అధికారులు సమన్వయంతో పనిచేయాలి
● వీసీలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
ఏటూరునాగారం: పంటలు కాపాడేందుకు అధికా రులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు సో మవారం రాత్రి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సూచించారు. హైదరాబాద్ నుంచి మంత్రులు సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా తరఫున కలెక్టర్ దివాకర హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు మా ట్లాడుతూ చుక్క నీరు వృథా కాకుండా సమర్థవంతంగా పంటలకు నీరు ఇవ్వాలన్నారు. రబీ పంటలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, నీటి వనరులపై ఇరిగేషన్ శాఖతో సమావేశాలు నిర్వహించి నీటి పంటలకు పూర్తి స్థాయిలో అందేలా చూడాలన్నారు.
ఓసీలో బ్లాస్టింగ్లతో
ఇళ్లు ధ్వంసం
గణపురం: మండలంలోని ఓసీ–3 ప్రాజెక్టులో నిత్యం పేలుస్తున్న బాంబులతో తమ ఇళ్లు ధ్వంసం కావడంతో పాటు తీవ్రంగా దుమ్ము ధూళి బయటకు వచ్చి తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నామని పరుశరాంపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఓసీ–3 ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం నుంచే ఆందోళనకు దిగారు. ఓసీ–3 ఓపెన్ కాస్టు గనిలో రోజు బొగ్గు తవ్వకాలకు ఉపయోగిస్తున్న భారీ బాంబులతో తమ ఇండ్లు పగుళ్లు పట్టడంతో పాటు గని నుంచి పెద్దఎత్తున దుమ్ము ఇండ్లలోకి చేరుకుంటుందని ఆరోపించారు. సింగరేణి అధికారులు వెంటనే తమ గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా ప్రకటించి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తుల ఆందోళనతో పెద్దఎత్తున గనిలోకి వెళ్లి వచ్చే బొగ్గు లారీలు రోడ్డుపై నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సింగరేణి అధికారులు, పోలీసులు ఆందోళన వద్దకు చేరుకొని గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ తమకు ఖచ్చితమైన హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించమని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డి ఆందోళన వద్దకు వచ్చి తమకు లిఖిత పూర్వకంగా రాసిస్తే సీఎండీ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
Comments
Please login to add a commentAdd a comment