ఇదిలాఉండగా, స్వయంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాగనూర్ పాఠశాలను సందర్శించి స్టాక్రూంలోని బియ్యాన్ని పరిశీలించారు. ఆ సమయంలో బియ్యంలో కలెక్టర్కు పురుగులు కనిపించలేదు. అయితే, అనంతరం అధికారుల పర్యవేక్షణలో హాస్టల్ సిబ్బంది మధ్యాహ్న భోజనం వండారు. సదరు అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు అన్నం తినకుండా పారబోసి ఆందోళనకు దిగారు. కలెక్టర్ను ఇక్కడి అధికారులు తప్పుదోవ పట్టించారా.. వండే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనేది విచారణ చేపడితే తప్పా బయటపడదంటూ వాపోయారు. చివరికి అధికారులు బియ్యం కొనుగోలు చేసి తీసుకువచ్చారు. సాయంత్రం 4 గంటలకు మరోమారు అన్నం వండి విద్యార్థులకు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment