విడాకులు వద్దు..కలసి కాపురం చేయండి: న్యాయమూర్తులు | 25 Married couples reunited With counseling of judges in Lok Adalat | Sakshi
Sakshi News home page

విడిపోవద్దు.. కలిసుంటేనే ముద్దు

Dec 20 2021 5:13 AM | Updated on Dec 20 2021 5:40 AM

25 Married couples reunited With counseling of judges in Lok Adalat - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మైసూరు: చిన్న చిన్న కారణాలతోనే విడాకులకు దరఖాస్తు చేసే జంటలు ప్రస్తుతం పెరిగిపోయాయి. ఇదే రీతిలో విడాకుల కోసం వచ్చిన జంటలను ఆదివారం మైసూరులో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో న్యాయమూర్తులు బుజ్జగించి మళ్లీ ఒక్కటి చేశారు.

నగరంలోని కోర్టు కాంప్లెక్స్‌లో కుటుంబ తగాదాల జంటలకోసం లోక్‌ అదాలత్‌ నిర్వహించగా సుమారు 25 మంది దంపతులు విడాకులు కోరుతూ హాజరయ్యారు. వారికి విడాకుల వల్ల వచ్చే అనర్థాలను జడ్జిలు, న్యాయ నిపుణులు వివరించి.. కలసి కాపురం చేయాలని నచ్చజెప్పడంతో వారంతా మళ్లీ ఒక్కటయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement