ప్రస్తుతం తాను రూపొందిస్తున్న సినిమాలో చంద్రబాబును అవమానించినట్టుగా టీడీపీ నాయకులు కంప్లయింట్ ఇచ్చారని ఈసీ, పోసానికి నోటీసులు పంపింది. అయితే పోసాని తన సినిమా ఇంకా ఫస్ట్ కాపీ రెడీ కాలేదని సినిమాలో ఏముందో ఎవరికీ తెలిసే అవకాశం లేదని, ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కారణంగా స్వయంగా వచ్చి కలవలేకపోతున్నట్టుగా ఈసీకి సమాధానం ఇచ్చారు. తాను యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టుగా అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్ను సైతం ఈసీకి పంపించానన్నారు.