
సాక్షి, హైదరాబాద్: భీమాకోరేగావ్ కేసులో 2018 ఆగస్టులో అరెస్టయిన వరవరరావు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని, ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తెలంగాణ పౌరసమాజం కోసం, రాజ్యాంగం ఇచ్చిన పౌరహక్కుల సాధన, భావ ప్రకటన కోసం, పేదల కోసం ఉద్యమిస్తున్న వరవరరావుకు జైల్లో ఏదైనా జరిగితే అది రాజ్యం చేసిన ద్రోహం అవుతుందని భట్టి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.