mysuru
-
మైసూరుకు ఏమైంది?
మైసూరు: రాచనగరిలో అప్పుల బాధతో ఓ వ్యాపారవేత్త భార్య, కుమారుడు, తల్లికి విషమిచ్చి చంపి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. నగరవాసులు ఈ షాక్ నుంచి తేరుకోకముందే అదే మాదిరి మరో సామూహిక ఆత్మహత్యల ఘటన సంభవించింది. జెస్సీ ఆంటోని, అతని సోదరుడు జోబి ఆంటోని, అతని భార్య స్వాతి బలవన్మరణానికి పాల్పడినవారు. మృతులు నగరంలోని విద్యానగర, యరగనహళ్లి నివాసులుగా గుర్తించారు. వీరి వయస్సు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుంది. వివరాలు.. జోబి ఆంటోని, జెస్సీ ఆంటోనీలు కవల సోదరులు. తాలూకాలోని రమ్మనహళ్లిలో జెస్సీ ఆంటోని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు అతను ఒక వీడియో చేశాడు. అందులో జోబి ఆంటోని, అతని భార్య స్వాతి అలియాస్ శర్మిల, తన సోదరి మేరీ షెర్లిన్ ద్వారా ఊరు నిండా అప్పులు చేశారు, అప్పులవారి బాధ భరించలేకున్నాం, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. షెర్లిన్కి భర్త లేడని, ఆమెను మోసం చేశారని, ఆమెని, ఆమె బిడ్డను చంపాలని ప్రయత్నించారని తెలిపాడు. దీనంతటికీ జోబి ఆంటోని, అతని భార్య స్వాతి కారణమని, వారిని శిక్షించాలని వీడియోలో అభ్యర్థించాడు. ఆ వీడియోను తన సోదరికి పంపి ఉరి బిగించుకున్నాడు. భయపడి.. జోబి జంట.. మేరీ షెర్లిన్ మైసూరు దక్షిణ పోలీసు స్టేషన్లో జోబి, స్వాతిలపై ఫిర్యాదు చేయగా ఆత్మహత్యకు ప్రేరేపించారనే సెక్షన్లతో కేసు నమోదైంది. ఈ పరిణామాలతో భయపడిన జోబి, స్వాతి విజయనగర క్రీడా మైదానంలోని నీటి ట్యాంకు నిచ్చెనకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జోబి ఆంటోని తన సోదరి పేరిట బెట్టింగ్ కోసం సుమారు రూ.80 లక్షల మేర అప్పులు చేశారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలో ఘర్షణలు చెలరేగాయని తెలుస్తోంది. వరుస ఆత్మహత్యల పరంపర మైసూరులో కలకలం సృష్టిస్తోంది. -
మా చావుకు ఎవరూ కారణం కాదు..
మైసూరు: వారసత్వ నగరి మైసూరులో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన దంపతులు, వారి కొడుకు, వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని విశ్వేశ్వరయ్య నగరలో ఉన్న సంకల్ప్ అపార్ట్మెంటులో ఈ విషాదం చోటుచేసుకుంది. అంతా భయానకం అపార్టుమెంటులో నివసిస్తున్న చేతన్ (45), రూపాలి (43) దంపతులు, వారి కొడుకు కుశాల్ (15), చేతన్ అమ్మ ప్రియంవద (65) మృతులు. మొదట చేతన్ తల్లి, భార్య, కుమారునికి ఏదో శక్తివంతమైన పురుగుల మందును తాగించడంతో వారు మరణించారు. తరువాత అతడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నట్లు అక్కడి దృశ్యాలను బట్టి చూస్తే ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లాటులో తల్లీ కొడుకు మృతదేహాలు ఒకచోట, వృద్ధురాలి మృతదేహం మరోచోట ఉండగా, పై కప్పునకు చేతన్ మృతదేహం వేలాడుతున్న దృశ్యాలు నగరవాసులకు గగుర్పాటును కలిగించాయి. ఈ సామూహిక ఆత్మహత్యలు ఉదయం నుంచి తీవ్ర సంచలనానికి కారణమయ్యాయి. మేమే కారణం విద్యారణ్యపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మొబైల్ఫోన్లు తదితరాలను స్వాదీనం చేసుకున్నారు. చేతన్ రాసిపెట్టిన డెత్నోట్ అక్కడ లభించింది. ఆర్థిక ఇబ్బందులే కారణం, మా చావుకు ఎవరూ కారణం కాదు, మేమే కారణం అని రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మా స్నేహితులను, బంధువులను ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దు, మమ్మల్ని క్షమించాలి అని రాశారు. సోదరునికి కాల్ చేసి నగర పోలీసు కమిషనర్ సీమా లాట్కర్ ఆ ఫ్లాటును పరిశీలించి మీడియాతో మాట్లాడారు. చేతన్ కార్మికులను సౌదీ అరేబియాకు పంపించే ఏజెన్సీ నడుపుతున్నాడు. చేతన్ కుటుంబం, తల్లి ప్రియంవద పక్క పక్క ఫ్లాట్లలో జీవిస్తున్నారు. ప్రతి ఆదివారం అందరూ కలిసి ఉండేవారు. హాసన్ జిల్లాలోని గోరూరు దేవాలయానికి వెళ్ళి ఆదివారం సాయంత్రం తిరిగి వచ్చారు. చేతన్ సొంతూరు గోరూరు, భార్య రూపాలి మైసూరువాసి. 2019 నుంచి మైసూరులో నివాసం ఉంటున్నారని కమిషనర్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు చేతన్ అమెరికాలో ఉన్న సోదరుడు భరత్కు ఫోన్ చేసి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నామని, అందరం ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పాడు. దీంతో భరత్ రూపాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి హెచ్చరించాడు. వారు చేతన్ ఫ్లాటుకు వచ్చి చూడగా అప్పటికే అందరూ ఆత్మహత్య చేసుకున్నారని కమిషనర్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులా, లేక ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా? అనేది సస్పెన్స్గా మారింది. -
పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన పుష్ప విలన్ జాలిరెడ్డి.. హాజరైన సుకుమార్
పుష్ప విలన్ డాలీ ధనుంజయ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టాడు. మైసూరులో ఆయన పెళ్లి వేడుగ ఘనంగా జరిగింది. పుష్ప సినిమాలో విలన్గా మెప్పించిన డాలీ ధనుంజయ్.. డాక్టర్ ధన్యత మెడలో మూడు ముళ్లు వేశారు. ఇవాళ ఉదయం జరిగిన ఈ పెళ్లి వేడుకలో కన్నడ సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. ఈ పెళ్లి వేడుక కోసం మైసూర్ ప్యాలెస్ పక్కన ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన పెళ్లికి అభిమానులు సైతం పెద్దఎత్తున పాల్గొన్నారు.కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్గా పలు సినిమాలు చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధనంజయ. ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ అదరగొట్టేశాడు. పుష్ప- 2 సినిమా దర్శకుడు సుకుమార్ కూడా డాలీ ధనంజయ్ పెళ్లికి హాజరయ్యారు.పెళ్లి కోసం ప్రత్యేకంగా సెట్..మైసూర్ ప్యాలెస్ ముందు ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఒక విలాసవంతమైన సెట్ను నిర్మించారు. ఫిబ్రవరి 15న సాయంత్రం రిసెప్షన్ జరిగింది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు హాజరై నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.మైసూర్తో ప్రత్యేక అనుబంధం..డాలీ ధనుంజయ్కు మైసూర్తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన ప్రాథమిక విద్య, జీవితం, సినిమా పరిశ్రమలోకి ప్రవేశం అన్నీ మైసూర్లోనే జరిగాయి. అందుకే మైసూర్లోనే వివాహం చేసుకున్నారు. చాముండేశ్వరి దేవి ఆశీర్వాదం పొందడానికి చాముండేశ్వరి ఆలయ నమూనాతో పెళ్లి వేదికను నిర్మించారు. అలాగే టవర్ ఆకారపు సెట్ పెళ్లికి హైలైట్గా నిలిచింది. -
రోడ్డుకు సిద్ధరామయ్య పేరు.. ప్రతిపక్షాల ఫైర్
బెంగళూరు:కర్ణాటకలోని మైసూరు(Mysuru) మునిసిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. నగరంలోని ఒక ప్రధాన రోడ్డుకు సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)పేరు పెట్టాలని మైసూరు కార్పొరేషన్ ప్రతిపాదించడం పట్ల ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రజలను అవమానపరచడమేనని జనతాదళ్ సెక్యులర్(JDS) పార్టీ విమర్శించింది.మైసూరు నగరంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి సర్కిల్ నుంచి మెటగల్లిలోని రాయల్ఇన్ జంక్షన్ వరకు ఉన్న రోడ్డుకు సిద్ధరామయ్య ఆరోగ్యమార్గ అని పేరు పెట్టేందుకు మైసూరు మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ రోడ్డుకు సిద్ధరామయ్య పేరు పెట్టాలని చామరాజ ఎమ్మెల్యే హరీశ్గౌడ తొలుత సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(Muda) కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సిద్ధరామయ్య పేరును రోడ్డుకు ఎలా పెడతారని బీజేపీ ప్రశ్నిస్తోంది.కార్పొరేషన్లో ఎన్నికైన పాలకవర్గంలేని ప్రస్తుత సమయంలో కొందరు అధికారులు ప్రభుత్వ మెప్పు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదీ చదవండి: గులాబ్జామూన్తో మాజీ మంత్రికి చిక్కులు -
క్లాసికల్ డ్యాన్స్ మహోత్సవ్!
మైసూరు కళా దివస్లో వసుంధరోత్సవ– 2024 పేరుతో 10 రోజుల మెగా క్లాసికల్ డ్యాన్స్మహోత్సవం జరిగింది. మెగా క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్లో భాగంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో 550 మందికి పైగా నృత్యకారులు పాల్గొన్నారు. నృత్యకళాకారిణి వసుంధర దొరస్వామి 75వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంత మంది నృత్యకళాకారులు పాల్గొన్న ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఈ నృత్యరూపకానికి ప్రఖ్యాత నృత్య కళాకారిణి వసుంధర దొరస్వామి నృత్య దర్శకత్వం వహించారు. నృత్యకారులలో ఆమె విద్యార్థులే కాకుండా ఇతర గురువుల వద్ద నృత్యం నేర్చుకున్న వారు కూడా తమ కళను ప్రదర్శించాను. మైసూరు కళా దివస్ పేరుతో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చెందిన దత్త విజయానంద తీర్థ స్వామి, సుత్తూరు మఠానికి చెందిన శివరాత్రి దేశికేంద్ర స్వామి, మైసూరు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్, సంగీత అకాడమీ పీఠాధిపతి సంధ్యా పురేచ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన శివరాత్రి దేశికేంద్ర స్వామి మాట్లాడుతూ ‘యోగా మాదిరిగానే భారతనాట్యం కూడా ఈ దేశం ప్రపంచానికి అందించింది. వసుంధర దొరస్వామి భరతనాట్యానికి చేసిన కృషికి, ప్రపంచ స్థాయిలో గొప్ప, ప్రాచీన నృత్య రూపాన్ని ప్రోత్సహించారు’ అని ప్రశంసించాడు. మైసూరు కళా దివస్ వసుంధర పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ నిర్వహించిన శాస్త్రీయ నృత్యం ఇది. వసుంధర దొరస్వామికి భరతనాట్యానికి 50 ఏళ్లుగా చేస్తున్న సేవను పురస్కరించుకొని ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో మైసూరులోని కళాకారులు, నృత్య గురువులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులూ పాల్గొన్నారు. ఈ ఉత్సవం భరతనాట్యానికి అంకితం చేస్తుమన్నామని వివరించారు. క్లాసికల్ డ్యాన్స్ మహోత్సవ్! -
స్విమ్మింగ్ పూల్లో గంతులేస్తూ..
దొడ్డబళ్లాపురం: మంగళూరు వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. సెలవులు గడుపుదామని వచ్చిన యువతులు నీట మునిగిపోయారు. స్విమ్మింగ్ పూల్లో మునిగి ముగ్గురు యువతులు మృతిచెందిన సంఘటన మంగళూరు శివారులోని ఉచ్చిల బీచ్ను ఆనుకుని ఉండే వాజ్కో బీచ్ రిసార్ట్లో చోటుచేసుకుంది. మైసూరుకు చెందిన ఎన్. నిశిత (21), పార్వతి (20), ఎండీ కీర్తన (21) మృతులు. వీకెండ్ కావడంతో వీరు శనివారం నాడు రిసార్ట్కు వచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టసాగారు. కొంతసేపటికే నీట మునిగిపోయారు. యువతులకు ఈత రాకపోవడం, స్విమ్మింగ్ పూల్ ఆరు అడుగుల కంటే లోతుగా ఉండడం వల్ల మునిగిపోయినట్లు అనుమానాలున్నాయి. ఉళ్లాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలిని నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ పరిశీలించారు. గంతులేస్తూ ఆడుతూనే..మొదట అందరూ ఈత కొలనులో గంతులేస్తూ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. అయితే కాస్త లోతైన చోట నిశిత మునిగిపోవడంతో ఆమెను కాపాడాలని పార్వతి ముందుకు వెళ్లింది. ఇదంతా చూస్తున్న కీర్తన కూడా వెళ్లింది. ఇలా వరుసగా మునిగి చనిపోయారని కమిషనర్ చెప్పారు. అక్కడి సీసీ కెమెరాలలో ఈ ఘోరం దృశ్యాలు నమోదయ్యాయి. అమ్మాయిల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు మధ్యాహ్నం కల్లా చేరుకుని విగతజీవులుగా ఉన్న కూతుళ్లను చూసి పెద్ద పెట్టున రోదించారు. వేలకు వేల ఫీజులు వసూలు చేసి రిసార్టులు, హోటళ్లలో కనీస భద్రతా వసతులు లేవని, ఫలితమే ఈ ఘోరమని ఆరోపణలున్నాయి. -
ముడా కుంభకోణం.. సీఎం సిద్దరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బర్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను మొదటి ముద్దాయిగా పేర్కొనగా.. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామి, దేవరాజ్, మల్లికార్జున స్వామిలను వరుస నిందితులుగా చేర్చింది.మూడా భూ కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని ట్రయల్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ.. గవర్నర్ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది. చదవండి: రాహుల్ ధైర్యవంతుడు, నిజాయితీ కలిగిన నేత: సైఫ్ ప్రశంసలు -
జైల్లో స్టార్ హీరో విలాసాలు.. కాఫీ కప్పు,సిగరెట్తో..
ఓ చేతిలో కాఫీ కప్పు.. మరో చేతిలో సిగరెట్ను గుప్పు గుప్పు మని పీలుస్తున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా?ఈ ఏడాది జూన్ 8,2024 తన ప్రియురాలు పవిత్ర గౌడ అశ్లీల పంపించాడని రేణుకాస్వామి (28) అనే యువకుడిని దారుణంగా హత్య చేసి జైలు శిక్షను అనుభవిస్తున్న శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ తూగదీపదే ఆ ఫొటో. అభిమాని హత్య కేసులోని ఏ1 దర్శన్తో పాటు ఇతర నిందితులు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా, దర్శన్ బెయిల్ కోసం ఆయన భార్య ప్రయత్నిస్తున్నారు.ఈ తరుణంలో దర్శన్ పరప్పన అగ్రహార జైలు గార్డెన్లో ఓ చేతిలో కాఫీ కప్పు, మరో చేతిలో సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దర్శన్తో పాటు రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగ,మరో ఖైదీ మేనేజర్ నాగరాజ్ ఉన్నారు.ఇక ఈ ఫొటోని అదే జైలులో ఉన్న వేలు అనే ఖైదీ తన భార్యకు పంపాడని, అది సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో క్షణాల్లో వైరలైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో జైల్లో నిబంధనలపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.హత్య కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న దర్శన్కు వీవీఐపీ ట్రీట్మెంట్ అందుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు జైలు గార్డెన్లో తోటి నేరస్తులతో కబర్లు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు, తాగేందుకు కాఫీ, సిగరెట్లు అందించడమేనని అంటున్నారు. మరి ఈ ఫొటోపై పరప్పన జైలు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ಏನ್ರೀ ಸ್ವಾಮಿ ಜೈಲುಇದ್ರೆ ನೆಮ್ಮದಿ ಆಗಿರ್ಬೇಕು 💀💥#DBoss #Darshan pic.twitter.com/eTNmHZqt4j— S R E E | ಶ್ರೀ ✨ (@SreeDharaNEL) August 25, 2024 -
ద్రవిడ్ కొడుకుకు సూపర్ ఆఫర్
టీమిండియా తాజా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కొడుకు సమిత్ ద్రవిడ్కు బంపరాఫర్ లభించింది. కర్ణాటక టీ20 లీగ్ (కేఎస్సీఏ టీ20 టోర్నీ) వేలంలో సుమిత్ను గత సీజన్ రన్నరప్ మైసూరు వారియర్స్ సొంతం చేసుకుంది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన సమిత్ను రూ. 50000 సొంతం చేసుకున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది.18 ఏళ్ల సమిత్ ఇప్పటివరకు సీనియర్ స్థాయి క్రికెట్ ఆడలేదు. సీనియర్లతో కలిసి ఆడేందుకు సమిత్కు ఇది మంచి అవకాశం. సమిత్ను కొనుగోలు చేసిన మైసూరు జట్టుకు టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్ కరుణ్ నాయర్ సారథ్యం వహించనున్నాడు. ఇదే జట్టులో టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ ఉన్నాడు. వీరి సహవాసంలో సమిత్ మరింత రాటుదేలే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్ కూచ్ బెహర్ ట్రోఫీ గెలిచిన కర్ణాటక అండర్-19 జట్టులో సమిత్ సభ్యుడిగా ఉన్నాడు. మిడిలార్డర్లో ఉపయోకరమైన బ్యాటర్గా పేరున్న సమిత్ ఇటీవలి కాలంలో అద్బుతంగా ఆడుతూ తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్ కౌంటీ జట్టు లాంకాషైర్తో జరిగిన మ్యాచ్లోనూ సమిత్ పర్వాలేదనిపించాడు.ఇదిలా ఉంటే, సమిత్ తండ్రి రాహుల్ ద్రవిడ్ ఇటీవలే టీమిండియాను టీ20 వరల్డ్కప్ గెలిపించి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ద్రవిడ్ సుమారు రెండున్నర సంవత్సరాల పాటు భారత హెడ్ కోచ్గా వ్యవహరించాడు. ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. గంభీర్ ఆథ్వర్యంలో టీమిండియా రేపటి నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది.మైసూర్ వారియర్స్ జట్టు:కరుణ్ నాయర్, కార్తీక్ సీఏ, మనోజ్ భండగే, కార్తీక్ ఎస్యూ, సుచిత్ జే, గౌతమ్ కే, విద్యాధర్ పాటిల్, వెంకటేష్ ఎం, హర్షిల్ ధర్మాని, గౌతమ్ మిశ్రా, ధనుష్ గౌడ, సమిత్ ద్రవిడ్, దీపక్ దేవాడిగ, సుమిత్ కుమార్, స్మయన్ శ్రీవాస్తవ, జాస్పర్ ఈజే, ప్రసిద్ధ్ కృష్ణ , మహమ్మద్ సర్ఫరాజ్ అష్రఫ్. -
భారత్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. ఎక్కడంటే?
ఎలా ఉంది ఫొటో? అద్భుతం అనిపిస్తోంది కదా? పెద్ద చెరువు.. పక్కనే పచ్చటి మైదానం. ఎక్కడుంది ఇది? అనుకుంటున్నారా? ఇప్పటికైతే లేదు కానీ... ఇంకొన్నేళ్లలో ఈ డిజైన్తో ఓ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మించాలని బీసీసీఐ ప్లాన్లు సిద్ధం చేస్తోంది. కర్ణాటకలోని మైసూర్లో కట్టనున్న ఈ స్టేడియం కోసం మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) 20.8 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్సిఎ)కి అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముడా ఆ భూమిని కెఎస్సిఎ 30 సంవత్సరాల లీజుకు ఇవ్వనున్నట్లు సమాచారం. లీజు మొత్తం రూ. 18 కోట్లు ఉండవచ్చు. తాజాగా స్టేడియం నిర్మించే ప్రాంతాన్ని కెఎస్సిఎ అధికారులు పరిశీలించినట్లు వినికిడి. వచ్చే ఏడాది ఆఖరికి ఈ స్టేడియం నిర్మాణం పూర్తి కానున్నట్లు కెఎస్సిఎ వర్గాలు వెల్లడించాయి. మైసూర్లో ఈ స్టేడియం నిర్మాణం జరిగితే అది కర్ణాటక రాష్ట్రంలో రెండో అంతర్జాతీయ స్టేడియం కానుంది. ఇప్పటికే బెంగళూరులో చిన్నస్వామి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉన్న సంగతి తెలిసిందే. MUDA is all set to hand over 20.8 acres of land to the Karnataka state cricket association (KSCA) for the construction of a International cricket stadium in #Mysuru 🔥 pic.twitter.com/7TgGE7W3eD— 𝗦𝗵𝗿𝗲𝘆𝗶 ᵀᵒˣᶦᶜ (@NameIsShreyash) June 7, 2024 -
తండ్రికి సాధ్యం కానిది... కుమారుడు సాధించాడు
మైసూరు: మైసూరుకు రాజ వంశానికి చెందిన శ్రీకంఠదత్త నరసింహరాజు ఒడెయార్ మైసూరు పార్లమెంటుకు బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. అయితే ఆయన దత్త కుమారుడు యదువీర్ శ్రీకంఠదత్త చామరాజ ఒడెయార్ బీజేపీ నుంచి పోటీ చేసి మొదటిసారే విజయం సాధించారు. శ్రీకంఠదత్త నరసింహరాజు ఒడెయార్ 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో కాంగ్రెస్ పారీ్టలో చేరి మైసూరు ఎంపీగా పార్లమెంట్కు పోటీ చేసి మొదటిసారి విజయం సాధించారు.అనంతరం 1991లో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అనంతరం ఆ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రప్రభ అరసుపై ఓటమి చవి చూశారు. తిరిగి కాంగ్రెస్లో చేరి 1996, 1999లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.2004 ఎన్నికలో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సీహెచ్ విజయశంకర్పై ఓటమి పాలయ్యారు. అనంతరం రాజకీయాలను దూరంగా ఉన్నారు. శ్రీకంఠ దత్త నరసింహరాజు ఒడెయార్ మరణాంతరం రాజవంశానికి చెందిన వారు ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు.అయితే రాజమాత ప్రమోదాదేవి రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు. ఆమె అయిష్టత చూపారు. 2015 ఫిబ్రవరి 23న యదువీర్ కృష్ణరాజ చామరాజ ఒడెయార్ను ప్రమోదాదేవి దత్తత తీసుకున్నారు. యదువంశానికి చెందిన 27వ యువరాజు శ్రీకంఠదత్త ఒడెయార్కు సంతానం లేదు. ప్రస్తుతం ఆయన దత్త కుమారుడు యదువీర్ మైసూరు–కొడగు పార్లమెంట్ నియోజకర్గానికి పోటీ చేసి విజయం సాధించారు.యదువీర్కు 1.30 లక్షల మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థి ఎం.లక్ష్మణ్కు 6,56,241 ఓట్లు, యదువీర్కు 7,95,503 ఓట్లు వచ్చాయి. యదువీర్కు 1,39,262 ఓట్ల మెజారిటీ లభించింది. -
నేత్రపర్వంగా మైసూరులో దసరా
మైసూరు: కర్ణాటకలో మైసూరు పట్టణంలో దసరా ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన జంబూ సవారీ ఏనుగుల ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖుల పూజలు, వేలాది మంది జనం మధ్య గజరాజులు ప్యాలెస్ నుంచి బన్ని మండపం వరకూ సుమారు 5 కిలోమీటర్లు ఊరేగింపుగా వెళ్లి వచ్చాయి. చాముండేశ్వరి అమ్మవారి విగ్రహంతో కూడిన 750 కిలోల బరువైన బంగారు అంబారీని అభిమన్యు ఏనుగుపై ప్రతిష్టించారు. మరో 13 ఏనుగులకు సీఎం సిద్దరామయ్య, మైసూరు రాజవంశీకులు తదితరులు ప్యాలెస్ వద్ద పూజలు చేసి మధ్యాహ్నం ఊరేగింపునకు నాంది పలికారు. అంతకుముందు, సీఎం సిద్దరామయ్య నంది ధ్వజ పూజలో పాల్గొన్నారు. సాయుధ బలగాల కవాతు, మేళతాళాలు, కళాకారుల ప్రదర్శనలు, 31 జిల్లాకు చెందిన శకటాల నడుమ ఏనుగులు ముందుకు సాగాయి. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవం(నాదహబ్బ)గా దసరా వేడుకలను నిర్వహిస్తుంది. 10 రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. వీటిని తిలకించేందుకు విదేశాల నుంచీ జనం తరలివచ్చారు. Glimpse of Jumboo Savari reaching Bannimantapa and Ambaari taken back to Mysuru Palace 🙏🙏 VC : Suhas Shivaay#MysuruDasara2023 pic.twitter.com/gX3ykOOn3K — Mysuru Memes (@MysuruMemes) October 25, 2023 -
కట్టెల కోసం వెళ్తే కబళించిన పులి.. అటవీ సిబ్బంది క్వార్టర్స్ వద్దే ఘోరం!
సాక్షి, కర్ణాటక: మైసూరు జిల్లాలో ఇప్పటికే చిరుత పులులు అనేకమందిని పొట్టనపెట్టుకుంటూ ఉంటే, మరోవైపు పెద్ద పులులు కూడా జనం మీద పడుతున్నాయి. ఓ పులి యువకున్ని చంపిన సంఘటన మైసూరు జిల్లాలో హెచ్డీ కోటె పరిధిలో డీబీ కుప్ప వద్ద నాగరహోళె అడవుల్లోని బళ్ళె ప్రాంతంలో ఆదివారం జరిగింది. మరణించిన యువకుడిని మంజుగా (18) గుర్తించారు. వివరాలు... అటవీ శాఖకు చెందిన వసతి గృహాల వెనుక భాగంలో ఉన్న అడవిలో మంజు స్నేహితులతో కలిసి కట్టెల కోసం వెళ్లాడు. అటువైపు వచ్చిన పులి మంజు పైన దాడి చేసింది. తల వెనుకాల భాగంలో కొరికి, పంజాలతో చీల్చడంతో తీవ్రగాయాలై ప్రాణాలు వదిలాడు. అతని వెంట వచ్చిన మరికొంత మంది యువకులు అక్కడినుంచి పరుగులు పెట్టారు. అంతకుముందు మంజు అరుపులకు సమీపంలోని అటవీ సిబ్బంది వచ్చారు. వారిని చూసిన పులి మంజును వదిలి వెళ్ళిపోయింది. అటవీ సిబ్బంది వెంటనే మంజు మృతదేహాన్ని అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. అంతరసంత పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. స్థానికుల ధర్నా.. క్వార్టర్స్ వెనుకలే పులి తిరుగుతున్నా అటవీ సిబ్బంది పట్టించుకోలేదని, అందుకే యువకుడు బలయ్యాడని స్థానిక ప్రజలు అటవీ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు– చామరాజనగర రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో పోలీసు, అటవీ ఉన్నతాధికారులు చేరుకుని రూ. 15 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోదీ సోదరుడి కుటుంబానికి గాయాలు
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కుటుంబ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని మైసూర్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. కారులో ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన భార్య, కుమారుడు, కోడలు, మనుమడు ఉన్నారు. ఈ ప్రమాదంలో మోదీ మనుమడి కాలుకి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలతో బయటపడిన మోదీ కుటుంబ సభ్యులను మైసూర్లోని జేఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రహ్లాద్ మోదీ తన కుటుంబంతో కలిసి మెర్సిడేస్ బెంజ్ కార్లో బందిపురాకు వెళ్తుండగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ను ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన కాన్వాయ్ సైతం ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ -
Karnataka Honour Killing: ఘోరాన్ని ముందే ఊహించి.. తల్లిదండ్రులు నన్ను చంపేస్తారంటూ..
మైసూరు: ప్రేమకు పణంగా తన ప్రాణం పోతుందని, అది తల్లిదండ్రుల చేతిలోనేనని ఆ యువతి ఊహించడం నిజమైంది. మైసూరు జిల్లాలోని పిరియా పట్టణ తాలూకా కగ్గుండి గ్రామంలో దళిత కులానికి చెందిన యువకున్ని ప్రేమించి పెళ్ళి చేసుకుందన్న కోపంతో కూతుర్ని తల్లిదండ్రులు హత్య చేసిన సంఘటన అంతటా సంచలనం సృష్టిస్తోంది. తల్లిదండ్రులు సురేష్, బేబి తనను వదలరని, చంపడానికి కూడా వెనుకాడరని హతురాలు, పీయూసీ చదివే శాలిని (17) రాసిన సుదీర్ఘ లేఖను పోలీసులు కనుగొన్నారు. హత్య జరగడానికి ముందు శాలిని అన్ని వివరాలతో పిరియా పట్టణ పోలీసులకు మూడు పేజీల లేఖను రాసింది. తను చనిపోతే అందుకు తల్లిదండ్రులే కారణమని, నన్ను హత్య చేయడానికి వారు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని అందులో పేర్కొంది. తన జీవితంలో ఎలాంటి సంతోషం లేదని, తల్లిదండ్రులు చిత్రహింసలకు గురి చేసేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ తాను మరణిస్తే ప్రియుడు మంజునాథ్కు ఎలాంటి సంబంధం లేదని, తల్లిదండ్రులు మాత్రమే కారణమని స్పష్టం చేసింది. చదవండి: (ట్రాప్ చేసింది ప్రజాప్రతినిధుల కుమారులే!) ఏడాది కిందట ఒక పరువు హత్య కాగా, గత ఏడాది జూన్లోనూ ఒక పరువు హత్య మైసూరు జిల్లాలో జరిగింది. పిరియాపట్టణలో ఇతర కులానికి చెందిన యువకున్ని ప్రేమిస్తోందన్న అక్కసుతో గాయత్రి అనే యువతిని ఆమె తండ్రి జయరాం పొలంలో నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో జిల్లాలో పరువు హత్యలు పెరుగుతున్నాయన్న ఆందోళన నెలకొంది. -
తాళి కట్టే సమయానికి కుప్పుకూలిన వధువు.. ఆ తర్వాత భలే ట్విస్ట్
మైసూరు: రెండు నిమిషాల్లో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో పెళ్లికూతురు కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే కొందరు నీళ్లు చల్లి కూర్చోబెట్టారు. వరుడు తాళి కట్టేందుకు సిద్ధం కాగా, వధువు వీల్లేదని మొండికేసింది. ఈ విడ్డూరం మైసూరు నగరంలోని విద్యాభారతి కళ్యాణ మండపంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హెచ్డీ కోటెకు చెందిన యువకునితో మైసూరుకు చెందిన సించన అనే యువతికి పెద్దలు ఇటీవలే నిశ్చితార్థం చేశారు. కాగా, పెళ్లి వేడుకలో వధువు అడ్డం తిరిగింది. ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదని, తాను ఇంటి పక్కన ఉన్న యువకున్ని ప్రేమించానని, అతనితోనే మూడుముళ్లు వేసుకుంటానని చెప్పడంతో వధూవరుల తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పుడు పెళ్లి వద్దంటే ఎలా?, తాము ఈ పెళ్లి కోసం రూ. 5 లక్షలకు పైగా ఖర్చు చేశామని, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పెళ్లకొడుకు తల్లిదండ్రులు పట్టుబట్టారు. దీంతో, స్థానిక పోలీసులు వచ్చి వధువుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. దీంతో వధూవరులను పోలీసు స్టేషన్కు తరలించారు. ఎవరు చెప్పినా వినేది లేదని, ప్రేమించినవాడినే పెళ్లి చేసుకుంటానని పెళ్లికూతురు భీష్మించడంతో ఖాకీలు సైతం ఏమీ చేయలేకపోయారు. Bride refuses to marry at the last minute- says 'No' to the groom on the wedding day, and leaves the marriage hall with police protection. The incident happened at #Mysuru #Karnataka.@KeypadGuerilla Video pic.twitter.com/wlwc0bZ2qO — Siraj Noorani (@sirajnoorani) May 22, 2022 ఇది కూడా చదవండి: బాలికను కాళ్లతో తన్నుతూ ఆనందం పొందాడు.. వీడియో వైరల్ కావడంతో.. -
73 ఏళ్ల వయసు.. హుషారుగా గంతులేసిన మాజీ సీఎం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయంతో కాదు.. ఈసారి ఆయన ఫోక్ డ్యాన్స్తో అదరగొట్టారు. మైసూర్ ఆలయ ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆయన హుషారుగా స్టెప్పులేశారు. 73 ఏళ్ల సిద్ధరామయ్య తన సొంత ఊరు.. సిద్ధారామనహుండి నుంచి వచ్చిన బృందంతో కలిసి వీర కునిత అనే జానపద నృత్యానికి నృత్యం చేశారు. ఆ ఆలయ దైవం సిద్ధరామేశ్వరుడ్ని ప్రార్థిస్తూ.. గాల్లో చేతులు ఆడిస్తూ డ్యాన్సులు వేశారాయన. ఆ దైవం పేరు మీదే ఆయనకు సిద్ధరామయ్య పేరు పెట్టారు. పైగా అక్షరాభ్యాసం కంటే ముందు నుంచే ఆయన వీర కునిత నృత్యంలో ఆరితేరారు. అందుకే అంత లయబద్ధంగా వాళ్లతో కలిసి హుషారుగా గంతులేయగలిగారు. ನಮ್ಮೂರಿನ ಸಿದ್ಧರಾಮೇಶ್ವರ ದೇವರ ಜಾತ್ರೆಯಲ್ಲಿ ತಂದೆಯವರು ಸಂಗಡಿಗರೊಂದಿಗೆ ವೀರಕುಣಿತದ ಹೆಜ್ಜೆ ಹಾಕಿದ ಕ್ಷಣಗಳು pic.twitter.com/GjMv5v4oeA — Dr Yathindra Siddaramaiah (@Dr_Yathindra_S) March 24, 2022 ఈ వీడియోను ఆయన తనయుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే యతింద్ర సిద్ధరామయ్య షేర్ చేశారు. మూడేళ్లకొకసారి ఈ ఆలయ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. కానీ, ఆలయ పునర్మిర్మాణం, కరోనా కారణంగా గత ఆరేళ్లుగా ఈ వేడుకలు జరగలేదు. దీంతో ఈ దఫా వేడుకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సిద్ధరామయ్య డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించడం ఇదే కొత్త కాదు. 2010లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘బెల్లారీ చలో’ పాదయాత్ర సందర్భంగా వీరగషే అనే జానపద నృత్యానికి హైలెవల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారాయన. -
గుండెపోటుతో పునీత్ రాజ్కుమార్ అభిమాని మృతి
Puneet Rajkumar Fan Dies Of Heart Attack In Nanjangud: దివంగత పునీత్ రాజ్కుమార్ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు..పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ సినిమా విడుదల సందర్భంగా మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హెడియాల గ్రామంలో గురువారం జరిగిన సంబరాల్లో హెడియాల గ్రామ పంచాయతీ అధ్యక్షులు మంజులా కుమారుడు ఆకాశ్ (22) పాల్గొన్నాడు. ఈక్రమంలో ఆకాశ్ గుండెపోటుతో మరణించాడు. -
తమ్ముడిని తలుచుకొని కన్నీటి పర్యంతమయిన శివరాజ్కుమార్
Shiva Rajkumar Watches Puneeth Rajkumar Last Film James In Mysuru: దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి సినిమా 'జేమ్స్' గురువారం ఆయన జన్మదినం సందర్భంగా విడుదలైంది. ఉదయం ఆరు గంటల నుంచే అభిమానులు థియేటర్ల వద్ద గుమిగూడారు. కొందరు తెరపై పునీత్ను చూసి నృత్యం చేయగా మరి కొందరు విలపించారు. పవర్ స్టార్ 47వ పుట్టిన రోజును అభిమానులు ఒక పండుగలా జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల థియేటర్లలో సినిమా విడుదలైంది.చదవండి: పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ట్విట్టర్ రివ్యూ పునీత్ తెరపై కనపడగానే అభిమానుల ఈలలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోయ్యాయి. మైసూరులో ఒక థియేటర్లో పునీత్ పెద్దన్న, నటుడు శివరాజ్కుమార్ సినిమాను చూశారు.ఈ సందర్భంగా అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. ఫిలిం సిటీకి పునీత్ పేరు పెడితే సంతోషం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హిమ్మావు గ్రామంలో నిర్మిస్తున్న ఫిలిం సిటీకి తన తమ్ముడు, దివంగత పునీత్ రాజ్కుమార్ పేరు పెడితే సంతోషిస్తామని హీరో శివరాజ్ కుమార్ అన్నారు. పునీత్ లేకుండా అతని పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో బాధగా ఉందని, ఇప్పటికీ తమ కుటుంబం అప్పు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: ఇప్పటికీ సీక్రెట్గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట -
కన్నతల్లి ఉన్మాదం.. దేవుడు ఆవహిస్తున్నాడని..
మైసూరు: ఓ తల్లి ఉన్మాదిగా మారి రెండేళ్ల వయసున్న కుమారుడిని వేటకొడవలితో నరికి కడతేర్చింది. అనంతరం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన హెచ్.డి.కోటె తాలూకా, బూదనూరులో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు బూదనూరు గ్రామానికి చెందిన శంకర్తో మేటికుప్పె గ్రామానికి చెందిన భవాని(28)కి ఐదేళ్ల క్రితం వివాహమైంది. తనను దేవుడు ఆవహిస్తున్నాడని భవానీ చెప్పేది. చదవండి: రూ.35 లక్షల విలువైన శ్రీగంధం దుంగల పట్టివేత దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈక్రమంలో భవానీ పుట్టింటికి వెళ్లింది. భర్త శంకర్ వెళ్లి భార్య, రెండేళ్ల కుమారుడిని గ్రామానికి తీసుకొని వచ్చాడు. నాలుగు రోజుల క్రితం శంకర్ వేరే ఊరికి వెళ్లాడు. ఈక్రమంలో భవానీ ఉన్మాదిలా మారింది. శుక్రవారం తన బిడ్డను కొడవలితో దాడి చేసి హతమార్చింది. అనంతరం ఆమె చెరువులోకి దూకింది. స్థానికులు బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో వైపు చెరువులో గాలించగా భవానీ కూడా విగతజీవిగా కనిపించింది. హెచ్డీ కోటె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
విడాకులు వద్దు..కలసి కాపురం చేయండి: న్యాయమూర్తులు
మైసూరు: చిన్న చిన్న కారణాలతోనే విడాకులకు దరఖాస్తు చేసే జంటలు ప్రస్తుతం పెరిగిపోయాయి. ఇదే రీతిలో విడాకుల కోసం వచ్చిన జంటలను ఆదివారం మైసూరులో నిర్వహించిన లోక్ అదాలత్లో న్యాయమూర్తులు బుజ్జగించి మళ్లీ ఒక్కటి చేశారు. నగరంలోని కోర్టు కాంప్లెక్స్లో కుటుంబ తగాదాల జంటలకోసం లోక్ అదాలత్ నిర్వహించగా సుమారు 25 మంది దంపతులు విడాకులు కోరుతూ హాజరయ్యారు. వారికి విడాకుల వల్ల వచ్చే అనర్థాలను జడ్జిలు, న్యాయ నిపుణులు వివరించి.. కలసి కాపురం చేయాలని నచ్చజెప్పడంతో వారంతా మళ్లీ ఒక్కటయ్యారు. -
పునీత్ అభిమాని పాదయాత్ర
Puneeth Rajkumar Fan Walks From Mysuru To Tirupati As Tribute: మైసూరుకు చెందిన అభిమాని ఒకరు దివంగత యువ నటుడు పునీత్ రాజ్కుమార్కు నివాళులర్పిస్తూ తిరుమల కొండకు పాదయాత్ర ప్రారంభించాడు. మైసూరులోని ఆగ్రహారకు చెందిన మసాజ్ సందీప్కు పునీత్ అంటే వీరాభిమానం. ఆయన హఠాన్మరణంతో ఆవేదనకు గురయ్యాడు. పునీత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈనెల 19 నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. -
మైసూరు ఘటన: వీడియోలు తీసి.. 3 లక్షలు డిమాండ్
సాక్షి, బెంగళూరు/మైసూరు: ప్రశాంత రాచనగరం నేరాలతో తల్లడిల్లుతోంది. మైసూరు నగరంలోని చాముండి కొండ తప్పలిలో ఉన్న లలితాద్రిపురం సమీపంలో యువతిపైన ఇద్దరు అత్యాచారానికి పాల్పడిన కేసులో దుండగులు కరడుగట్టిన నేరస్తులుగా భావిస్తున్నారు. గ్యాంగ్ రేప్ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశామని, రూ.3 లక్షలు ఇస్తే సరి, లేదంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో పెడతామని బాధితురాలి స్నేహితునికి ఫోన్చేసి హెచ్చరించారు. మంగళవారం రాత్రి యువతీ యువకుడు కలిసిఉండగా, ఇద్దరు దుండగులు యువకున్ని కొట్టి, యువతిపై దారుణానికి ఒడిగట్టడం తెలిసిందే. అప్పటినుంచి పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఫోన్చేసి డబ్బు డిమాండ్ .. యువతీ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అఘాయిత్యం జరిపి పరారైన దుండగులు కొంతసేపటికి తనకు ఫోన్ చేశారని యువతి స్నేహితుడు తెలిపాడు. వీడియోల పేరుతో రూ. 3లక్షలు డిమాండ్ చేశారని పోలీసులకు వివరించాడు. అత్యాచారం, బెదిరింపుల సంగతిని పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని దుండగులు బెదిరించారని తెలిపాడు. తమపైన ఎలాంటి కేసు నమోదైనా వెంటనే వీడియోలను సోషల్ మీడియాలో, నెట్లో వైరల్ చేస్తామని బెదిరించారు. కాగా, బాధితురాలు ప్రాణాలకు ప్రమాదం లేదని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు. దుండగులు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నారని, పూర్తిగా మద్యం మత్తులో ఉన్నారని యువతి స్నేహితుడు చెప్పాడు. మొబైల్స్ ఆధారంగా దర్యాప్తు.. దుండగుల కోసం పోలీసులు పరిసర మొబైల్ టవర్లలో నమోదైన మొబైల్ఫోన్ నంబర్లను సేకరించి నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఘటనపై ఆళణహళ్లి పీఎస్లో కేసు నమోదైంది. ఆగస్టు 24వ తేదీ రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో దారుణం జరిగినట్లు గుర్తించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న మొబైల్ ఫోన్ల నంబర్లను ఆరా తీస్తున్నారు. అనుమానం ఉన్న వారిని పిలిచి పోలీసులు విచారణ చేస్తున్నరని అదనపు డిజిపి ప్రతాపరెడ్డి తెలిపారు. ప్రత్యేక బృందాలు గాలింపు సాగిస్తున్నాయన్నారు. పోలీస్ కమిషనర్ చంద్రగుప్త మాట్లాడుతూ మరికొన్ని గంటల్లో నిందితులను పట్టుకుంటామని చెప్పారు. మహిళా కమిషన్ రాక .. రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళా నాయుడు గురువారం మైసూరుకు వచ్చి యువతిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. పోలీసు అధికారులను కలిసి విచారణ ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు. మీడియాతో మాట్లాడుతూ దుండగుల ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు చెప్పారన్నారు. అతి త్వరలోనే వారిని పట్టుకొంటారన్నారు. ఆమె షాక్లో ఉంది: హోంమంత్రి.. యశవంతపుర: మైసూరులో లైంగికదాడిని సీరియస్గా పరిగణించినట్లు హోంమంత్రి అగర జ్ణానేంద్ర తెలిపారు. ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆమె షాక్లో ఉన్నందున ఆమె నుంచి వివరాలను సేకరించడం సాధ్యం కావడం లేదన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు మైసూరులో ఉండి నిందితులను పట్టుకోవడానికి పనిచేస్తున్నారని తెలిపారు. బాధిత యువతి ఇతర రాష్ట్రాలకు చెందినవారని చెప్పారు. పర్యాటక కేంద్రంలో ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ రాజకీయం చేయడం సరికాదని, వారి హయాంలో జరగలేదా? అని ప్రశ్నించారు. చదవండి: దారుణం: మద్యం తాగి యువతిపై సామూహిక అత్యాచారం -
కష్టార్జితంతో గ్రంథాలయం: ఓర్వ లేక నిప్పు పెట్టిన దుండగులు
సాక్షి, మైసూరు: ఆయనొక ముస్లిం. నిరక్షరాస్యుడైనప్పటికీ చదువంటే అమితమైన మక్కువ. తాను కష్టపడి సంపాదించిన డబ్బులతో ఒక ప్రైవేట్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో నిత్యం ఎంతో మంది పుస్తకాలు చదివేవారు. ఇది చూసి ఓర్వలేని కొందరు నిప్పు పెట్టడంతో నిన్నటివరకు కళకళలాడిన గ్రంథాలయం బూడిద కుప్పగా మారింది. 11 వేల పుస్తకాలు మంటల్లో ఆహుతయ్యాయి. కర్ణాటకలో మైసూరు నగరంలోని రాజీవ్నగరలోని 2వ స్టేజిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. సయ్యద్ అనే భాషాభిమాని కష్టార్జితంతో ఒక షెడ్డునే గ్రంథాలయంగా మలిచాడు. వృత్తిరీత్యా చిన్నస్థాయి ప్లంబర్ అయిన ఆయనకు పుస్తకాలంటే విపరీతమైన ఇష్టం. కన్నడ భాష అంటే మరీ అధికం. చాలా ఏళ్ల కిందట వైవిధ్య పుస్తకాలతో లైబ్రరీని అందుబాటులోకి తెచ్చాడు. నిత్యం ఎంతోమంది వచ్చి పుస్తకాలు చదివి వెళ్లేవారు. కానీ శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ లైబ్రరీకి నిప్పు పెట్టారు. పుస్తకాలు, షెడ్డు మొత్తం మంటల్లో కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది వచ్చేటప్పటికీ ఏమీ మిగలలేదు. కాలిపోయిన పుస్తకాలను చూసి సయ్యద్ బోరును విలపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: నడిచే పుస్తకాలయాలు బెంగాల్ ఎన్నికలు రక్తసిక్తం -
ట్రాఫిక్ పోలీసుల్ని ప్రజలు చితక్కొట్టేశారు
మైసూరు: ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైకిస్టు జారి పడి మరణించడంతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. దీంతో కోపం వచ్చిన ప్రజలు పోలీసులను చితక్కొట్టారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వీడియోలు వైరల్ అయ్యాయి. వివరాలు.. మైసూరు నగరం బోగాది రింగ్ రోడ్డుపై దేవరాజ్ బైక్ నడుపుతుండగా సురేష్ అనే వ్యక్తి వెనుక కూర్చున్నాడు. కాస్త ముందు పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు చెయ్యెత్తి ఆపమనడంతో బైక్ అదుపు తప్పి కింద పడడం, దేవరాజ్ తీవ్ర గాయాలతో మరణించినట్లు తెలుస్తోంది. ఈ వార్త దావాలనంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. పోలీసులు డబ్బుల కోసం ఎప్పుడంటే అప్పుడు తనిఖీలు చేస్తూ ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వాదన ముదిరి కొందరు వ్యక్తులు ఏఎస్సైలు స్వామినాయక్, మాదేగౌడ, కానిస్టేబుల్ మంజులపై దాడి చేశారు. ఒక పోలీస్ జీపును తలకిందులు చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారి ఇలాంటి అమాయకపు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. Traffic Cop thrashed by locals in Mysore who were furious after one of the riders the cops tried to stop fell of the bike and lost his life. pic.twitter.com/n02bkc0F1t — Deepak Bopanna (@dpkBopanna) March 22, 2021 ఏం జరిగిందో తెలియదు.. పోలీసులు మాట్లాడుతూ బైక్ను టిప్పర్ ఢీకొనడం వల్లనే ప్రమాదం జరిగిందని, తమ తప్పేం లేదని చెప్పారు. బైక్ ప్రమాదంలో గాయపడిన సురేష్ తాము పొలీసులకు సుమారు 250 మీటర్ల దూరంలో ఉన్నామని, వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ తమ బైకును డీకొట్టిందని, కిందపడిన తరువాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు. దాడికి గురైన పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
భార్య మేయరైతే.. ఆనందాన్ని ఆపడం ఎవరితరం?
సాక్షి, మైసూరు: భార్యామణి మేయరైతే భర్త ఆనందానికి పట్టపగ్గాలుంటాయా!, ఆ ఆనందాన్ని దాచుకోకుండా ఉండడం ఎవరితరం? అందుకే భార్య మేయరైన మరుక్షణమే ఆమెను గాల్లోకి ఎత్తి సంతోషాన్ని చాటుకున్నాడు భర్త. బుధవారం కర్ణాటకలోని పర్యాటకనగరి మైసూరు మేయర్ పీఠానికి ఎన్నిక జరిగింది. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి పోటీ పడిన జేడీఎస్ కార్పొరేటర్ రుక్మిణి ఘన విజయం సాధించారు. దీంతో ఆమె భర్త విజయోత్సాహంతో పొంగిపోయారు. రుక్మిణిని ముద్దాడుతూ ఎత్తుకోవడంతో అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. చదవండి: (కర్ణాటకలో మంకీ ఫీవర్.. తొలి కేసుగా నమోదు) -
కర్ణాటకలో తొలి ట్రాన్స్జెండర్ న్యాయవాది
మైసూరు: సమాజంలో అందరితో సమానంగా జీవించేందుకు అనేక హక్కులు సాధించుకున్న ట్రాన్స్జెండర్లు నైపుణ్యాలు పెంపొందించుకొని వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ఈక్రమంలో కర్ణాటకలో తొలిసారిగా ఒక ట్రాన్స్జెండర్ న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. మైసూరులోని జయనగర నివాసి శశికుమార్ అలియాస్ శశి ప్రస్తుతం ఒక సీనియర్ న్యాయవాది వద్ద సహాయకురాలిగా పని చేస్తున్నారు. 14 సంవత్సరాల వరకు యువకుడిగా ఉన్న ఈయన హార్మోన్స్లో వచ్చిన మార్పులతో యువతిగా మారాడు. మైసూరులోని అశోకపురంలో ఉన్న సిద్ధార్థ పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు చదివిన శశి, మైసూరులో సైన్స్(పీసీఎంబీ) చదివారు. తర్వాత కువెంపు నగరంలో ఉన్న సోమాని కళాశాలలో ఆర్ట్స్ విభాగంలో శిక్షణ పొందారు. కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో ప్రజా పరిపాలన కోర్సు చదివారు. 2018లో విద్యావర్ధక లా కళాశాలలో చేరి మూడేళ్ల లా కోర్సు పూర్తి చేశారు. చదువంటే ఎంతో ఇష్టం.. శశి మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టం. ఎంతో మంది అవహేళన చేసినా ఉన్నత విద్య అభ్యసించేందుకు శ్రమించాను. ఫీజులు చెల్లించేందుకు డబ్బు లేక పలువురి ఇళ్లలో పని చేశాను. తోటి విద్యార్థుల వద్ద కూడా అవమానాలు ఎదుర్కొన్నా. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచించుకోవాలని కొందరు ఒత్తిడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పంచకర్మ వైద్యురాలు డాక్టర్ జే.రశ్మిరాణి నా ఉన్నత చదువులకు ఫీజులు చెల్లించి ఎంతో సహకారం అందించారు. మున్ముందు న్యాయమూర్తిగా ఎదగాలనేది నా ఆశయం’ అని తెలిపారు. చదవండి: 150 ఏళ్ల అనంతరం తొలి ఉరి.. 40 ఏళ్లలో తొలిసారి దిశ రవి.. ఎఫ్ఎఫ్ఎఫ్ అంటే ఏమిటి? -
అమెరికాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి
మైసూరు : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మైసూరు యువకుడు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. గురువారం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైసూరులోని కువెంపు నగర్కు చెందిన అభిషేక్ సుధేశ్ భట్ (25) ఇంజనీరింగ్ పూర్తిచేసి ఏడాదిన్నర క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. శాన్ బెర్నార్డియాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ ఓ హోటల్లో పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం హోటల్కు వచ్చిన ఓ దుండగుడు అభిషేక్తో గొడవపడి, తుపాకితో కాల్పులు జరిపి పారిపోయాడు. తీవ్ర గాయాలతో అభిషేక్ అక్కడిక్కడే మృతి చెందాడు. -
ఇడ్లీ చాలెంజ్.. ఈ బామ్మతో పోటీ పడగలరా
బెంగళూరు: ఇడ్లీ చాలామందికి ఇష్టమైన అల్పాహారం. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తేలీకగా జీర్ణం అవుతుంది. అయితే ఇడ్లీ అంటే ఎంత ఇష్టం ఉన్నా మాములుగా ఎన్ని తినగల్గుతారు.. నాలుగు, ఆరు సరే ఓ పది. కానీ నిమిషంలోనే ఆరు ఇడ్లీలు స్వాహా చేసే వారిని ఎప్పుడైనా చూశారు. అది కూడా 60 ఏళ్ల బామ్మ అంటే నమ్మగలరా. కానీ ఇది వాస్తవం. దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరులో ఇడ్లీ తినే పోటీ పెట్టారు. హుల్లాహళ్లి ప్రాంతానికి చెందిన సరోజమ్మ అనే 60 ఏళ్ల మహిళ ఏకంగా నిమిషంలో ఆరు ఇడ్లీలు తిని ఔరా అనిపించడమే కాక పోటీలో మొదటి స్థానంలో నిలిచింది. యువతులు, పెళ్లైనవారు కూడా ఈ పోటీలో పాల్గొన్నారు. కానీ వారందరిని సరోజమ్మ ఓడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో హిందుస్తాన్ టైమ్స్, ఏఎన్ఐలో వచ్చింది. -
కాపీ డే వీజీ సిద్దార్థ తండ్రి మృతి
సాక్షి, మైసూరు: కెఫే కాపీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ తండ్రి గంగయ్య హెగ్డే ఆదివారం మృతి చెందారు. మైసూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో వీజీ సిద్ధార్థ ఈ ఏడాది ఆగస్ట్లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్.. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు. వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు ముందు ఆయన తన తండ్రి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి కొద్దిసేపు గడిపారు. మరోవైపు అనారోగ్య కారణాల నేపథ్యంలో గంగయ్య హెగ్డేకు కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని చెప్పకుండా కుటుంబసభ్యులు గోప్యంగా ఉంచారు. చదవండి: కాఫీ మొఘల్కు ఏమైంది? షేర్లు డీలా -
సిద్ధరామయ్యపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు
మైసూరు : కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు మైసూరులోని జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. భూ అక్రమణ కేసులో సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మైసూరు పరిధిలోని హింకల్ ప్రాంతంలో భూ అక్రమణలకు పాల్పడినట్టు ఆరోపిస్తూ గంగరాజు అనే వ్యక్తి కోర్టుని ఆశ్రయించారు. దీనిపై గంగరాజు మాట్లాడుతూ.. సిద్ధరామయ్య తనకు కేటాయించిన స్థలంతో పాటు మరికొంత స్థలాన్ని ఆక్రమించి ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు. కొంత కాలం తర్వాత ఆ ఇంటిని ఇతరులకు విక్రయించారని.. ఈ భూ వ్యవహారానికి సంబంధించి తాను 2017లోనే లక్ష్మీపురం పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ అక్రమాలకు సంబంధించిన వివరాలను గవర్నర్కు అందజేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత కోర్టుని ఆశ్రయించానని తెలిపారు. గంగరాజు పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు సిద్ధరామయ్యతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లక్ష్మీపురం పోలీసులను ఆదేశించింది. -
ఆ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్నా..
సాక్షి, మైసూరు: రానున్న విధాన సభ ఎన్నికల్లో మైసూరులోని కే.ఆర్ నియోజక వర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత మాళవిక అవినాశ్ తెలిపారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కే.ఆర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి టికెట్ ఇవ్వాలని పార్టీ నేతలను కోరామన్నారు. ఈ అంశంపై బీజేపీ అధిష్టానం, రాష్ట్ర నేతలు సానుకూలంగా స్పందిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, మాళవిక 2013 లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో చురకుగా పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మాళవిక పోటీ చేస్తుందనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ వచ్చినా ఆమె స్పందించలేదు. అయితే తొలిసారి తాను పార్టీ టికెట్ ఆశిస్తున్నట్టు మాళవిక ప్రకటించారు. -
400 ఏళ్ల తర్వాత శాప విముక్తి..!
-
బీజేపీ ఎంపీకి ప్రకాశ్ రాజ్ లీగల్ నోటీసు
భారతీయ జనతా పార్టీకి చెందిన మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహాకు నటుడు ప్రకాశ్ రాజు గురువారం లీగల్ నోటీసులు పంపారు. ప్రధాని నరేంద్ర మోదీపై తాను చేసిన వ్యాఖ్యలపై, బీజేపీ ఎంపీ మండిపడుతూ ప్రతి కామెంట్లు చేయడంతో ప్రకాశ్ రాజు ఈ నోటీసులు పంపారు. ఒకవేళ ఎంపీ లీగల్గా స్పందించకపోతే, క్రిమిషనల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రకాశ్ రాజు హెచ్చరించారు. ''మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాకు లీగల్ నోటీసు పంపాను. దేశ ఒక పౌరుడిగా ఆయన అలా నాపై కామెంట్లు చేయడం, నా వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లేలా చేసింది. లీగల్గా ఆయన నాకు సమాధానం చెప్పాలి. ఒకవేళ అలా చేయని పక్షంలో ఎంపీకి వ్యతిరేకంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటా'' అని ప్రకాశ్ రాజు తెలిపారు. అక్టోబర్ 3న బెంగళూరులో ఓ ఈవెంట్లో పాల్గొన్న ప్రకాశ్ రాజు గౌరి లంకేష్ హత్యపై స్పందించారు. హత్య చేసిన వారిని పట్టుకోకపోగా, ఆమె హత్యను సెలబ్రేట్ చేసుకోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యపై ప్రధాని మోదీ మౌనం వహించారని, ఆయన అనుచరులు ఆమె హత్య జరిగితే సంబరాలు చేసుకున్నారని తెలిపారు. ప్రకాశ్ రాజు చేసిన ఈ కామెంట్లపై బీజేపీం ఎంపీ స్పందించారు. ప్రకాశ్ రాజు ఈ కామెంట్లు చేస్తారు ఎందుకంటే గౌరి ఆయనకి స్నేహితురాలన్నారు. ప్రో-హిందూ ఆర్గనైజేషన్స్కు చెందిన 12 మందిని పైగా హత్య చేసినప్పుడు ప్రకాశ్ రాజు ఎక్కడున్నారంటూ బీజేపీ ఎంపీ మండిపడ్డారు. -
టెంపుల్కు భారీగా విరాళం ఇచ్చిన యాచకురాలు
మైసూర్ : ఆ యాచకురాలి దాతృత్వం అందరి హృదయాలను ఆకట్టుకుంటోంది. ఎక్కడైతే తాను ఏళ్లుగా కూర్చుని యాచక వృత్తిని కొనసాగిస్తుందో ఆ టెంపుల్కే ఏకంగా రెండున్నర లక్షల మేర రూపాయలను విరాళంగా అందించింది ఓ వృద్ధురాలు. ఆమెనే ఎంవీ సీతాలక్ష్మి. ఓంటికొప్పల్లోని ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో కూర్చుని గత దశాబ్ద కాలంగా యాచక వృత్తిని కొనసాగిస్తోంది. తను ఏం చేయలేని పరిస్థితుల్లో ఆమె ఈ యాచక వృత్తిని ప్రారంభించింది. ఇలా సంపాదించిన మొత్తంలో రెండున్నర లక్షలను ఆలయ సౌకర్యాలను మెరుగు పరచడానికి, హనుమాన్ జయంతికి ప్రతి ఏడాది వచ్చే భక్తులకు ప్రసాదాలు ఇవ్వడానికి వినియోగించాలని కోరుతూ విరాళంగా అందించింది. తొలుత గణేష్ ఉత్సవం సందర్భంగా రూ.30వేల అందించిందని, తర్వాత ఇటీవల మరో రెండు లక్షలకు పైగా నగదును అందించిందని ఆలయ నిర్వహకులు చెప్పారు. మొత్తంగా సీతాలక్ష్మి రెండున్నర లక్షలను విరాళంగా అందించింది. సోదరుడు, సోదరి భార్యతో యాదవగిరిలో నివసిస్తున్న సీతాలక్ష్మి, తనకు ప్రతిదీ ఆ దేవుడే అంటూ చెబుతోంది. తనను ఆ దేవుడే బాగా చూసుకుంటున్నాడని, అందుకే ఈ విరాళం ఇచ్చినట్టు పేర్కొంది. సీతాలక్ష్మి ఇతర యాచకులా కాదని, భక్తుల నుంచి అసలు నగదును డిమాండ్ చేయదని, వాళ్లు ఏమిస్తే అదే స్వీకరిస్తుందని ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఎం బసవరాజ్ చెప్పారు. ఆలయ అధికారులు ఆమెను చాలా బాగా చూసుకుంటారని తెలిపారు. -
‘స్కైప్’లో అత్యాచార బాధితురాలి విచారణ
మైసూరు: విదేశీ మహిళపై అత్యాచారం చేసిన కేసులో దోషికి 25 ఏళ్ల జైలుశిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ మైసూరు ఏడవ జిల్లా సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. స్కైప్ (వీడియో కాలింగ్ యాప్) ద్వారా ఈ కేసు విచారణ జరగడం విశేషం. ఆదివాసీల జీవనంపై అధ్యయనం చేయడానికి 2015లో అమెరికా నుంచి ఓ మహిళ మైసూరుకు వచ్చింది. ఆమె ఆరోగ్యం బాగోలేక మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా.. చికిత్స అందించే నెపంతో అక్కడ పనిచేస్తున్న సుమిత్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం మహిళ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఘటనపై ఫిర్యాదు చేసి స్వదేశానికి వెళ్లిపోయింది. కేసు నమోదవడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అధికారులు అప్పటి నుంచి స్కైప్ ద్వారా బాధిత మహిళ నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. నేరం రుజువు కావడంతో నిందితుడు సుమిత్కు న్యాయస్థానం శిక్ష విధించింది. -
విప్రో మైసూరు యూనిట్ మూత
బెంగళూరు: ప్రముఖ పారిశ్రామిక వేత్త అజీం ప్రేమ్ జీ ఆధర్వంలోని విప్రో కార్యాలయాన్ని మూసి వేసింది. ఎల్ఈడీ ఉత్పత్తులకు పెరుగుతున్న భారీ డిమాండ్ కారణంగా తమ మైసూరు ఆఫీసును మూసివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. హూటాగల్లీ ఇండస్ట్రీ ఏరియాలో సుమారు 7.5 ఎకరాల్లో విస్తరించిన ఉన్న యూనిట్కు సోమవారం లాకౌట్ నోటీసులు అతికించింది. దీంతో కంపెనీ కార్మికుల భవితవ్యం ఆందోళనలో పడింది. మైసూరులోని లైటింగ్ తయారీ యూనిట్ను మూసివేశామని విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్ పేర్కొంది. ఎల్ఈడీ ఉత్పత్తుల ప్రాధాన్యత పెరగడంతో తమ సీఎఫ్ఎల్ ఉత్పత్తులకు డిమాండ్ క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత రెండేళ్ళలో డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి తగ్గుముఖం పట్టిందని కంపెనీ తెలిపింది. పరిస్థితి మెరుగుకు అన్ని రకాల అవకాశాలను పరిశీలించినప్పటికీ ఏడాదికి పైగా ఉత్పత్తి క్షీణించడంతో ఆర్థిక భారం భరించలేనిదిగా మారిందని తెలిపింది. అలాగే ఈ ప్లాంట్ ను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం, సంబంధిత అధికారులు, ఇతర రెగ్యులేటరీ సంస్థలకు రెండునెలల క్రితమే నోటిఫికేషన్ ఇచ్చామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారాఅన్ని రెగ్యులేటరీ అవసరాలకు కట్టుబడి ఉన్నామని చెప్పింది. ఈ నేపథ్యంలో మొత్తం 84 మంది శాశ్వత కార్మికులు, 66గురు కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ స్వచ్ఛంద విరమణ పథకాన్ని ప్రతిపాదించినట్టు వెల్లడించింది. మరోవైపు కంపెనీ లాకౌట్ పై కార్మికులు సోమవార రాత్రి నుంచి ఆందోళనకు దిగారు. నిరవధిక ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమకు కంపెనీ తమకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. -
అక్కడ అడుగు పెడితే క్షణాల్లో మాడిమసి...
మైసూరు : కర్ణాటక మైసూరు నగర శివార్లలో భూమి అగ్నిగుండంలా కుతకుత ఉడుకుతున్న వింత ఘటన వెలుగు చూసింది. ఇలా నిప్పు కణికలా మారిన భూమిపై అడుగు పెట్టిన ఓ బాలుడు మాడి మసైన ఘటనతో కలకలం రేపింది. ఇలాంటి విచిత్ర, వింతైన, అరుదైన, భయానకమైన ఘటన మైసూరు నగర శివార్లలోని బెలవత్త గ్రామంలో జరిగింది. ఓ బాలుడు చికిత్స పొందుతూ మరణించగా, మరో బాలుడు మనోజ్ తీవ్రం గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించారు. అతడు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యలు వెల్లడించారు. కాగా మైసూరు క్యాతనహళ్లికి చెందిన మూర్తి, జానకి దంపతుల కుమారుడు హర్షల్(14) తన నలుగురు స్నేహితులతో కలిసి ఈ నెల 14న కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. అక్కడ నేల కుతకుత ఉడుకుతుండటంతో ఆశ్చర్యపోయి అక్కడ అడుగు పెట్టి చూద్దామని అడుగు ముందుకేశాడు. బిగ్గరగా అరుస్తూ కుప్పకూలిపోవడంతో అతడిని రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించగా, అప్పటికే హర్షల్ భూమిలోకి చిక్కుకు పోయి కాలిపోయాడు. తీవ్రంగా కాలిన గాయాలైన అతనిని వెంటనే స్నేహితులు ఇతరుల సాయంతో వెలికితీశారు. సమాచారం అందిన వెంటనే అతని కుటుంబసభ్యులు హర్షల్తో పాటు మనోజ్ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ హర్షల్ ఆదివారం సాయంత్రం మరణించాడు. దీంతో హర్షల్ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. తమకు నష్టపరిహారం అందించేంతవరకూ మృతదేహానికి అంత్యక్రియలు జరపమంటూ నిరసన వ్యక్తం చేశారు. మైసూరు కుంబార కొప్పలు నివాసి సోమణ్ణకు క్యాతనహళ్లి పరిధిలో నాలుగు ఎకరాల పొలం ఉంది. అయితే అందులో ఎలాంటి వ్యవసాయం చేయడం లేదు. ఆ పొలంలోని కొంత భాగం భూమి నిప్పు కణికలా మారి కుతకుత ఉడుకుతోంది. అక్కడ కాలు పెడితే చాలు కాలిపోయి భూగర్భంలోకి చేరక తప్పని భయానక వాతావరణం నెలకొంది. భూమి అలా మారటానికి రసాయనిక వస్తువులు, ఘన వ్యర్థపదార్థాలు అక్కడ చేరుతుండటమే కారణమని తెలుస్తోంది. గత వారం రోజులుగా సోమణ్ణ పొలంలో భూమి కుతకుత ఉడుకుతూ పొగలు కక్కుతోంది. రాత్రివేళ ఆ భూమిని చూస్తే అగ్నిగుండంలో కనిపిస్తోందని, నిప్పు సెగ కూడా చాలా దూరం వరకు ఉంటోంది. వారం రోజులుగా నిప్పులు కక్కుతున్న ఆ పొలంలోకి వెళ్లిన గొర్రెలు, కుక్కలు చనిపోయాయని, ఈ విషయంపై అధికారులు ఎలాంటి అప్రమత్తంగా వ్యవహరించ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఓ బాలుడు బలి కావడంతో ఆ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా పోలీసులు ప్రకటించారు. సమాచారం అందుకుని ఘటన స్థలానికి చేరుకున్న మెటగల్లి పోలీసులు అక్కడ నిషేధిత ప్రాంతంగా బోర్డు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న గనులు, భూగర్భ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలన జరుపుతున్నారు. రసాయనిక వస్తువులు ఎక్కువగా అక్కడకు చేరుతుండటం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని భూగర్భ శాస్త్రవేత్త ప్రభాకర్ పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని తహసీల్దారు రమేష్ బాబు తెలిపారు. సమీపంలోని కర్మాగారాలు, ఆస్పత్రుల నుంచి తెచ్చిన రసాయనిక ఘనవ్యర్థాలను అక్కడ పారవేసినందునే రసాయనిక క్రియ జరిగి భూమి ఇలా కుతకుత ఉడుకుతోందని అన్నారు. విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
పేర్లు చెప్పకుండా రూ.1.6 కోట్లు సమర్పించుకున్నారు
-
పేర్లు చెప్పకుండా రూ.1.6 కోట్లు సమర్పించుకున్నారు
మైసూర్: 'అమ్మను మించి దైవం ఉన్నదా?'అనేది తెలుగు పాటే అయినా, తమిళుల కోసమే రాశారేమో అనిపించక మానదు. ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలితను అక్కడ చాలామంది దైవం కంటే మిన్నగా భావిస్తారు. ఆమె పాలన వర్ధిల్లాలని ప్రార్థనలు చేస్తారు. అయితే అనారోగ్యం కారణంగా రోజులుగా ఆస్పత్రికే పరిమితమైపోయిన ఆ అమ్మ.. త్వరగా కోలుకోవాలని ముక్కోటి దేవతలను వేడుకుంటున్నారు ఆమె అభిమానులు. ఆ క్రమంలోనే కర్ణాటకలోని మైసూర్ లో చోటుచేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. 'కోదండ ఎస్టేట్' అని మాత్రమే చెప్పి తమ పేర్లను వెల్లడించని తమిళ భక్త బృందం.. అమ్మపేరు మీద రూ.1.6కోట్ల విలువైన ఆభరణాలకు మైసూర్ లోని ఆలయానికి సమర్పించుకున్నారు. మైసూర్ శివారులోని చాముండీ హిల్స్ పైగల గణపతి, ఆంజనేయస్వామి ఆలయాలకు వచ్చిన జయలలిత అభిమానులు.. స్వామివార్ల విగ్రహాలకు భారీ స్థాయిలో ఆభరణాలను ఇచ్చి వెళ్లారు. ఇంత భారీ మొత్తంలో ఆభరణాలు ఇచ్చిన వారు కనీసం పేరైనా చెప్పలేదని, తమిళనాడు సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని తామీ పని చేస్తున్నామని అన్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు మీడియాకు చెప్పారు. వారి మొక్కులు ఫలించి, ఆస్పత్రి వర్గాలు ప్రకటించినట్లు దీపావళిలోపే జయలలిత కోలుకోవాలని కోరుకుందామా.. -
అత్యంత పరిశుభ్రమైన నగరాలు మూడే
న్యూఢిల్లీ: దేశంలో మూడే మూడు పరిశుభ్రమైన నగరాలుగా నిలిచాయి. అత్యంత పరిశుభ్రమైన నగరాల జాబితాను సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సెంటర్ (సీఎస్ఈ) సోమవారం విడుదల చేసింది. సీఎస్ఈ తాజా రేటింగ్స్ ప్రకారం వీటిలో కేరళలోని అలెప్పు, గోవా రాజధాని పనాజి, కర్ణాటకలోని మైసూరు అతి పరిశుభ్రమైన నగరాలుగా పేరు దక్కించుకున్నాయి. దేశంలో సాలిడ్ వేస్టే మేనేజ్ మెంట్ పద్ధతిపై 'నాట్ ఇన్ మై బ్యాక్ యార్డ్' పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణలో ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో పరిస్థితులు అంత మెరుగ్గా లేవని సీఎస్సీ వ్యాఖ్యానించింది . దేశవ్యాప్తంగా పట్టణాల్లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పద్ధతులు ఆధారంగా ఒక సర్వే నిర్వహించింది. మున్సిపల్ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థల భారతదేశం లో పరిశుభ్రమైన నగరాల్లో ఈ మూడు నగరాలు ఉన్నాయని సర్వే తేల్చింది. ఈ విషయంలో దేశరాజధాని నగరం ఢిల్లీ అట్టడుగు స్థాయిలో ఉండగా, మైసూర్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. గ్రౌండ్ లెవల్ సమాచారం పూర్తిగా లభ్యంకానప్పటికీ, 2009 ఘన వ్యర్థాల నిర్వహణ ఆర్థిక వ్యవహారాల శాఖ స్థాయీ పత్రాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశ అర్బన్ ఏరియాల్లో ఇప్పటికే ఒక రోజు వ్యర్థాలు సుమారు 80,000 మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు . 2047 నాటికి ఇది 260 మిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా వేశారు. దీనికోసం 1,400 చదరపు కిలోమీటర్ల అవసరమవుతుందనీ, ఇది హైదరాబాద్, ముంబై , చెన్నై నగరాలకు కలిపితే వచ్చే ప్రదేశానికి సమానమవుతుందని సునీత హెచ్చరించారు. భారతదేశం అత్యంత పరిశుభ్రమైన నగరాన్ని కొనుక్కొనే క్రమంలో ఈ సర్వేనిర్వహించామని సీఎస్ సీ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ తెలిపారు. వ్యర్థాల నియంత్రణలోపాలపై ఆమె అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ పరిస్థితుల్లో కేరళలో మున్సిపాలిటీ కంటే ప్రజలు అనుసరిస్తున్న పద్ధతులే ఉత్తమమైనవి అని ఆమె తెలిపారు. ప్రజలే కంపోస్ట్ , ఇతర వ్యర్థాలను వేరుచేసి రీసైక్లింగ్ చేసి సేకరించి అమ్ముతున్నారన్నారు. ఫ్యూచర్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో ఇదే అద్భుతమైన మోడల్ అనీ, వ్యర్థాలను నిరోధించకపోతే దేశంలోని ఇతర నగరాలకు భారీ గుణపాఠం తప్పదని నారాయణ్ చెప్పారు. -
ఈ పెళ్లికి.. పోలీసులే అతిథులు
మైసూర్: కర్ణాటకలోని మైసూర్ నగరంలో సోమవారం ఓ వివాహం జరిగింది. వధూవరులిద్దరూ ఎంబీఏ గ్రాడ్యుయేట్లు. ఈ పెళ్లికి పోలీసులే అతిథులు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు భారీ సంఖ్యలో పోలీసులు వచ్చారు. విషయం ఏంటంటే.. ఇది ప్రేమ వివాహం. అందులోనూ మతాంతర వివాహం. ఇరు కుటుంబాలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. హిందూ సంస్థ కార్యకర్తలు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది లవ్ జిహాద్ అంటూ నిరసనకు దిగారు. దీంతో ఈ పెళ్లికి భద్రత కల్పించేందుకు భారీగా పోలీసులు తరలివచ్చారు. వధూవరులు ఆషిత, షకీల్లది మాండ్య. వీరి పెళ్లిని వ్యతిరేకిస్తూ వీహెచ్పీ కార్యకర్తలు వధువు ఇంటిముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ పెళ్లి లవ్ జిహాద్ అని, వరుడు షకీల్ వివాహం ద్వారా ఆషితను మతమార్పిడికి ప్రేరేపిస్తున్నాడని మండిపడ్డారు. ప్రేమ అయితే తమకు అభ్యంతరం లేదని, మతమార్పిడికి కుట్ర అని ఆరోపించారు. వీరి ఆరోపణలను వధూవరుల తల్లిదండ్రులు ఖండించారు. 'భారత్లో అందరూ సమానం. నిరసనకారులకు ఈ పెళ్లి ఓ సందేశం. వారు అర్థం చేసుకోవాలి' అని వధువు తండ్రి డాక్టర్ నరేంద్ర బాబు అన్నారు. ఈ పెళ్లి తమకు అమిత సంతోషాన్ని కలిగిస్తోందని వరుడు తండ్రి ముక్తర్ అహ్మద్ చెప్పారు. చిన్నప్పటి నుంచి ఆషిత, షకీల్లకు పరిచయం ఉంది. మాండ్యలో వీరి కుటుంబాలు పక్కపక్కన ఉంటున్నాయి. స్కూల్ నుంచి కాలేజీ వరకు ఇద్దరూ క్లాస్ మేట్స్. 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఆషిత, షకీల్కు వివాహం నిశ్చయమైందని తెలిసిన వెంటనే హిందూమత కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు ఇటీవల ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ రోజు భారీ భద్రత మధ్య మైసూరులో పెళ్లి చేసుకున్నారు. -
మైసూరులో 144 సెక్షన్ పొడిగింపు
మైసూరు: శ్రీరామ సేన కార్యకర్త హత్యతో ఉద్రిక్తతలు నెలకొన్న మైసూరులో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. టెన్షన్ సద్దుమణిగిందని, పరిస్థితులు చక్కబడ్డాయని మైసూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద తెలిపారు. పోలీస్ పెట్రోలింగ్ పెంచామని, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) బలగాలు మొహరించామని వెల్లడించారు. 144 సెక్షన్ ను గురువారం రాత్రి వరకు పొడిగించినట్టు చెప్పారు. నగరం ప్రశాంతంగా ఉందని, ఎక్కడా సమస్య లేదని అన్నారు. ఆర్ఎస్ఎస్ రాజుగా సుపరిచితుడైన రాజును ఆదివారం నలుగురు దుండగులు హత్య చేశారు. దీంతో బీజేపీ, హిందూ సంస్థలు సోమవారం మైసూరు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో అదనపు బలగాలు మొహరించారు. -
మైసూరులో టెన్షన్
మైసూరు: శ్రీరామ సేన కార్యకర్త రాజు(39) హత్యతో మైసూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్ఎస్ఎస్ రాజుగా సుపరిచితుడైన అతడిని ఆదివారం ఉదయగిరి సిగ్నల్ దగ్గర గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. రోడ్డు పక్కన హోటల్ లో టీ తాగుతుండగా నలుగురు దుండగులు మారణాయుధాలతో దాడిచేశారు. ఆస్పత్రికి తరలించేసరికి అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బీజేపీ, హిందూ సంస్థలు సోమవారం మైసూరు బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఆర్ఎస్ఎస్ రాజు హత్యకు కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు పహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలం సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీని పరిశీలిస్తున్నారు. -
'ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి'
-
'ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలి'
మైసూరు : ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని శాస్త్రవేత్తలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను మోదీ ఆదివారం బెంగళూరులో ప్రారంభించారు. అనంతరం దేశవిదేశాలకు చెందిన శాస్త్రవేత్తలను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.... శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతోనే సుపరిపాలన సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అలాగే 2030 నాటికి దేశంలో పేదరిక నిర్మూలన, అభివృద్ధిలో భారత్ను ఆగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. శాస్త్ర, పరిశోధన రంగాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. మైసూరు విశ్వవిద్యాలయానికి శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. అలాంటి తరుణంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు ఈ విశ్వవిద్యాలయం వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, మైసూరు విశ్వవిద్యాలయం రెండూ ఒకేసారి తమ ప్రయాణాన్ని ప్రారంభించాయని మోదీ పేర్కొన్నారు. కొత్త సంవత్సరంలో దేశ విదేశాలకు చెందిన శాస్త్రవేత్తలతో కలసి ఈ సదస్సు పాల్గొనడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో భాగస్వాములు కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు మోదీ విజ్ఞప్తి చేశారు. గొప్ప నేతలంతా మైసూరు విశ్వవిద్యాలయంలోనే చదువుకున్నారని చెప్పారు. ఈ సదస్సుకు 10 వేల మంది దేశ విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. 30 మంది శాస్త్రవేత్తలకు మోదీ పురస్కారాలను ప్రదానం చేశారు.