గోదాం వద్ద పటిష్ట భద్రత ఉండాలి | - | Sakshi
Sakshi News home page

గోదాం వద్ద పటిష్ట భద్రత ఉండాలి

Published Sun, Mar 16 2025 2:04 AM | Last Updated on Sun, Mar 16 2025 1:59 AM

గోదాం

గోదాం వద్ద పటిష్ట భద్రత ఉండాలి

నల్లగొండ : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు భద్రపరిచిన గోదాం వద్ద భద్రతను నిరంతరం కొనసాగించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి కోరారు. ప్రతినెల ఈవీఎం గోదాం తనిఖీలో భాగంగా శనివారం ఆమె రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టరేట్‌ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. వారి సమక్షంలోనే ఈవీఎం గోదాం సీల్‌ తీసి లోపల భద్రపరిచిన ఈవీఎంలను తనిఖీ చేశారు. ఆమె వెంట వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి ఉన్నారు.

ఇందిరమ్మ ఇంటి నమూనా ఆవిష్కరణ

నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్లపై లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇంటి నమూనాను కలెక్టర్‌ ఇలా త్రిపాఠి శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్లపై పూర్తిగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత గృహ నిర్మాణ శాఖ అధికారులపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
గోదాం వద్ద పటిష్ట భద్రత ఉండాలి1
1/1

గోదాం వద్ద పటిష్ట భద్రత ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement