ములుగు రూరల్: పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలు చేసి క్వింటాకు రూ.25వేలు ధర చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.అమ్జద్పాషా అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్కకు ఆయన ఆదివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు 20వేల ఎకరాల్లో పత్తి పంటసాగు అయిందని తెలిపారు. సీసీఐ రెండు నెలలుగా కొనుగోలు చేసి వారం నుంచి కొనుగోళ్లు చేయడం లేదని తెలిపారు. వెంటనే సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. అదే విధంగా మిర్చిని మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి క్వింటాకు రూ.25వేలు చెల్లించాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో నాయకులు బోడ రమేష్, గొంది సాంబయ్య, తిరుపతి, రామయ్య పాల్గొన్నారు.
రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్జద్పాషా
Comments
Please login to add a commentAdd a comment