ఎయిడ్స్‌ అవగాహన సదస్సుకు నిధులు విడుదల | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ అవగాహన సదస్సుకు నిధులు విడుదల

Published Fri, Feb 28 2025 1:34 AM | Last Updated on Fri, Feb 28 2025 1:30 AM

ఎయిడ్స్‌ అవగాహన సదస్సుకు నిధులు విడుదల

ఎయిడ్స్‌ అవగాహన సదస్సుకు నిధులు విడుదల

నల్లగొండ టూటౌన్‌ : జాతీయ సేవా పథకం, ఎంజీ యూనివర్సిటీ ఇటీవల రెండు రోజుల పాటు రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌, పీర్‌ లీడర్స్‌ కన్వెనషన్‌ ఆధ్వర్యంలో ఎయిడ్స్‌పై నిర్వహించిన అవగాహన సదస్సు ఇటీవల విజయవంతమైంది. దీంతో తెలంగాణ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ నుంచి నిధులు విడుదలైనట్లు యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్‌ హేస్సేన్‌ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా నిధుల విడుదల ఉత్తర్వులను డాక్టర్‌ మద్దిలేటికి అందజేశారు. ఒక రోజు ఉమ్మడి జిల్లాలోని రెడ్‌రిబ్బన్‌ కాలేజీల్లో ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించాలని వీసీ సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ అల్వాల రవి, ప్రొఫెసర్‌ ఆకుల రవి, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డాక్టర్‌ జి.ఉపేందర్‌రెడ్డి, హరికిషన్‌రావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement