కష్టపడ్డారు.. | - | Sakshi
Sakshi News home page

కష్టపడ్డారు..

Published Wed, Mar 12 2025 7:39 AM | Last Updated on Wed, Mar 12 2025 7:35 AM

కష్టప

కష్టపడ్డారు..

బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
గ్రూప్‌– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ

8లోu

ముల్కలపల్లి యువకుడు ఉపేందర్‌..

డోర్నకల్‌: గ్రూప్‌–2 ఫలితాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్‌ ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్‌ ప్రస్తుతం మహబూబాబాద్‌ కలెక్టరేట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ గ్రూప్‌–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్‌ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాప్‌–10లో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్‌ను గ్రామస్తులు అభినందించారు.

ఉద్యోగం చేస్తూనే

పోటీ పరీక్షకు సన్నద్ధం

పలువురికి మెరుగైన ర్యాంకులు

హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు

కొందరు ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నతస్థాయికి వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్‌–2 ఫలితాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చదవడం, విషయాన్ని అర్థం చేసుకుని పోటీ పరీక్షలు రాయడం ద్వారా ర్యాంకులు సాధించవచ్చని ఆయా అభ్యర్థులు అంటున్నారు.

– సాక్షి నెట్‌వర్క్‌

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్‌కుమార్‌ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్‌కుమార్‌. తల్లి రాధ అంగన్‌వాడీ హెల్పర్‌గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌ బీటెక్‌ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వహించారు. 2021లో వీఆర్‌ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్‌ మండలంలోని అంబటిపల్లిలో పనిచేశారు. ఆ సంవత్సరంలోనే గ్రూప్‌–4 పరీక్షలో ప్రతిభ కనబరిచి హైదరాబాద్‌లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. అదే శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే 2024 డిసెంబర్‌లో జరిగిన గ్రూప్‌–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్‌ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.

మూడు శ్రీకాంత్‌ను సన్మానిస్తున్న మాజీ ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు

గూడూరు: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం మారుమూల ఏజెన్సీ గ్రామం జంగుతండాకు చెందిన మూడు భద్రు కుమారుడు శ్రీకాంత్‌ గ్రూప్‌–2 ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో ప్రతిభ కనబరిచారు. ఎస్టీ కేటగిరీలో ప్రథమ, జోనల్‌ వైస్‌ ఓపెన్‌ కేటగిరీలో మూడో ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 38వ ర్యాంకు సాధించినట్లు శ్రీకాంత్‌ తెలిపారు. గతంలో గ్రూప్‌–4 సాధించి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు, గ్రూప్‌–3 లో కూడా మంచి మార్కులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్‌ను మాజీ సర్పంచ్‌ అరుణమంగీలాల్‌నాయక్‌, మాజీ ఎంపీటీసీ గీతాఅమరేందర్‌రెడ్డి, తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సన్మానించారు.

న్యూస్‌రీల్‌

కాసింపల్లి వాసి

No comments yet. Be the first to comment!
Add a comment
కష్టపడ్డారు..1
1/5

కష్టపడ్డారు..

కష్టపడ్డారు..2
2/5

కష్టపడ్డారు..

కష్టపడ్డారు..3
3/5

కష్టపడ్డారు..

కష్టపడ్డారు..4
4/5

కష్టపడ్డారు..

కష్టపడ్డారు..5
5/5

కష్టపడ్డారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement