్సులో తండ్రిని, 30 ఏళ్ల కింద తల్లిని కోల్పోయారని, అయితే తన తండ్రి, తల్లి అంత్యక్రియలకు వెళ్తున్నావు కదా అని ఫోన్లో తనను అడిగారని హేమలత ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాల నాటి ఘటనలకు సంబంధించిన భ్రమల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోడియం, పొటాషి యం లెవల్స్ పడిపోవడంతో మెదడు దెబ్బతింటుండడం వల్లే తమ తండ్రి మతిస్థిమితం కోల్పోయినట్టు వ్యవహరిస్తున్నారని ఆయన కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిందని, నడవలేకపోతున్నారని, ఒకరి సహాయం లేకుండా మరుగుదొడ్డికి వెళ్లలేకపోతున్నారని, పళ్లు తోముకోవడం కూడా కష్టంగా ఉం దని సహచర ఖైదీ పేర్కొన్నట్టు తెలియజేశారు. ఒకరి ప్రా ణాలను తీసే హక్కు ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించలేదని వీవీ బావమరిది వేణుగోపాల్ పేర్కొన్నారు. -
వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడండి: భట్టి
సాక్షి, హైదరాబాద్: భీమాకోరేగావ్ కేసులో 2018 ఆగస్టులో అరెస్టయిన వరవరరావు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని, ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తెలంగాణ పౌరసమాజం కోసం, రాజ్యాంగం ఇచ్చిన పౌరహక్కుల సాధన, భావ ప్రకటన కోసం, పేదల కోసం ఉద్యమిస్తున్న వరవరరావుకు జైల్లో ఏదైనా జరిగితే అది రాజ్యం చేసిన ద్రోహం అవుతుందని భట్టి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆరోగ్యంపై స్పందించిన అశోక్ తేజ
హైదరాబాద్ : ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను ఖండించారు. తను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు. ఆరోగ్యం విషమించిందనే వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘మిత్రులకు, శ్రేయాభిలాషులకు, పాట అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి నమస్కారం. మీ అందరి ప్రేమ వల్ల, ప్రభుత్వ సహాయ, సహకారాల వల్ల కాలేయ మార్పిడి చికిత్స అనంతరం.. రోజురోజుకు కోలుకుంటున్నాను.(చదవండి : నిర్మాతగా మారిన మెగాస్టార్ కుమార్తె) ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. మళ్లీ పాటలు రాస్తున్నాను. కరోనా నేపథ్యంలో అందరిలాగే జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నా ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే అశోక్ తేజ ఆరోగ్యం విషమంగా ఉందని కొన్ని వార్తలు వినబడుతున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు’ అని తెలిపారు. -
ఆరోగ్యంపై స్పందించిన అశోక్ తేజ
-
అచ్చెన్నాయుడు ఆరోగ్యం నిలకడగానే ఉంది
-
మెరుగుపడిన మన్మోహన్ ఆరోగ్యం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి, నిలకడగా ఉందని ఎయిమ్స్ తెలిపింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్గా వచ్చిందని సోమవారం వెల్లడించింది. ఆదివారం ఆయనకు కొత్త మెడికేషన్ సరిపడక జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఎయిమ్స్లో చేర్చారు. ‘ఆయన్ను కార్డియో థొరాసిక్ ఐసీయూ నుంచి కార్డియో–న్యూరో టవర్లోని ప్రైవేట్ వార్డుకు తరలించాం. ఇవాళో రేపో డిశ్చార్జి చేసే అవకాశం ఉంది’ అని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. -
ఉత్తర కొరియాకు చైనా వైద్య బృందం
బీజింగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషమంగా మారినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం వైద్య నిపుణుల బృందాన్ని పంపడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై చైనా ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కిమ్ జోంగ్ ఉన్ ఇటీవలే కోలుకున్నాడని దక్షిణ కొరియాకు చెందిన ఓ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే కిమ్ జోన్ ఉన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. -
కిమ్ ఆరోగ్యంపై స్పందించిన ట్రంప్
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఒకవేళ కిమ్ అనారోగ్యానికి గురైతే త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు మంగళవారం వైట్హౌజ్ వద్ద విలేకరుల సమావేశంలో తెలిపారు. ఉత్తర కొరియాతో తమకు మంచి సంబంధాలు ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. ‘కిమ్ ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే నేను చెప్పగలను. ఆయన ఆరోగ్యంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. కిమ్ పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే నివేదికలు తెలిపిన దాని ప్రకారం కిమ్ ఆరోగ్యం విషమంగా ఉంటే అది తీవ్రమైన పరిస్థితి’గా ట్రంప్ వర్ణించారు. కానీ కిమ్ ఆరోగ్యం గురించి ట్రంప్కు సరైన సమాచారం ఉందా అన్న విషయాన్ని ఆయన వెల్లడించలేదు. (విషమంగా కిమ్ జోంగ్ ఆరోగ్యం..!) కాగా గత కొంత కాలంగా కిమ్ జోంగ్ అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆసుపత్రిలో చేరిన ఆయన శస్త్ర చికిత్స చేసుకున్నారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు మంగళవారం మీడియా కథనాలు వెలువడ్డాయి. కాగా ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరుకాక పోవడంతో ఆయనకు ఏమైందన్న విషయం చర్చరనీయంశంగా మారింది. నిత్యం తన పనులతో వార్తల్లో నిలిచే కిమ్ జంగ్ ఉన్ కనిపించక పోవడంతో ఆయన అనారోగ్యమే ఇందుకు కారణమంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. (కిమ్ ఆరోగ్యం విషమం.. ఆ వార్తలు నిజం కాదు) -
కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమం!
-
విషమంగా కిమ్ జోంగ్ ఆరోగ్యం..!
ప్యాంగ్యాంగ్ : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య తీవ్రంగా విషమించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి సమయంలో ఆయన తీవ్ర అస్వస్థత గురైనట్లు సమాచారం. ప్రస్తుతం కిమ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరుకాని విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర చర్చసాగింది. ఈ క్రమంలోనే కిమ్ కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స కూడా నిర్వహించారు. దాని తరువాత కిమ్ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నారు. (సుప్రీం లీడర్ కిమ్కు ఏమైంది?) మరోవైపు కాగా గడిచిన నెల రోజులుగా కిమ్ జంగ్ ఉన్ ఎందుకు సైలెంటయ్యారనే విషయమై ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిత్యం తాను చేసే పనులతో వార్తల్లో నిలిచే కిమ్ జంగ్ ఉన్ ఎందుకు కనిపించడం లేదనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా సాగుతోంది. అంతేకాదు అణుపరీక్షలు, క్షిపణి పరీక్షలు కానీ నిర్వహించన దాఖలాలు లేవు. అయితే అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఉత్తర కొరియా నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. -
కాస్త జలుబు చేసిందంతే
ఆక్లాండ్: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కాస్త జలుబు చేసినా సరే నానా హైరానా పడిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇదే పరిస్థితి న్యూజిలాండ్ పేస్ బౌలర్ లోకీ ఫెర్గూసన్కు కూడా ఎదురైంది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో తొలి వన్డే ఆడిన తర్వాత అతనికి కొంత అనారోగ్యంగా కనిపించడంతో కివీస్ బోర్డు వెంటనే స్పందించింది. కరోనా వైరస్కు సంబంధించి పరీక్షలకు పంపడంతో పాటు 24 గంటల పాటు ఎవరితో కలవకుండా హోటల్ రూమ్లోనే ఉండాలని నిర్బంధించింది. శనివారం అతని రిపోర్ట్లు నెగెటివ్గా రావడంతో ఊపిరి పీల్చుకొని ఫెర్గూసన్ ఆక్లాండ్లోని తన ఇంటికి చేరుకున్నాడు. దీనిపై అతను స్పందిస్తూ తనకు జరిగిన అనుభవాన్ని వివరించాడు. కరోనా విషయంలో అతి చేసినట్లు అనిపించిందని వ్యాఖ్యానించాడు. ‘నా ఆరోగ్యంపై చాలా మంది ఆందోళన చెందారు. నేను బాగానే ఉన్నానని వారందరికీ సమాధానమిచ్చా. నాకు కాస్త జలుబు చేసిందంతే. అంతకుమించి ఏమీ కాలేదు. టీమ్ వైద్యులు నిబంధనలు అమలు చేశారు కాబట్టి అర్థం చేసుకోగలను. కానీ మొత్తంగా చూస్తే అంతా అతి చేసినట్లు అనిపిస్తోంది.’ అని ఫెర్గూసన్ అన్నాడు. మరోవైపు కరోనా కారణంగా మరో రెండు క్రికెట్ ఈవెంట్లు రద్దయ్యాయి. జింబాబ్వేలో పర్యటిస్తోన్న ఇంగ్లండ్ కౌంటీ జట్టు డెర్బీషైర్ టూర్ను రద్దు చేసుకొని ఇంగ్లండ్కు తిరిగి వెళ్లిపోయింది. ఆస్ట్రేలియా అగ్రశ్రేణి టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ చివరి రౌండ్ మ్యాచ్లు కూడా రద్దయ్యాయి. -
ఆ వార్తలను ఖండించిన రెబల్ స్టార్
కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు అస్వస్థకు గురయ్యారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలపై కృష్ణంరాజు ఖండించారు. కేవలం న్యూమోనియాకు చికిత్స చేయించుకోవడంతో పాటు రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రికి వెళ్ళానని, కానీ కొన్ని పత్రికలు మాత్రం నిర్ధారణ లేకుండా వార్తలు ప్రచురణ చేశాయని కృష్ణంరాజు అన్నారు. దీనివల్ల ఆస్పత్రిల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు. అంతేకాకుండా అభిమానులు చాలా కంగారు పడడంతో సమాధానం చెప్పడం కష్టమైందని అన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం చాలా బాగుందని, చెకప్స్ పూర్తయిన వెంటనే ఇంటికి వెళ్లిపోతానని చెప్పారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాని కృష్ణం రాజు అన్నారు. -
హాస్యనటుడు వేణుమాధవ్ ఆరోగ్యం విషమం
రాంగోపాల్పేట: ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 6న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేరారు. గత కొద్ది రోజుల నుంచి ఆయనకు డయాలసిస్ నడుస్తోంది. మంగళవారం ఆరోగ్యం విషమించడంతో ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ నటులు జీవిత, రాజశేఖర్, ఉత్తేజ్లు ఆస్పత్రికి వచ్చి ఆయనను పరామర్శించి వెళ్లారు. -
నటుడు వేణు మాధవ్కు తీవ్ర అనారోగ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్గా తనదైన ముద్రను వేసుకున్న వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. హాస్యపాత్రలతో తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన వేణు మాధవ్ అనారోగ్యంపై చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తనకు ఎటువంటి అనారోగ్యం లేదని గతంలో ఆయన వివరణయిచ్చారు. రాజకీయాల్లో రాణించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అప్పట్లో నామినేషన్ కూడా వేశారు. -
నిలకడగా మాజీ సీఎం ఆరోగ్యం
కోల్కతా: పశ్చిమబెంగాల్ మాజీ సీఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీనియర్ నాయకుడు బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. 2000 నుంచి 2011 మధ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన భట్టాచార్జీ, తన భార్యతో కలిసి కోల్కతాలోని రెండు గదుల అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, లోబీపీ కారణంగా 75 ఏళ్ల బుద్ధదేవ్ను శుక్రవారం సాయంత్రం కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ కౌశిక్ బసు మాట్లాడుతూ.. బుద్ధదేవ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఏడుగురు వైద్యుల బృందం నిత్యం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పారు. -
విషమంగానే జైట్లీ ఆరోగ్యం: మంత్రుల పరామర్శ
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఈ నెల 9న ఆయన తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఇంకా కోలుకోకపోవడంతో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు శనివారం జైట్లీని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత అభిషేక్ సింగ్వీ ‘జైట్లీ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని పార్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. శిరోమణి అకాళీదళ్ నేత మంజిందర్ ఎస్ సిర్సా కూడా జైట్లీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జైట్లీ.. తనకు మెంటర్ వంటి వారని, అంతే కాకుండా 1984 సిక్కుల ఊచకోత బాధితులకు న్యాయం జరగాలని పోరాడిన వ్యక్తి అంటూ ఆయన గుర్తుచేసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైట్లీని శుక్రవారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వైద్యశాలకు వెళ్లి జైట్లీని పరామర్శించిన విషయం తెలిసిందే. మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్లు కూడా ఆసుపత్రికి వెళ్లి జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. జైట్లీ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆగస్టు 9 రోజు రాత్రే ఎయిమ్స్ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. తర్వాత జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. -
పుకార్లపై క్లారిటీ ఇచ్చిన పోసాని
నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితిపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల చికిత్స చేయించుకున్న పోసాని మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై పోసాని కృష్ణమురళి స్పందించారు. ఇటీవల తాను అనారోగ్యానికి గురైన మాట వాస్తవమే కాని చికిత్స తరువాత కోలుకుంటున్నట్టుగా వివరించారు. మరోసారి తీవ్ర అస్వస్థతకు గురైనట్టుగా వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా తెలిపిన ఆయన, మరో వారం పదిరోజుల్లో షూటింగ్లకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలిపారు. తన ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్ధించిన వారందరికీ వీడియో సందేశం ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన పోసాని
-
మెడికల్ రిపోర్ట్ను ఈసీకి పంపించాను
-
సాయిబాబకి వైద్య బెయిల్ ఇవ్వాలి
న్యాయస్థానం ఆదేశాలతో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబని ఆయన సోదరుడు రామ్దేవ్తోపాటు 2018 డిసెంబర్ 26న కలిశాను. నాగ్పూర్ జైలులో ములాఖత్ కిటికీ గుండా కాకుండా, చాలా కాలం తర్వాత నాగ్పూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో తనను నేరుగా చూడగలిగాను. తన పరిస్థితి గతంలో నేను ఊహించినదానికంటే ఘోరంగా ఉంది. దాదాపు కదల్లేని స్థితిలో కనిపించారు. తన చేతులు విడుపులేకుండా వణుకుతున్నాయి. బరువు కూడా బాగా కోల్పోయారు. ఇప్పుడు తనను కుర్చీలోంచి పడకమీదికి మార్చాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం అవసరం. డిసెంబర్ 26న వైద్య పరీ క్షల సమయంలో కూడా సాయి సోదరుడు, ఒక పోలీసు కలిసి తనను అనేక సార్లు చేతుల మీద ఎత్తుకుని మార్చాల్సి వచ్చింది. ఆ దృశ్యాలను వీడియోగా కూడా తీసి ఉంచాను కాబట్టి గౌరవనీయ న్యాయమూర్తులు కూడా చూసి సాయి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. సాయిబాబకు జైల్లో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. తనను చుట్టుముట్టిన తీవ్ర అనారోగ్య పరిస్థితులను పట్టించుకోకుండా మూత్రాశయంలో రాళ్లను మాత్రమే శస్త్ర చికిత్సతో తీసేస్తామని మాత్రమే ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. సాయి మొత్తంమీద 19 రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రాణాంతకంగా మారిన గుండె సమస్య, కిడ్నీల్లో రాళ్లు, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి పలు సమస్యలు తనను వెంటాడుతున్నాయి. వైద్యులు సిఫార్సు చేసిన పలు పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో లేవు. అందుకే తనను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చాలని కూడా వైద్యులు సూచించారు. సాయి ఉంటున్న సెల్ ఓపెన్గా ఉండటంతో తనకు తీవ్రంగా చలివేస్తోంది. దీంతో తన కాళ్లు స్తంభిం చిపోయాయి. అండా సెల్ లోపల ఉష్ణోగ్రత మరింత తక్కువగా కావడంతో తాను నరకం అనుభవిస్తున్నట్లే లెక్క. తన ఎడమ భుజం స్తంభించిపోయినందున వెంటనే ఆయనకు థెరపీ చికిత్స చేయించాలని న్యూరాలజీ విభాగాధిపతి రాశారు. తనకు నిత్యం ఫిజియోథెరపీ అవసరం. కుటుంబ సభ్యుల తోడు లేకుండా అది అసాధ్యం. తీవ్రమైన నొప్పిని అనుభవిస్తూ జీవిత చరమాంకంలో లాగా గడుపుతున్నారు. జనవరి 24న ఢిపెన్స్ కౌన్సిల్ వాదన ముగిసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 11న ఉంటుంది. సాయిని జైల్లో ఉంచి రెండేళ్లవుతోంది. తనకు మెడికల్ బెయిల్ కోసం అప్లై చేసి 11 నెలలు అవుతోంది. ఈలోగానే తన ఆరోగ్య స్థితి విషమంగా మారింది. ఘన ఆహారం స్వీకరించలేనంత బలహీనంగా ఉన్నారు. 90 శాతం వైకల్యంతో ఉన్న సాయి హక్కులకు తీవ్రంగా భంగం కలుగుతోంది. తరచుగా స్పృహ కోల్పోతున్న సాయిబాబది అక్షరాలా ఇçప్పుడు చావుబతుకుల సమస్య. తన ప్రాథమిక మానవ హక్కులను గౌరవ న్యాయస్థానం ఎత్తిపట్టి పూర్తిస్థాయి అంగవైకల్యంతో ఉంటున్న సాయి వైద్య బెయిల్ను తదుపరి విచారణలో అయినా మంజూరు చేయాలని కోరుతున్నాను.-వసంత,ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబ సహచరి -
ఇంకా తెలవారలేదు
బడికి వెళ్లి అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు మంచు తెరలపై రక్తాక్షరాలు అయ్యారు. తెల్లవారుజామునే జరిగిన రోడ్డు ప్రమాదంలో నెత్తుటి ముద్దలుగా మారారు. ఈ ఘోరం∙జరిగి సరిగ్గా ఏడాది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి నలుగురు విద్యార్థులతోపాటు ఆటోడ్రైవర్ బలైన విషాద ఘటన 2017 డిసెంబరు 28వ తేదీన ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ శివారులో జరిగింది. ఆ ఘటనలో విద్యార్థినులు కనుమర్తి గాయత్రి (15), ఆళ్ల రేణుక (15), పొట్లపల్లి శైలజ (15), మున్నంగి కార్తీక్ రెడ్డి (15), వీరితోపాటు ఆటోడ్రైవర్ రేపూడి ధన్రాజ్ (28) చనిపోయారు. గాయపడిన వారిలో పొట్లపల్లి భాను, పొట్లపల్లి వైష్ణవి, ఆలకుంట శిరీషలు ఉన్నారు. ఈ సంఘటన ఎనిమిది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. అందరూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. వైష్ణవి, శిరీష, లక్ష్మీ భవానీలు ముగ్గురికీ కాళ్లు విరగడంతో ఆపరేషన్లు చేశారు. కొద్ది రోజుల క్రితం వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగు పడటంతో ఇంటికి పంపారు. వీరిలో వైష్ణవి, లక్ష్మీభవాని ఇంటివద్ద మంచంలో ఉంటూనే చదువుకుని చేతి కర్రలుపట్టుకుని తల్లిదండ్రుల సహకారంతో పదోతరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ప్రైవేట్ కళాశాల హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. శిరీషకు మూడు ఆపరేషన్లు జరిగాయి. ఒక ఆపరేషన్ విజయవంతం కాకపోవడంతో అమ్మ సాయం లేనిదే నడవలేని పరిస్థితిలో ఉంది. దీంతో పదోతరగతి పరీక్షలు కూడా రాయలేక మంచానికే పరిమితమైంది. తాను బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించాలని అనుకునేదాన్నంటూ శిరీష గద్గద స్వరంతో చెబుతోంది. కదిలిస్తే కన్నీళ్లే శైలజ తండ్రి శ్రీధర్ ఎంత ముఖ్యమైన పని ఉన్నా గ్రామం నుంచి ఫిరంగిపురం వెళ్లే మార్గంలో ఉన్న దుర్ఘటన ప్రాంతం మీదుగా వెళ్లడం లేదు. అటు వెళితే తమ కుమార్తె అసువులు బాసిన ప్రాంతం వస్తుందని, అది చూసి తట్టుకోలేనన్న భయంతో కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న ఫిరంగిపురం వెళ్లేందుకు ఏడు కిలోమీటర్ల దూరం వచ్చి, 113 తాళ్లూరు నుంచి ఫిరంగిపురానికి రాకపోకలు సాగిస్తున్నారు. కార్తీక్రెడ్డి తండ్రి కూడా ఘటన గురించి ఎవరైనా గుర్తు చేస్తే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. గ్రామానికి ఆర్టీసీ బస్ రాని కారణంగా తన కుమారుడు పాఠశాలకు ఆటోలో వెళ్తూ ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లాడని.. ప్రభుత్వం నుంచి అందిన పరిహారంతో తన కుమారుడు కార్తీక్ పేరుతో బస్ షెల్టర్ నిర్మించాడు. పూలచెట్లు చూస్తే తమ కుమార్తె గుర్తుకు వస్తుందంటూ రేణుక తల్లి దేవి విలపిస్తున్న తీరు అపరిచితులు సైతం కంటనీరు తెప్పిస్తోంది. బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగం పొంది మిమ్మల్ని బాగా చూసుకుంటానని ఎప్పుడూ చెబుతుండేదని, దేవుడు తమకు అన్యాయం చేసి తీసుకెళ్లాడని గాయత్రి తల్లి శివకుమారి గుండెలు పగిలేలా రోదిస్తోంది. వైద్యం కోసం ఇల్లు తాకట్టు ఏడాది కాలంగా మంచానికే పరిమితమైన ఆలకుంట శిరీషకు మూడు విడతలుగా ఆపరేషన్లు జరిగాయి. మొదట ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఉచితంగా వైద్యం చేయించిన ప్రభుత్వం ఆ తరువాత పట్టించుకోలేదు. దీంతో ప్రతినెలా వైద్యపరీక్షలు, మందుల కోసం వేలకు వేలు ఖర్చు అవుతుండటతోపాటు తండ్రి కృష్ణయ్య రెండేళ్లుగా పక్షవాతం కారణంగా కాలుచేయి పనిచేయక ఇంటివద్దే ఉంటున్నాడు. శిరీష తల్లి పుల్లమ్మకు కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. ప్రభుత్వం 2 లక్షలు నష్టపరిహారం ఇస్తుందనుకుంటే 1 లక్ష మాత్రమే ఇవ్వడంతో చేసేది లేక ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి శిరీషకు వైద్యం చేయిస్తున్నారు. బాసటగా వై.ఎస్.జగన్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ బాధితుల పక్షాన నిలబడడంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అయితే ప్రకటించింది గానీ అందులోనూ మోసం చేసింది. – ఎన్. మాధవరెడ్డి, సాక్షి, గుంటూరు -
రజనీకాంత్ క్షేమం.. వదంతులు నమ్మొద్దు
సాక్షి, చెన్నై : సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రఅనారోగ్యానికి గురయ్యారన్న వార్తల్లో వాస్తవం లేదని రజనీకాంత్ పీఆర్వో రియాజ్ వివరణ ఇచ్చారు. రజనీకాంత్ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని, వదంతులు నమ్మొద్దని కోరారు. రజనీకాంత్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ తమిళనాడు వ్యాప్తంగా వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్ బుక్లలో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. రజనీకాంత్ ఆరోగ్యం క్షీణించిందని, ఆసుపత్రిలో చేరినట్టు వస్తున్న వార్తలను రజనీకాంత్ పీఆర్వో కొట్టిపడేశారు. మరోవైపు శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన 2.0 చిత్రం నవంబర్ 29న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. రజనీకాంత్ ప్రస్తుతం పేటా అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతుంది. -
దిలీప్ బాగానే ఉన్నారు
బాలీవుడ్ పాత తరం సూపర్ స్టార్ దిలీప్ కుమార్ ఆరోగ్యంపై రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజాగా ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు ఆయన సతీమణి, నటి సైరా భాను. ‘‘దిలీప్ కుమార్గారు న్యుమోనియాతో బాధపడుతున్నారన్నది అబద్ధం. ఆ వార్త కేవలం పుకారు మాత్రమే. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఇంట్లోనే ఉంటున్నారు. సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతున్నారాయన. ప్రస్తుతం కోలుకుంటున్నారు’’ అని సైరా భాను పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో దిలీప్ ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరితే న్యుమోనియాతో బాధపడుతున్నట్టు వార్తలు మొదలయ్యాయి. అందుకే సైరా అదేం కాదని స్పష్టం చేశారు. -
వాజ్పేయి ఆరోగ్యంపై రాజ్నాథ్, అమిత్షా వాకబు
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి(93) ఆరోగ్య పరిస్థితిపై హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అమిత్ షా శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో వాజ్పేయి చికిత్స పొందుతున్న ఎయిమ్స్కు వెళ్లి, వైద్యులతో మాట్లాడారు. అనంతరం రాత్రి 8.15 గంటలకు హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎయిమ్స్కు వెళ్లారు. వాజ్పేయి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబసభ్యులు జూన్ 11వ తేదీన ఎయిమ్స్లో చేర్పించారు. ప్రస్తుతం వాజ్పేయి కిడ్నీ ఒక్కటే పనిచేస్తోంది. ఆయనకు డయాబెటిస్తోపాటు డిమెన్షియా ఉంది. -
సోనాలి బింద్రే ఆరోగ్యంపై ‘గోల్డీ’ ట్వీట్
సాక్షి, న్యూఢిల్లీ : న్యూయార్క్లో క్యాన్సర్ చికిత్స పొందుతున్న బాలీవుడ్ నటి సోనాలి బింద్రే ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహల్ ట్వీట్ చేశారు. క్యాన్సర్పై పోరాటం దీర్ఘకాలమైనా తాము సానుకూల దృక్పథంతో ప్రయాణం ప్రారంభించామన్నారు. తాను మెటాస్టాటిక్ క్యాన్సర్తో బాధపడుతున్నానని, దీనిపై ధైర్యంగా పోరాడతానని జులైలో సోనాలి వెల్లడించిన విషయం తెలిసిందే. ‘సోనాలి పట్ల మీరు చూపుతున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు.. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. చికిత్స నేపథ్యంలో ఎలాంటి సమస్యలూ తలెత్తడం లేదు.. సానుకూల దృక్పథంతో తాము ఈ ప్రయాణాన్ని ప్రారంభించా’మని గోల్డీ బెహల్ ట్వీట్ చేశారు. క్యాన్సర్ రూపంలో తనకు ఎదురైన ప్రాణాంతక వ్యాధిని అత్యంత ధైర్యంగా ఎదుర్కొంటున్న సోనాలీని బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసించిన విషయం తెలిసిందే. Thank you all for the love and support for Sonali... she is stable and is following her treatment without any complications. This is a long journey but we have begun positively.🙏 — goldie behl (@GOLDIEBEHL) 2 August 2018 -
రియాక్షన్.. ‘ఇంక ఫోన్కాల్స్ చెయ్యను’
ఎన్డీయేపై అసంతృప్తితో తిరిగి మహాకూటమితో జత కడదామనుకుంటున్న తరుణంలో జేడీయూ అధినేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. లాలూ కొడుకులు విముఖత వ్యక్తం చేయటంతోపాటు తీవ్ర వ్యాఖ్యలు చేయటం నితీశ్కు కోపం తెప్పించింది. పట్నా: లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దకొడుకు, ఆర్జేడీ యువనేత తేజ్ప్రతాప్ యాదవ్ వ్యాఖ్యలపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నితీశ్ మీడియాతో మాట్లాడుతూ... ‘ఒకరితో వ్యక్తిగతంగా అనుబంధం ఉన్నప్పుడు.. వారి ఆరోగ్యం గురించి వాకబు చేయటంలో తప్పేంటి. అతని(తేజ్ను ఉద్దేశించి) వ్యాఖ్యలు సబబు కాదు. ఎవరెలా బాధపడుతున్నా పట్టించుకోరనేది వారి మాటల ద్వారా అర్థమైంది. లాలూ త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. కానీ, ఇంక వాళ్లకు ఫోన్ చేసి లాలూ ఆరోగ్యంపై ఆరా తీయను. న్యూస్ పేపర్ల ద్వారానే తెలుసుకుంటా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం లాలూ ఏషియన్ హార్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే లాలూ ఆరోగ్యంపై నితీశ్ పదే పదే వాకబు చేస్తుండటంతో తిరిగి ఆర్జేడీకి లాలూ దగ్గరవుతున్నాడంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో స్పందించిన తేజ్ ప్రతాప్ యాదవ్... ‘కూటమిలోకి కాదు.. ఇంట్లోకి కూడా రానివ్వం. మా ఇంట్లోకే నితీశ్ చాచాకు అనుమతిలేదని బోర్డు పెట్టాలనుకున్న మేము.. మహాకూటమిలోకి ఎలా ఆహ్వానిస్తామనుకుంటున్నారు?’ అని మీడియానే తేజ్ ఎదురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నితీశ్ ఇలా స్పందించాల్సి వచ్చింది. -
ముందుగానే మృత్యువాత పడుతున్నారు..
దేశంలోని ఇతర సామాజికవర్గాలతో పోల్చితే ఆదివాసీలు, షెడ్యూల్డ్ కులాలు, అల్పసంఖ్యాక వర్గాలు (ముస్లింలు) ముందుగానే మృత్యువాత పడుతున్నారు. ఇతర వర్గాల ప్రజలతో పోల్చితే సరైనస్థాయిలో వైద్యసేవలు అందక క్షీణిస్తున్న ఆరోగ్యాల కారణంగా చిన్నవయసులోనే చనిపోతున్నారు. భారత్లోని నిచ్చెన మెట్ల సమాజంలో అట్టడగున ఉన్న అణగారిన వర్గాలపై ఈ ప్రభావం అధికంగా ఉన్నట్టు తేలింది. ఉన్నత తరగతులు, ముస్లీమేతర వర్గాలకు చెందిన వారితో పోల్చి చూస్తే ఈ వర్గాలకు సరైన వైద్య,ఆరోగ్య సేవలు అందడం లేదని ‘భారత్లో కులం, మతం, ఆరోగ్యాలపై ప్రభావం (2004–14 మధ్యకాలంలో)’ పై ఆర్థికవేత్త వాణీæకాంత్ బారువా జరిపిన విశ్లేషణలో వెల్లడైంది. 2004 నుంచి 2014 వరకు పరిశీలిస్తే ఆదివాసీల సగటు జీవితకాలం తగ్గిపోయింది.. 2004 వరకు ఎస్టీలు సగటును 45 ఏళ్లపాటు జీవిస్తుండగా, ఆ తర్వాతి దశకంలో అది మరింత తగ్గిపోయింది. ఎస్సీల సగటు జీవితకాలం 42 నుంచి 2014 కల్లా ఆరేళ్లు పెరిగింది. మొత్తం ఆరుగ్రూపుల్లో ముస్లీమేతర ఉన్నత కుటుంబాల సగటు జీవించే వయసు 2004లో 55 ఏళ్ల నుంచి 2014లో 66 ఏళ్లకు పెరిగింది. దీనికి ఆరోగ్య,వైద్యసేవల నిర్వహణలో లోపాల కారణంగా తలెత్తుతున్న అసమానతలే ప్రధాన కారణమని బారువా తేల్చారు. భారత్లో ఓ వ్యక్తి ఆరోగ్యస్థితి నిర్థారణకు అతడు/ఆమె ఆర్థిక, సామాజిక స్థాయి సారూప్యపాత్ర (రిలేటివ్ రోల్) నిర్వహిస్తోందంటారు. 2004, 2014లలోని నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్ఓ) గణాంకాల ఆధారంగా ఆయన వివిధ అంశాలు పరిశీలించారు. 2004, 2014లలో సామాజిక బృందాల వారీగా సగటు వయసు మరణాలు... 2004 2014 ముస్లీమేతర ఉన్నత వర్గాల వయసు 55 60 ముస్లీమేతర ఓబీసీలు 49 52 ఉన్నత వర్గ ముస్లింలు 44 49 షెడ్యూల్డ్ కులాలు 42 48 షెడ్యూల్డ్ జాతులు 45 43 ఇతర సామాజికవర్గాలతో పోల్చితే ఎస్టీలు తక్కువ వయసులోనే చనిపోతున్నా, తాము అనారోగ్యంగా ఉన్న విషయాన్ని 24 శాతం మాత్రమే వెల్లడిస్తున్నారు. 2004లో ఇది 19 శాతంగానే ఉంది. ముస్లింలు, ఓబీసీలు 35 శాతం మంది వైద్య సేవల కోసం బయటకు వస్తున్నారు. పేదలు, ఒంటరిగా ఉంటున్న వారు తమ ఆరోగ్య సమస్యలు వెల్లడించి వైద్యసేవలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బారువా పేర్కొన్నారు. -
కోలుకుంటున్న స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు సరోజినీదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్గౌడ్ బుధవారం చెప్పారు. గవర్నర్ ప్రసంగ సమయంలో చోటు చేసుకున్న ఘటనలో ఆయన కంటికి గాయమైన విషయం తెలిసిందే. సరోజినీదేవి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం నిలకడగా, మెరుగ్గా ఉందని తెలిపారు. గురువారం ఉదయం మరోసారి పరీక్షించిన తర్వాత ఆయన్ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందన్నారు. -
ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యంపై ఆందోళన
-
దాసరి కోలుకుంటున్నారు...
ఆయన ఆరోగ్యంపై ఆందోళన అక్కర్లేదు: కిమ్స్ ఎండీ సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ దర్శక నిర్మాత, కేంద్రం మాజీ మంత్రి దాసరి నారాయణరావు ప్రస్తుతం కోలుకుంటున్నారని కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్రావు వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గురువారం చెప్పారు. మూడునాలుగు రోజుల్లో సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందన్నారు. అన్నవాహిక ఇన్ఫెక్షన్తో బాధపడుతూ నాలుగు రోజుల కిందట దాసరి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇన్ఫెక్షన్ తొలగిస్తున్న క్రమంలో ఆయన కిడ్నీలు, ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింది. దీంతో వెంటిలేటర్తో కృత్రిమ శ్వాస అందించారు. కిడ్నీల పనితీరు మెరుగవ్వడంతో డయాలసిస్ నిలిపివేసి, గురువారం వెంటిలేటర్ తొలగించారు. కానీ దాసరి చికిత్సకు స్పందించలేదు. దీంతో ఆయన్ను మళ్లీ వెంటిలేటర్పైకి మార్చి వైద్యం అందిస్తున్నారు. దత్తాత్రేయ పరామర్శ... కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ, సినీనటులు మురళీమోహన్, తరుణ్, రోజారమణి, ఎడిటర్ మోహన్, కాస్ట్యూమ్స్ సురేష్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని దాసరి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాసరి ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ గురువారం ఫిలింనగర్ సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. -
దాసరికి పవన్ కల్యాణ్ పరామర్శ
-
నిలకడగా పాశ్వాన్ ఆరోగ్యం
పట్నా : అస్వస్థతకు గురైన కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ఆర్యోగం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్వాసకోస ఇబ్బందులతో ఆయనను నిన్న రాత్రి ఢిల్లీలోని పరాస్ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. పాశ్వాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి కార్డియాలస్ట్ హెడ్ డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పాశ్వాన్కు ఐసీయూలోనే చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు పాశ్వాన్ ఆరోగ్యం మెరుగు పడగానే వైద్యుల సిఫార్సు మేరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఓఎస్డీ ఆర్సీ మీనా తెలిపారు. -
'జయలలిత నాకు చెల్లెలులాంటిది'
-
'జయలలిత నాకు చెల్లెలులాంటిది'
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి గడిచేకొద్ది విషమంగా మారుతుండటంతో పార్టీలు, రాజకీయాలకతీతంగా ఆమె కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. రాజకీయాలను పక్కనబెడితే జయలలిత తనకు చెల్లెలు లాంటిదని ఎండీఎంకే అధినేత వైగో చెప్పారు. అపోలో వైద్యులు జయలలితకు అధునాతన చికిత్సను అందిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ ఆందోళనకర పరిస్థితి నుంచి ఆమె త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మరో వైపు అపోలో ఆసుపత్రి వర్గాలు, లండన్కు చెందిన ప్రఖ్యాత వైద్య నిపుణుడు ప్రొఫెసర్ రిచర్డ్ బేలే ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడేందుకు తాము శాయశక్తులా కృషిచేస్తున్నామని, కానీ ఆమె పరిస్థితి విషమంగా మారుతున్నట్టు పేర్కొన్నారు. దీంతో తమిళనాడుతోపాటు దేశవ్యాప్తంగా జయలలిత ఆరోగ్యంపై ఆందోళనలు నెలకొన్నాయి. తమిళనాడు రాజకీయాల్లో చిరకాల ప్రత్యర్థిగా ఉన్న కరుణానిధి, ప్రతిపక్ష నేత స్టాలిన్లు కూడా జయ పూర్తిగా కోలుకోవాలని కోరుతున్నట్టు ఉదయం ట్వీట్లు చేశారు. మరోవైపు ఆమె కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. -
అమ్మ సేనల్లో ఆనందం
సాక్షి, చెన్నై: అనారోగ్యంతో అమ్మ జయలలిత ఆసుపత్రిలో చేరి నెల రోజులు దాటింది. ఆమెకు అపోలో ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవల్ని అందిస్తూ వస్తున్నారు. పలు రకాల వదంతులు, ప్రచారాలు సాగినా, వాటన్నింటికి అమ్మ ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతూ , ప్రస్తుతం దాదాపు కోలుకున్నట్టే అని వస్తున్న సమాచారాలే సమాధానం. అపోలో ఆసుపత్రికి మళ్లీ లండన్ వైద్యుడు రిచర్డ్, ఎయిమ్స్ వైద్యుడు గిల్నాని ఆదివారం రావడంతో ఇక, తమ అమ్మ ఆరోగ్యం పూర్తిగా కుదుట పడ్డట్టే అన్న ఆనందం అన్నాడీఎంకే వర్గాల్లో బయలు దేరింది. జయలలిత సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాల్లో పూజలు హోరెత్తించారు. పాల కలశాలతో అనేక చోట్ల ఊరేగింపులు ఆలయాల వైపుగా సాగాయి. మరికొన్ని చోట్ల నిప్పు కుండల్ని చేత బట్టి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఇక, సంపూర్ణ ఆరోగ్య వంతురాలుగా తమ ముందుకు అమ్మ రానున్నారన్న సమాచారంతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఉదయం సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి కేరళ మాజీ సీఎం ఉమన్ చాంది అపోలో ఆసుపత్రికి చేరుకుని విచారించారు. జయలలిత సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ప్రజల ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేయడం విశేషం. ఇక, సింగపూర్ నుంచి వచ్చిన అక్కడి ప్రభుత్వం ప్రతినిధి జోష్వా జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వర్గాల వద్ద, మంత్రుల వద్ద విచారించారు. జయలలిత త్వరితగతిన సంపూర్ణ ఆరోగ్య వంతురాలు కావాలని కాంక్షిస్తున్నట్టు జోష్వా పేర్కొన్నారు. ఇక, సీనియర్ నటి లత కూడా పరామర్శించిన వారిలో ఉన్నారు. సేలం సమీపంలోని కామాక్షి దేవి పెరియ నాయకీ అమ్మ వారి ఆలయంలో అలనాటి నటి కేఆర్ విజయ సీఎం జయలలిత ఆరోగ్య క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. ఇక, జయలలిత ఆసుపత్రిలో ఉన్న దృష్ట్యా, ఈ ఏడాది తాను జన్మదిన వేడుకలకు దూరం అని విశ్వనటుడు కమల్హాసన్ ప్రకటించారు. నవంబర్ ఏడో తేదీన తన జన్మదిన వేడుకల్ని జరప వద్దని అభిమానులకు సూచించారు. కాగా, సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి మీడియాతో మాట్లాడుతూ త్వరలో సంపూర్ణ ఆరోగ్య వంతు రాలుగా అమ్మ జయలలిత ఇంటికి చేరుతారని ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి చౌదరి చేసిన వ్యాఖ్యలు తమకు మరింత ఆనందాన్ని నింపాయని వ్యాఖ్యానించారు. అమ్మ ఆరోగ్య వంతురాలుగా ఉన్నారని, రాష్ట్ర ప్రజల ప్రార్థనలకు, పూజలకు దేవుడు కరుణ చూపించాడని పేర్కొన్నారు. దేవుడి అనుగ్రహం, ఆశీస్సులు, డాక్టర్ ఉత్తమ సేవలకు అమ్మ ఆరోగ్యవంతు రాలుగా అందరి ముందుకు రానున్నారని ధీమా వ్యక్తం చేశారు. -
ఆందోళనకరంగా సీఎం మేనల్లుడి ఆరోగ్యం
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. రోడ్డు ప్రమాదానికి గురైన వారం రోజుల తర్వాత కూడా అభిషేక్ ఆరోగ్యం మెరుగుపడలేదు. అభిషేక్ చికిత్స పొందుతున్న బెల్లె వ్యూ క్లినిక్ ఆదివారం హెల్తె బులెటిన్ విడుదల చేసింది. ఆయన జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారని, ఇప్పటికీ కృత్రిమ శ్వాస అందిస్తున్నారని తెలిపారు. గత రెండు రోజులుగా రాత్రి వేళల్లో అభిషేక్ హృదయ స్పందన నిలకడగా లేకపోవడం వైద్యులకు ఆందోళన కలిగిస్తోంది. అభిషేక్ తలకు, ముఖంపై గాయాలయ్యాయి. 14 మందితో కూడిన వైద్యుల బృందం అభిషేక్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు త్వరలో సర్జరీ చేయనున్నారు. కాగా అభిషేక్కు నిర్వహించిన పరీక్షల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని వైద్యులు చెప్పారు. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అభిషేక్ బెనర్జీ (29) తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. హుగ్లీ జిల్లాలోని ముర్షిబాద్ లో పార్టీ మీటింగ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రత్నపూర్ వద్ద ప్రమాదం జరిగింది. -
క్రమంగా కోలుకుంటున్న సంజనా
హైదరాబాద్ : పెద్ద అంబర్పేట్ వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారి సంజనా ఆరోగ్య పరిస్థితి క్రమంగా కోలుకుంటుందని కామినేని వైద్యులు బుధవారం వెల్లడించారు. ఆమె ఇంకా వెంటిలేటర్పైనే కొనసాగుతుందని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన పెద్ద అంబర్పేట వద్ద సంజనాతోపాటు ఆమె తల్లిని తాగి వాహనం నడిపి... యువకులు ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సంజనాతోపాటు ఆమె తల్లీ కూడా తీవ్రంగా గాయపడింది. వీరు ప్రస్తుతం కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సంజనాను కారు ఢీకొట్టడంతో ఆమె తాతయ్యకు తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
ఇంకా విషమంగానే సంజన ఆరోగ్యం: వైద్యులు
-
జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన