వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని ఇసుక లారీలతో ఇక్కట్లు తప్పడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం నుంచి వందల సంఖ్యలో ఇసుక లారీలు మండల కేంద్రం మీదుగా హైదరాబాద్కు వెళ్తున్నాయి. ఈ లారీలతో ప్రజలతో పాటు అత్యవసర సర్వీసులకు ఇబ్బందులు ఎదురైనా పట్టించుకునే వారే కరువయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఏటూరునాగారంలోని ప్రభుత్వ ఆస్పత్రికి గర్భిణులను ప్రసవ నిమిత్తం తరలిస్తున్న 102వాహనం ఇసుక లారీల మధ్యలో సుమారు అరగంట పాటు చిక్కుకుంది. సాయంత్రం సమయంలో అత్యవసర కేసులను తీసుకెళ్తున్న 108 వాహనం సైతం 45 నిమిషాల పాటు చిక్కుకుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment