Judges
-
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. న్యాయమూర్తులను తొలగిస్తూ..
వాషింగ్టన్ : డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి వివరణ ఇవ్వకుండా కనీసం 20 మంది ఇమ్మిగ్రేషన్ కోర్టు న్యాయమూర్తులను తొలగించారు. అంతకు ముందు ఇంకా ప్రమాణ స్వీకారం చేయని 13 మంది న్యాయమూర్తులను, ఐదుగురు అసిస్టెంట్ చీఫ్ ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తులను నోటీసు లేకుండా తొలగించారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ ఇంజనీర్స్ అధ్యక్షుడు మాథ్యూ బిగ్స్ తెలిపారు. ఇలా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారు. ఆ వ్యాజ్యాలపై ట్రంప్ స్పందించారు. ‘తన దేశాన్ని కాపాడుకునే వారు ఎన్నటికి రాజ్యాంగాన్ని ఉల్లంఘించరూ’ అంటూ ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. పలు ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ల జారీఈ ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. వెంటనే తన ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ అమెరికా ఫస్ట్ నినాదంతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపడం,పుట్టుక ద్వారా వచ్చే పౌరసత్వానికి ముగింపు,ఆరోగ్య సమస్యల దృష్ట్యా సరిహద్దుల్ని మూసివేయడం, అమెరికా- మెక్సికో మధ్యన గోడ నిర్మించడం, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకాలు విధించడం ఇలా మెరుపు వేగంతో పలు ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్లను జారీ చేశారు. ట్రంప్కు వ్యతిరేకంగా వరుస వ్యాజ్యాలుఅయితే, వాటిల్లో అక్రమ వలసలపై కొనసాగుతున్న కఠిన చర్యలు, లింగమార్పిడి వ్యక్తులను అమెరికా సైన్యంలో పనిచేయకుండా నిషేధించే ప్రయత్నాలు, ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకోవడం అంశాలపై వ్యతిరేకత ఎదురైంది. అమెరికా వ్యాప్తంగా పలువురు ట్రంప్ నిర్ణయాలను సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిల్లో, అక్రమ వలసలపై అణిచివేతపై పది వ్యాజ్యాలు, జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ఆదేశాన్ని సవాలు చేసే ఏడు వ్యాజ్యాలు ఉన్నాయి. దీంతో ట్రంప్ న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు జనవరి 2021 కాపిటల్ అల్లర్లపై బ్యూరో దర్యాప్తులో పాల్గొన్న ఎఫ్బీఐ ఏజెంట్లు, సిబ్బంది పేర్లను వెల్లడించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశంపై ట్రంప్పై పలు కేసులు నమోదయ్యాయని అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.నెపోలియన్ను ప్రస్తావిస్తూఈ వరుస పరిణామలపై ట్రంప్ స్పందించారు. తన దేశాన్ని రక్షించేవాడు ఏ చట్టాన్ని ఉల్లంఘించడు అని ట్రూత్ సోషల్ యాప్లో పోస్ట్ చేసారు. తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకోవడానికి ముందు 1804లో నెపోలియన్ కోడ్ ఆఫ్ సివిల్ లాను రూపొందించిన ఫ్రెంచ్ సైనిక నాయకుడి ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే కొటేషన్ ప్రస్తావించారు. ఫ్రాన్స్లో తన నిరంకుశ పాలనను సమర్థిస్తూ, ఇది ప్రజల ఇష్టమని వ్యాఖ్యానించే సమయంలో నెపోలియన్ తరచూ ఈ కొటేషన్ను వినిపించేవారు. కోర్టు తీర్పులకు తాను కట్టుబడి ఉంటానని ట్రంప్ చెబుతుండగా, ఆయన సలహాదారులు సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై దాడి చేసి, వారిపై అభిశంసనకు పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక వర్గం చట్టబద్ధమైన అధికారాన్ని నియంత్రించడానికి న్యాయమూర్తులకు అనుమతి లేదు’ అని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గత వారం ట్వీట్ చేశారు. -
భారత్లో బంగ్లా న్యాయమూర్తులకు శిక్షణ.. రద్దు చేసిన మహమ్మద్ యూనస్
ఢాకా : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో భారత్లో జరగనున్న 50 మంది బంగ్లాదేశ్ న్యాయమూర్తులు, న్యాయాధికారులకు జరగాల్సిన శిక్షణా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ కేంద్రంగా నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో బంగ్లాదేశ్కు చెందిన న్యాయమూర్తులకు,న్యాయాధికారులకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. అయితే, ఈ తరుణంలో ఈ ట్రైనింగ్ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. దూరం పెరిగిందా?బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ 16 ఏళ్ల పాలనకు అక్కడి విద్యార్థులు ముగింపు పలికారు. హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న భారత్కు వచ్చారు. నాటి నుంచి భారత్- బంగ్లాదేశ్ల మధ్య సంబధాలు క్షీణించాయి. ఆగస్టు 8న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హిందవులపై,ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరిగాయి. ఆ తర్వాత దేశద్రోహం కేసులో అరెస్టయిన హిందూ గురువు, ఇస్కాన్ మాజీ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు మార్లు బెయిల్ కోసం అప్లయి చేసినా ఆయనకు ఊరట దక్కలేదు. ఇలా నాటి నుంచి భారత్-బంగ్లాదేశ్ల మధ్య దూరం పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
బుల్డోజర్ సంస్కృతిపై వేటు!
‘చావుకి పెడితే లంఖణానికి వస్తార’ని నానుడి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ స్వామ్యాన్ని జొప్పించి మురిసి ముక్కలవుతున్నవారికి సర్వోన్నత న్యాయస్థానం కీలెరిగి వాత పెట్టింది. నేరం రుజువై శిక్షపడిన లేదా నిందితులుగా ముద్రపడినవారి ఆవాసాలను కూల్చటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలాంటి చేష్టలకు పాల్పడే ప్రభుత్వాధికారులు బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు వారి ఇళ్ల పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని వ్యక్తిగతంగా భరించాల్సి వుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ల ధర్మాసనం తేల్చిచెప్పింది. కూల్చివేతలకు ఏ నిబంధనలు పాటించాలో వివరించే మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవటంతోపాటు వ్యాజ్యాలు కూడా మొదలవుతాయని హెచ్చరించింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నా రులూ, ఆడవాళ్లూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కొన్ని విధివిధానాలు పాటించేవారు. నోటీసులిచ్చి సంజాయిషీలు తీసుకుని ఆ తర్వాత చర్యలు ప్రారంభించేవారు. కీడు శంకించినవారు న్యాయస్థానాలను ఆశ్రయించటం, వారికి ఊరట దొరకటం కూడా రివాజే. తమకు నచ్చని అభిప్రాయాలున్నా, ఏదో ఉదంతంలో నిందితులుగా ముద్రపడినా వారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చే పాపిష్టి సంస్కృతి ఇటీవలి కాలపు జాడ్యం. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ‘పాన్ ఇండియా’ సంస్కృతి! దీనికి ఆద్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తర ప్రదేశ్లో నేర సంస్కృతిని అరికట్టడంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో ఆయన విజయం సాధించారని బీజేపీ చెబుతుంటుంది. కానీ అంతకన్నా ‘బుల్డోజర్ బాబా’గా పిలిపించుకోవటం యోగికి, అక్కడి బీజేపీకి ఇష్టం. చూస్తుండగానే ఇది అంటువ్యాధిలా పరిణమించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్లతో విధ్వంసానికి దిగాయి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్నాక బాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చాలని చూసింది. ఒకటి రెండుచోట్ల ఆ పనిచేసింది కూడా. ఇక తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దిక్కూ మొక్కూలేని పేదల ఇళ్లు సైతం ఇదే రీతిలో ధ్వంసం చేసింది. రాజస్థాన్లో 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజ్గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి సర్కారు హయాంలో నిందితుల ఇళ్లనూ, దుకాణాలనూ కూల్చారు. కేంద్రం మాటే చెల్లుబాటయ్యే ఢిల్లీలో జహంగీర్పురా ప్రాంతంలో మతఘర్షణలు జరిగినప్పుడు అనేక ఇళ్లూ, దుకాణాలూ నేలమట్టం చేశారు. బాధితులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పొందేలోగానే విధ్వంసకాండ పూర్తయింది. 2020 నుంచి ముమ్మరమైన ఈ విష సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే వచ్చింది. ‘నిందితులు మాత్రమే కాదు, శిక్ష పడినవారి ఇళ్లను సైతం కూల్చడానికి లేదు. ఈ విషయంలో చట్టనిబంధనలు పాటించి తీరాలి’ అని స్పష్టం చేసింది. కానీ ఆ చేష్టలు తగ్గిన దాఖలా లేదు. చుట్టూ మూగేవారు ‘ఆహా ఓహో’ అనొచ్చు. అవతలి మతంవారి ఇళ్లు, దుకాణాలు కూలుతున్నాయంటే తన్మయత్వంలో మునిగే వారుండొచ్చు. ఆఖరికి ఇళ్లు కూల్చిన ఉదంతాల్లో పాలుపంచుకున్న అధికారులు విందులు చేసుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. కానీ సమాజంలో అరాచకం ప్రబలకూడదన్న ఉద్దేశంతో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడూ... రాజ్యాంగమూ, చట్టాలూ ఉన్నప్పుడూ... రాజ్యవ్యవస్థే తోడేలుగా మారితే దిక్కెవరు? సుప్రీంకోర్టు వద్దుగాక వద్దని చెప్పాక కూడా ఈ పోకడ ఆగలేదంటే ఏమను కోవాలి? ఒక వ్యక్తి నిజంగా తప్పు చేశాడనుకున్నా అతని కుటుంబమంతా అందుకు శిక్ష అనుభవించి తీరాలన్న పట్టుదల నియంతృత్వ పోకడ కాదా? సుప్రీంకోర్టు 95 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఎన్నో విధాల ప్రామాణికమైనదీ, చిరస్మరణీయమైనదీ. ‘ఇల్లంటే కేవలం ఒక ఆస్తి కాదు... అది కొందరు వ్యక్తుల, కుటుంబాల సమష్టి ఆకాంక్షల వ్యక్తీకరణ. అది వారి భవిష్యత్తు. వారికి స్థిరత్వాన్నీ, భద్రతనూ చేకూరుస్తూ, సమాజంలో గౌరవం తీసుకొచ్చేది. ఇలాంటి ఇంటిని బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు విశ్వసించాలి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన తీరు అమానవీయత నిండిన పాలకులకు ఏమేరకు అర్థమైందో సంశయమే. ఆ మాటెలా వున్నా కఠిన చర్యలుంటాయన్న హెచ్చరిక వారిని నిలువరించే అవకాశం ఉంది. దేశంలో దిక్కూ మొక్కూలేని కోట్లాదిమంది సామాన్యులకు ఊరటనిచ్చే ఈ తీర్పులో హిందీ భాషా కవి ప్రదీప్ లిఖించిన కవితకు కూడా చోటు దక్కింది. దాని సారాంశం – ‘ఇల్లు, పెరడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఆ కలను కోల్పోవడానికి సిద్ధపడతారా ఎవరైనా?’ బ్రిటన్ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీర్పులో ఉటంకించారు. ‘రాజ్యా ధికారాన్ని ధిక్కరించి అతి సామాన్యుడు వేసుకున్న గుడిసె చిరుగాలికే వణికేంత బలహీనమైనది కావొచ్చు. ఈదురుగాలికి ఇట్టే ఎగిరిపోవచ్చు. దాన్ని వర్షం ముంచెత్తవచ్చు. కానీ చట్టనిబంధన అనుమతిస్తే తప్ప ఆ శిథిల నిర్మాణం వాకిలిని అతిక్రమించటానికి ఇంగ్లండ్ రాజుకు సైతం అధికారంలేదు’ అని లార్డ్ డెన్నింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూశాకైనా తమపై ఏ స్థాయిలో విశ్వాసరాహిత్యం ఏర్పడిందో ప్రభుత్వాలు గ్రహించాలి. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలించటం నేర్చుకోవాలి. -
అన్ని ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి రాష్ట్రాలకు అధికారం లేదు
ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న సామాజిక వనరులు అన్న పదబంధం ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు, వనరులకు వర్తిస్తుందా అన్నది మా ముందున్న ప్రశ్న. సైద్ధాంతికంగా చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. కానీ ఆ మేరకు జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు, దాని ఆధారంగా సంజీవ్ కోక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేకపోతున్నాం. కేవలం భౌతిక అవసరాల నిర్వచన పరిధిలోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రైవేట్ ఆస్తినీ సామాజిక వనరుగా పరిగణించడం కుదరదు.– సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆస్తులపై ప్రభుత్వాల అధికార పరిధికి సంబంధించిన అతి కీలకమైన అంశంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. అన్ని ప్రైవేట్ ఆస్తులూ సామాజిక వనరుల నిర్వచన పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ‘‘కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని ప్రైవేట్ ఆస్తుల మీదా హక్కులు ఉండబోవు. సమాజ హితం, ఉమ్మడి ప్రయోజనాలు, సామాజిక పంపకం నిమిత్తం ఏ ప్రైవేట్ ఆస్తినైనా స్వాదీనం చేసుకునేందుకు వాటికి అధికారం లేదు’’ అని తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 7–2 మెజారిటీతో చరిత్రాత్మక తీర్పు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ఆధారంగా ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని వనరులను స్వా«దీనం చేసుకునే హక్కు రాష్ట్రాలకు లేదని పేర్కొంది. వాటికి ఆ అధికారం ఉందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తదితరులు ఇచ్చిన గత తీర్పులతో విభేదించింది. వాటిలో వెలిబుచ్చిన అభిప్రాయాలను లోపభూయిష్టమైనవిగా, కాలదోషం పట్టినవిగా పేర్కొంది. ఆ తీర్పులను కొట్టేసింది. ఆర్థిక ప్రజాస్వామ్యానికి కూడా రాజ్యాంగం అనుమతిస్తోందంటూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, ‘‘కొన్ని ప్రైవేట్ ఆస్తులు మాత్రం ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న ‘సామాజిక వనరులు, సమాజ హితం’ పరిధిలోకి వస్తాయి. ఆ నిర్దిష్ట అవసరాల నిమిత్తం వాటిని ప్రభుత్వాలు స్వాదీనం చేసుకోవచ్చు’’ అని స్పష్టం చేసింది. సీజేఐతో పాటు జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ సతీశ్చంద్ర శర్మ, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీ ఈ మేరకు మెజారిటీ తీర్పు వెలువరించారు. వారి తరఫున సీజేఐ 193 పేజీల తీర్పును రాశారు. ఈ తీర్పుతో జస్టిస్ బి.వి.నాగరత్న పాక్షికంగా, జస్టిస్ సుధాన్షు ధూలియా పూర్తిగా విభేదించారు. కాలానుగుణంగా మారాలి: సీజేఐ ఆర్టికల్ 39(బి) కింద కేవలం ప్రైవేట్ ఆస్తులను కూడా సామాజిక వనరులుగా భావించవచ్చా అన్న అంశం 1992 నుంచి న్యాయస్థానాల్లో నలుగుతోంది. దీనికి సంబంధించి 16 పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. దీన్ని 2002లో తొమ్మిది మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. 2024లో సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం దీన్ని విచారణకు చేపట్టింది. ప్రైవేట్ ఆస్తులన్నింటినీ సామాజిక వనరులుగా భావించడానికి వీల్లేదని సీజేఐ తన తీర్పులో స్పష్టం చేశారు. అలా భావించవచ్చని, వాటిని సమాజ హితం కోసం స్వాదీనం చేసుకోవచ్చని పేర్కొన్న గత తీర్పులు సామ్యవాద ధోరణితో కూడినవని అభిప్రాయపడ్డారు. ‘‘ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న సామాజిక వనరులు అన్న పదబంధం ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు, వనరులకు వర్తిస్తుందా అన్నది మా ముందున్న ప్రశ్న. సైద్ధాంతికంగా చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. కానీ ఆ మేరకు జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు, దాని ఆధారంగా సంజీవ్ కోక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేకపోతున్నాం. కేవలం భౌతిక అవసరాల నిర్వచన పరిధిలోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రైవేట్ ఆస్తినీ సామాజిక వనరుగా పరిగణించడం కుదరదు. సదరు ఆస్తి తాలూకు స్వభావం, సమాజ శ్రేయస్సుపై దాని ప్రభావం, వనరుల అలభ్యత, అది ప్రైవేటు చేతుల్లో ఉంటే తలెత్తే పరిణామాలు తదితరాలన్నింటినీ బేరీజు వేసిన మీదట మాత్రమే అది సామాజిక వనరో, కాదో తేల్చాలి. ప్రజా విశ్వాస సిద్ధాంతాన్ని కూడా దీనికి వర్తింపజేయాల్సి ఉంటుంది. అడవులు, చెరువులు, చిత్తడి నేలలు, సహజ వనరులతో కూడిన భూముల వంటివి ప్రైవేట్ స్వాదీనంలో ఉంటే ఆర్టికల్ 39(బి) కింద వాటిని సమాజ అవసరాల నిమిత్తం ప్రభుత్వాలు సేకరించవచ్చు. అదే సమయంలో స్పెక్ట్రం, ఎయిర్వేవ్స్, సహజ వాయువు, గనులు, ఖనిజాల వంటి కొరతతో కూడిన పరిమిత వనరులు కొన్నిసార్లు ప్రైవేట్ అజమాయిషీలో ఉండేందుకు ఆస్కారముంది. కనుక పంపకం అనే మాటకున్న అర్థం విస్తృతమైనది’’ అని సీజేఐ పేర్కొన్నారు. ‘‘గత తీర్పుల్లో జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి నిర్దిష్ట ఆర్థిక సిద్ధాంతాల ప్రాతిపదికన అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో సంక్షేమ ఆధారిత విధానాలున్నాయి. తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, జాతీయీకరణ వంటివాటి కాలం నడిచింది. ఇది పెట్టుబడుల ఉపసంహరణల యుగం. ప్రైవేట్ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. కనుక గత పరిస్థితులను ఇప్పుడు ప్రాతిపదికగా తీసుకోరాదు. ప్రస్తుత, భావి అవసరాలను తగ్గట్టుగా తీర్పులుండాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కూడా ఫలానా ఆర్థిక విధానాన్నే పాటించాలని సూచించలేదన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు ఏమన్నారంటే... ఏ ప్రైవేట్ ఆస్తులనైనా సమాజ హితానికి స్వా«దీనం చేసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉందన్న జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తదితర తీర్పులకు నేటికీ కాలదోషం పట్టలేదని జస్టిస్ ధూలియా అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఆర్టికల్ 38, 39ల్లో పేర్కొన్న సూత్రాలను పక్కన పెట్టడం సబబు కాదన్నారు. అలా చేయడం ప్రభుత్వాల చేతులను కట్టేయడమే అవుతుందని 97 పేజీల తీర్పులో స్పష్టం చేశారు. ‘‘ఎందుకంటే అంబేడ్కర్ హెచ్చరించిన సామాజిక, ఆర్థిక అసమానతలు మన దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పేద, సంపన్న వర్గాల మధ్య ఆదాయ, సంపదపరమైన భారీ అసమానతలు నానాటికీ మరింతగా పెరుగుతున్నాయి’’ అన్నారు. జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తీర్పులకు పూర్తిగా కాలదోషం పట్టలేదని జస్టిస్ నాగరత్న కూడా అభిప్రాయపడ్డారు. అయితే, ‘‘భౌతిక వనరులను ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోవిగా విభజించవచ్చు. పూర్తిగా వ్యక్తిగత అవసరాలను తీర్చేవాటిని మినహాయించి ఇతర ప్రైవేటు ఆస్తులను సమాజ హితం కోసం ప్రభుత్వం సేకరించవచ్చు. ఆ మీదట సమాజ హితం కోసం అర్హులకు వాటిని చట్టపరమైన మార్గాల్లో తాత్కాలిక/శాశ్వత ప్రాతిపదికన బేషరతుగానో, షరతులతోనో పంపకం చేయవచ్చు’’ అని ఆమె పేర్కొన్నారు. అయితే జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పుపై సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యలను ‘పరుషమైనవి, అనవసరమైనవి’గా జస్టిస్ ధూలియా, జస్టిస్ నాగరత్న అభివర్ణించడం విశేషం. వాటితో తాము గట్టిగా విభేదిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. కృష్ణయ్యర్, చిన్నపురెడ్డి తీర్పులు... సమాజహితం కోసం ప్రైవేట్ ఆస్తులను సేకరించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని 1977లో కర్నాటక ప్రభుత్వం వర్సెస్ రంగనాథరెడ్డి కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ పేర్కొన్నారు. ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తులు సామాజిక వనరుల నిర్వచనంలోకి రావంటూ ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మెజారిటీతో తీర్పును వ్యతిరేకించారు. ప్రైవేట్ ఆస్తులు కూడా ఆ నిర్వచనం పరిధిలోకి వస్తాయంటూ ఆయన మైనారిటీ తీర్పు వెలువరించారు. ఆస్తులపై భూస్వాములు, పెట్టుబడిదారుల ఆస్తుల కోటలను బద్దలు కొట్టడానికి ఆర్టికల్ 39(బి)ని రాజ్యాంగంలో ఉద్దేశపూర్వకంగానే చేర్చారని అభిప్రాయపడ్డారు. 1983లో సంజీవ్ చోక్ కేసులో సీజేఐ చిన్నపరెడ్డి కూడా జస్టిస్ కృష్ణయ్యర్ మైనారిటీ తీర్పును పూర్తిగా సమర్థించారు. సామ్యవాద సిద్ధాంతకర్తల ఆదర్శాలే ఆర్టికల్ 39(బి)లో ప్రతిఫలించాయని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 39(బి) ఏం చెబుతోందంటే... ‘‘సామాజిక వనరులు సమాజ విశాల హితం కోసం పంపిణీ అయేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఇందుకు వీలుగా సదరు వనరులపై యాజమాన్యం, నియంత్రణకు అవసరమైన విధానాలను రూపొందించాలి’’. -
సామాన్యుల భాషలో... సన్నిహితమైన న్యాయం
మన దేశంలోని అన్ని హైకోర్టుల్లో అధికారికంగా వాడేది ఇంగ్లీషు భాష. కానీ కేసులో గెలిచినవాడు, ఓడిన సామాన్యుడు కూడా తమ గెలుపోటములకు కారణాలు అర్థం చేసుకోలేని పరిస్థితి. అందుకే తీర్పుల్లోని కారణాలు అర్థమయ్యే భాషలో తెలియ జేసి, సామాన్యుడికి న్యాయ వ్యవస్థ చేరువ కావాలనే సదుద్దేశ్యంతో సుప్రీంకోర్టు, దేశంలోని అన్ని హైకోర్టులు వారి తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించి, ఉచితంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాము ఇంగ్లీషులో వెలువరించే ముఖ్యమైన తీర్పులను తెలుగులోకి అనువాదం చేయించే ప్రక్రియను యుద్ధ ప్రాతి పదికన చేపట్టింది. తదనుగుణంగా ఇంగ్లీషు నుండి తెలుగులోకి తర్జుమా చేయటానికి విశ్రాంత ఉద్యోగులు, విశ్రాంత న్యాయమూర్తులు, న్యాయవాదుల సేవలు వినియోగించుకుంటోంది. అనువాదకుల కొరత మూలాన ప్రస్తుతానికి ముఖ్యమైన తీర్పులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అనువాదకుల సేవలు ఉచితంగా స్వీకరించటం లేదు. వారి సేవలకు గాను, హైకోర్టు ప్రతి పేజీకి మూడు వందల రూపాయలు చెల్లిస్తుంది. ఇంగ్లీషులో వెలువరించిన తీర్పుల కాపీలను వారి ఇంటి దగ్గరే అనువాదం చేసి, సహేతుకమైన సమయంలో అను వాదాన్ని హైకోర్టులోని సంబంధిత అధికారులకు స్వయంగా అందజేయడం లేదా ఆన్లైన్లో పంపించటం అనువాదకుల పని. ఈ కార్యక్రమ సక్రమ నిర్వహణ కోసం హైకోర్టు తన పరిపాలనా భవనంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగంలో తెలుగు భాషపై పట్టున్న ఇద్దరు విశ్రాంత జిల్లా న్యాయమూర్తులను ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్గా; ఒక విశ్రాంత సీనియర్ సివిల్ జడ్జిని రిపోర్టర్గా నియామకం చేసింది. ఇంగ్లీషు నుండి తెలుగులోకి ప్రైవేటు అనువాదకులు తర్జుమా చేసిన∙ముఖ్యమైన తీర్పులను జాగ్రత్తగా పరిశీలించి, ప్రతి తీర్పుకు అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను జోడించి, వాటిని తెలంగాణ హైకోర్టు వెబ్సైట్లో నెల వారీగా పెట్టవలసిన బాధ్యత వీరికి అప్పగించింది. వెబ్సైట్ను 2024 ఆగస్టు 15న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ముఖ్య మైన తీర్పుల తెలుగు ప్రతులను ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని చదువుకునే అవకాశం కల్పించారు. అనువాదకులను శాశ్వత ప్రాతిపదికన నియమించుకోడానికి, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అనుమతి ఇచ్చింది. 25 తెలుగు అనువాదకులు, 10 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 5 తెలుగు టైపిస్ట్ పోస్టులను కూడా మంజూరు చేసింది. త్వరలో హైకోర్టు ఈ పోస్టులను భర్తీ చేసే అవకాశం లేకపోలేదు. తెలుగు అనువాదకులు దొరకటం అంత సులభమేమీ కాదు. ఎందుకంటే తెలంగాణ సచివాలయంలో కూడా ఈ కొరత ఉందని తెలుస్తోంది.మరో విషయమేమంటే ప్రతి పౌరుడికీ హైకోర్టు వెబ్సైట్ ద్వారా ముఖ్యమైన తెలుగు తీర్పులను డౌన్ లోడ్ చేసుకునే సౌలభ్యం ఉందనే విషయం తెలియ జేయాలనే ఆశయంతో... జిల్లా న్యాయమూర్తులు, జిల్లా, మండల న్యాయ సేవాధికార సంస్థలు; సంబంధిత జిల్లా ప్రభుత్వ అధికారులు న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రచారం కల్పించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతగా ప్రచారం కల్పించినా తెలుగులో తీర్పులు చదువుకోవాలనుకునే విషయం, అది ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉందనే విషయం అంత సులువుగా సామాన్యుడికి తెలియక పోవచ్చు. అవగాహన కల్పించటానికి సకల ప్రయత్నాలు చేయటానికి న్యాయ వ్యవస్థ గట్టిగానే కృషి చేయాలి. దీనికి న్యాయవాదుల పాత్ర పరిమితమని అనుకోవద్దు. ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కక్షిదారులు తాము దాఖలు చేసిన కేసుల్లో న్యాయ మూర్తులు ఇంగ్లీషులో వెలువరించిన తీర్పులను తమ భాషలో చదివి అర్థం చేసుకొని సంతృప్తి పడాలనే దృక్పథం. అనువాదం అంటే ప్రస్తుత కాలంలో ఎవరికీ అర్థం కాని పూర్తి గ్రాంథిక భాషా ప్రయోగం చేయకుండా, వ్యవహారిక భాషను వాడాలనీ, అవసరమైతే దైనందిన ఇంగ్లీషు పదాలను అదే విధంగా వాడాలనీ హైకోర్టు సూచన చేసింది. టెక్నాలజీ అతి వేగంగా దూసుకుపోతున్న ప్రస్తుత కాలంలో, ఇప్పటికే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్లలో రికార్డ్ చేసిన సాక్ష్యాల నకళ్ళను అప్పటికప్పుడు ఇరు పక్షాలకు ఉచితంగా అందజేసే ఏర్పాటు ఉంది. అదే విధంగా హైకోర్టు రిజిస్ట్రీ జోక్యం లేకుండా, తీర్పు చెప్పిన రోజే తీర్పు ప్రతిని ఇరుపక్షాలకు కోర్టులోనే ఉచితంగా అందజేయాలి. దిగువ కోర్టుల్లో కూడా సివిల్, క్రిమినల్ తీర్పు అనే భేదం లేకుండా, ఇదే పద్ధతి పాటించడానికి ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. అయితే నూటికి నూరు శాతం తీర్పుల తెలుగు అనువాదం సరైనది లేదా తప్పులు లేనిదని చెప్పలేం. ఈ తెలుగు తీర్పుల అనువాదం కేవలం చదువుకొని అర్థం చేసుకోవడానికి మాత్రమే పరిమితం. తెలుగు అనువాదం ఆధారంగా ఎవరు కూడా తప్పొప్పులు ఎంచి దానిపై అప్పీళ్ళు వేసే అవకాశం లేదు. ఇందు కోసం హైకోర్టు వెబ్సైట్లో డిస్ క్లెయిమర్ కూడా చొప్పించారు.తడకమళ్ళ మురళీధర్ వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జిమొబైల్: 98485 45970 -
సమాజం పట్ల కరుణతోనే న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నా..
ముంబై: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సైతం సూక్ష్మ పరిశీలనకు గురి కావాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయమూర్తుల పనితీరును చుట్టూ ఉన్న సమాజం పరిశీలిస్తూనే ఉంటుందని అన్నారు. అయితే, సమాజం పట్ల ఉన్న దయ, కరుణ, జాలి, అనురాగం వల్లే తాను అన్ని రకాల పరిశీలనలు, పరీక్షలకు నిలిచి, న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నానని తెలిపారు. సమాజం పట్ల తమ ప్రేమానురాగాలు తమ తీర్పుల ద్వారా వెల్లడవుతాయని వివరించారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెల 10వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముంబైలో ఆయనను ఘనంగా సత్కరించారు. జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను న్యాయవాదులు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ తాను ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ‘‘ఐఐటీ–ధన్బాద్లో చేరేందుకు సకాలంలో అడ్మిషన్ ఫీజు రూ.17,500 చెల్లించలేకపోయిన దళిత విద్యార్థికి మా ఆదేశాలతో ప్రవేశం లభించింది. ఇలాంటి తీర్పులు తనకెంతో సంతృప్తిని ఇచ్చాయి’’ అని తెలిపారు. -
న్యాయ వ్యవస్థపై ఏఐ ప్రభావం
కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం అన్ని రంగాలపైనా విశేషంగా పడుతోంది. అందులో భాగంగానే న్యాయ వ్యవస్థనూ అది ప్రభావితం చేస్తోంది. ఏఐతో న్యాయమూర్తుల పని సులువవుతుంది. దేశంలో లక్షల సంఖ్యలో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు సాధ్యమైనంత త్వరగా ఏఐ వినియోగంలో నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. న్యాయ శాస్త్రంలోని అనేక అంశాలు చిటికెలో ఏఐ ద్వారా అందుబాటు లోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల న్యాయ వ్యవస్థలో ఉన్నవారి పని భారం తగ్గుతుంది. మొత్తం మీద ఏఐ వల్ల న్యాయవ్యవస్థ ఎలా లాభం పొందుతుందో ఇక్కడ చూద్దాం:ఏఐ కేసు డేటాను విశ్లేషించడానికీ, ఫలితా లను అంచనా వేయడానికీ, నమూనాలను గుర్తించడానికీ సాయపడుతుంది. న్యాయ మూర్తులు అదనపు సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఏఐ ఆధారిత సాధనాలు న్యాయవాదులు, న్యాయమూర్తులకు సంబంధిత చట్టాల పూర్వాపరాలు, కేస్ స్టడీస్, పరిశోధనలో సమయం ఆదా చేయడంలో సహాయ పడతాయి. ఏఐ ఆధారిత చాట్ బాట్లు వర్చువల్ కోర్టు ప్రొసీడింగ్స్లో సహాయ పడతాయి. షెడ్యూల్ చేయడం, రిమైండర్లు, ప్రాథమిక విచారణల వంటి పనులలో సహాయ పడతాయి. ఏఐ ఆధా రిత న్యాయ సహాయం, మద్దతును అందించడం ద్వారా... ముఖ్యంగా అట్టడుగు వర్గాలు న్యాయం పొందడంలో అంతరాన్ని తగ్గించవచ్చు. ఏఐ రొటీన్ టాస్క్ను ఆటోమేట్ చేయగలదు. న్యాయ మూర్తులు, న్యాయస్థాన సిబ్బందిని మరింత సంక్లిష్టమైన, అధిక విలువైన పనులపై దృష్టి పెట్టేలా చేస్తుంది. న్యాయ ప్రక్రియలను మెరుగు పరచడానికి, జాప్యాలను తగ్గించడానికి, న్యాయ వ్యవస్థకు గల మొత్తం సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది.ఏజీఐ... అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలి జెన్స్ (కృత్రిమ సాధారణ బుద్ధి) ఒక భావితర హిత ఏఐ వ్యవస్థను సూచిస్తుంది. ఇది మనుషుల మేధస్సుకు సమానంగా విభిన్న పనులను అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం జ్ఞానాన్ని అనేక విభాగాల్లో ఉపయోగించే సామర్థ్యాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు: కారణాలు చెప్పడం, సమస్యలను పరిష్కరించడం; అనుభవం నుంచి నేర్చుకోవడం; సహజ భాషను అర్థం చేసుకోవడం, వివిధ రంగాల్లో జ్ఞానాన్ని ఉపయోగించడం వంటి పనులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.ఏఐ పరిశోధనలో ఏజీఐని పవిత్ర కాంక్షగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది అపారమైన అవకా శాలను తెచ్చిపెడుతుంది. అయితే ఏజీఐ ఇంకా పరిశోధన, అభివృద్ధి దశలోనే ఉంది. ఏఐ సాధానాలతో సమర్థవంతంగా పని చేయడానికి వ్యూహం, న్యాయవాదులకు, కక్షి దారులకు కౌన్సెలింగ్ వంటి అధిక విలువ గల పనులపై దృష్టి పెట్టడానికి, న్యాయవాదులు కొత్త నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది. న్యాయ వాద వృత్తిలో జూనియర్లు, లేదా పారాలీగల్స్ వంటి నిర్దిష్ట పాత్రలను ఏఐ స్థానభ్రంశం చేయ గలదు. సబ్స్క్రిప్షన్ ఆధారిత చట్టపరమైన సేవలు, ఏఐ ఆధారిత లీగల్ కన్సల్టింగ్ వంటి కొత్త వ్యాపార నమూనాలను ఏఐ ప్రారంభించగలదు.చట్టపరమైన ఆచరణలో ఏఐ ఉపయోగం, నిర్ణయాధికారం పారదర్శకంగా, జవాబుదారీ తనంగా ఉండేలా చూసుకోవడం వంటి నియంత్రణ సమస్యలను లేవనెత్తవచ్చు. న్యాయవాదులు ఏఐపై ఎక్కువగా ఆధారపడవచ్చు. దీని వల్ల అవ సరమైన నైపుణ్యాలను, నిర్ణయాన్ని (తీర్పును) కోల్పోయే అవకాశం ఉంది. ఏఐ ఆధారిత చట్ట పరమైన సాధనాలు డేటా చౌర్యం, ఉల్లంఘనల వంటి ప్రమాదాన్ని పెంచుతాయి.న్యాయవాదులు ఏఐని ఉపయోగించడంలో నైతికపరమైన చిక్కులను పరిగణనలోకి తీసు కోవాలి. ఏఐ తీసుకునే నిర్ణయం న్యాయంగా, నిష్పక్ష పాతంగా ఉండేలా చూసుకోవాలి. నైపుణ్యా లను సాధ్యమైనంత త్వరగా పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏఐ నుంచి ఎదురయ్యే సవా ళ్లను దీటుగా ఎదుర్కోవచ్చు. వృత్తిపరంగా విజ యవంతంగా ముందుకు వెళ్లవచ్చు. అయితే ఈ వ్యస్థపై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ఉండాలి.– ఆగూరు ఉమామహేశ్వరరావు సీనియర్ న్యాయవాది -
DY Chandrachud: న్యాయ వ్యవస్థకు ప్రజా విశ్వాసమే కీలకం
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థకు, న్యాయమూర్తులకు ప్రజా విశ్వాసమే అత్యంత కీలకమని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. ప్రజల నమ్మకం చూరగొనేలా పని చేయాలని న్యాయమూర్తులకు సూచించారు. ప్రజలు నేరుగా ఎన్నుకోనప్పటికీ, ప్రజా తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ న్యాయమూర్తులపై గురుతర బాధ్యత ఉందని చెప్పారు. జడ్జిగా విశ్వసనీయత, తగిన గుర్తింపు పొందాలంటే ప్రజల ఆమోదం, నమ్మకం చాలా ముఖ్యమని అన్నారు. భూటాన్లోని ‘జేఎస్డబ్ల్యూ స్కూల్ ఆఫ్ లా’లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ప్రజలకు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా కోర్టులు పరిష్కరిస్తుంటాయని పేర్కొన్నారు. అందుకే వారి విశ్వాసం పొందడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. ఏ దేశంలోనైనా ప్రజల మద్దతుతో న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అక్కడ రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలన సజావుగా సాగుతుందని వివరించారు. ప్రజాభిప్రాయం అనేది న్యాయ వ్యవస్థలో అంతర్గత తనిఖీగా తోడ్పడుతుందని సూచించారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు ప్రజలకు కనిపించాలని స్పష్టంచేరు. భారత్లోని కోర్టుల్లో ప్రవేశపెట్టిన సాంకేతిక విధానాలను జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. వర్చువల్ విచారణ, కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం, కేసుల ఈ–ఫైలింగ్, ఆన్లైన్ కేసు సమాచార వ్యవస్థ, కృత్రిమ మేధ(ఏఐ)తో కోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం వంటి విధానాలు తీసుకొచ్చామని వెల్లడించారు. ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. సామాన్య ప్రజల కోసం సుప్రీంకోర్టు ప్రక్రియలను మరింత సులభతరం చేశామని చెప్పారు. -
Pune Porsche car crash: మైనర్ నిందితునికి బెయిలు.. జడ్జిల తొలగింపు
పుణే: పోర్షే కారు దుర్ఘటనలో మైనర్ నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన కేసులో జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)కి చెందిన ఇద్దరు జడ్జిలను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. విధానపరమైన లోపాలు, దుష్ప్రవర్తన, నిబంధనలు పాటించకపోవ డంవంటి ఆరోపణలపై ఎల్.ఎన్.దన్వాడే, కవితా థోరట్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీ డీ) దర్యాప్తు కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేసిన ట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి ని యామకాన్ని రద్దు చేసింది. పుణేలోని కళ్యా ణి నగర్ ప్రాంతంలో ఓ బిల్డర్ కుమారుడైన 17 ఏళ్ల బాలుడు మద్యం మత్తులో పోర్షే కారు నడిపి మోటార్ సైకిల్ను ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఐటీ నిపుణులు మృతి చెందారు. అప్పటి జేజేబీ జడ్జిలు నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆ షరతులలో రోడ్డు భద్రతపై 300 పదాల వ్యాసం రాయాలని ఉంది. ఇది జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
ధిక్కార ‘స్వర’ భాస్కరం!
స్వర భాస్కర్... బాలీవుడ్ హీరోయిన్, నటిగా కొందరికి తెలుసు. హిందుత్వ వ్యతిరేకిగా... తప్పును తప్పు అని ఎత్తిచూపగల వ్యక్తిగా మరికొందరికి పరిచయం! ముస్లిం స్నేహితుడిని పెళ్లాడి.. ఇటీవలే తల్లిఅయిన స్వర భాస్కర్ తాజాగా మళ్లీ తన ధిక్కార స్వరంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల తీరును నేరుగా ప్రశ్నించారు. ఏళ్లుగా నిర్బంధంలో మగ్గుతున్న జేఎన్యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్, గుజరాత్ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ వంటి వారికి మద్దతుగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో స్వర భాస్కర్ మాట్లాడుతూ... ‘‘నేను ఈ రోజు న్యాయవ్యవస్థను ఒక ప్రశ్న అడగదలిచాను. దేనికి మీకు భయం? సామాన్య ప్రజలకైతే బతుకు సాగాలన్న భయం ఉంటుంది. ఎవరైనా దాడి చేసి కొడతారన్న భయం ఉంటుంది. దేశంలో ముస్లింలను ఎక్కడపడితే అక్కడ దాడి చేసి కొట్టేస్తున్నారు. పాపం ఈ దేశంలో దళితులపై కూడా విచ్చలవిడి దాడులు జరుగుతున్నాయి. మాలాంటి వాళ్లకు కూడా పని దొరకదనో.. కామెడీ షోల్లాంటివి చేయనివ్వరని, నటించిన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకంటారనో భయాలు ఉండవచ్చు. మరి మీకే రకమైన భయాలు ఉన్నాయి? అధికారం మీ చేతుల్లో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉంది. అరవై, డెబ్భై ఏళ్ల వయసు వాళ్లు.. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లోకి చేరిపోతున్నారు. మీ పిల్లలు కూడా పెద్దవాళ్లై పోయి ఉంటారు. ఖరీదైన.. మంచి కాలేజీల్లో, విదేశాల్లో చదువుకుని ఉంటారు. పెళ్లాం పిల్లలతో వాళ్లు జీవితంలో స్థిరపడి పోయి ఉంటారు. అలాంటి మీకు ఈ వృద్ధాప్యంలో ఎందుకు భయం? ఇంకా ఎలాంటి ఆశ మిగిలిపోయింది మీలో? ఏం కావాలి మీకు? రాజ్య సభ సభ్యత్వం, గవర్నర్ పదవుల అవసరం ఏమిటి? ఇన్ని ఆశలు పెట్టుకున్న మీరు మీ పని చేయమని మాత్రమే కదా మేము అడుగుతున్నది? అది కూడా మీరు చేయలేకపోతున్నారు ఎందుకు?’’ అంటూ న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై ప్రశ్నల వర్షం కురిపించారు.Why are you so scared at this age? What is the greed you have at this age? Do you want a Governor or Rajya Sabha post at this age?- @ReallySwara#UmarKhalidpic.twitter.com/2CSyEGWUFL— Mohammed Zubair (@zoo_bear) September 18, 2024 ఉమర్, ఖాలిద్, అతర్, గుష్ఫా, షెర్జీల్ ఇమామ్ వంటి ఎందరో మూడు నాలుగైదేళ్లుగా జైళ్లలో మగ్గిపోతున్నారని గుర్తు చేసిన స్వర.. ‘‘న్యాయవ్యవస్థ వీరిని పూర్తిగా మరచిపోయినట్లు అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. బెయిల్ లేకుండా.. విచారణ కూడా మొదలు కాకుండా ఇలాంటి వాళ్లు ఎంతకాలం నుంచి మగ్గిపోతున్నారో కూడా న్యాయవ్యవస్థ పట్టించుకోవడం లేదని అన్నారు. ‘‘అందుకే నేను ఈ వేదికపై నుంచి నాలుగేళ్ల కాలం అనేది ఎంత పెద్ద సమయమో చెప్పదలుచుకున్నాను. ఉమర్ ఖలీద్ 2020 సెప్టెంబరులో ఇరవయ్యవ తేదీ అరెస్ట్ అయ్యాడు. ఆ తరువాత మూడుసార్లు కోవిడ్ వచ్చి పోయింది. వ్యాధి కారక వైరస్ మూడు నాలుగు మార్లు రూపం మార్చుకుంది కూడా. ప్రాణాంతక మహమ్మారి జబ్బుకు చికిత్స కూడా దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఫహాద్ (భర్త)ను కలిశా. అప్పట్లో ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉండింది. తరువాత మా దోస్తీ కాస్తా ప్రేమగా మారింది.. రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నాయి. పెళ్లికి నిర్ణయించాం. అదీ పూర్తయ్యింది. కానీ... అప్పుడూ.. ఇప్పుడూ వాళ్లు (ఉమర్ తదితరులు) జైళ్లల్లోనే ఉండిపోయారు. బెయిల్ రాలేదు.. విచారణ మొదలు కాలేదు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
సీఎం హోదాలో ఉండి సుప్రీం తీర్పుపై వ్యాఖ్యలా!
సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవితకు బెయిలు మంజూరుపై స్పందిస్తూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా ఎలా మాట్లాడతారంటూ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తప్పుబట్టారు. ఇలాంటి ప్రకటనల వల్ల ప్రజల్లో భయాందోళనలు కలగొచ్చని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్రెడ్డి నిందితుడిగా ఉన్న ఓటుకు కోట్లు కేసు దర్యాప్తు హైదరాబాద్ నుంచి భోపాల్కు బదిలీ చేయాలంటూ, బీఆర్ఎస్ నేతలు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, కల్వకుంట్ల సంజయ్, మొహమ్మద్ అలీలు దాఖలు చేసిన పిటిషన్ను గురువారం జస్టిస్ గవాయి, జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మార్పు అంశం ప్రస్తావనకు వచ్చిన సమయంలో.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం వల్లే కవితకు బెయిలు వచ్చిందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తులు ఘాటుగా స్పందించారు.మనస్సాక్షి ప్రకారమే విధులు నిర్వర్తిస్తాం‘సుప్రీంకోర్టు తీర్పులపై వచ్చే విమర్శలు పట్టించుకోబోం. మాకెలాంటి ఇబ్బందీ లేదు. మనస్సాక్షి ప్రకారమే విధులు నిర్వర్తిస్తాం. ఇష్టం ఉన్నా లేకపోయినా మా విధులు మేం నిర్వర్తిస్తాం. కానీ న్యాయమూర్తులను అవమానించేలా ఇలాంటి ప్రకటనలు చేయకూడదు. ఆ తరహా ప్రకటనలు ఎలా చేయగలరు? రాజకీయ పార్టీలతో సంప్రదించిన తర్వాత ఆదేశాలు జారీ చేయాలా? రాజకీయ సంప్రదింపుల వరకూ వేచి ఉండాలా? సుప్రీంకోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేసే ధైర్యం ఎవరికైనా ఉంటే, మా తీర్పులపై గౌరవం లేకుంటే.. కేసు విచారణ సుప్రీంకోర్టులో కాకుండా మరెక్కడైనా జరగనివ్వండి..’ అంటూ జస్టిస్ గవాయి ఘాటుగా వ్యాఖ్యానించారు. పదే పదే అలాంటి వ్యాఖ్యలా?‘ఆ తరహా వ్యాఖ్యలు..మళ్లీ గురువారం ఉదయం కూడా! బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తొలి వంద రోజుల్లోనే ఈ తరహా స్టేట్మెంట్లు ఇవ్వడాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. కోర్టుపై ఆక్షేపణలు చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి చేసే బాధ్యతాయుతమైన ప్రకటనేనా ఇది? న్యాయవ్యవస్థకు ఆమడ దూరంలో ఉండడమే కార్యనిర్వాహకుల ప్రాథమిక విధి. విమర్శించండి.. కానీ ఆక్షేపణలు వద్దు..’ అని జస్టిస్ విశ్వనాథన్ స్పష్టం చేశారు.అలాగైతే న్యాయాధికారులపై విశ్వాసం లేనట్లే అవుతుంది..‘ఓటుకు నోటు కేసు విచారణ బదిలీ చేయాలన్న పిటిషన్లు విచారణకు స్వీకరిస్తే న్యాయాధి కారులపై కోర్టుకు విశ్వాసం లేనట్లే అవుతుంది. ఎన్నికల సమయంలో ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తారు. చట్టసభల్లో జోక్యం చేసుకోబోమని ఎప్పుడూ చెబుతుంటాం. వారికీ ఇది వరిç్తÜ్తుంది..’ అని జస్టిస్ గవాయి పేర్కొన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరిగే అవకాశం లేదు: పిటిషనర్ల తరఫు న్యాయవాదివ్యాఖ్యల సవరణకు ప్రయత్నిస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గీ తెలిపారు. అయితే జరగా ల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని, అటువంటి వ్యాఖ్యలు న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకు రావడంతోపాటు దిగువ కోర్టులకూ వ్యాపించే అవకాశం ఉందని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సి.సుందరం పేర్కొన్నారు. రేవంత్రెడ్డి ప్రస్తుతం సీఎం కావడంతో పాటు ఏసీబీని కూడా తన అధికార పరిధిలో ఉంచుకున్నారని, దర్యాప్తు పారదర్శకంగా జరిగే అవకాశం ఉండదని అన్నా రు. దర్యాప్తు అధికారులు కూడా మారారని చెప్పా రు. గతంలో దాఖలు చేసిన కౌంటరుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పోలీసులపై కూడా రేవంత్రెడ్డి వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారని తెలిపారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అని, ఏ వ్యక్తీ తన సొంత విషయంలో న్యాయ మూర్తి కాకూడదనే సహజ న్యాయసూత్రం గుర్తుచేశారు. న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచాలిఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మా సనం.. స్వతంత్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తే దర్యాప్తుపై విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. గతంలో దర్యాప్తుపై స్టే ఇచ్చిన అంశం, సీబీఐకి బదిలీ తదితర అంశాలపై ఆరా తీసింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై తెలంగాణకు చెందిన సహచరులను సంప్రదిస్తామని తెలిపింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తామని, అయితే ప్రస్తుత పిటిషన్ను కొట్టివేస్తామని పేర్కొంది. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంచాలని, అందరికీ విశ్వాసం కలిగేలా నియామకం చేపడతామని జస్టిస్ గవాయి చెప్పారు. ప్రస్తుత పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేంద్రరావుతో పాటు మరో న్యాయవాది ఉమా మహేశ్వరరావు ఉత్తమమని భావిస్తున్నామ న్నారు. అయితే తమకు పోలీసు అధికారుల విషయంలో ఆందోళన ఉందని పిటిషనర్ల తరఫు మరో సీనియర్ న్యాయవాది శేషా ద్రినాయుడు చెప్పారు. అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. -
CJI D Y Chandrachud: బెయిల్ అర్జీలపై ‘సేఫ్ గేమ్’ వద్దు
బెంగళూరు: బెయిల్ అర్జీల విషయంలో ట్రయల్ కోర్టుల జడ్జీలు ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అనుమానాస్పదం అనే పేరు చెప్పి ప్రతి కేసులోనూ బెయిల్ తిరస్కరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో బెర్క్లే సెంటర్ 11వ వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రయల్ కోర్టులు ప్రతి బెయిల్ పిటిషన్ను క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ అనుమానాస్పదం పేరిట అర్జీలను ట్రయల్ కోర్టుల జడ్జీలు కొట్టేస్తున్నారు. ఇలాంటి సేఫ్గేమ్ పనికిరాదు. బెయిల్ అర్జీలపై ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. కేసు ప్రాముఖ్యతను బట్టి తుది నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ పై కోర్టుకు వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్లంతా హైకోర్టు గడపతొక్కుతున్నారు. అక్కడా బెయిల్ దొరక్కపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. అనవసరంగా అరెస్ట్ అయిన వాళ్లు కూడా సుప్రీంకోర్టు దాకా రావాల్సిన పరిస్థితి! ఇలాంటి కేసులన్నీ అంత దూరం రావడం సరికాదు’’ అన్నారు. వాతావరణ మార్పులు మహిళలు, చిన్నారులు, దివ్యాంగులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సీజేఐ అన్నారు. ‘‘వాతావరణ మార్పులతో వలసలు పెరుగుతున్నాయి. ప్రజలకు నాణ్యమైన జీవితం కరువవుతోంది. ఆహార కొరతతో చిన్నారులు, ఇతర సమస్యలతో మహిళలు బాధ పడుతున్నారు. ఇబ్బందుల కొలిమిలో కాలిపోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. -
హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 7, తెలంగాణ హైకోర్టులో 16 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 84, తెలంగాణలో 115 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలో వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది. అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలు, సబార్డినేట్ కోర్టుల్లో 5,432 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పదవులను ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ, రాజీనామాలు, పదోన్నతుల ద్వారా ఖాళీ అయిన పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ఇది నిరంతర ప్రక్రియని స్పష్టం చేసింది. దేశంలోని జిల్లాల కోర్టుల్లో న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్రాల హైకోర్టులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని పేర్కొంది. నిబంధనల ప్రకారం.. జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో న్యాయమూర్తుల ఎంపిక, నియామకాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపింది. అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 70 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. ఆ తర్వాత పంజాబ్, హరియాణా ఉమ్మడి హైకోర్టులో 29, బాంబే హైకోర్టులో 25, కలకత్తా, గుజరాత్ హైకోర్టుల్లో 21 చొప్పున ఖాళీలు ఉన్నట్లు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 1,250, గుజరాత్లో 535, బిహార్లో 467, తమిళనాడులో 334, రాజస్థాన్లో 300 న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. -
హైకోర్టు శాశ్వత జడ్జీలుగా జస్టిస్ శ్రీనివాస్రావు,జస్టిస్ రాజేశ్వర్రావు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించింది. ముఖ్యమంత్రి, గవర్నర్లు దీనికి సమ్మతి తెలియ జేశారు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తులుగా నియామకానికి జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వర్రావుకు తగిన అర్హతలు ఉన్నాయని నిర్ణయించింది. వారిద్దరినీ శాశ్వత న్యాయమూర్తు్తలుగా నియమించాలని ఈ నెల 16న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులను ఆమోదించిన కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారం వారు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ..సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో 1969, ఆగస్టు 31న జగ్గన్నగారి శ్రీనివాస్రావు జన్మించారు. ఆయన తల్లిదండ్రులు లక్ష్మీబాయి, మాణిక్యరావు. పాఠశాల విద్య లింగన్నపేటలో.. గంభీరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్ నారాయణగూడలోని భవన్స్ న్యూ సైన్స్ కళాశాల నుంచి డిగ్రీ చేశారు. ఓయూ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 1999 ఏప్రిల్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. తొలుత జి.కృష్ణమూర్తి వద్ద జూనియర్గా పనిచేశారు. రిట్ సర్వీస్, నాన్ సర్వీస్ మ్యాటర్స్, సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి ట్రయల్ కోర్టులు, హైకోర్టులు, ట్రిబ్యునళ్లలో సమర్థంగా వాదనలు వినిపించారు. 2006 నుంచి స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2015 నుంచి న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టే వరకు సింగరేణి కాలరీస్ లిమిటెడ్ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2022 ఆగస్టు 16న హైకోర్టు అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఈ రెండేళ్లలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. ఆయనకు భార్య శ్రీలత ఇద్దరు పిల్లలు ప్రణీత్, ప్రక్షిప్త ఉన్నారు. 2001లో ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్మహబూబాబాద్ జిల్లా సూదన్పల్లిలో 1969 జూన్ 30న నామవరపు రాజేశ్వర్రావు జన్మించారు. తల్లిదండ్రులు గిరిజాకుమారి, సత్యనారాయణరావు. పాఠశాల విద్య వరంగల్లో.. హైసూ్కల్, ఇంటర్ గోవిందరావుపేటలో.. డిగ్రీ మహబూబాబాద్లో పూర్తి చేశారు. ఓయూ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించారు. 2001 ఫిబ్రవరి 22న న్యాయవాదిగా ఉమ్మడి ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. తొలుత సీవీ రాములు కార్యాలయంలో న్యాయవాదిగా పనిచేశారు. 2015లో ఉమ్మడి హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులై 2019 వరకు విధులు నిర్వర్తించారు. యూజీసీ న్యాయవాదిగానూ పనిచేశారు. 2016 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 2019 వరకు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ప్యానల్గా విధులు నిర్వహించారు. 2019 నవంబర్ నుంచి అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా పనిచేస్తూ 2022 ఆగస్టు 16న అడిషనల్ జడ్జిగా పదోన్నతి పొందారు. దాదాపు ఈ రెండేళ్ల కాలంలో కొన్ని వేల కేసుల్లో తీర్పులు వెలువరించారు. -
నల్ల కోటు... రాజకీయం!
కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రాజ్యానికి మూలస్తంభాలు. ఇందులో న్యాయ వ్యవస్థ మిగిలిన రెండింటికంటే విశిష్టమైనది. ఎందుకంటే మొత్తం మూడు వ్యవస్థల పరిధులనూ, పరిమితులనూ నిర్ణయించగల, నిర్దేశించగల స్థానం ఆ ఒక్క వ్యవస్థకు మాత్రమే వుంది. ఇతర రెండు వ్యవస్థలతో పోలిస్తే ఇప్పటికీ న్యాయ వ్యవస్థపై ప్రజలకు కొద్దో గొప్పో విశ్వనీయత వుంది. దానికి విఘాతం కలిగించే పరిణామాలు అడపా దడపా చోటుచేసుకుంటున్న సంగతి కూడా కాదనలేనిది. 175 ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, ఆ పదవికి రాజీనామా ఇచ్చిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ వైనం అటువంటిదే. తన రాజకీయ రంగ ప్రవేశంపై జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన సంజాయిషీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ తనను రోజూ దుమ్మెత్తిపోయటం, అసభ్య పదజాలంతో దూషించటం ఆయన తట్టుకోలేకపోయారట. కనుక నల్లకోటు, న్యాయదండం విడిచిపెట్టి ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకోవటమే ఆయనకు పరిష్కారంగా తోచింది! అలా అసభ్య పదజాలంతో దూషించే నేతలకు చదువు సక్రమంగా లేదన్న జస్టిస్ గంగోపాధ్యాయ విమర్శలో నిజం వుండొచ్చు. కానీ ఆయన చదువుసంధ్యలూ, విజ్ఞతా ఏమయ్యాయి? తాను వెలువరించే తీర్పులకు పూలు తప్ప రాళ్లు పడవని ఎలా అనుకున్నారు? తృణమూల్ సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో జస్టిస్ గంగోపాధ్యాయ కఠినంగా వ్యవహరించారన్న పేరు వుంది. మొత్తం 14 ఉదంతాల్లో ఆయన సీబీఐ దర్యాప్తు జరపాలని ఆదేశించారు. అందులో ఉపాధ్యాయ నియామకాల కోసం పెద్దయెత్తున ముడుపులు చేతులు మారాయన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్సెస్సీ) కేసు ప్రధానమైనది. ఆయన ఉత్తర్వుల కారణంగా 2022లో ఉన్నత విద్యాశాఖమంత్రిగా వున్న పార్థా ఛటర్జీతోపాటు దళారులు, డబ్బులిచ్చి ఉద్యో గాల్లోకొచ్చిన కొందరు టీచర్లు అరెస్టయ్యారు. నిజానికి ఆ కేసులో జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన ఆదేశాలు ఆయనకు పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. అవినీతిపై నిప్పులు కక్కే యోధుడిగా, సీఎం పదవికి అన్నివిధాలా అర్హతగల వ్యక్తిగా లోక్సభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి అప్పట్లో కీర్తించారు. వామపక్షాలు సైతం ఆయన తీర్పులను ప్రశంసించాయి. కానీ అవి జస్టిస్ గంగో పాధ్యాయ చెవికి సోకినట్టు లేదు. ‘న్యాయమూర్తులుగా తమ తీర్పులు నచ్చకపోతే విమర్శించవచ్చు, అప్పీల్కు పోవచ్చు. కానీ దూషిస్తారా?’ అని ఆయన ప్రశ్నించటం సబబే. కానీ ఆయన చేయాల్సిందేమిటి? దూషణలకు జవాబుగా ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకోవటమా? ఇందువల్ల ఆయనకుగానీ, మొత్తంగా వ్యవస్థకుగానీ విశ్వసనీయత పెరుగుతుందా? నిరుడు జస్టిస్ గంగో పాధ్యాయ తృణమూల్ను విమర్శిస్తూ స్థానిక చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దాన్ని తీవ్రంగా తప్పుబట్టి మందలించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. న్యాయమూర్తి పదవిలో వుంటూ రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేయటం జస్టిస్ గంగోపాధ్యాయతోనే మొదలు కాలేదు. 1967లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కోకా సుబ్బారావుతోపాటు జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ బహరూల్ ఇస్లాం, జస్టిస్ ఫాతిమా, జస్టిస్ సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్ వరకూ ఎందరో వున్నారు. జస్టిస్ బహరూల్ ఇస్లాం 1983లో అప్పటి బిహార్ పీసీసీ(ఐ) అధ్యక్షుడు జగన్నాథ్ మిశ్రాపై వచ్చిన ఫోర్జరీ, నేరపూరిత ప్రవర్తన ఆరోపణలనుంచి ఆయన్ను విముక్తి చేసిన నెల రోజులకే అస్సాంలో ఎంపీగా పోటీచేసే అవకాశం వచ్చింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. రిటైర్మెంట్ అనంతరం లా కమిషన్, మానవహక్కుల సంఘం, కంపెనీ లా బోర్డు, వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ వంటి సంస్థలకు నేతృత్వం వహించే అవకాశం ఎటూ వుంటుంది. అది కూడా సరికాదని అభ్యంతరం చెప్పేవారున్నారు. రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించటం, అంతకు వారంరోజుల ముందు ఆ పార్టీ నేతలను సంప్రదించినట్టు చెప్పటం జస్టిస్ గంగోపాధ్యాయ విజ్ఞతపై సందేహాలు రేకెత్తిస్తుంది. ఈ వారంరోజుల్లో కేసులేమీ చూడలేదన్నంత మాత్రాన ఈ సందేహాలు సమసిపోవు. మిమ్మల్ని ముందుగా బీజేపీ నేతలే సంప్రదించారా అన్న ప్రశ్నకు ఆయన లౌక్యంగా ‘మేమిద్దరం ఒకరినొకరం సంప్రదించుకున్నాం’ అని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ నీతివంతమైన పాలన గురించి ఎవరికీ భ్రమల్లేవు. నాలుగైదేళ్ల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే తమ పార్టీలో అవినీతి నేతలు మితిమీరుతున్నారనీ, వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వుంటుందనీ హెచ్చరించిన సంగతి అందరికీ గుర్తుంది. ఇలాంటి పరిస్థితి వున్నది గనుకే జస్టిస్ గంగోపాధ్యాయ వెలువరించిన తీర్పులను అనేకులు ప్రశంసించారు. తన రాజకీయ రంగ ప్రవేశ నిర్ణయంతో ఆ తీర్పులపై సందేహాలు తలెత్తటానికి ఆయనే కార కులయ్యారు. బీజేపీ నేతలు స్వర్గీయ అరుణ్ జైట్లీ, ప్రస్తుత కేంద్రమంత్రి నితీన్ గడ్కరి వంటివారు పదవీ విరమణ తర్వాత జడ్జీలు ఏ పదవీ తీసుకోరాదని అభిప్రాయపడ్డారు. అసలు సీవీసీ పదవికున్నట్టే జడ్జీలకు సైతం రిటైరయ్యాక పదవులు చేపట్టరాదన్న ఆంక్షలుండాలని చాలామంది చెబుతారు. అలా కాకపోయినా కనీసం రెండేళ్లపాటు ఏ పదవీ తీసుకోకుండా వుండటం శ్రేయస్కరం. రాజకీయాలకు అతీతంగా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల స్థితిలో వుందనే సంకేతం మన దేశ గౌరవాన్ని మరింత పెంచుతుందని అందరూ గుర్తించాలి. -
రాజ్యాంగం.. ఓ రక్షణ కవచం
సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తులు అంతర్నిర్మిత దురభిప్రాయాలను వదిలించుకోవాలని, రాజ్యాంగ నైతికతను అన్ని సమయాల్లో సమర్థించాల్సిన అవ సరం ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లు సూచించారు. నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, తెలంగాణ హైకోర్టు శనివారం సంయుక్తంగా నిర్వ హించిన దక్షిణ భారత న్యాయమూర్తుల ప్రాంతీయ సదస్సు మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో జరిగింది. ఈ సద స్సుకు హాజరైన న్యాయమూర్తులు, జిల్లా జడ్జిలను ఉద్దేశించి వారు మాట్లాడారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా మాట్లాడుతూ.. ‘కేవలం లక్ష్యాలను సాధించా లనే ఉద్దేశంతో న్యాయమూర్తులు ప్రయత్నించకుండా, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకుని తీర్పుల్లో నాణ్యతను మరింత పెంచాలి. వీలైనంత త్వరిత పద్ధతిలో గుణాత్మక, సమర్థవంతమైన న్యా యాన్ని అందించాలి. బెయిల్ కోసం ఇంకా అనేక మంది నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తోంది. రాజ్యాంగంలోని అత్యంత ప్రాధాన్యమైన ఆర్టి కల్ 21ని రక్షించడానికి మనం తీవ్రంగా కృషి చేయా లి. ఈ సోషల్ మీడియా యుగంలో మన పనితీరు పై ప్రజల పరిశీలన పెరిగిందన్న విషయాన్ని న్యా యమూర్తులు తెలుసుకోవాలి. న్యాయమూర్తులకు నిరంతర శిక్షణ ఎల్లప్పుడూ అవసరం. నాకు నచ్చిన సిటీల్లో హైదరాబాద్ ఒకటి. నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయ డం అభినందనీయం. కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ఏ న్యాయమూర్తికైనా శిక్షణ అవసరమే. ఒక్కో రాష్ట్రంలో చట్టాల్లో మార్పులు ఉంటాయి. అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది’అని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం కలిగించాలి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మాట్లాడుతూ.. ‘ప్రజలకు న్యాయవ్యవస్థపై మరింత నమ్మకం కలిగేలా న్యా యమూర్తుల విధి నిర్వహణ ఉండాలి. న్యాయ వ్యవస్థ తమకు ఓ రక్షణ కవచం అన్న భావన కల్పించాలి. సామాన్యుల విశ్వాసం చూరగొన్నప్పుడే న్యా యవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు. ఆ విశ్వ సనీయత కోల్పోయిన రోజు ఈ వ్యవస్థ నిష్ప్రయో జనం. అంతిమంగా రాజ్యాంగ సారాంశం సమా నత్వమే. పక్షపాతాలను పక్కకు పెట్టి పనిచేయాలి. న్యాయమూర్తులు ఉపన్యాసాలు ఇవ్వడం మాని.. చట్టప్రకారం మాత్రమే తీర్పులు వెల్లడించాలి’అని సూచించారు. అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ.. రా జ్యాంగం కేవలం ఒక చట్టపరమైన డాక్యుమెంట్ మాత్రమే కాదని, ప్రజల రక్షణ కవచమని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జస్టిస్ సుజోయ్ పాల్, తెలంగాణ రాష్ట్ర న్యాయ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, తెలంగాణ, ఇతర హైకోర్టుల న్యాయమూర్తులు మాట్లాడారు. -
హైకోర్టు జడ్జీలుగా ఐదుగురు
న్యూఢిల్లీ: నాలుగు హైకోర్టుల్లో నియామకానికిగాను సుప్రీంకోర్టు కొలీజియం అయిదుగురు జడ్జీల పేర్లను ప్రతిపాదించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలో భేటీ అయిన కొలీజియం ఈ మేరకు కేంద్రానికి సిఫారసులను పంపించింది. కొలీజియంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్ కూడా ఉన్నారు. జమ్మూ కశీ్మర్ అండ్ లద్దాఖ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ రాహుల్ భారతి, జస్టిస్ మోక్షా ఖజూరియా కజి్మలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియంకోరింది. బాంబే హైకోర్టులో అదనపు జడ్జి అభయ్ అహుజాను శాశ్వత న్యాయమూర్తిగా, కోల్కతా హైకోర్టు న్యాయాధికారి చైతలి చటర్జీ(దాస్)ను అదే హైకోర్టులో న్యాయమూర్తిగా, ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయాధికారి అరవింద్ కుమార్ వర్మను అదే హైకోర్టులో జడ్జిగా నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. -
ఇద్దరు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. జస్టిస్ సుధీర్కుమార్ను మద్రా స్ హైకోర్టుకు, జస్టిస్ చిల్లకూర్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని కొద్ది రోజుల కిందట సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఆ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. వీరితోపాటు ఇతర రాష్ట్రాల కు చెందిన మరో ముగ్గురు న్యాయమూర్తుల బదిలీకికూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తు ల సంఖ్య (సీజేతో కలిపి) 42 కాగా, ప్రస్తుతం 28 మంది ఉన్నారు. జస్టిస్ చిల్లకూర్ సుమలత, జస్టిస్ సుధీర్కుమార్ బదిలీతో ఆ సంఖ్య 26కు చేరగా.. ఖాళీల సంఖ్య 16కు పెరిగింది. చదవండి: కేసీఆర్కు కోటి అప్పు ఇచ్చిన వివేక్ -
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు
న్యూఢిల్లీ: ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. సీజేఐ జస్టిస్ డీ వై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కేంద్రానికి ఈ మేరకు సిఫార్సు చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఉన్నారు. ప్రతిభ, సామర్థ్యం, నిజాయితీ, విశ్వసనీయత, నేపథ్యం తదితరాలను జాగ్రత్తగా మదింపు చేసిన అనంతరం సుప్రీం న్యాయమూర్తులుగా వారి పేర్లను సిఫార్సు చేసినట్లు కొలీజియం తెలిపింది. వారి నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరుగుతుంది. న్యాయమూర్తులపై పెరుగుతున్న విపరీతమైన పని భారం దృష్ట్యా సుప్రీంకోర్టులో ఎప్పుడూ ఒక్క ఖాళీ కూడా ఉండకుండా చూడాల్సిన అవసరం ఉందని కొలీజియం అభిప్రాయపడింది. -
సీజే రోస్టర్కే జడ్జీలు కట్టుబడి ఉండాలి
సాక్షి, అమరావతి: ప్రధాన న్యాయమూర్తి (సీజే) మాత్రమే నిర్ణయించే రోస్టర్ (ఏ న్యాయమూర్తులు ఏ రకమైన కేసులు వినాలి)ను అనుసరించే విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి కేటాయించని కేసుపై న్యాయమూర్తులు విచారణ జరపడం తీవ్రమైన అనౌచిత్యమని స్పష్టంచేసింది. న్యాయమూర్తులందరూ కూడా ప్రధాన న్యాయమూర్తి నిర్ధేశించిన రోస్టర్కు కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పింది. అలాగే, వారంతా క్రమశిక్షణతో వ్యవహరించాలని, సీజే కేటాయించిన కేసు తప్ప మరే ఇతర కేసును విచారించడానికి వీల్లేదని తెలిపింది. రోస్టర్ ప్రకారం నిర్ధిష్ట కేటగిరి కింద తమ ముందుకొచ్చిన కేసును విచారించడం లేదా సీజే నిర్ధిష్టంగా అప్పగించిన కేసును విచారించడం మాత్రమే న్యాయమూర్తులు చేయాల్సి ఉంటుందని ‘సుప్రీం’ స్పష్టంచేసింది. అలాగే, కొందరు కక్షిదారులు తాము అనుకున్న ఉత్తర్వులు పొందేందుకు తమ కేసును నిర్ధిష్టంగా ఓ న్యాయమూర్తి వద్దకు వచ్చేలా చేయడం.. ఉత్తర్వులిచ్చే అవకాశంలేని న్యాయమూర్తి ముందు నుంచి తమ కేసును తప్పించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతుండటాన్ని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ విధంగా ఫోరం షాపింగ్ (కావాల్సిన జడ్జి వద్దకు కేసు వచ్చేలా చేయడం, కేసు రాకుండా చేయడం)కు పాల్పడడం ఎంతమాత్రం సరికాదంది. తమ ముందున్న కేసులో కక్షిదారులు వ్యవహరించిన తీరు విస్మయకరమంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఫోరం షాపింగ్కు పాల్పడినందుకు ఆ కక్షిదారులకు రూ.50వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ఇటీవల తీర్పు వెలువరించారు. మొదటక్వాష్.. పనికాకపోవడంతో రిట్ పిటిషన్.. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజస్థాన్కు చెందిన నలుగురు వ్యక్తులపై వేర్వేరుగా ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరికొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ రెండు ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ నలుగురు వ్యక్తులు రాజస్థాన్ హైకోర్టులో సీఆర్పీసీ సెక్షన్–482 కింద క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈ ఏడాది ఏప్రిల్ 23న విచారణ జరిపిన న్యాయమూర్తి ఆ నలుగురు వ్యక్తులు కోరిన విధంగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో ఆ నలుగురు వ్యూహం మార్చి ఆరు ఎఫ్ఐఆర్లను కలిపేసి, వాటన్నింటినీ ఒకే ఎఫ్ఐఆర్గా పరిగణించాలని కోరుతూ 8 మే 2023న సివిల్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మరో న్యాయమూర్తి ఆ నలుగురు వ్యక్తులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఫిర్యాదుదారు అంబలాల్ పరిహార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ఆ నలుగురు వ్యక్తులు కూడా గతంలో తమకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన న్యాయమూర్తి ముందు తిరిగి తమ కేసు రాకుండా చేసేందుకే ఎఫ్ఐఆర్లన్నింటినీ కలపాలంటూ పిటిషన్ దాఖలు చేశారని అంబలాల్ తన పిటిషన్లో ఆరోపించారు. అంతేకాక.. ఎనిమిది ఎఫ్ఐఆర్లలో తమపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కూడా కోరారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పైపెచ్చు ఫిర్యాదుదారులను అసలు ప్రతివాదులుగా చేర్చలేదని వివరించారు. ఫోరం షాపింగ్కు ఈ కేసు ఓ ఉదాహరణ.. వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. గతంలో ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది, ఎఫ్ఐఆర్లన్నింటినీ కలిపేయాలంటూ సివిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఒకరేనని గుర్తించింది. ఫోరం షాపింగ్కు ఈ కేసు ఓ ప్రామాణిక ఉదాహరణని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. అంతేగాక.. న్యాయ ప్రక్రియ దుర్వినియోగానికి ఈ కేసు ఓ మచ్చుతునకని కూడా తెలిపింది. ఎఫ్ఐఆర్లన్నింటినీ కలిపేయాలంటూ దాఖలు చేసిన సివిల్ రిట్ పిటిషన్ను అసలు ఎలా విచారించారంటూ విస్మయం వ్యక్తంచేసింది. క్రిమినల్ కేసులను విచారించేందుకు సీజే నిర్ధిష్ట రోస్టర్ను ఖరారు చేశారని.. ఈ కేసులో నలుగురు నిందితులు దాఖలు చేసినటువంటి పిటిషన్లను న్యాయస్థానాలు అనుమతిస్తూ వెళ్తే సీజే నిర్ధేశించే రోస్టర్కు ఎంతమాత్రం విలువ ఉండదని తేల్చిచెప్పింది. ఆ నలుగురు వ్యక్తులు మరో న్యాయమూర్తి ముందు దాఖలు చేసిన సివిల్ రిట్ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ నలుగురు వ్యక్తుల వ్యవహారశైలిని సెక్షన్–482 కింద వీరి పిటిషన్లను విచారిస్తున్న న్యాయమూర్తి దృష్టికి తీసుకురావాలని స్పష్టంచేసింది. ‘ఫోరం షాపింగ్’ బాబు బ్యాచ్కు కొట్టిన పిండి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు విభజిత ఏపీ హైకోర్టులో కూడా ఫోరం షాపింగ్, నాట్ బిఫోర్ అనగానే వెంటనే గుర్తొచ్చేది చంద్రబాబు అండ్ కోనే. గతంలో ఎన్నడూ వినని, తెలియని ఫోరం షాపింగ్, నాట్ బిఫోర్ వంటి వాటిని సామాన్య జనానికి తెలిసేలా చేసింది ఆ బ్యాచే. గతంలో చంద్రబాబు ఈ ‘ఫోరం షాపింగ్’ ను అడ్డంపెట్టుకుని ఎన్నో కేసుల నుంచి బయటపడ్డ ఉదంతాలున్నాయి. ♦ అక్రమాస్తులకు సంబంధించి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్లో చంద్రబాబు ఏ రకంగా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ♦ రామోజీ, చంద్రబాబు తదితరుల అక్రమార్జనపై వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలోనూ చంద్రబాబు అండ్ కో వేసిన నాట్ బిఫోర్ నాటకాలతో న్యాయవ్యవస్థే విస్మయం చెందింది. ♦ ఫలానా న్యాయమూర్తి తమకు అనుకూలంగా ఉత్తర్వులివ్వరని భావిస్తే, అతనిపైకి కొందరు న్యాయవాదులను ఉసిగొల్పి, ఆ న్యాయమూర్తితో ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకుని ఆ కేసు విచారణ నుంచి ఆ న్యాయమూర్తులు తప్పుకునేలా చేసిన కేసులూ ఎన్నో. ♦ ఇలా న్యాయమూర్తులతో గొడవలు పెట్టుకున్నందుకు ఆ న్యాయవాదులకు పెద్ద మొత్తాల్లో డబ్బు ముట్టజెప్పిన సంగతి న్యాయవర్గాల్లో అందరికీ తెలుసు. ♦ తాజాగా.. ఓ కేసులో కూడా చంద్రబాబు బృందం ఇలానే ఫోరం షాపింగ్కు పాల్పడింది. దీనిపై ప్రస్తుతం న్యాయవర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. -
CBN Arrest: ‘క్యాంపెయిన్గా జడ్జిలను ట్రోల్ చేశారు’
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత.. ఆయన పిటిషన్లను విచారించిన జడ్జిలపై రాజకీయపరంగా.. ఉద్దేశపూర్వకంగానే దూషణల పర్వం కొనసాగిందని ఏపీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఇవాళ క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్పై విచారణ జరిగింది. పిటిషన్పై విచారణ నేపథ్యంలో.. టీడీపీ నేత బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరీ సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలని బుధవారం హైకోర్టు ఏపీ డీజీపీని ఆదేశించింది. క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్పై వాదనల సందర్భంగా.. ‘‘క్యాంపెయిన్గా జడ్జిపై ట్రోలింగ్ చేశార’’ని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. ఇద్దరు హైకోర్టు జడ్జీలు, ఏసీబీ జడ్జి ఫ్యామిలీ టార్గెట్గా ట్రోలింగ్ నడిచిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. దీంతో ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి.. ఆ 26 మందికి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. నాలుగు వారాలకు పిటిషన్పై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. యెల్లో బ్యాచ్తో పాటు చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై దూషణల పర్వం కొనసాగింది. టీడీపీ నేతలు, చంద్రబాబు సానుభూతి పరులు న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులపై నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసింది పచ్చ మీడియా. దీంతో ఈ వ్యవహారంలో బుద్దా వెంకన్న సహా 26 మంది ప్రతివాదులుగా చేర్చింది ప్రభుత్వం. బుద్దా వెంకన్నతో పాటు ఎస్. రామకృష్ణ, మరికొన్ని సోషల్ మీడియా పేజీల నిర్వాహకులకు పరిశీలన తర్వాత నోటీసులు జారీ కానున్నాయి. అలాగే ప్రతివాదులుగా ఉన్న గూగుల్, ఎక్స్(ట్విటర్), ఫేస్బుక్కు కూడా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. మహాదారుణంగా.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టులో 10 గంటల వాదనల తరువాత చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఆపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని హైకోర్టు కొట్టేసింది. అయితే ఈ తీర్పులను ఇచ్చిన జడ్జీలను సామాజిక మాధ్యమాల వేదికగా వికృత రూపాల్లో తూలనాడుతూ పోస్టులు వెల్లువెడ్డాయి. రాష్ట్రపతి కార్యాలయం స్పందన మరోవైపు జడ్జీలపై అభ్యంతరకర పోస్టులపై రాష్ట్రపతి భవన్ పై స్పందించి పోస్ట్ లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ రాసింది. తదనంతరం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. -
అడ్డంగా దొరికిపోయి.. జడ్జిలపై నిందలా!
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): ‘అడ్డగోలుగా తప్పులు చేసి సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయి.. ఆ కేసుల్లో తీర్పు చెప్పిన జడ్జిలపై నిందలు వేస్తారా’ అంటూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ అనుకూల మీడియాను పలువురు వక్తలు ప్రశ్నించారు. విజయవాడలోని ఐలాపురం హోటల్లో ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో ‘కోర్టు తీర్పులపై రాజకీయాలు–వక్ర భాష్యాలు’ అనే అంశంపై శనివారం సదస్సు జరిగింది. ఫోరం కన్వినర్ బి.అశోక్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో న్యాయవాదులు, న్యాయ నిపుణులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిన నాటి నుంచి టీడీపీ నాయకులు, అనుకూల మీడియా న్యాయవ్యవస్థపై, జడ్జిలపై విమర్శలు చేయడాన్ని వక్తలు ఖండించారు. జడ్జిలపై వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్న వ్యాఖ్యలను కోర్టులు సుమోటోగా తీసుకోవాలన్నారు. తీర్పులు తమకు అనుకూలంగా వస్తే ఒక విధంగా, వ్యతిరేకంగా వస్తే మరో విధంగా జడ్జిలపై నిందలు వేస్తూ మాట్లాడటం సరికాదని హితవు పలికారు. కోర్టు సాక్ష్యాధారాలు చూస్తుందని, చంద్రబాబు కేసులో పూర్తి సాక్ష్యా«ధారాలు చూపినందు వల్లే కోర్టు ఆయనకు రిమాండ్ విధించిందన్నారు. సదస్సు అనంతరం న్యాయవ్యవస్థపై నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలుపొందిన పాఠశాలల విద్యార్థులకు జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. సదస్సులో వివిధ సంఘాల ప్రతినిధులు ఎం శ్రీనివాసరెడ్డి, బడేజానీ, హృదయరాజు, ఎం.కోటేశ్వరరావు, వలిపర్తి బసవరాజు తదితరులు పాల్గొన్నారు. న్యాయస్థానం సుమోటోగా తీసుకోవాలి రాష్ట్రంలో ప్రధాన మీడియా తీర్పులు చెప్పిన జడ్జిల వ్యక్తిత్వ హననానికి తెగబడుతోంది. తీర్పులపై చర్చలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. ఇది కచి్చతంగా కోర్టు ధిక్కారం అవుతుంది. హైకోర్టు, సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకోవాలి. జైలర్ సెలవుపై పుంఖాను పుంఖాలుగా కథనాలు రాశారు. చివరికి అతని భార్య చనిపోతే ఆ వార్త కూడా కనిపించకుండా చేశారు. – విజయబాబు, అధ్యక్షుడు, అధికార భాషా సంఘం కేసు పూర్వాపరాలు చూసే రిమాండ్ స్కిల్ స్కామ్లో చంద్రబాబు సాక్ష్యా«ధారాలతో దొరికిపోయారు. జడ్జి పూర్వాపరాలు పరిశీలించిన మీదటే రిమాండ్ విధించారు. బెయిల్ పిటిషన్ వేయకుండా రిమాండ్ విధించడమే తప్పు అన్న వాదన తెచ్చారు. చంద్రబాబు తాను తప్పు చేయకపోతే నిర్థోíÙత్వం నిరూపించుకోవాలి. జడ్జిలను తప్పుబట్టడం, న్యాయస్థానాలను తప్పుబట్టడం సరికాదు. – పి.గౌతంరెడ్డి, చైర్మన్, ఏపీ ఫైబర్ నెట్ జడ్జిల వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు కేసులు విచారణలో ఉండగా వాటిపై చర్చలు పెట్టడం, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. అక్రమ అరెస్ట్, రిమాండ్ అక్రమం, నిర్బంధం అక్రమమంటూ చెబుతున్నారు. వాస్తవానికి అది చెప్పాల్సింది కోర్టులు. కోర్టులు చెప్పాల్సిన అంశాలను మీడియా చానల్స్ చెప్పడం దురదృష్టకరం. – వీవీఆర్ కృష్ణంరాజు, ఎడిటర్స్ అసోసియేషన్ చంద్రబాబు బొక్క బోర్లా పడ్డాడు స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడం చరిత్రాత్మక తీర్పు. ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబు చట్టం ముందు బొక్క బోర్లా పడ్డాడు. లూథ్రాను ఆంధ్ర న్యాయవాదులు తిప్పికొట్టారు. – ఎం.గురునాథం, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్డీఎఫ్ ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదు చంద్రబాబు కేసులో నిష్పక్ష తీర్పు వచ్చింది. చంద్రబాబుకు జైల్లోనూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. జడ్జిలపై విమర్శలు చేస్తూ ఏవేవో ఆపాదిస్తూ నిందలు వేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. – విఠల్ రావు, సీనియర్ న్యాయవాది సూత్రధారులకు శిక్ష తప్పదు ఏ కేసులోనైనా నేరం చేసిన వాడిది ఎంత తప్పో, నేరానికి ప్రేరేపించిన వాడిది అంతే తప్పు. కేసులో సాక్ష్యాధారాలు ఉంటేనే కోర్టు రిమాండ్ విధిస్తుంది. చంద్రబాబు కేసులో అదే జరిగింది. న్యాయవ్యవస్థపై, జడ్జిలపై నిందలు మోపొద్దు. – జయరాజ్, మాజీ పీపీ తీర్పులకు వక్రభాష్యం తగదు తవ్వేకొద్దీ చంద్రబాబు స్కామ్లు బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లు కొందరు వ్యక్తులను అడ్డుపెట్టుకుని వ్యవస్థలను అనుకూలంగా మార్చుకున్నారు. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే జడ్జి తీర్పులపై వక్రభాష్యం చెబుతున్నారు. కోర్టు తీర్పులపై మీడియా తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. – ఎం.వెంకటేశ్వరరెడ్డి, హోటల్స్ అసోసియేషన్ -
కింది కోర్టుల లాయర్లనూ హైకోర్టు జడ్జిలుగా నియమించాలి
సాక్షి, అమరావతి : హైకోర్టు జడ్జిలుగా కేవలం హైకోర్టు న్యాయవాదులనే కాక కింది కోర్టుల లాయర్లను సైతం పరిగణనలోకి తీసుకోవాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కోరారు. కింది కోర్టుల్లో కూడా ఎంతో మంది ప్రతిభావంతులైన న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. కింది కోర్టుల్లో ఉన్న సీనియర్ లాయర్లకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించాలన్నారు. శనివారం గుంటూరులో జరిగిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర మహాసభల్లో జస్టిస్ దేవానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత న్యాయవ్యవస్థలో ‘సామాజిక భిన్నత్వం’ లోపించిందని అన్నారు. అణగారిన వర్గాలు, మహిళల సంఖ్య పెరగాలని చెప్పారు. 2018 నుంచి 2023 వరకు హైకోర్టుల్లో 601 మంది న్యాయమూర్తుల నియామకాలు జరగ్గా, అందులో జనరల్ కోటా 457 మంది, ఎస్సీలు 18 మంది, ఎస్టీలు 9 మంది, ఓబీసీలు 72 మంది, మహిళలు 91 మంది, మైనారిటీలు 32 మంది, ఇతరులు 13 మంది ఉన్నారన్నారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ విధానం లేకపోయినప్పటికీ, న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. న్యాయమూర్తుల నియామకాల్లో నా ణ్యతపై లా కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు చేసిన సిఫార్సులను కొలీజియం పరిగణనలోకి తీసుకో వాలని కోరారు. దేశంలోని కోర్టుల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటి భారం చాలా తీవ్రమైన అంశమని చెప్పారు. న్యాయం అందించడంలో జాప్యం జరిగితే న్యాయం అందని పరిస్థితికి దారి తీస్తుందన్నారు. జాప్యం ఇలాగే కొనసాగితే విసిగిపోయిన కక్షిదారులు రాజ్యాంగేతర, అసాంఘిక శక్తులను ఆశ్రయించి తక్కువ ఖర్చుతో వేగవంతమైన న్యాయం పొందేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. ఇది అంతిమంగా శాంతిభద్రతల సమస్యగా మారి, సమాజంలో అశాంతి, అరాచకానికి దారి తీస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉందని తెలిపారు. న్యాయవాదుల రక్షణకు చట్టం తెచ్చేలా తీర్మానం చేయాలని ఐలూ కార్యవర్గాన్ని కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతం పార్లమెంట్ చేసే చట్టాలను సమీక్షించే అధికారాన్ని న్యాయవ్యవస్థకు రాజ్యాంగం ఇచ్చిందని, దీంతో న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేందుకు కార్యనిర్వాహక వ్యవస్థ చాలా గట్టిగా ప్రయత్నిస్తోందని ఐలూ జాతీయ కార్యదర్శి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వి.సురేంద్రనాథ్ చెప్పారు. అందులో భాగంగానే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం మొదలు పెట్టిందన్నారు. న్యాయమూర్తుల ఎంపికలో ఆధిపత్యానికి ఆరాటపడుతోందన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటే ప్రజాస్వామ్యం మరో విధంగా మారుతుందని, దేశం లౌకిక, సార్వభౌమ దేశంగా కొనసాగే పరిస్థితి ఉండదని చెప్పారు. దీనిని అడ్డుకోవాల్సిన బాద్యత న్యాయవాదులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఐలు రాష్ట్ర అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ, ఏపీ కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మణిపూర్ కోసం ముగ్గురు మాజీ మహిళా జడ్జీలతో కమిటీ.. సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: మణిపూర్ ఘటనలపై విచారణ సందర్భంగా ఇవాళ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్ హింసపై దర్యాప్తు కోసం ముగ్గురు మాజీ మహిళా హైకోర్టు జడ్జిలతో కమిటీ కూడిన కమిటీని ప్రతిపాదించింది. దర్యాప్తు పరంగానే కాకుండా.. పునరావాసం, ఇతరత్రా అంశాలపైనా ఈ కమిటీ దృష్టిసారిస్తుందని స్పష్టం చేసింది. అంతేకాదు వివిధ రాష్ట్రాల నుంచి డీజీఐ ర్యాంక్ అధికారులతో కూడిన 42 సిట్లు... సీబీఐయేతర కేసులు విచారణ చేపడతాయని తెలిపింది. ఒక్కో అధికారి ఆరు సిట్లను పర్యవేక్షిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘‘మా ప్రయత్నాలు చట్ట పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం. మేము ఒక స్థాయిలో ముగ్గురు మాజీ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ కమిటీ దర్యాప్తు మాత్రమే కాకుండా - సహాయక చర్యలను, నివారణ చర్యలు మొదలైనవాటిని కూడా పరిశీలిస్తుంది’’ అని చీఫ్ జస్టిస్ డీవైచంద్రచూడ్ ప్రకటించారు. ► ముగ్గురు సభ్యుల కమిటీలో జమ్ము కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలినీ జోషి, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆశా మీనన్ ఉన్నట్లు తెలిపింది. ► సీబీఐ దర్యాప్తు బృందంలో ఐదు రాష్ట్రాల నుంచి డిప్యూటీ సూపరిడెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు ఐదుగురు ఉంటారని, సీబీఐ దర్యాప్తును మాజీ ఐపీఎస్ అధికారి దత్తాత్రేయ పద్సల్గికర్ Dattatray ‘Datta’ Padsalgikar (మహారాష్ట్ర మాజీ డీజీపీ) పర్యవేక్షిస్తారని తెలిపింది. ► సీబీఐకి ట్రాన్స్ఫర్ కాని కేసుల్ని 42 సిట్లు విచారణ చేపడతాయి. ఈ సిట్లను మణిపూర్ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి డీఐజీ ర్యాంక్ అధికారులు నేతృత్వం వహిస్తారు. దర్యాప్తు సక్రమంగా సాగుతుందో లేదో.. ఒక్కో అధికారి ఆరు సిట్లను చూసుకుంటారు అని తెలిపింది. అంతకు ముందు.. మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ వ్యక్తిగతంగా చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు హాజరయ్యారు. ఎఫ్ఐఆర్ల వ్యవహారం తప్పుల తడకగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఆయన్ని హాజరు కావాలంటూ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక.. మణిపూర్ హింసపై దర్యాప్తునకు ఆరు జిల్లాల వారీగా ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్) ఏర్పాటు చేసినట్లు కేంద్రం సుప్రీం కోర్టుకు నివేదించింది. బయట నుంచి కాకుండా.. సిట్లను జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేయించి దర్యాప్తునకు అనుతించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బెంచ్కు తెలిపారు. అయితే సుప్రీం మాత్రం తమ ప్రతిపాదనకే మొగ్గు చూపించింది. -
కొత్త న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ కళాసికం సుజన, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సోమవారం ఫస్ట్ కోర్టు హాల్లో ఉదయం 9.45 గంటలకు జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయమూర్తులు, అడ్వొ కేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాదులు తదిత రులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సుజన, లక్ష్మీనారాయణ, అనిల్ కుమార్లను అదనపు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్ర పతి గత వారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరి నియామకంతో హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ఇంకా శాశ్వత, అదనపు న్యాయమూర్తులు కలిపి 12 ఖాళీలున్నాయి. బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొత్త న్యాయమూర్తులు కేసుల విచారణలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... సోమవారం సాయంత్రం తెలంగాణ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్త న్యాయమూర్తులు జస్టిస్ సుజన, జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ అనిల్ కుమార్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్సీఏఏ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్రావు చెంగల్వ, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
కొత్త కోర్టులతో సత్వర న్యాయం అందాలి
విజయనగరం లీగల్: విజయనగరం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన న్యాయస్థానాల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు అభిలషించారు. ఈ దిశగా న్యాయాధికారులు, న్యాయవాదులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. విజయనగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో కొత్తగా మంజూరైన అదనపు సీనియర్ సివిల్ కోర్టుని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ప్రారంభించారు. న్యాయసేవా సదన్లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని జస్టిస్ ఏవీ శేషసాయి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులకు తగిన శిక్షణ ఇచ్చి మెరికల్లాంటి న్యాయవాదులను అందించాలని సీనియర్ న్యాయవాదులకు సూచించారు. న్యాయవాదులు, న్యాయాధికారులు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా సమాజానికి మేలు చేయగలమన్నారు. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ జిల్లా కోర్టు భవన సముదాయాలకు రూ.99 కోట్లతో మంజూరైన కొత్త భవనాలను నాణ్యతగా నిరి్మంచేలా బార్ కౌన్సిల్, యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణచక్రవర్తి, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు. -
చంపేస్తాం..! హైకోర్టు జడ్జిలకు బెదిరింపులు
బెంగళూరు: గుర్తు తెలియని వ్యక్లి నుంచి కర్ణాటక హైకోర్టు జడ్జీలకు బెదిరింపులు అందాయి. హైకోర్టులోని ఓ ఉద్యోగితోపాటు పలువురు న్యాయమూర్తులను చంపేస్తామని ఓ పలు నెంబర్ల నుంచి వాట్సాప్ మెసెజ్లు వచ్చాయి. దీనిపై హైకోర్టు ప్రెస్ రిలేషన్స్ అధికారి(పీఆర్ఓ) కే మురళీధరన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా జూలై 12న రాత్రి 7 గంటలకు ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి మురళీ ధరన్ వాట్సాప్కు మెసెజ్ వచ్చిన్నట్లు పోలీసులు తెలిపారు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో వచ్చిన ఈ మెసెజ్లో తనతోపాటు హైకోర్టులోని ఆరుగురు జడ్జిలను చంపేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఆరుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ మహ్మద్ నవాజ్, జస్టిస్ హెచ్టి నరేంద్ర ప్రసాద్, జస్టిస్ అశోక్ జి నిజగన్నవర్ (రిటైర్డ్), జస్టిస్ హెచ్పి సందేశ్, జస్టిస్ కె నటరాజన్, జస్టిస్ బి వీరప్ప (రిటైర్డ్) ఉన్నారు. కాగా బెదిరింపులు వచ్చిన నెంబర్ను మురళీధరన్కు హైకోర్టు అధికారికంగా అందించిందని తెలిపారు. పాకిస్థాన్లోని బ్యాంకు ఖాతాకు ₹ 50 లక్షలు చెల్లించాలని లేదంటే.. ఈ లిస్ట్లో పేర్కొన్న వారిని దుబాయ్ గ్యాంగ్ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మెసెజ్లో ఐదు అనుమానాస్పద మొబైల్ ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయని చెప్పారు. మురళీధరన్ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్లు 506, 507, 504, ఐటీ చట్టంలోని 75, 66(ఎఫ్) సెక్షన్ల కింద సెంట్రల్ CEN పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: ఫేస్బుక్ ప్రియుడి కోసం పాకిస్థాన్కు .. నన్ను సీమాతో పోల్చకండి! -
అవునని తెలిసీ... కాదని అంటాం!
‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు... వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు ‘క్యాస్ట్ ప్రైడ్’ రచయిత మనోజ్ మిత్తా. కులహత్యలు జరిగినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు. కులం గురించి, అది మన వ్యవస్థలలోకి చొరబడిన విద్వేష మార్గం గురించి నాకు మరీ అంతగా తెలియదు. అదృష్టవశాత్తూ మనోజ్ మిత్తా రాసిన ‘క్యాస్ట్ ప్రైడ్: బ్యాటిల్స్ ఫర్ ఈక్వాలిటీ ఇన్ హిందూ ఇండియా’ నా చేతికి అందింది. దట్టమైన పుస్తకం అది. పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అడవిని చూడలేనంతగా చెట్ల కింద కూరుకుపోయినట్లుగా ఉంది. అయితే మీరు గొప్ప పట్టుదలను కలిగి ఉంటే కనుక చదవదగిన పుస్తకమే అనిపిస్తుంది. ఏమైనా, మనోజ్ తనకు తానుగా సత్యాన్ని గుర్తించాడని కనిపెట్టినప్పుడు మొదట నా ముఖంపై చిరునవ్వు వెలసింది. ‘‘1984లో సిక్కుల ఊచకోత, 2002లో ముస్లింలపై జరిగిన మారణకాండల మీద పుస్తకాలు రాశాక, మూడో పుస్తకాన్ని భారతదేశంలోని సామూహిక హింసపై రాయాలన్నది నా అసలు ప్రణాళిక. దళితుల హత్యలపై దృష్టి పెట్టాలన్నది నా ఉద్దేశం’’ అంటాడు మనోజ్. అయితే ఏడేళ్ల పరిశోధన తర్వాత అతడు తెలుసుకున్నది ఏమిటంటే, ఇంకా చాలా కథే ఉందని! ‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు, పునర్విచారణ న్యాయ నిర్ణేతలు వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు మనోజ్. అతడి ఈ గ్రహింపు సూటిగా ఉన్నది, సరళమైనది, బాధతో కూడినది. కులహత్యలు జరిగినప్పుడు, కుల మారణ కాండలు సంభవించినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా కూడా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘అత్యంత స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు. కుల వివాదాలను, కుల దౌర్జన్యాలను అదుపులోకి తెచ్చేందుకు 1816–2019 మధ్య ఏ విధమైన ప్రయత్నాలు జరిగాయో తెలిపే వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘‘అంటరానితనం నిర్మూలనకు అంటూ 1950లో ఏదైతే ప్రయత్నం జరిగిందో అది... అప్పటికే అంటరానితనం నుంచి విముక్తి పొంది ఉన్నవాళ్లపై మరింతగా దిగ్భ్రాంతి కరమైన హింసాత్మక చర్యలకు ఆధిపత్య కులాలవారిని ప్రేరేపించి, సామూహిక హత్యలు అనే ఒక కొత్త దురాగతాన్ని కనిపెట్టేందుకు వారు పాల్పడేంతగా వ్యతిరేకతకు కారణమైంది’’ అని మనోజ్ రాశారు. 1968లో తమిళనాడులోని కీలవేణ్మణిలో తొలిసారి అటువంటి సామూహిక హత్యలు జరిగాయి. మనోజ్ పేర్కొన్న దారుణాలలో నేను బాగా గుర్తెరిగినది బెల్చి హత్యాకాండ. అది జరిగినప్పుడు నా వయసు 22. ఆ భయానక ఊచకోతకు లండన్ నుంచి వెలువడే ‘ది స్పెక్టేటర్’ పత్రిక ‘ది హంటింగ్ ఆఫ్ హరిజన్’ అనే శీర్షికను పెట్టడం కన్నా కూడా నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉన్నది... ఇందిరా గాంధీ చూపిన చొరవ. అర్ధరాత్రి సమయంలో రుతుపవనాలు కుండపోతగా కురుస్తున్నప్పుడు మావటి వెనుక ఏనుగుపై కూర్చొని, ఆ చీకట్లో తనను అంతా గుర్తించగలిగేలా టార్చిలైట్ల వెలుగులో బెల్చి చేరుకోవడం. ‘‘ఆ విధంగా చేయడం ద్వారా ఆమె జనాదరణను ఒడిసి పట్టుకున్నట్లయింది’’ అంటాడు మనోజ్. ఈ పుస్తకం ద్వారా తప్ప... ఇంతవరకు నాకు తెలియందీ, నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందీ, ‘‘కులపరమైన హత్యలు జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించిన మొట్టమొదటి, బహుశా ఏకైక జాతీయ నాయకురాలు ఇందిరాగాంధీ’’ కావడం. మన తాజా రాజకీయాలపై, నిజానికి ఇప్పటి మన ప్రజాస్వామ్యంపై ఎంత కఠోర వ్యాఖ్య! మనల్ని బాధించే విషాదాలపై మన పాలకులు ఎలా çస్పందిస్తున్నారనే దానిపైన కూడా ఇది కచ్చితమైన వ్యాఖ్య. అయితే మనోజ్ ఉద్దేశం ఇందిరాగాంధీ చొరవ గురించి చెప్పడం కాదు. బెల్చి ఘటనను మన వ్యవస్థ ఒక కులద్వేష దురాగతంగా అంగీకరించడానికి ఎందుకు ఇష్టపడలేదన్న ప్రశ్నను లేవనెత్తడం. నాడు హోమ్ మంత్రిగా ఉన్న చరణ్సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ... ‘‘ఈ ఘటనకు కుల, మత, భూ తగాదాలు గానీ, రాజకీయాలు గానీ కారణం కాదు. కొన్ని పత్రికల్లో వచ్చిన విధంగా సమాజంలోని బలహీన వర్గాలపై జరిగిన దౌర్జన్యం కూడా కాదు’’ అని ప్రకటించారు. జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ధన్ చైర్మన్గా ఉన్న పార్లమెంటరీ కమిటీ చరణ్ సింగ్తో తీవ్రంగా విభేదించింది కానీ, అది కుల దురాగతమేనని ఆయన్ని ఒప్పించలేకపోయింది. చరణ్ సింగ్ చేసినటువంటి ఖండన ప్రకటనలు దాదాపు ప్రతిసారి కూడా మన ప్రతిస్పందనల్ని వికలపరుస్తాయని మనోజ్ వాదిస్తాడు. అగ్రవర్ణాలవారు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తిరస్కరిస్తారు. అది ప్రతి దశలోనూ జరుగుతుంది. పోలీసులు, దర్యాప్తు అధికారులు సహకరించుకోవడం, బలహీనమైన న్యాయ విచారణ, వాదనలు, తీర్పులు, సుప్రీంకోర్టుకు చేరిన పునర్విచారణల నిర్వహణలో సైతం ఈ అగ్రవర్ణ భావన పని చేస్తుందని మనోజ్ అంటాడు. ఆఖరికి మనమెంతో గొప్పగా భావించే నాయకుల గురించి కూడా మనోజ్ చేసిన వ్యాఖ్యలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ‘‘ఈ నిర్దిష్ట సందర్భంలో ఎల్లవేళలా మహాత్ముడిలా కనిపించరు’’ అని గాంధీ గురించి, ‘‘కుల సంస్కరణలను ఆయన ప్రతిఘటించలేదు, లేదా పెద్దగా వాటి కోసం ప్రయత్నించనూ లేదు. ఆయనది అతిథి పాత్ర మాత్రమే’’ అని నెహ్రూ గురించి, చివరికి అంబేడ్కర్ గురించి కూడా – నేను ఎక్కువ వివరాలు ఇవ్వను గానీ– ‘‘ఆయన కథేమీ ఆశ్చర్యాలు లేనిదైతే కాదు’’ అని అంటూ... ‘‘స్వాతంత్య్ర సమరయోధులు తప్పనిసరిగా సమానత్వ ఉద్యమశీలురు కావాలనేముంది?’’ అని ముగిస్తాడు మనోజ్. పుస్తకం గురించి నా ఏకైక విమర్శ ఏమిటంటే... చదివేందుకు ఇది కొంచెం తేలికగా ఉండవలసిందనీ, పేజీలు పొంగిపొర్లేలా వివరాలు ఇవ్వడం వల్ల పుస్తకంలో ప్రధాన సందేశాన్ని తరచు అవి మరుగున పడేస్తున్నాయనీ. అయినప్పటికీ అది మనం వినవలసిన, మనం గుర్తుంచుకోవలసిన సందేశమే. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ భూయాన్, జస్టిస్ ఎస్వీ భట్టి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, ప్రస్తుతం కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టిలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో మూడు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాల్సి ఉండడంతో కొలీజియం ఇటీవల సమావేశమైంది. కేరళ సీజే ఎస్.వెంకటనారాయణ భట్టి, తెలంగాణ సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పేర్లను కొలీజియం ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్లు సుప్రీంకోర్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తులుగా సీనియారిటీ, మెరిట్, పనితీరు వంటి అంశాలతోపాటు హైకోర్టుల ప్రాతినిధ్యం, అట్టడుగు వర్గాలు, సమాజంలో వెనకబడిన వర్గాలు, లింగ వైవిధ్యం, మైనారిటీల ప్రాతినిధ్యం వంటివి మూల్యాంకనం చేసి ఈ ఇద్దరు న్యాయమూర్తులను సిఫార్సు చేసినట్లు పేర్కొంది. 2022 ఆగస్టు నుంచి సుప్రీంకోర్టులో ఏపీకి ప్రాతినిధ్యం లేదు. ఈ నేపథ్యంలో మాతృ హైకోర్టు అయిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తుల్లో సీనియర్ అయిన జస్టిస్ భట్టిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. సమగ్రత, సామర్థ్యం ఉన్న న్యాయమూర్తి భుయాన్ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ చట్టంలోని విభిన్న అంశాలపై అనుభవం సంపాదించారని సుప్రీంకోర్టు కొలీజియం పేర్కొంది. లా ఆఫ్ టాక్సేషన్లో ఆయన ఎంతో నైపుణ్యం ఉన్నవారని తెలిపింది. బొంబాయి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో ట్యాక్సేషన్ సహా పలు కేసులు సమర్థంగా డీల్ చేసిన ఆయన సమగ్రత, సామర్థ్యం ఉన్న న్యాయమూర్తి అని పేర్కొంది. జస్టిస్ భుయాన్ 2011 అక్టోబరు 17న గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ భట్టి అనుభవం అపారం ఏపీ, కేరళ హైకోర్టుల్లో సుదీర్ఘకాలం పనిచేసిన జస్టిస్ భట్టి చట్టంలోని పలు అంశాలపై అపార అనుభవం సంపాదించారని సుప్రీంకోర్టు కొలీజియం పేర్కొంది. జస్టిస్ భట్టి తీర్పులే ఆయన న్యాయపరమైన యోగ్యతకు నిదర్శనమని తెలిపింది. జస్టిస్ భట్టి జ్ఞానం, అనుభవం సుప్రీంకోర్టుకు అదనపు విలువ అందిస్తాయని పేర్కొంది. జస్టిస్ ఎస్.వి.భట్టి 1962 మే 6న చిత్తూరు జిల్లా మదనపల్లెలో జన్మించారు. తల్లిదండ్రులు రామకృష్ణయ్య, అన్నపూర్ణమ్మ. మదనపల్లెలోని గిరిరావు థియోసోఫికల్ హైస్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన ఆయన బీసెంట్ థియోసాఫికల్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. బెంగళూరులోని జగద్గురు రేణుకాచార్య కాలేజీ నుంచి లా డిగ్రీ పొంది, 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఇ.కళ్యాణ్రామ్ వద్ద న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, బీహెచ్ఈఎల్, బీఈఎల్, బీహెచ్పీవీ, ఆర్ఎస్వీపీ, నేషనల్ మారిటైం యూనివర్సిటీలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2000 నుంచి 2003 వరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా అప్పటి అడ్వొకేట్ జనరల్కు సహాయ సహకారాలు అందించారు. 2013 ఏప్రిల్ 12న అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 2019లో ప్రమాణం చేశారు. అదే ఏడాది జస్టిస్ భట్టిని కేరళ హైకోర్టుకు బదిలీ చేస్తూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, న్యాయమూర్తులు జస్టిస్ సిక్రీ, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణమిశ్రాలతో కూడిన కొలీజియం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 24న కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, జూన్ 1న పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్ రావు, జస్టిస్ భట్టి
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులుగా పదోన్నతి పొందారు. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మామిడాన సత్యరత్న శ్రీరామచంద్రరావు హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులయ్యారు. కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ సారస వెంకటనారాయణ భట్టి అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కేంద్ర న్యాయ శాఖ ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్లు జారీ చేసింది. హైదరాబాద్కు చెందిన జస్టిస్ రావు 2021లో జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు కొంతకాలం పాటు తాత్కాలిక సీజేగా సేవలందించారు. జస్టిస్ భట్టి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లె. వీరితో పాటు మరో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ విజయ్కుమార్ గంగాపూర్వాలా (మద్రాస్ హైకోర్టు), జస్టిస్ రమేశ్ దేవకీనందన్ ధనూకా (బాంబే హైకోర్టు), జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి (రాజస్తాన్) కూడా పదోన్నతి పొందారు. జస్టిస్ ధనూకా ఈనెల 30న రిటైరవుతున్నారు. -
హైకోర్టుకు వేసవి సెలవులు
సాక్షి, అమరావతి: హైకోర్టుకు ఈనెల 15 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి జూన్ 13న ప్రారంభమవుతాయి. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్ కోర్టులు ఏర్పాటయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటుచేశారు. రెండు దశల్లో ఈ వెకేషన్ కోర్టులు పనిచేస్తాయి. హైబ్రిడ్ (భౌతిక, ఆన్లైన్) విధానంలో కేసులను విచారిస్తారు. మొదటి దశ వెకేషన్ కోర్టులు మే 16 నుంచి 26 వరకు పనిచేస్తాయి. రెండో దశ కోర్టులు మే 27 నుంచి జూన్ 12 వరకు పనిచేస్తాయి. ఈ వెకేషన్ కోర్టుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు, బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు, సెలవులు పూర్తయ్యేంత వరకు వేచిచూడలేనటువంటి అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే, సర్వీసు సంబంధిత కేసులు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టానికి సంబంధించిన కేసులను అత్యవసరం అయితే తప్ప విచారించబోమని పేర్కొంది. అలాగే, సీఆర్పీసీ సెక్షన్ 482, అధికరణ 226 కింద ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లను కొట్టేయాలంటూ దాఖలుచేసే వ్యాజ్యాలను ఈ వేసవి సెలవుల్లో విచారించబోమని తెలిపింది. వెకేషన్ కోర్టుల్లో జడ్జిలు వీరే.. ఇక మొదటి దశ వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ బీఎస్ భానుమతి, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉంటారు. ఇందులో జస్టిస్ భానుమతి, జస్టిస్ రవీంద్రబాబు ధర్మాసనంలో.. జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. మొదటి వెకేషన్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేయాలనుకునే వారు మే 16వ తేదీన దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తులు మే 18న విచారణ జరుపుతారు. అలాగే, మే 30న వ్యాజ్యాలు దాఖలు చేస్తే జూన్ 1న విచారణ ఉంటుంది. జూన్ 6న పిటిషన్లు దాఖలు చేస్తే వాటిపై న్యాయమూర్తులు జూన్ 8న విచారణ జరుపుతారు. రెండో వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ దుప్పల వెంకటరమణ, జస్టిస్ వి.గోపాలకృష్ణరావు ఉంటారు. ఇందులో జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ గోపాలకృష్ణరావు ధర్మాసనంలో.. జస్టిస్ దుప్పల వెంకటరమణ సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. జూన్ 8న విచారణ జరిపే ధర్మాసనానికి న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య నేతృత్వం వహిస్తారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు నోటిఫికేషన్ జారీచేశారు. -
దాని గురించి మాట్లాడను! 'అదంతా మైండ్గేమ్': న్యాయశాఖ మంత్రి
కేంద్ర న్యాయశాఖ మంత్రి కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఈ మేరకు రిజిజ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియమాకానికి సంబంధించి ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న సుప్రీం కోర్టు కొలీజియంకి సంబంధించిన సిఫార్సులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కొలీజియం ఇష్యూ అంతా మైండ్గేమ్గా అభివర్ణించారు. దీనిపై తాను మాట్లాడనని కూడా చెప్పారు. ఈ మేరకు అరుణాచల్ ప్రదేశ్లో 4జీ సేవల కోసం 254 మైబెల్ టవర్లను అంకితం చేసే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రిజిజు మాట్లాడుతూ..కఠినమైన భూభాగాలను కలిగిన సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత స్థానికులకు ప్రధాన సమస్యగా ఉందన్నారు. రిజిజు అరుణాచల్ ప్రదేశ్లోని తపిర్ గావో లోక్సభకు ప్రాతినిధ్యం వహస్తున్నారు. కాగా, ఆయన కొలీజియంని మన రాజ్యాంగానికి విరుద్ధమైనదిగా కూడా పిలివడం గమనార్హం. (చదవండి: ఇది నిజం మాట్లాడినందుకు చెల్లిస్తున్న మూల్యం! రాహుల్ గాంధీ) -
జడ్జీల సెర్చ్ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలి
-
216 జడ్జీల పోస్టుల భర్తీకి సిఫారసులు రాలేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో మొత్తం 334 జడ్జీల పోస్టులు ఖాళీలుండగా 118 పోస్టుల భర్తీ కోసం హైకోర్టు కొలీజియంల నుంచి అందిన సిఫారసులు వివిధ దశల్లో పరీశీలనలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మరో 216 జడ్జీల పోస్టులకు హైకోర్టుల కొలీజియంల నుంచి సిఫారసులు అందాల్సి ఉందని వివరించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు గురువారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మార్చి 10వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో ఖాళీలు లేవన్నారు. 25 హైకోర్టుల్లో మంజూరైన 1,114 జడ్జీ పోస్టులకు గాను 334 ఖాళీలున్నాయన్నారు. జడ్జీ పోస్టుల ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ అని వివరించారు. -
తెనాలిలో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ప్రారంభం
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని కోర్టు భవనాల సముదాయంలో నూతనంగా నిర్మించిన ‘చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు’ ను బుధవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వడ్డిబోయిన సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప హాజరయ్యారు. జస్టిస్ దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ..మైనార్టీ తీరని మహిళలపై జరిగే అత్యాచారాలను అత్యంత త్వరితగతిన విచారణ జరిపించి బాధితులకు న్యాయం, నేరస్తులకు తగిన శిక్ష పడేలా చూడాలని అటు ప్రభుత్వం, ఇటు న్యాయస్థానాలు భావిస్తున్నాయని చెప్పారు. పోక్సో నేరాలను తీవ్రమైనవిగా పరిగణించి సత్వర న్యాయం చేయాలన్న సంకల్పంతో సాధ్యమైనన్ని ఎక్కువ పోక్సో కోర్టులను అవసరమైన ప్రదేశాల్లో నెలకొల్పుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే గుంటూరులో పోక్సో కోర్టు ఉన్నప్పటికీ తెనాలిలో కూడా మరో పోక్సో కోర్టును ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. ఇక్కడ 16 మండలాలకు సంబంధించిన పోక్సో కేసులను విచారణ చేస్తారని చెప్పారు. -
జడ్జీల జీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేస్తారా?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) ఖాతాలను నిలిపివేశారని పేర్కొంటూ పాట్నా హైకోర్టు న్యాయమూర్తులు దాఖలు చేసిన విజ్ఞప్తి పట్ల సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఏడుగురు జడ్జీల జీపీఎఫ్ ఖాతాలను క్లోజ్ చేశారని వారి తరపు న్యాయవాది పేర్కొన్నారు. దీనిపై సాధ్యమైనంత త్వరగా విచారణ ప్రారంభించాలని కోరారు. న్యాయమూర్తుల జీపీఎఫ్ ఖాతాలను మూసేయడం ఏమిటని సీజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చదవండి నా తండ్రిని రక్షణ శాఖ కార్యదర్శిగా... ఇందిర తొలగించారు -
సుప్రీంకోర్టులో మరో ఇద్దరు జడ్జీల నియామకం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో మరో ఇద్దరు జడ్జీలు నియమితులయ్యారు. దీంతో, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్తో కలిపి మొత్తం 34 మంది న్యాయమూర్తులతో ఇక పూర్తిస్థాయి సామర్ధ్యంతో సర్వోన్నత న్యాయస్థానం పనిచేయనుంది. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్లను రాష్ట్రపతి నియమించారని శుక్రవారం న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజు ట్వీట్ చేశారు. ఈ నెల 13న వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. వీరి పేర్లను జనవరి 31వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులుండే కొలీజియంలో జస్టిస్ బిందాల్ పేరుపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అయితే, జస్టిస్ కుమార్ పేరుపై కొలీజియంలోని జస్టిస్ కేఎం జోసెఫ్ విభేదించినట్లు సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపరిచిన వివరాలను బట్టి తెలుస్తోంది. తాజాగా జస్టిస్ బిందాల్, జస్టిస్ కుమార్ల నియామకంపై డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, కేంద్ర న్యాయశాఖ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. గత వారం సుప్రీంకోర్టుకు ఐదుగురు జడ్జీలు నియమితులైన విషయం తెలిసిందే. అయితే, వచ్చే మే–జూలై నెలల మధ్యలో సుప్రీంకోర్టులోని ఆరుగురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. -
ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా నియమితులైన ఐదుగురు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్, పాట్నా, మణిపూర్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు జస్టిస్ మనోజ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన కొలీజియం పంపిన సిఫారసులకు కేంద్రం తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో సుప్రీంకోర్టులో కొత్తగా శనివారం ఐదుగురు జడ్జిలు నియమితులయ్యారు. ఫలితంగా సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య సీజేఐతో కలిపి ప్రస్తుతమున్న 27 నుంచి 32కు చేరనుంది. అత్యున్నత న్యాయస్థానంలో వాస్తవంగా 34 మంది జడ్జీలు ఉండాల్సింది. న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలపడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా మరో ఐదుగురు న్యాయమూర్తులు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫారసు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పేర్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. అనంతరం ఈ ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపింది. ప్రెసిడెంట్ ద్రౌపదిముర్ము కూడా దీనిపై సంతకం చేయడంతో సుప్రీంకోర్టుకు కొత్త న్యాయమూర్తుల నియామక ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. సుప్రీంకోర్టుకు కొత్తగా నియమించిన న్యాయమూర్తులు వీరే. జస్టిస్ పంకజ్ మిత్తల్, రాజస్థాన్ హైకోర్టు సీజే. జస్టిస్ సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు సీజే. జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, మణిపూర్ హైకోర్టు సీజే. జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా, పాట్నా హైకోర్టు జడ్జి. జస్టిస్ మనోజ్ మిశ్రా, అలహాబాద్ హైకోర్టు జడ్జి. కొలీజియం సిఫారసు మేరకు ఐదుగురు నూతన న్యాయమూర్తులను త్వరలోనే నియమిస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు శుక్రవారమే తెలిపింది. ఆ మరునాడే నియామక ప్రక్రియ పూర్తి చేసింది. కేంద్రం కావాలనే న్యాయమూర్తలు నియామక ప్రక్రియను ఆలస్యం చేస్తోందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో త్వరలోనే పక్రియ పూర్తి చేస్తామని కేంద్రం చెప్పింది. చదవండి: పెండింగ్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్.. కట్టేందుకు ఎగబడ్డ జనం -
న్యాయ విచారణలో రాజకీయ వ్యాఖ్యలు అవాంఛనీయం
సాక్షి, అమరావతి: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిపై ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, తమకు అపార గౌరవం ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ నొక్కి వక్కాణించారు. ఏదైనా ఉంటే తీర్పులో రాస్తే దాన్ని గౌరవంగా అమలు చేస్తామని తెలిపారు. తీర్పుపై విభేదిస్తే అప్పీల్ చేస్తామన్నారు. కానీ, ఇలా చేయకుండా జడ్జి రాజకీయ పార్టీల మాదిరిగా మాట్లాడుతూ.. ఎల్లో మీడియా, దుష్ట చతుష్టయానికి ఉపయోగపడేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయ పార్టీల మాదిరిగా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేస్తే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ స్ఫూర్తిని, న్యాయవ్యవస్థ గౌరవాన్ని ఏ విధంగా కాపాడుకున్న వాళ్లమవుతామని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మాణిక్య వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల హైకోర్టులో ఒక న్యాయమూర్తి చేస్తున్న వ్యాఖ్యలకు ఎల్లో మీడియా తనదైన వక్రభాష్యం చెబుతూ కథనాలు అచ్చేస్తోందన్నారు. న్యాయ వ్యవస్థను పక్కదారి పట్టించి, తమకు కావాల్సిన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ వ్యాఖ్యలను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయన్నారు. ఇటీవల ఒక న్యాయమూర్తి కోర్టులో లేని అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికలు తొందరగా వస్తాయని వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. అందులో ఆయన ఉద్దేశం ఏమిటో తమకు అర్థం కావడం లేదన్నారు. న్యాయమూర్తి వ్యాఖ్యలపై వెంటనే అడ్వొకేట్ జనరల్ స్పందించి.. ఎన్నికలు నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని తేల్చిచెప్పారన్నారు. ఆ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కోర్టులో వాదనలు జరిగేటప్పుడు న్యాయమూర్తులు వ్యక్తిగతంగా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని హైకోర్టుకు ఆయన విన్నవించారు. వాదనల సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు, విద్రోహశక్తులకు ఉపయోగపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టుల్లో ఉన్న రాజధాని అంశంపై వ్యాఖ్యలా? రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించాలని న్యాయమూర్తులకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సూచించారని మాణిక్యవరప్రసాద్ గుర్తుచేశారు. ఇటీవల చెన్నై కోర్టు ఒక కేసులో ఎన్నికల సంఘంపై హత్య కేసు నమోదు చేయాలని ఆదేశించడంపై సుప్రీంకోర్టు.. అలా పరిధి దాటి మాట్లాడకూడదని చెన్నై కోర్టుకు దిశానిర్దేశం చేసిందన్నారు. ఏపీకి రాజధాని ఎక్కడో తెలియదని తన కుమార్తె అన్నారని ఇటీవల ఓ న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తుచేశారు. రాజధాని అంశంపై హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ సాగుతోందని, ఈ సమయంలో దానిపై వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. ఆ వ్యాఖ్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలి.. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీల సంక్షేమం, అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వంపై కొన్ని రాజకీయ పార్టీలు, ఎల్లో మీడియాకు ఉపయోగపడేలా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు వాంఛనీయం? సబబు? అని మాణిక్య వరప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ పార్టీలకు ఎన్నో లక్ష్యాలు ఉంటాయని.. వాటి సాధనలో ఆ పార్టీలే మార్గాలు చూసుకుంటాయని తెలిపారు. వాటికి మీ సహకారం అవసరమా... అనేది ఆలోచించుకోవాలన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజకీయ వ్యాఖ్యలు చేయడంపై న్యాయమూర్తి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: గుంటూరు: డిగ్రీలు లేని పరిశోధకుడు.. 500 అదృశ్య గ్రామాలను గుర్తించి.. -
సుప్రీం జడ్జీలుగా ఐదుగురికి పదోన్నతి
న్యూఢిల్లీ: పేరుకుపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం మరో ముందడుగు వేసింది. ఐదుగురు హైకోర్టు జడ్జీలను సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అంతకుముందు ఢిల్లీలో మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమైంది. ఆ తర్వాత సంబంధిత జడ్జీల పేర్ల జాబితాను కేంద్రానికి పంపింది. ఈ వివరాలను సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో పొందుపరిచింది. రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ పంకజ్ మిట్టల్, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్, పట్నా హైకోర్టులో మరో జడ్జి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ మిశ్రాలను సుప్రీంకోర్టులో జడ్జీలుగా ఎంపికచేయాలంటూ కేంద్రానికి సిఫార్సుచేసింది. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 33కు పెరుగుతుంది. మరోవైపు, ఉత్తరాఖండ్ హైకోర్టులో జడ్జి జస్టిస్ సంజయకుమార్ మిశ్రాను జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గువాహటి హైకోర్టు జడ్జి ఎన్ కోటీశ్వర్ సింగ్ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ను గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుచేసింది. -
హైకోర్టు ‘గడువుల’పై సుప్రీం స్టే
రాజధాని ఫలానా ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి లేదు. అది ప్రభుత్వ పరిధిలోని అంశం. ఇలాంటి వ్యవహారాల్లో కూడా కోర్టులు జోక్యం చేసుకుంటుంటే, ఇక ప్రజా ప్రతినిధులెందుకు? మంత్రి వర్గం ఎందుకున్నట్లు? – సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో నిర్మించి, అభివృద్ధి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపేసింది. అలాగే రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ తదితర ప్రాథమిక మౌలిక సదుపాయాలతో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియను నెల రోజుల్లో పూర్తి చేయాలన్న ఆదేశాన్ని కూడా సుప్రీంకోర్టు నిలిపేసింది. అంతేకాక అన్ని మౌలిక సదుపాయాలతో నివాసయోగ్యమైన రీతిలో ప్లాట్లను అభివృద్ధి చేసి వాటిని మూడు నెలల్లో ల్యాండ్ పూలింగ్ కింద భూములిచ్చిన భూ యజమానులకు అప్పగించాలన్న ఆదేశాన్ని సైతం సుప్రీంకోర్టు స్టే చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అమరావతి రైతులకు, రైతు సంఘాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదని చెప్పిన హైకోర్టు తీర్పుపై జనవరి 31న లోతుగా విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త చట్టాన్ని తెస్తే, ప్రస్తుత వ్యాజ్యాలన్నీ నిరర్థకం అవుతాయి కదా! అందుకనే ఈ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా తేలుస్తాం’’ అని న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బివీ.నాగరత్నంతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పలు సందర్భాల్లో విస్మయం వ్యక్తం చేసింది. పలు ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటిషన్ రాజధాని నగరాన్ని మార్చే లేదా రాజధానిని విభజించే లేదా మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో తీర్మానం, చట్టం చేసే శాసనాధికారం రాష్ట్రానికి లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న తీర్పునిచ్చింది. అలాగే హైకోర్టుతో సహా శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలను ఏపీ సీఆర్డీఏ చట్టం, ల్యాండ్ పూలింగ్ నిబంధనల కింద నోటిఫై చేసిన ప్రాంతంలో తప్ప మరో చోటుకి మార్చే అధికారం కూడా రాష్ట్రానికి లేదని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. వీటితో పాటు రాజధాని నగర, రాజధాని ప్రాంత అభివృద్ధి, నిర్మాణం విషయంలో పలు కాల పరిమితులను నిర్ధేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఇలా చేయకపోవటం కోర్టు ధిక్కారమేనని పేర్కొంటూ కొందరు రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. మనుగడలోని లేని చట్టం ఆధారంగా హైకోర్టు తీర్పునిచ్చింది... ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, పాలన వికేంద్రీకరణ కోసం ఉద్దేశించిన చట్టం రద్దయిందని, అలా రద్దయిన తరవాత కూడా అది ఉన్నట్లుగా భావించి హైకోర్టు తీర్పునిచ్చిందని, అలా ఎలా చేస్తుందని ప్రశ్నించారు. న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ జోక్యం చేసుకొని రైతులకు, రాష్ట్రానికి మధ్య జరిగిన ఒప్పందం కొంత మేరకు మనుగడలో ఉంటుంది కదా అని అభిప్రాయపడ్డారు. ఒక నిర్దిష్ట పరిధిలో చట్టాన్ని ఆమోదించాలంటూ శాసనసభను హైకోర్టు ఆదేశించజాలదని, ఇదంతా అధికార విభజన పరిధిలోని వ్యవహారమని వేణుగోపాల్ తెలిపారు. ఒక చట్టం మనుగడలో లేనప్పుడు దాని శాసన యోగ్యతపై కోర్టు జోక్యం తగదన్నారు. ‘‘చట్టం రద్దు చేసినప్పుడు శాసనసభ తదుపరి ఏం చేస్తుందో న్యాయ వ్యవస్థ ఓపికతో చూడాలి. ఆపై శాసనసభ మరో చట్టాన్ని ఆమోదిస్తే దాని చెల్లుబాటును పరిగణించొచ్చు. కానీ చట్టమే లేనప్పుడు అది ఉన్నట్టే పరిగణనలోకి తీసుకున్నారు. ఇది చాలా చిత్రమైన అంశం. న్యాయస్థానాలు పూర్తిగా అకడమిక్ సమస్యల్లోకి వెళ్లజాలవవు’’ అని వేణుగోపాల్ తెలిపారు. రాజధాని నగరం అనే భావన రాజ్యాంగంలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలులో రాజధాని ఏర్పాటుకు సంబంధించి నిర్దిష్ట ప్రదేశం లేదని, రాజధాని అంటే ప్రభుత్వం తన మూడు శాఖల్లో దేనిలోనైనా పని చేసే స్థానం మాత్రమేనన్నారు. కార్యనిర్వాహక వ్యవహారాలు పూర్తిగా అధికార యంత్రాంగానికి సంబంధించిన సమస్య అని విన్నవించారు. హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది... నెల లోపు ఇది చేయండి అని ఆదేశించడం సులభమని, కాని దానిని ఆచరణలో పెట్టడం అసాధ్యమైన పనిగా వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సమయంలో జస్టిస్ జోసెఫ్ జోక్యం చేసుకుంటూ, ‘అమరావతిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు ఉన్నారుగా..! హైకోర్టు భవనం కూడా కట్టారు. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు అంటున్నారు. దీని సంగతి ఏమిటి? అని ప్రశ్నించారు. అదంతా అయిపోయిన అంశం అని వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు ముప్పు వాటిల్లుతుందని సహేతుకమైన భయాందోళనలున్నప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చు. కానీ హైకోర్టు ఆదేశాలు అనుమానమే బేస్గా ఇచ్చినట్లున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సమయంలో జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ,. ‘‘ఆంధ్రప్రదేశ్లో అధికారాలు వేర్వేరుగా లేవా? హైకోర్టు ఎందుకు కార్యనిర్వాహక అధికారాలను నిర్విర్తిస్తోంది? అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించడం కంటే మరిన్ని పట్టణ కేంద్రాలను కలిగి ఉండడం మంచిది కదా..? దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రమే కదా? హైకోర్టు కాదు కదా!. హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాక ఇరువురు న్యాయమూర్తులు కూడా, వేర్వేరు రాష్ట్రాల్లో అధికార వికేంద్రీకరణ గురించి న్యాయవాదులతో చర్చించారు. రైతుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ ఉంది... ఈ సమయంలో భూములిచ్చిన రైతుల గురించి జస్టిస్ జోసెఫ్ ఆరా తీశారు. రైతుల హక్కులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ఎస్. నిరంజన్రెడ్డి కోర్టుకు వివరించారు. చట్టంలో రైతుల ప్రయోజనాలను పరిరక్షించే ఏర్పాట్లున్నాయన్నారు. రైతుల నుంచి సేకరించిన భూమిని అభివృద్ధి చేయడానికి సంబంధించి ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని, అయితే కాలపరిమితి అనేది ప్రధానమైన అడ్డంకి అని ఆయన వివరించారు. అమరావతిని రాజధానిగా తొలగించలేదని, మూడు అధికార కేంద్రాల్లో అమరావతి కూడా ఒకటి అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో హైకోర్టు నిర్వహణ గురించి న్యాయమూర్తులు ఆరా తీశారు. హైకోర్టు గురించి చెప్పాలని జస్టిస్ జోసెఫ్ కోరగా.. అమరావతిలోనే నిర్వహణ సాగుతోందని నిరంజన్రెడ్డి తెలిపారు. హైకోర్టుపై ఎంత ఖర్చుచేశారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. సుమారు రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు నిరంజన్రెడ్డి తెలిపారు. హైకోర్టులో క్యాంటీన్ లేదట కదా..! న్యాయమూర్తులు, న్యాయవాదులు మధ్యాహ్నా సమయంలో భోజనం నిమిత్తం బయటకి వెళ్తున్నారట కదా! అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. హైకోర్టు పూర్తి స్థాయిలో పనిచేయాలంటే పూర్తి స్థాయి సౌకర్యాలు ఉండాలి కదా? అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం క్యాంటీన్ పూర్తిస్థాయిలో ఉందని నిరంజన్రెడ్డి తెలిపారు. పూర్తిస్థాయి వాదనల తరువాత దీనిపై నిర్ణయం... వేణుగోపాల్ వాదనలు కొనసాగిస్తూ.. సమాఖ్య నిర్మాణంలో రాజధానిని మార్చుకొనే అధికారం రాష్ట్రానికి ఉండదా? ఆ అధికారాన్ని హైకోర్టు తన ఆదేశాలతో నియంత్రించొచ్చా? అని ప్రశ్నించారు. జస్టిస్ జోసెఫ్ జోక్యం చేసుకొని రెండు సమస్యలు గుర్తించినట్లుగా పేర్కొన్నారు. శాసనసభ అధికారాలు, రైతుల సమస్య రెండింటినీ చూడాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికే రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం ఉందన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని వేణుగోపాల్ కోరారు. ఈ విషయంలో న్యాయాన్యాయాల జోలికి వెళ్లని సుప్రీంకోర్టు... పూర్తి స్థాయి వాదనల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. హైకోర్టు తప్పుగా పేర్కొంది... చట్టంలో ‘ఎ క్యాపిటల్’ అని ఉందని, అంటే ఒకే రాజధాని అని ఎలా భావిస్తారని ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వ్యాఖ్యానించారు. అమరావతిని రాజధానిగా కేంద్రం నిర్ణయించలేదని, కేంద్రం కేవలం నిపుణుల కమిటీని మాత్రమే వేసిందని ఆయన తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 ప్రకారం రాష్ట్ర రాజధానిని కేంద్రమే నిర్ణయిస్తుందని హైకోర్టు తప్పుగా పేర్కొందని వేణుగోపాల్ తెలిపారు. ఆర్టికల్ 4 ద్వారా సంక్రమించిన అధికారం కొత్త రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఒకసారి మాత్రమే వినియోగించగలిగేదని వేణుగోపాల్ ధర్మాసనం దృష్టికికి తీసుకొచ్చారు. శాసన అధికారాలకు మూలం ఏంటని జస్టిస్ జోసెఫ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.. కార్యనిర్వాహక అధికారం శాసన అధికారంతో సహా విస్తృతమైనదని, ముందుగా శాసన అధికారం కలిగి ఉండాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. క్యాపిటల్ అనే భావన అసలు రాజ్యాంగంలో లేదని, సమాఖ్య రాష్ట్రంలో పాలనలో కొంత భాగాన్ని కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా నిర్ణయించడానికి అనుమతి ఉంటుందని, కార్యనిర్వాహక అధికారాల నిర్వహణలో శాసన వ్యవస్థ ఎప్పుడైనా అడుగు పెట్టొచ్చని వేణుగోపాల్ తెలిపారు. ‘‘రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సమయంలో రాజ్యాంగపరమైన విషయాలపై నిర్ణయం తీసుకోవాలి. కానీ రోజువారీ కార్యకలాపాలు ఎలా నిర్వహించాంటూ రాష్ట్రం చేతులు కట్టుకుని న్యాయవ్యవస్థను అడగాలా? ఇది పూర్తిగా ఎగ్జిక్యూటివ్ అధికారాలకు విరుద్ధం కాదా?’’ అని వేణుగోపాల్ ప్రశ్నించారు. ఆర్టికల్ 162 రాష్ట్ర కార్యనిర్వాహక అధికార పరిధిని పరిశీలిస్తుంది కదా అని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించగా... కార్యనిర్వాహక అధికారం శాసన అధికారంతో కలిసి ఉంటుందని మాత్రమే ఆర్టికల్ 162 చెప్పిందని వేణుగోపాల్ తెలిపారు. అయితే, రాష్ట్రానికున్న శాసన అధికారాలతో విభజన చట్టాన్ని సవరించగలరా? అని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు. అలా చేయలేమని, విభజన చట్టం అనేది ఓ ప్రవేశిక అని వేణుగోపాల్ తెలిపారు. విభజన చట్టాన్ని సవరించడానికి పార్లమెంటుకు నిర్దిష్టమైన నిబంధనలున్నందున దాన్ని సవరించలేమని జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. రాజధానిని మార్చే అధికారం రాష్ట్రానికి లేదు... రైతుల తరఫు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. పార్లమెంటు చేసిన చట్టాన్ని ఓసారి చూడాలన్న ఆయన... ఒకసారి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశాక దాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. జస్టిస్ జోసెఫ్ జోక్యంచేసుకొని... చట్టంలో అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పలేదుగా? అని ప్రశ్నించారు. తొలుత హైదరాబాద్ రాజధానిగా పేర్కొన్నారని, తర్వాత కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ప్రత్యామ్నాయ రాజధానిని నిర్ణయించాలని సూచించిందని నారిమన్ పేర్కొన్నారు. అంటే ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పలేదుగా? అని జస్టిస్ జోసెఫ్ పేర్కొంటూ... రాజధాని ఒక ప్రాంతంలో అభివృద్ధి చెందాలని కూడా చెప్పలేమన్నారు. పార్లమెంటు ఒక రాజధాని అని మాత్రమే చెప్పిందని, కానీ ఇక్కడ మూడు రాజధానులు అంటున్నారని నారీమన్ తెలిపారు. రాజధాని ఎక్కడ ఉండాలో రాష్ట్రం నిర్ణయించగలదని జస్టిస్ జోసెఫ్ స్పష్టంచేశారు. దీనిపై పార్లమెంటు చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంటందని నారీమన్ తెలిపారు. లబ్ది చేకూరుతుందనే భూములిచ్చారు... రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు నిరంజన్రెడ్డి, శ్రీరామ్ జోక్యం చేసుకొంటూ రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 35, ఉమ్మడి జాబితాలోని ఎంట్రీ 20 ప్రకారం రాష్ట్రంలో పట్టణ, స్థానిక ప్రణాళికలకు సంబంధించి చట్టాలను రూపొందించడానికి శాసనసభ సమర్థనీయమైందని తెలిపారు. రైతుల తరఫు మరో సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపిస్తూ.. రైతులకు ప్రయోజనం చేకూరుతుందనే ల్యాండ్ పూల్కి అంగీకరించారన్నారు. 2020 నాటికి భూములు అభివృద్ధిలోకి తెస్తామని హామీ ఇచ్చారని, కానీ 2019 నుంచే మౌలికసదుపాయాల కల్పన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వదిలేసిందని శ్యాం దివాన్ తెలిపారు. మూడేళ్లుగా భూమిపై ఎలాంటి చర్యలు లేవన్నారు. కొన్ని ఫొటోలు చూపుతూ హైకోర్టు ఆవరణలో సౌకర్యాలు లేవని, సరైన రహదారులు లేవని, పాఠశాలలు లేవని, కానీ మిషన్ 2020 అని రైతులకు చెప్పారన్నారు. పరిపాలనలో భాగంగా పాలనపరమైన బ్లాకులను వేరే ప్రాంతాలకు మార్చే సామర్థ్యం రాష్ట్రానికి లేదని పేర్కొన్నారు. పాలనపరమైన బ్లాకులను మార్చడం ద్వారా నగరాన్ని నాశనం చేస్తున్నారన్నారు. హైకోర్టు విధించిన కాలపరిమితి అసాధ్యమని భావిస్తే తిరిగి హైకోర్టుకు వెళ్తే తగిన సమయం ఇస్తుందన్నారు. 2019 మే నుంచి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎందుకు చేయలేదో కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు. అసలు చట్టంలో రాజధాని నగరం అంటే ఏంటని జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించగా.. పరిపాలన ప్రాథమిక స్థానమని దివాన్ తెలిపారు. అలా అయితే మనకు ప్రజా ప్రతినిధులెందుకు..? ఇవన్నీ ఫలానా ప్రాంతంలో ఉండాలా? ఇవి చట్టానికి సంబంధించిన విషయాలా? అని న్యాయమూర్తి తిరిగి ప్రశ్నించారు.. జస్టిస్ బీవీ నాగరత్న స్పందిస్తూ.. అలా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం న్యాయస్థానానికి సంబంధించిన అంశం కాదు. అలాంటప్పుడు మనకు ప్రజా ప్రతినిధులు ఎందుకున్నారు? మంత్రి వర్గం ఎందుకు? అని ప్రశ్నించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాజధాని కాకుండా వేరే ప్రదేశంలో సెక్రటేరియట్ లేదా దానిలో కొంత భాగం ఉండాలని ప్రభుత్వం భావిస్తుండొచ్చుగా? జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. అమరావతి నుంచి విశాఖపట్నం, కర్నూలు ఎంత దూరమని న్యాయవాదిని ప్రశ్నించారు. విశాఖపట్నం సుమారు 500 కిలోమీటర్లు, కర్నూలు సుమారు 800 కిలోమీటర్లు అని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ఇది వికేంద్రీకరణలాగే ఉంది కదా! అని ధర్మాసనం అభిప్రాయపడింది. అందరి వాదనలు విన్న ధర్మాసనం, హైకోర్టు ఇచ్చిన తీర్పులోని పలు ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. అమరావతి రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశం పూర్తిగా అసంబద్ధం. అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆరు నెలల్లో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయడమేంటి? అసలు మీ ఉద్దేశంలో రాజధాని నగరమంటే ఏంటి? అన్నీ మౌలిక వసతులతో రాజధాన్ని ప్రాంతం మొత్తాన్ని నెల రోజుల్లో అభివృద్ధి చేయాలా? హైకోర్టు ఇలా ఎలా ఆదేశాలిస్తుంది. నగర నిర్మాణంలో హైకోర్టుకున్న నైపుణ్యమేంటి? హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? లేక చీఫ్ ఇంజనీరా? ఇలాంటి వ్యవహారంలో కోర్టులకు ఎలాంటి నైపుణ్యం ఉండదు. అందువల్ల నగర నిర్మాణం విషయంలో మేం ఏ రకంగానూ జోక్యం చేసుకోబోం. ఆంధ్రప్రదేశ్లో అధికారాలు వేర్వేరుగా లేవా? హైకోర్టు ఎందుకు కార్యనిర్వాహక విధులు నిర్వర్తిస్తోంది? అన్నింటినీ ఒకే చోట కేంద్రీకరించడం కంటే మరిన్ని పట్టణ కేంద్రాలను కలిగి ఉండడం మంచిదే కదా!!. ఈ విషయంలో నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే తప్ప, హైకోర్టుది కాదు. ఈ మొత్తం వ్యవహారంలో హైకోర్టు పరిధి దాటి వ్యవహరించింది. హైకోర్టు కార్య నిర్వాహక వ్యవస్థ ఎంత మాత్రం కాజాలదు. – సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నం ధర్మాసనం -
జడ్జిల బదిలీలను వివాదాస్పదం చేయడం సరికాదు: లాయర్లు
విజయవాడ: జడ్జిల బదిలీలను వివాదాస్పదం చేయడం సరికాదని ఏపీ హైకోర్టు లాయర్లు తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులకు కులాలు,మతాలు ఆపాదించడం తగదన్నారు. కొలీజియం నిర్ణయం మేరకే జడ్జిల నియామకాలు, బదిలీలు ఉంటయాన్నారు. జడ్జిల బదిలీల అంశానికి సంబంధించి సీఎం జగన్పై తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. అసలు కులాలు, మతాలతో రాజకీయం చేసేది చంద్రబాబేనని వారు స్పష్టం చేశారు. -
ముగ్గురు హైకోర్టు జడ్జీల బదిలీ!
సాక్షి, హైదరాబాద్: దేశంలో వివిధ హైకోర్టుల్లో పనిచేస్తున్న ఏడుగురు న్యాయమూర్తులను వేర్వేరు హైకోర్టులకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం గురువారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీరిలో తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ డా.డి.నాగార్జున్లతో పాటు ఆంధ్రపదేశ్ నుంచి జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేశ్లను ఇతర హైకోర్టులకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే తమిళనాడు(మద్రాస్) నుంచి మరో ఇద్దరు జడ్జీల బదిలీలకు సిఫార్సు చేసింది. తాజా సిఫార్సుల్లో గతంలో ప్రతిపాదించిన గుజరాత్ న్యాయమూర్తి జస్టిస్ నిఖిల్ ఎస్.కరియల్ పేరు లేకపోవడం గమనార్హం. కాగా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి కేంద్రం ఆమోదం తెలిపితే.. న్యాయమూర్తుల సంఖ్య 33 నుంచి 30కి తగ్గనుంది. మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా.. 12 స్థానాలు ఖాళీ ఉంటాయి. హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్(హెచ్సీఏఏ) నేతృత్వంలో న్యాయవాదులు జస్టిస్ అభిషేక్రెడ్డి బదిలీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆందోళనలు చేపట్టడటంతో పాటు ఢిల్లీకి వెళ్లి సీజేఐను కలసి విజ్ఞప్తి చేసినా ఆయన్ను బదిలీ చేయడం గమనార్హం. పలువురికి పదోన్నతి...: ఇదిలా ఉండగా, రాజస్తాన్ హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న అనిల్కుమార్ ఉప్మాన్, నుపుర్ భట్తో పాటు మరో ఆరుగురు జ్యుడీషియల్ అధికారులు రాజేంద్ర ప్రకాశ్ సోనీ, అశోక్కుమార్ జైన్, యోగేంద్రకుమార్ పురోహిత్, భువన్గోయల్, ప్రవీణ్ భట్నాగర్, ఆశుతోష్కుమార్లకు అదే హైకోర్టులో జడ్జీలుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. అలాగే ఛత్తీస్గఢ్ హైకోర్టులో అదనపు జడ్జీలుగా పనిచేస్తున్న జస్టిస్ నరేంద్రకుమార్ వ్యాస్, నరేశ్ కుమార్లను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించింది. -
మానవ హక్కులకు ప్రాణధార
‘చట్టాలు పేద వర్గాలను పీల్చి పిప్పి చేస్తూంటే, ధనిక వర్గం ఆ చట్టాలతోనే పెత్తనం చలాయిస్తూంది’ అన్నాడు గోల్డ్స్మిత్. ఆదర్శంలో ప్రతి ఒక్కరూ వారి స్థాయితో నిమిత్తం లేకుండా తమ ఫిర్యాదును న్యాయస్థానానికి నివేదించుకోగలగాలి. అందుకే జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ధోరణు లకు అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా గుర్తించవలసి వచ్చింది. కానీ ‘చట్టాలు సాలెగూడుల్లాంటివి. ఆ గూట్లోకి బలహీనమైన ప్రాణి దూరితే దాని కథ ముగిసినట్టే’ అన్నాడు సోలన్. అందుకే రాజ్యాంగంలోని 32వ అధికరణానికి ఉన్న పరిమితులను సైతం దృష్టిలో ఉంచుకుని మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న న్యాయమూర్తులు ఉన్నారు. అలాంటివారిలో... జస్టిస్ యతిరాజులు ఒకరు. ‘‘ఎంతటి సాధారణ పౌరుడైనా, జీవి తంలో అతడు ఏ స్థానంలో ఉన్నా, దానితో నిమిత్తం లేకుండా న్యాయస్థానంలో తన కేసును హుందాగా వినిపించే హక్కు అతనికి ఉంది. అంతే హుందా తనంతో కోర్టు అతని వాదనను సానుభూతితో వినే మర్యాదనూ పాటించాలి. ప్రజా సమస్యలను వినడానికే న్యాయస్థానాలు ఉన్నాయి. కోర్టులో న్యాయం కోసం వచ్చే పౌరుల్ని యాచకులుగానూ, పీడకులు గానూ చూడరాదు.’’ – 1988 షీలా బర్సీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు. ‘‘తీర్పు గుడ్డిది కావచ్చుగానీ, తీర్పరి (జడ్జి) గుడ్డివాడు కాకూడదు. – సుధాంశు రంజన్, సుప్రసిద్ధ జర్నలిస్టు, ‘జస్టిస్ వర్సెస్ జ్యుడీషియరీ’ గ్రంథం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, 2019 భారత రాజ్యాంగ సూత్రాలను, ‘భారత ప్రజలమైన మేము మాకుగా రూపొందించుకున్న సెక్యులర్ రాజ్యాంగాన్ని’ కంటికి రెప్పలా కాపాడుకునే హక్కు మాకు ఉందని రాజ్యాంగం పీఠికలోనే నిర్ద్వంద్వంగా ప్రకటించి ఉన్నందున అది ఎప్పటికీ అనుల్లంఘనీయ మని ప్రముఖ తెలుగు న్యాయమూర్తులలో ఒకరైన జస్టిస్ జి. యతి రాజులు చాటి చెప్పారు. రాజ్యాంగ అతిక్రమణ జరిగినప్పుడు ‘రాజ్యాంగ పరిహార’ హక్కును 32వ అధికరణం ప్రసాదిస్తోంది. భాగమైన 32వ అధికరణకు ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ– ఆ ఇబ్బందుల ఫలితంగా పాలక వర్గాలు, అధికారులు, పోలీసుల వల్ల సామాన్య ప్రజలు ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తోందో వివరించారు. ‘‘జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ధోరణులకు’’ అడ్డుకట్ట వేయవలసిన అవసరాన్ని సుప్రీం కోర్టు ఎందుకు గుర్తించవలసి వచ్చిందో జస్టిస్ యతిరాజులు పదే పదే ప్రస్తావించవలసి వచ్చింది (‘ఆర్టికల్ 32 అండ్ ద రెమెడీ ఆఫ్ కాంపె న్సేషన్’ పేరుతో రాసిన పుస్తకంలో). అయితే, దురదృష్టవశాత్తూ, కాదుకాదు, రాజ్యాంగ ఆదేశాల ఉల్లంఘనకు పాల్పడి పౌరహక్కుల అధ్యాయానికి తూట్లు పొడవడానికి అలవాటుపడిన పాలకవర్గాలు పౌరులకు ఉపయోగపడాల్సిన అధికరణలను ఆచరణలో అమలు కాకుండా చేసే యంత్రాంగాన్ని చొప్పించాయి. ఆదేశిక సూత్రాల లక్ష్యం సంక్షేమ రాజ్య స్థాపన. అవి అమలు జరగాలంటే వాటికి చట్టబద్ధత అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని విస్మరించరాదు. కొంతమంది వ్యక్తులకు సౌకర్యాల పేరిట కల్పించిన ప్రత్యేక హక్కులను అవసరమైతే సవరించయినా సరే ఆదేశిక సూత్రాలను అమలు జరపాలని కనీసం తొమ్మిది, పది కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది (1970–1987 మధ్యకాలంలో). రాజ్యాంగంలోని 32వ అధికరణ ప్రాధా న్యతను నొక్కి చెప్పడానికి జస్టిస్ యతి రాజులు ‘‘మానవ హక్కుల, ప్రాథమిక స్వేచ్ఛా స్వాతంత్య్రాల’’ రక్షణ ప్రాధాన్య తను ఉగ్గడించిన యూరోపియన్ కన్వెన్షన్ అధికరణలో పెక్కింటిని కూడా ఉదాహ రించారు. ఈ 32వ అధికరణ ఆసరాగానే పాలకులు ప్రత్యర్థులపై విధించే అక్రమ కేసుల నుంచి విడిపించే ‘హెబియస్ కార్పస్’ పిటీషన్ కూడా అమలులోకి రాగ ల్గింది! అలాంటి అధికారం ఉన్న 32వ అధిక రణను విధిగా అమలు జరిపే బాధ్యత నుంచి తప్పించి అమలు లోకి రాకుండా చేశారు. అలాంటి 32వ అధికరణ అమలు జరపడా నికున్న అడ్డంకులను ఛేదించిన జస్టిస్ యతిరాజులును న్యాయ శాస్త్రంలో ఉద్దండులైన పలువురు పాత తరం న్యాయ మూర్తులకు దీటైనవారిగా భావించవచ్చు. సుప్రసిద్ధ గోల్డ్స్మిత్ అన్నట్టు ‘‘చట్టాలు పేద వర్గాలను పీల్చి పిప్పి చేస్తూంటే, ధనిక వర్గం ఆ చట్టాలతోనే పెత్తనం చలాయిస్తూంది.’’ అయితే గతించిన శతాబ్దంలో ఏథెన్స్లో ధనికులకూ, పేదలకూ మధ్య దుర్భరమైన అంతరం ఏర్పడినప్పుడు రాచరిక కుటుంబీకుడైన సోలన్ రంగంలోకి దిగాడు. స్వయంగా ప్రజలకు ఆర్థిక బానిసత్వం నుంచి, అప్పుల నుంచి విముక్తి కల్పించాడు. జైళ్లపాలైన వారిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశాడు. పేదల్ని పిండి వసూలు చేసే పన్నులకు పన్నెండు రెట్లు ఎక్కువ పన్నును ధనిక వర్గాల నుంచి రాబట్టాడు. కోర్టులను ప్రజాబాహుళ్యం అవసరాలకు అనుగుణంగా సంస్కరిం చాడు. ఏథెన్స్ నగర రక్షణలో ప్రాణాలొడ్డిన వారి పిల్లలను పైకి తెచ్చి, ప్రభుత్వ ఖర్చుపైన విద్య చెప్పించాడు. ఈ సమూల సంస్కరణలకు ధనిక వర్గాలు భీషణమైన నిరసనలకు దిగాయి. అయితే ఇలా – ఒక తరం గడిచే లోగానే సోలన్ పెను సంస్కరణలు ఏథెన్స్ను విరుచుకు పడటానికి సిద్ధంగా ఉన్న విప్లవం నుంచి రక్షించాయి. అందుకే సెయింట్ అగస్తీన్ అన్నాడు: రాజ్యాలు, రాజ్యపాలకు లంటే ఎవరనుకున్నారు? పరమ ఘరానా దోపిడీదారులు, దోపిడీవర్గ సంస్థలు అన్నాడు (ది సిటీ ఆఫ్ గాడ్)! కనుకనే, సోలన్ ‘‘పాలకు డెవరో చెప్పండి – అతను చేసే చట్టం ఎలా ఉంటుందో నేను చెప్తా’’ అన్నాడు. ‘‘ఎందుకంటే చట్టాలు సాలెగూడుల్లాంటివి. ఆ గూట్లోకి బలహీనమైన ప్రాణి (పురుగు) దూరితే దాని కథ ఇక ముగిసి నట్టే. కానీ, ఎదిరించగల శక్తి ఉన్నది దూరితే అది నిభాయిం చుకుని బయటపడగల్గుతుంది’’ అని వివరించాడు. రాజ్యాంగంలోని 32వ అధికరణకున్న పరిమితులను సహితం దృష్టిలో ఉంచుకుని జస్టిస్ యతిరాజులు అదే అధికరణ కింద కక్షి దారుల సహజహక్కుల్ని రక్షించడం, నష్టపరిహారం రాబట్టగల్గడం... మానవహక్కుల సహజ పరిరక్షణకు తనవంతు చారిత్రక బాధ్యతను నెరవేర్చడంగా భావించాలి. ఈ విషయంలో జాతీయస్థాయిలోనూ, ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ పలువురు న్యాయమూర్తులు సాధించిన విజయాలకు జస్టిస్ యతిరాజులు కృషి ఏమాత్రం తీసి పోదు. నిజాయితీకి, నిర్మొహమాటానికి పేరొంది, జాతీయ స్థాయిలో అభ్యుదయకర సంస్కరణలకు చేదోడు వాదోడుగా నిలిచిన జస్టిస్ పి.ఎ.చౌదరి, హిదా యతుల్లా, కేహార్, వెంకటాచలయ్య, హెచ్.ఆర్. ఖన్నా, జె.ఎస్.వర్మ, లోకూర్, జె.ఎస్.టాగోర్, భరూచా, కురియన్, జోసఫ్, జాస్తి చలమేశ్వర్ ప్రభృతులు ప్రవేశపెట్టిన నూతన ఒరవడు లకు జస్టిస్ యతిరాజుల కృషి కొనసాగింపుగానే భావించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, జాతీయ స్థాయిలోనూ నూతన ఒర వడిలో తీర్పులు వెలువరించిన పి.ఎ.చౌదరి, జస్టిస్ జీవన్ రెడ్డి ప్రభృ తుల కృషికి ప్రాణధారపోసి చట్టబద్ధతకు దూరంగా ఉండి పోయిన దానిని పలువురి దృష్టిని ఆకర్షించేలా చేసి ప్రజలముందు ప్రయోజ నకర అధికరణగా నిలబెట్టగలిగారు! సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో ఉండ వలసిన సుప్రసిద్ధ పౌరహక్కుల వాణి అయిన ప్రశాంత్ భూషణ్ గొంతు నొక్కేసే సంప్రదాయానికి తలుపులు తెరి చిన మాజీ ప్రధాన న్యాయమూర్తుల వైఖరిని తూర్పారబట్టారు. ఇలాంటి వాతావర ణంలో – చట్టరీత్యా ఆచరణలో అమలు కాకుండా దూరంగా ఉంచేసిన 32వ అధికరణకు ఆచరణలో శాశ్వత విలువను సంతరింపజేయడంలో జస్టిస్ యతిరాజుల కృషి సదా అభినంద నీయం. అయితే, రాజ్యాం గంలో కేవలం పేరుకు మాత్రమే చేర్చి, ఆచరణలో లేకుండా దూరం చేసిన వాటికి పూర్తి చట్టబద్ధత కల్పించే వరకు ప్రజాశ్రేయస్సును కోరే న్యాయమూర్తులు విశ్రమించకుండా ఉంటే ప్రజలు సంతోషిస్తారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
తెలంగాణ జడ్జీల స్థానంలో ఆంధ్రా జడ్జీలు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి వారి స్థానంలో ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకొచ్చేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇప్పటికే ఈ విషయంలో రంగం సిద్ధమైందా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ న్యాయవాదులు. ముగ్గురు తెలంగాణ న్యాయమూర్తులను ఇప్పటికే బదిలీ చేశారని, త్వరలో మరికొందరిని బదిలీ చేసేందుకు సర్వం సిద్ధమైందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెండు వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని బదిలీలు చేపట్టబోతున్నారని గట్టిగా నమ్ముతున్నారు. ఈ బదిలీ యత్నాల వెనుక ఇటీవల తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చిన ఓ న్యాయమూర్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు వారు అనుమానిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో సర్వం తానై వ్యవహరిస్తున్న ఆ న్యాయమూర్తి ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడిని వాడుతున్నట్టు చెబుతున్నారు. ఆ న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చిన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ ప్రధానమంత్రి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, కేంద్ర హోం మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీ బుధవారం ఓ లేఖను పంపింది. ఊరుకునేది లేదు రాష్ట్ర న్యాయమూర్తులను బలి పశువులను చేసే చర్యలను అడ్డుకుని తీరుతామని తెలంగాణ న్యాయవాదులు చెబుతున్నారు. ఇందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సైతం సిద్ధమంటున్నారు. ఇందులో భాగంగానే న్యాయవాదులు బుధవారం హైకోర్టులో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు కూడా పాల్గొనడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. బుధవారం భోజన విరామ సమయంలో హైకోర్టు గేటు ముందు ‘సేవ్ తెలంగాణ జ్యడీషియరీ, ఆంధ్ర న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం ఆపాలి’.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి వారి స్థానంతో ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్రెడ్డి చెప్పారు. ఇలా చేయడం తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని, రాష్ట్ర న్యాయవ్యవస్థ అస్థిత్వాన్ని ప్రశ్నించడమేనని మరో న్యాయవాది చిన్నోళ్ల నరేశ్రెడ్డి అన్నారు. తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకురావాలన్న ప్రయత్నాలను విరమించుకోకపోతే ఆందోళనలు ఉద్యమ రూపం దాలుస్తాయని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, న్యాయవాదులు గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, చిక్కుడు ప్రభాకర్, ఎ. జగన్, రాజేశ్ మెహతా తదితరులు పాల్గొన్నారు. -
న్యాయమూర్తులపై దుష్ప్రచారం.. కొత్త ట్రెండ్
న్యూఢిల్లీ: న్యాయమూర్తులపై ప్రభుత్వాలే దుష్ప్రచారం సాగిస్తుండడం దురదృష్టకరం, ఇదొక కొత్త ట్రెండ్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇష్టంలేని తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులపై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆక్షేపించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మాజీ ఐఏఎస్ అధికారి అమన్కుమార్ సింగ్పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ చత్తీస్గఢ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలు సవాలు చేస్తూ చత్తీస్గఢ్ ప్రభుత్వం, ఓ సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ‘‘మీ పోరాటం మీరు చేసుకోండి. కానీ కోర్టులను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నించొద్దు. సుప్రీంకోర్టులో కూడా ఇలాంటివి చూస్తున్నా. జడ్జీలపై ప్రభుత్వాలే దుష్ప్రచారం ప్రారంభిస్తున్నాయి. ఇది చాలా దురదృష్టకరం. ఇదొక కొత్త ట్రెంట్గా మారింది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
7 న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
-
హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ఆమోద ముద్ర వేశారు. కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయన సుజాతలను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం ఉదయం న్యాయమూ ర్తులుగా వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా ప్రమాణం చేయించనున్నారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 27కి చేరనుంది. మరో పది పోస్టులు ఖాళీగా ఉండగా కొన్నింటిని భర్తీ చేసేందుకు హైకోర్టు త్వరలో చర్యలు తీసుకోనుంది. న్యాయాధికారుల కోటా నుంచి కొందరి పేర్లను కొలీజియం సిఫారసు చేయనుంది. ఈ ఏడాది ముగ్గురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. ఫిబ్రవరి 11న జస్టిస్ మఠం వెంకటరమణ, జూన్ 13న జస్టిస్ మల్లవోలు సత్యనా రాయణమూర్తి, సెప్టెంబర్ 19న జస్టిస్ కొంగర విజయలక్ష్మీ పదవీ విరమణ చేయను న్నారు. ఈ ఏడాది ఆగస్టు లోపు అటు న్యాయ వాదుల కోటా, ఇటు న్యాయాధికారుల కోటా నుంచి అన్నీ ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. -
దర్యాప్తు పురోగతి ఏంటో చెప్పండి
సాక్షి, అమరావతి: న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై నమోదైన కేసులో దర్యాప్తు పురోగతి ఎలా ఉందో చెప్పాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికీ దొరకని నిందితులు ఉంటే వారి ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో దర్యాప్తు పురోగతి నివేదికను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నా పోలీసులు సరిగా స్పందించడం లేదంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ హైకోర్టులో గతేడాది పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సీజే ధర్మాసనం సోమవారం దాన్ని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. సీబీఐ ఇచ్చిన యూఆర్ఎల్స్ను తొలగించామన్నారు. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు స్పందిస్తూ.. తామిచ్చిన యూఆర్ఎల్స్ను ట్విట్టర్ తొలగించిందని తెలిపారు. దీంతో ధర్మాసనం.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ స్పందన కోరగా ట్విట్టర్ ఆ పోస్టులను తొలగించిందని చెప్పారు. అన్ని వివరాలతో తదుపరి విచారణ నాటికి ఓ మెమో దాఖలు చేస్తానన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది. -
హైకోర్టుకు 12 మంది జడ్జీలు!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు 12 మంది న్యాయమూర్తులను నియమించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ నెల 1న కొలీజియం సమావేశమై ఈ మేరకు చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. న్యాయవాదులు కాసోజు సురేందర్, చాడ విజయభాస్కరరెడ్డి, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్వీ శ్రావణ్కుమార్.. జ్యుడీషియల్ అధికారులు జి.అనుపమ చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్రెడ్డి, డి.నాగార్జునలను తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసింది. పదికి పెరగనున్న మహిళా జడ్జీల సంఖ్య.. ప్రస్తుతం హైకోర్టులో ఆరుగురు మహిళా న్యాయమూర్తులు విధులు నిర్వహిస్తుండగా.. తాజా ఇద్దరు న్యాయవాదులు, మరో ఇద్దరు జిల్లా జడ్జిలకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన నేపథ్యంలో త్వరలో మహిళా జడ్జిల సంఖ్య 10కి చేరుకోనుంది. చాడ విజయభాస్కర్రెడ్డి.. 1968, జూన్ 28న ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాకలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1992, డిసెంబర్ 31న బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. జస్టిస్ వీవీఎస్ రావు దగ్గర జూనియర్గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1999లో జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ), స్మాల్స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా నియమితులయ్యారు. 2006–09 మధ్య కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా సేవలందించారు. 2010–15 మధ్య వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్గా సేవలందించారు. 2014 నుంచి ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. సూరేపల్లి నంద.. 1969, ఏప్రిల్ 4న జన్మించారు. 1993లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకున్నారు. 28 ఏళ్లుగా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు బార్ కౌన్సిల్ స్టాండింగ్ కౌన్సిల్గా సేవలు అందిస్తున్నారు. 1995–2001 వరకు స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్యానల్ అడ్వొకేట్గా, 2001–04 వరకు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా సేవలందించారు. 2005–2016 హైకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ మెంబర్గా సేవలు అందించారు. న్యాయవాదిని పెట్టుకోలేని కక్షిదారులకు న్యాయ సహాయం అందించడంపై పలు జిల్లాల్లో న్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. జువ్వాడి శ్రీదేవి.. 1972, ఆగస్టు 10న జన్మించారు. 1997లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2004–08 వరకు నిర్మల్ జిల్లా కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014–17 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా, 2018 నుంచి ఇప్పటి వరకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సేవలందిస్తున్నారు. ముమ్మినేని సుధీర్కుమార్.. 1969, మే 20న ఖమ్మం జిల్లాలోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది ఎంఆర్కే చౌదరి దగ్గర జూనియర్గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీసు కొనసాగిస్తున్నారు. కాసోజు సురేందర్... 1968లో మహబూబ్నగర్ జిల్లాలో జన్మించారు. 1992లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ప్రముఖ క్రిమినల్ లాయర్ పి.సీతాపతి వద్ద జూనియర్గా వృత్తిని ప్రారంభించారు. 2005–2008 వరకు హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా సేవలు అందించారు. హైకోర్టులో 2010 నుంచి ఇప్పటివరకు సీబీఐ, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సేవలు అందిస్తున్నారు. మిర్జా సఫియుల్లాబేగ్.. మహబూబాబాద్లో జన్మించారు. 2002లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది, తాత కేఎఫ్ బాబా దగ్గర జూనియర్గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. తర్వాత తండ్రి న్యాయవాది మిర్జా ఇమాముల్లా బేగ్, న్యాయవాది ఈ.ఉమామహేశ్వర్రావుల వద్ద జూనియర్గా ప్రాక్టీస్ చేశారు. 2014 నుంచి తెలంగాణ వక్ప్బోర్డు స్టాండింగ్ కౌన్సిల్గా సేవలు అందిస్తున్నారు. ఎన్వీ శ్రవణ్కుమార్.. 1967, ఆగస్టు 18న జన్మించారు. 2005లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. రావ్ అండ్ కంపెనీ లాయర్స్ ఆఫీస్లో జూనియర్గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. ప్రస్తుతం ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. ఈయన దివంగత పీవీ నర్సింహారావు మనమడు. జి.అనుపమ చక్రవర్తి... 1970లో శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జన్మించారు. 1994లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది టి.నిరంజన్రెడ్డి దగ్గర జూనియర్గా న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం వ్యాట్ ట్రిబ్యునల్ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నారు. మాటూరి గిరిజ ప్రియదర్శిని.. 1964, ఆగస్టు 30న విశాఖపట్నంలో జన్మించారు. 1995లో బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదు చేసుకొని విశాఖపట్నం జిల్లా కోర్టులో ఏడేళ్లు న్యాయవాదిగా పనిచేశారు. 2008లో జిల్లా జడ్జి పరీక్షలో ఎంపికై గుంటూరులో అదనపు జిల్లా జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. సాంబశివరావు నాయుడు.. 1962, ఆగస్టు 1న తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జన్మించారు. న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యి 1986లో ప్రముఖ క్రిమినల్ లాయర్ పిల్లా జానకి రామయ్య దగ్గర జూనియర్గా వృత్తిని ప్రారంభించారు. 1991లో డిస్ట్రిక్ట్ మున్సిఫ్గా ఎంపికయ్యారు. తర్వాత సీనియర్ సివిల్ జడ్జిగా, జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఏసీబీ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. అలుగు సంతోష్రెడ్డి... జగిత్యాల జిల్లా జొగన్పల్లిలో జన్మించారు. 1985లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. కరీంనగర్ జిల్లాలో ప్రాక్టీస్ చేశారు. 1991లో డిస్ట్రిక్ మున్సిఫ్గా ఎంపికయ్యారు. 2004లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. 2010లో అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి.. రాష్ట్ర విభజన తర్వాత 2017 వరకు కొనసాగారు. 2019లో తిరిగి న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులై విధులు నిర్వహిస్తున్నారు. డాక్టర్ డి.నాగార్జున.. వనపర్తి జిల్లాలో 1962, ఆగస్టు 15న జన్మించారు. 1986లో న్యాయవాదిగా ఎన్రోల్ చేసుకొని వనపర్తి, మహబూబ్నగర్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 1991లో డిస్ట్రిక్ట్ మున్సిఫ్గా ఎంపికయ్యారు. 2010లో అదనపు జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా విధులు నిర్వహిస్తున్నారు. -
కోర్టుతో దాగుడుమూతలా?
సాక్షి, అమరావతి: న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో పెట్టిన అనుచిత పోస్టులను తొలగించాలంటూ ఇచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం పట్ల హైకోర్టు సోషల్ మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మా ఆదేశాలకే వక్రభాష్యం చెబుతారా? మీ గురించి మీరేమనుకుంటున్నారు? కోర్టుతో దాగుడుమూతలు అడుతున్నారా?’ అంటూ నిలదీసింది. జడ్జీలపై పెట్టిన పోస్టులను తీసేయాలని సీబీఐ కోరితే ఎందుకు తీసేయలేదని ప్రశ్నించింది. సీబీఐ కోరిందంటే తమ ఆదేశాల మేరకే అలా కోరినట్లని తేల్చి చెప్పింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, సీబీఐ కోరిన విధంగా పోస్టులను తొలగించకపోతే కోర్టు ధిక్కార చర్యలు తప్పవని హెచ్చరించింది. ఏ ఏ యూనిఫాం రీసోర్స్ లోకేటర్ (యూఆర్ఎల్)లను తొలగించాలో సోషల్ మీడియా సంస్థల న్యాయవాదులకు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. కోర్టుకు సైతం వాటిని ఇవ్వాలంది. సీబీఐ ఇచ్చిన యూఆర్ఎల్స్ను తొలగించి, వాటి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సోషల్ మీడియా సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారు పరారీలో ఉన్నట్లు ప్రకటించి చార్జిషీట్ వేయండి న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నా పోలీసులు స్పందించడం లేదంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ దాఖలు చేసిన పిటిషన్పై సీజే ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. సీబీఐ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఉన్న 17 మంది నిందితుల్లో 11 మందిని అరెస్ట్ చేశామని, మిగిలిన వారు విదేశాల్లో ఉన్నారని తెలిపారు. పంచ్ ప్రభాకర్ విషయంలో కేంద్రానికి లేఖ రాశామని, అనుమతులు రాగానే చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ విదేశాల్లో ఉన్న వారిని పరారీలో ఉన్నట్లుగా ప్రకటించి చార్జిషీట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తాజాగా మరో 8 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని రాజు చెప్పారు. యూఆర్ఎల్స్ సోషల్ మీడియా సంస్థలకు పంపామన్నారు. యూట్యూబ్ 160 యూఆర్ఎల్స్కు గాను 150 తొలగించిందని తెలిపారు. ట్విట్టర్ స్పందన నామమాత్రంగా ఉందని, 43 యూఆర్ఎల్స్కు 13 మాత్రమే తొలగించిందని చెప్పారు. ఫేస్బుక్ 51 యూఆర్ఎల్స్కు 31 తొలగించిందన్నారు. కేసుల నమోదు తరువాత జడ్జీలపై పోస్టులు దాదాపుగా లేవనే చెప్పొచ్చన్నారు. 36 గంటల్లో తొలగిస్తామన్నారుగా.. ట్విట్టర్ తీరు మొదటి నుంచీ ఇలానే ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలిస్తే యూఆర్ఎల్స్ ఇచ్చిన 36 గంటల్లో తొలగిస్తామని చెప్పి, ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా ఎందుకు తొలగించలేదని సోషల్ మీడియా సంస్థల న్యాయవాదులను ప్రశ్నించింది. ట్విట్టర్ తరఫు సీనియర్ న్యాయవాది అరవింద్ దత్తార్ స్పందిస్తూ, ఐటీ చట్ట నిబంధనల ప్రకారం కోర్టు ఆదేశాలు ఉంటేనే యూఆర్ఎల్స్ తొలగించాలన్నారు. రిజిస్ట్రార్ జనరల్ పంపిన వివరాలను కోర్టు ఆదేశాలుగానే భావించి కొన్నింటిని తొలగించామని చెప్పారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. యూఆర్ఎల్స్ తొలగింపుపై గత ఉత్తర్వుల్లో చాలా స్పష్టంగా చెప్పామని, ఇప్పుడు వాటికి వక్రభాష్యం చెబుతున్నారంటూ మండిపడింది. ఇలా కోర్టుతోనే దాగుడుమూతలు ఆడుతుంటే కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధంగా ఉండాలంది. రిజిస్ట్రార్ జనరల్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ, సీబీఐ దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా కాకుండా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన యూఆర్ఎల్స్ ఆధారంగా సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాస్తోందన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రంగానే వ్యవహరించాలని అన్నారు. రిజిస్ట్రార్ జనరల్ పంపిన యూఆర్ఎల్స్ను తొలగించాయన్నారు. -
మై లార్డ్, యువరానర్ అనాల్సిన అవసరం లేదు.. సర్ చాలు!
సాక్షి, భువనేశ్వర్/కటక్: సాధారణఃగా కోర్టుల్లో కేసుల విషయంలో వాదనలు వినిపించేటప్పుడు న్యాయవాదులు న్యాయమూర్తుల్ని ‘మైలార్డ్ లేదా..యువరానర్’ అని సంభోదిస్తుంటారు. అయితే న్యాయమూర్తులను ఉద్దేశించి చేసే మై లార్డ్, యువర్ లార్డ్షిప్, యువర్ ఆనర్ వంటి సంబోధనలు మినహాయించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎస్.మురళీధర్ న్యాయవాదులకు విన్నపం చేశారు. సర్ వంటి సాధారణ సంబోధన సరిపోతుందని ఆయన అన్నారు. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సోమవారం ఈ సందేశం జారీ చేశారు. 2009లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న రోజుల్లో సైతం న్యాయవాదులకు ఆయన ఇదే సందేశాన్ని జారీ చేయడం విశేషం. 2006 మే 29 నుంచి 2020 మార్చి 5వ తేదీ వరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2020లో పంజాబ్–హర్యానా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉండే సమయంలో కూడా ఇదే విన్నపం అక్కడి న్యాయవాదులకు విన్నవించడం గమనార్హం. 2020 మార్చి 6 నుంచి 2021 జనవరి 3వ తేదీ వరకు పంజాబ్–హర్యానా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా, చీఫ్ జస్టిస్ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను ఉద్దేశించి మై లార్డ్, లార్డ్షిప్, యువర్ ఆనర్, ఆనరబుల్ వంటి సంబోధనలు నివారించాలని 2006లో తీర్మానించింది. చదవండి: వేల సంఖ్యలో కేసులు.. భారత్లో మొదలైన కరోనా థర్డ్వేవ్? చీఫ్ జస్టిస్ నిర్ణయం అభినందనీయం.. హైకోర్టులో న్యాయమూర్తులను ఉద్దేశించాల్సిన సంబోధనల పురస్కరించుకుని, ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన సందేశం అభినందనీయమని ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి జె.కె.లెంకా తెలిపారు. ఆయన విన్నపం నేపథ్యంలో తోటి న్యాయమూర్తులు ఈ సంస్కరణ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులు, కోర్టు విచారణకు హాజరయ్యే వ్యక్తులు ఇదే పద్ధతి పాటించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి చేసే సంబోధనల నివారణకు జస్టిస్ గతికృష్ణ మిశ్రా హయాంలో బీజం పడిందని సీనియర్ న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు. 1969 నుంచి 1975 వరకు జస్టిస్ గతికృష్ణ మిశ్రా హైకోర్టు ప్రధాన న్యా యమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. న్యాయమూర్తులను సర్ అని సంబోధించాలని ఫుల్ బెంచ్ అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వులు వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు. -
సాధారణ న్యాయవాదులూ న్యాయమూర్తులుగా ఎదగొచ్చు
కందుకూరు: వృత్తిలో సవాళ్లు, ఒత్తిడిలను అధిగమించి వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా సాధారణ న్యాయవాదులు సైతం న్యాయమూర్తులుగా ఎదగవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు పేర్కొన్నారు. తనలాంటి సామాన్యుడికి హైకోర్టు న్యాయమూర్తి పదవి దక్కడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయనకు ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ మన్మథరావు మాట్లాడుతూ.. కందుకూరు బార్ అసోసియేషన్ సభ్యుడిగా కందుకూరు కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. 31 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో పనిచేసిన తరువాత తనకు న్యాయమూర్తిగా అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోర్టుల్లో అవకాశాలు భారీగా పెరిగాయని, ఈ నేపథ్యంలో న్యాయమూర్తిగా ఎదగడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. బార్ అసోసియేషన్లు కేవలం కోర్టు విధులు, కోర్టుల్లో సమస్యలకే పరిమితం కాకుండా సామాజిక సమస్యలపై కూడా పోరాటం చేయాలని మన్మథరావు కోరారు. నేడు కోర్టులే ప్రజల వద్దకు వస్తుంటే.. బార్ అసోసియేషన్లు ప్రజల వద్దకు ఎందుకు వెళ్లలేవని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి జ్యోతిర్మయి, సీనియర్ సివిల్ జడ్జి విజయబాబు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి.వాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరికృష్ణ, న్యాయవాదులు పాల్గొన్నారు. -
విడాకులు వద్దు..కలసి కాపురం చేయండి: న్యాయమూర్తులు
మైసూరు: చిన్న చిన్న కారణాలతోనే విడాకులకు దరఖాస్తు చేసే జంటలు ప్రస్తుతం పెరిగిపోయాయి. ఇదే రీతిలో విడాకుల కోసం వచ్చిన జంటలను ఆదివారం మైసూరులో నిర్వహించిన లోక్ అదాలత్లో న్యాయమూర్తులు బుజ్జగించి మళ్లీ ఒక్కటి చేశారు. నగరంలోని కోర్టు కాంప్లెక్స్లో కుటుంబ తగాదాల జంటలకోసం లోక్ అదాలత్ నిర్వహించగా సుమారు 25 మంది దంపతులు విడాకులు కోరుతూ హాజరయ్యారు. వారికి విడాకుల వల్ల వచ్చే అనర్థాలను జడ్జిలు, న్యాయ నిపుణులు వివరించి.. కలసి కాపురం చేయాలని నచ్చజెప్పడంతో వారంతా మళ్లీ ఒక్కటయ్యారు. -
హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు
సాక్షి అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ డాక్టర్ కుంభజడల మన్మధరావు, జస్టిస్ బొడ్డుపల్లి శ్రీ భానుమతి నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దీంతో కేంద్రం వీరి నియామకాలను నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వారంలో వీరు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. వీరిద్దరి నియామకంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరనుంది. న్యాయమూర్తుల నేపథ్యం ఇది.. న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మధరావు జననం: 1966, జూన్ 30 ఊరు: ప్రకాశం జిల్లా సింగరాయకొండ విద్యాభ్యాసం: ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, డాక్టరేట్ ప్రస్థానం: ► 1991లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఒంగోలులో నాగిశెట్టి రంగారావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. ► 1999లో హైకోర్టుకు ప్రాక్టీస్ మార్చారు. ► ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రెవెన్యూ ఇంటెలిజెన్స్ వంటి కీలక సంస్థలకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించారు. ► పలు బ్యాంకులకు న్యాయ సలహాదారుగా ఉన్నారు. న్యాయమూర్తి జస్టిస్ బొడ్డుపల్లి శ్రీ భానుమతి స్వగ్రామం: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు విద్యాభ్యాసం: రాజమహేంద్రవరంలో ‘లా’ అభ్యసించారు. ప్రస్థానం: ► న్యాయాధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనిచేశారు. ► 2020 జూన్లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా నియమితులయ్యారు. తొలి మహిళా రిజిస్ట్రార్ జనరల్ భానుమతి కావడం విశేషం. అప్పటి నుంచి అదే పోస్టులో కొనసాగుతున్నారు. -
విచక్షణతో వ్యాఖ్యలు చెయ్యాలి
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో జడ్జీలు వ్యాఖ్యలు చేసేటప్పుడు విచక్షణతో చేయాలని రాష్ట్రపతి కోవింద్ హితవు పలికారు. జడ్జీలు తమ వ్యాఖ్యలకి తప్పుడు భాష్యాలు కల్పించే అవకాశం ఇవ్వకూడదన్నారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ విక్షచణారహితంగా వ్యాఖ్యలు చేస్తే వాటిని సరిగా అర్థం చేసుకోలేరని అన్నారు. అంతిమంగా న్యాయవ్యవస్థ సక్రమంగా నడవదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగదినోత్సవాల ముగింపు సమావేశంలో శనివారం కోవింద్ మాట్లాడారు. భారతీయ సంప్రదాయంలో న్యాయమూర్తులకు ఒక హోదా ఉందని, స్థితప్రజ్ఞతకు, నైతికతకు మారుపేరుగా వారు ఉంటారని కొనియాడారు. ‘మన దేశంలో తీర్పులిచ్చిన సమయంలో ఎంతో వివేకాన్ని ప్రదర్శిస్తూ వ్యాఖ్యలు చేసే న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. వారు చేసే వ్యాఖ్యలు భవిష్యత్ తరాలకు బాటలు వేసేలా ఉన్నాయి. అత్యున్నత ప్రమాణాలకే న్యాయవ్యవస్థ కట్టుబడి ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యానికి న్యాయం మూలాధారం లాంటిది. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు సామరస్యపూర్వక ధోరణిలో కలిసి ముందుకు సాగినపుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. రాజ్యాంగంలో ప్రతి వ్యవస్థకూ దాని పరిధిని నిర్దేశించారు. దానికి లోబడే ఈ వ్యవస్థలు పనిచేస్తాయి’ అని కోవింద్ అన్నారు. ఆ చట్టాలతో న్యాయవ్యవస్థపై భారం: సీజేఐ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ శాసనవ్యవస్థ తాను చేసే చట్టాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అంచనా వేయకుండా, అధ్యయనాలు నిర్వహించకుండా వాటిని ఆమోదించడం వల్ల ఒక్కోసారి అతి పెద్ద సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. దాని వల్ల కేసుల సంఖ్య పెరిగిపోయి న్యాయవ్యవస్థపై పెనుభారం పడుతోందన్నారు. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల్ని పెంచనంతవరకు పెండింగ్ కేసులు తగ్గుముఖం పట్టవని అన్నారు. పార్లమెంటు లేదంటే రాష్ట్రాల అసెంబ్లీలు చేసిన చట్టాలను, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను అమలు చేయడం కష్టసాధ్యమనే పరిస్థితులు ఎప్పటికీ ఏర్పడకూడదని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. -
పోస్టులు పెట్టినవారి వివరాల కోసం లేఖలు
సాక్షి, అమరావతి: న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారి వివరాల కోసం పలు మీడియా సంస్థలకు, సామాజిక మాధ్యమ కంపెనీలకు లేఖలు రాసినట్లు సీబీఐ సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఆ లేఖలను సీల్డ్ కవర్లో ఉంచామని, వాటిని పరిశీలించాలని సీబీఐ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డి కోర్టును కోరారు. వాటిని తరువాత పరిశీలిస్తామని, ఆ లేఖల కాపీలను పిటిషనర్ (హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్) న్యాయవాదికి అందచేయాలని సుభాష్కు హైకోర్టు సూచించింది. న్యాయమూర్తులపై పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి రోజూ పోస్టులు పెడుతున్న నేపథ్యంలో అతడి చిరునామా, ఫోన్ నంబర్, ఈ–మెయిల్, పనిచేసేచోటు తదితర వివరాలను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ సోమవారం హైకోర్టు ముందుంచారు. లంచ్మోషన్ రూపంలో ఈ మెమోలను ఆయన కోర్టుకు సమర్పించారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ వ్యవహారంపై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కారంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ ధిక్కార వ్యాజ్యంపై సీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిలో పలువురు ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్నారని, వారందరికీ నోటీసులు జారీచేశామని చెప్పారు. ఈ వ్యాజ్యంలో యూట్యాబ్, ట్విటర్లను ప్రతివాదులుగా చేరుస్తూ అనుబంధ పిటిషన్ వేసినట్లు రిజిస్ట్రార్ జనరల్ న్యాయవాది అశ్వనీకుమార్ చెప్పారు. దీన్ని అనుమతించాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ.. సుమోటో ధిక్కార పిటిషన్ను, ఇదే అంశంపై రిజిస్ట్రార్ జనరల్ వ్యాజ్యంతో కలిపి మంగళవారం వింటామని తెలిపింది. -
హైకోర్టు జడ్జిలుగా 68 మంది పేర్లు
న్యూఢిల్లీ: వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68మంది పేర్లను సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసింది. ఆగస్టు25, సెపె్టంబర్1న జరిపిన సమావేశాల్లో సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కొలిజియం 112మంది పేర్లను పదోన్నతి కోసం పరిశీలించింది. ఇందులో 82మంది బార్కు చెందినవారు కాగా, 31మంది జ్యుడిషియల్ సర్వీసెస్కు చెందినవారు. వీరిలోనుంచి 68మంది పేర్లను 12 హైకోర్టులకు కొలిజియం రికమండ్ చేసింది. వీరిలో 44మంది బార్కు, 24 మంది జ్యుడిషియల్ సర్వీసెస్కు చెందినవారు. ఈ దఫా సిఫార్సుల్లో కూడా కొలిజియం చరిత్ర సృష్టించింది. తొలిసారి మిజోరాం నుంచి హైకోర్టు జడ్జి పదవికి ఒకరిని ఎంపిక చేసింది. మిజోరాంకు చెందిన ఎస్టీ జ్యుడిషియల్ అధికారి మర్లి వాంకుంగ్ను గౌహతి హైకోర్టుకు జడ్జిగా కొలిజియం రికమండ్ చేసింది. అలాగే సిఫార్సు చేసిన 68మందిలో 10మంది మహిళలున్నారు. ప్రస్తుతం సిఫార్సు చేసిన జడ్జిలను అలహాబాద్, రాజస్తాన్, కలకత్తా, జార్ఖండ్, జమ్ము కాశ్మీర్, మద్రాస్, మధ్యప్రదేశ్, కర్నాటక, పంజాబ్ అండ్ హర్యానా, కేరళ, చత్తీస్గఢ్, అస్సాం హైకోర్టుల్లో నియమిస్తారు. ఇటీవలే కొలిజయం ఏడుగురు జడ్జిలను తెలంగాణ హైకోర్టుకు, 9మందిని సుప్రీంకోర్టుకు రికమండ్ చేసింది. వీరందరితో ఒకేరోజు సీజేఐ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంలో జడ్జిల సంఖ్య 33కు చేరింది. -
Telangana: హైకోర్టుకు కొత్త జడ్జీలు
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు రానున్నారు. సీనియర్ జిల్లా జడ్జి స్థాయి నుంచి హైకోర్టు జడ్జిగా ఏడుగురికి పదోన్నతులు కల్పించాలం టూ.. సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ జాబితాలో సీనియర్ జిల్లా జడ్జీలు పి.శ్రీసుధ, డాక్టర్ సి.సుమలత, డాక్టర్ జి.రాధారాణి, ఎం.లక్ష్మణ్, ఎన్.తుకారాంజీ, ఎ.వెంకటేశ్వర్రెడ్డి, ఆదాయపన్ను శాఖ అప్పిలేట్ ట్రిబ్యునల్ అథారిటీ (ఐటీఏటీ) సభ్యురాలిగా ఉన్న టి.మాధవీదేవి ఉన్నారు. ఏడుగురు కొత్త న్యాయమూర్తుల్లో నలుగురు మహిళా జడ్జీలే ఉండటం విశేషం. సుప్రీం కొలీజియం పంపిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించగానే.. కొత్త జడ్జీల నియామక ప్రక్రియ పూర్తికానుంది. పోస్టుల సంఖ్య పెంచాక.. తెలంగాణ హైకోర్టులో జడ్జి పోస్టుల సంఖ్య 24గా ఉండేది. ఇటీవలే పోస్టుల సంఖ్యను 42కి పెంచారు. ప్రస్తుతం కేవలం 12 మంది న్యాయమూర్తులే ఉండగా.. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా ఏడుగురు రానున్నారు. వాస్తవానికి జిల్లా జడ్జీల నుంచి సీనియారిటీ ఆధారంగా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. కానీ చాలా ఏళ్లుగా పదోన్నతులు ఇవ్వలేదు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడ్డాక ప్రతిపాదన వచ్చినా అమల్లోకి రాలేదు. తాజాగా జడ్జి పోస్టుల సంఖ్యను పెంచిన నేపథ్యంలో పదోన్నతులతో కొత్త నియామకాలు చేపట్టారు. ప్రస్తుతం హైకోర్టులో 2.32 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కొత్త జడ్జీలు వస్తే విచారణల వేగం పెరగనుంది. కొత్త న్యాయమూర్తులు వీరే.. 1. పి.శ్రీసుధ 1967 జూన్ 6న జన్మించారు. తొలుత నిజామాబాద్ అదనపు జిల్లా జడ్జిగా, 2002లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, విశాఖపట్నం, వరంగల్, నిజామాబాద్ జిల్లాలు, సిటీ సివిల్ కోర్టుల చీఫ్ జడ్జిగా, ఉమ్మడి ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం కోఆపరేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్గా ఉన్నారు. 2. డాక్టర్ సి.సుమలత 1972 ఫిబ్రవరి 5న నెల్లూరు జిల్లాలో జన్మించారు. 2006లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. మదనపల్లి, కర్నూలు, గుంటూరు జల్లాల్లో న్యాయమూర్తిగా, ఉమ్మడి జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడం ఎలా అన్న అంశం ఆమె డాక్టరేట్ చేశారు. 3. డాక్టర్ జి.రాధారాణి 1963 జూన్ 29న జన్మించారు. ఏలూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. 2008లో జిల్లాజడ్జిగా ఎంపికయ్యారు. హైదరాబాద్లోని పలు కోర్టుల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చీఫ్ జడ్జిగా ఉన్నారు. 4. వికారాబాద్ జిల్లాకు చెందిన ఎం.లక్ష్మణ్ 1965 డిసెంబర్ 24న జన్మించారు. హైదరాబాద్లోని పలు కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. హైదరాబాద్లోని పలు కోర్టుల్లో, ఖమ్మం జిల్లా చీఫ్ జడ్జిగా పనిచేశారు. ప్రస్తుతం లేబర్ కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 5. ఎన్.తుకారాంజీ 1973 ఫిబ్రవరి 24న జన్మించారు. విద్యాభాస్యం మొత్తం హైదరాబాద్లో సాగింది. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, రాజమండ్రి జిల్లాల చీఫ్ జడ్జిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రిమినల్ కోర్టుల మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా ఉన్నారు. 6. ఎ.వెంకటేశ్వర్రెడ్డి 1961 ఏప్రిల్ 1న జన్మించారు. 1994లో జడ్జిగా ఎంపికయ్యారు. రంగారెడ్డి జిల్లాతోపాటు పలు జిల్లాల్లో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా పనిచేస్తున్నారు. 7. పి.మాధవిదేవి ఆదాయ పన్నుశాఖ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) జ్యుడిషియల్ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. -
న్యాయమూర్తుల రక్షణకు భద్రతా సంస్థ ఏర్పాటు సాధ్యం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయమూర్తుల రక్షణకు సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ (సీఐఎస్ఎఫ్) మాదిరిగా భద్రతా సంస్థ ఏర్పాటు సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ అంశం సలహా ఇవ్వదగినది కాదని పేర్కొంది. ధన్బాద్ న్యాయమూర్తి హత్య కేసు సమోటో విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్లతో కూడిన ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ మేరకు స్పష్టం చేశారు. న్యాయమూర్తుల భద్రతను తీవ్రంగా పరిగణించాల్సి అంశంగా తుషార్ మెహతా పేర్కొన్నారు. సమోటో కేసుకు సంబంధించి గత విచారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటరు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన ఈ నెల 14న కేంద్రం కౌంటరు అఫిడవిట్ దాఖలు చేసింది. ‘‘న్యాయమూర్తుల భద్రతకు సంబంధించి హోంశాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. సీఐఎస్ఎఫ్ తరహాలో భద్రతా సంస్థ ఏర్పాటు సాధ్యంకాదు, సలహా ఇవ్వదగినది కాదు’’ అని అఫిడవిట్లో పేర్కొంది. ప్రత్యేకమైన పోలీసు వ్యవస్థ ఏర్పాటు స్థానంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు రాష్ట్రాలు అమలు చేస్తే చాలని పేర్కొంది. విచారణలో భాగంగా.. రాష్ట్రాలతో కలిసి చర్చించి దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని తుషార్ మెహతాకు ధర్మాసనం సూచించింది. హోం కార్యదర్శులతోనా, పోలీసు చీఫ్లతో ఎవరితో సమావేశం నిర్వహించాలని తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. సీసీటీవీలకే సొమ్ములు లేవని రాష్ట్రాలు చెబుతున్నాయని, రాష్ట్రాలు, కేంద్రం తేల్చుకోవాల్సి అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో న్యాయమూర్తులు, న్యాయవాదుల భద్రతకు సంబంధించి ఎలాంటి రక్షణ తీసుకుంటున్నారో పది రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. గత విచారణ సమయంలోనే దాఖలు చేయాలని ఆదేశించిన పలు రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయలేదని ఆయా రాష్ట్రాలు రూ.లక్ష జరిమానా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్కు జమ చేయాలని పేర్కొంది. మణిపూర్, జార్ఖండ్, గుజరాత్లు సోమవారం కౌంటరు అఫిడవిట్ దాఖలు చేశాయని ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14న కేంద్రం కౌంటరు దాఖలు చేసిందని తెలిపింది. కేరళ తరఫు న్యాయవాది పదిరోజులు సమయం కోరగా అనుమతించిన ధర్మాసనం మిగిలిన రాష్ట్రాలు కూడా పది రోజుల్లో దాఖలు చేయాలని, రూ.లక్ష సుప్రీంకోర్టు బార్ అసోసియేన్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్కు జమ చేయాలని స్పష్టం చేసింది. పది రోజుల్లో దాఖలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. -
జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు తగదు
సాక్షి, అమరావతి: న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్కుమార్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. గతంలోనూ ఇలాంటి పోస్టులపై హైకోర్టు ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు చేపట్టామని సునీల్ కుమార్ గుర్తు చేశారు. నాలుగు రోజుల నుంచి న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్లను గుర్తించామని, వాటిపై లోతైన దర్యాప్తు చేపట్టామని సునీల్ కుమార్ తెలిపారు. ఇదంతా కొందరు పథకం ప్రకారం చేస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని, కొందరు కావాలనే న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చామన్నారు. ఇందుకు సంబంధించి ఏపీ సీఐడీ సోషల్ మీడియా వింగ్, ఫ్యాక్ట్ ఫైండింగ్ టీమ్లు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. -
తెలంగాణ కోర్టుల్లో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్లో కలకలం రేపుతోంది. రోజువారీ కేసుల సంఖ్య లక్ష మార్క్ను దాటడంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. తాజాగా తెలంగాణా జంట నగరాల పరిధిలోని నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సిటీ సివిల్ కోర్టు, సిటీ స్మాల్కాజెస్ కోర్టులతోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల పరిధిలో పలువురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు. అలాగే పదుల సంఖ్యలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో విచారణలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తుకారాంజీ రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. భౌతిక విచారణ నిలిపివేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గతేడాది జూన్లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నప్పటి ఆదేశాలను ఇప్పుడు అమలు చేయాలన్నారు. దీంతో జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోర్టుల్లో కేసులను భౌతికంగా విచారించరు. ముఖ్యమైన, తుది వాదనల సమయంలో ఉన్న 20 కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశముంది. ఆయా కేసుల్లో కక్షిదారులు హాజరుకాకపోయినా ప్రతికూలమైన ఆదేశాలు జారీచేయరాదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేస్తారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో రోజూవారీగా విచారణ చేయాల్సిన అవసరం లేదని, కోర్టు వీలును బట్టి కేసులను పరిష్కరించాలని స్పష్టంచేశారు. -
కోర్టు విచారణ.. జడ్జికే లైన్ వేసిన ముద్దాయి
వాషింగ్టన్: కోర్టు విచారణ సమయంలో నిందితులు ఎంతో పద్దతిగా ప్రవర్తిస్తారు. పోలీసుల దగ్గర కాస్త అతి చేసినా చెల్లుతుంది కానీ.. కోర్టులో మాత్రం ఎలాంటి పిచ్చి వేశాలు వేయకూడదు. అడిగిన దానికి సమాధానం చెప్పడం... మన వాదన వినిపించడం ఇదే జరిగేది. మన సినిమాల్లో కూడా న్యాయవాదులు, కోర్టులపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు, సీన్లు ఉండవు. చాలా దేశాల్లో ఇలాగే ఉంటుంది. ఇంతటి అత్యున్నత స్థానం ఉన్న కోర్టులో ఓ నిందితుడు పిచ్చి వేషాలు వేశాడు. ఏకంగా జడ్జికే లైన్ వేయడమేకాక.. పడిపోయాను అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు.. దక్షిణ ఫ్లోరిడా కోర్టులో తబితా బ్లాక్మోన్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఓ కేసు విచారణ సందర్భంగా ప్రతివాది డెమెట్రిస్ లూయిస్ బ్రోవార్డ్ కౌంటీ జడ్జి తబితా బ్లాక్మోన్ ముందు వర్చువల్ విచారణలో హాజరయ్యాడు. కెమరా ముందుకు వచ్చాక లూయిస్.. జడ్జిని ఫ్లర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ‘‘జడ్జి గారు మీరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా.. నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు. మీకు పడిపోయాను’’ అంటూ జడ్జి తబితాను మోసే ప్రయత్నం చేశాడు. అతడి పొగడ్తలకు ఆమె నవ్వుకుని.. ‘‘థాంక్యూ.. నేను అందంగా ఉన్నానని నాకు తెలుసు. పొగడ్తలు ఎక్కడైనా పని చేస్తాయేమో కానీ ఇక్కడ కాదు’’ అని తెలిపారు. ఇక లూయిస్పై నమోదయిన కేసు ఏంటంటే కొద్ది రోజుల క్రితం అతడు తల్లి, ముగ్గురు కుమార్తెలు ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. డోర్ పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ తతంగాన్ని సదరు ఇంటి ఓనర్ డోర్బెల్ కెమెరా ద్వారా చూసి.. ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చింది. వారు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ నేరానికి గాను కోర్టు లూయిస్కి 50 వేల డాలర్ల జరిమానా విధించింది. ఇక గతంలో మరణాయుధం కలిగి ఉన్నాడనే నేరం కింద లూయిస్ నాలుగేళ్లు జైల్లో గడిపి 2019లో బయటకు వచ్చాడు. చదవండి: ఇంటిపెద్దకు కాకుంటే ఇంకెవరికి ఫిర్యాదు చేయాలి? జడ్జీలూ సోషల్ మీడియా బాధితులే -
దేశవ్యాప్తంగా హైకోర్టు జడ్జీల ఖాళీలు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తుల స్థానాలు ఖాళీగా ఉన్నాయని, కొత్తగా హైకోర్టు న్యాయమూర్తులను నియమించాలని కొన్ని నెలల క్రితం హైకోర్టులు చేసిన సిఫారసులపై సుప్రీంకోర్టు కొలీజియం ఇంకా తుది తీర్పునివ్వలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలోని 25 హైకోర్టులలో మొత్తం 1,079 మంది న్యాయమూర్తులుండాల్సి ఉంటుంది. జనవరి 1వ తేదీ నాటికి 411 ఖాళీలున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో సుప్రీంకోర్టు కోలీజియం నుంచి న్యాయమంత్రిత్వ శాఖకు ఇంకా సిఫర్సులు అందలేదన్నారు. 2019 నవంబర్లో భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ అనంతరం సుప్రీంకోర్టులో మొదటి ఖాళీ ఏర్పడిదని, ఆ తరువాత వరుసగా జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఆరుణ్ మిశ్రాల పదవీ విరమణలతో స్థానాలు ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. మొత్తం 34 మందిని నియమించగా, ప్రస్తుతం 30 మందితో కోర్టు నడుస్తోంది. సుప్రీంకోర్టు లోని ఈ ఖాళీలను భర్తీ చేయడానికి కొలీజియం నుంచి ఇంత వరకు ప్రభుత్వానికి ఎటువంటి సూచనలు రాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. న్యాయమూర్తుల పదవీ విరమణ, రాజీనామా లేదా, పదోన్నతుల కారణంగా ఇటువంటి ఖాళీలు ఏర్పడతాయి. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకం అనేది, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య నిరంతర ప్రక్రియ. దీనికి వివిధ రాజ్యాంగ అధికారుల నుంచి ఆమోదం అవసరమౌతుంది. 25 హైకోర్టులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి, సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదనలు చేస్తుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి, అవసరమైతే అంగీకరిస్తుంది. లేదా పునః పరిశీలిస్తుంది. హైకోర్టు కొలీజియం మొదట తమ సిఫార్సులను న్యాయమంత్రిత్వ శాఖకు పంపుతుంది. ఐబి నివేదికను వాటికి జతచేస్తుంది. దీన్ని సుప్రీంకోర్టు కొలీజియంకి పంపిస్తారు. ఈ కొలీజియం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టులోని నలుగురు సీనియర్ న్యాయవాదులను ప్రతిపాదిస్తుంది. అయితే 23 మంది అభ్యర్థులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని పలుహైకోర్టు కొలీజియంలు చేసిన సిఫార్సులపై సుప్రీంకోర్టు కొలీజియం ఇంకా నిర్ణయం తీసులకోలేదని భావిస్తున్నారు. హైకోర్టుల ప్రతిపాదనలు నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని వారు ఆరోపించారు. ఒక అభ్యర్థి ప్రతిపాదన దాదాపు మూడేళ్ళుగా ఉన్నత న్యాయస్థానం కొలీజియంలో పెండింగ్లో ఉంది. మరికొన్ని ప్రతిపాదనలు దాదాపు రెండేళ్ళుగా పెండింగ్లో ఉన్నాయని తెలుస్తోంది. మరో 47 రికమండేషన్స్ సుప్రీంకోర్టు కొలీజియంలో పెండింగ్లో ఉన్నాయన్నారు. దేశంలోని 25 హైకోర్టులలో మొత్తం 1,079 మంది న్యాయమూర్తులుండాల్సి ఉంటుంది. జనవరి 1వ తేదీనాటికి 411 ఖాళీలున్నాయి. ఇందులో అత్యధికంగా 64 మంది అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తుల నియమాకాలే పెండింగ్లో ఉన్నాయి. కొలీజియం సిఫార్సులను బట్టి ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి పేర్లను ఖరారు చేయడంలో కేంద్రం వైపు నుంచి జరిగిన ఆలస్యంపై బుధవారం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడింది. కొన్ని కేసుల్లో కేంద్రం కొలీజియం సూచనలపై ప్రతిస్పందించేందుకు కేంద్రం ఏడాదికి పైగా సమయం తీసుకుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. -
న్యాయమూర్తులు పరిధులు దాటొచ్చా?
న్యాయమూర్తులు కూడా సమాజం నుంచి వచ్చిన వ్యక్తులే. వాళ్ళ మీద కూడా ప్రభావాలు ఉంటాయి. అన్ని ప్రభావాలు చెడ్డవి అని అనడానికి వీల్లేదు. వాళ్ళు తమమీద ఉన్న ఒత్తిడి వల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. న్యాయవ్యవస్థ నుంచి కొన్ని ఒత్తిడులు ఉత్పన్నమవుతాయి. న్యాయమూర్తి సాంఘిక, సాంస్కృతిక, మతపరమైన నేపథ్యం నుంచి మరికొన్ని ఒత్తిడులు ఉత్పన్నమవుతాయి. ఇవే కాకుండా వర్గపరమైన పక్షపాత ధోరణులు కూడా ఉంటాయి. ఇంటి యజమాని వల్ల బాధితుడైన న్యాయమూర్తి కిరాయిదారుల పక్షం ఉండి యజమానులకి వ్యతిరేకంగా ఉంటాడు. వరకట్నం కేసు వల్ల బాధను అనుభవించిన వ్యక్తి, ఆ కేసుల్లో పక్షపాత ధోరణి కలిగి ఉంటాడు. ఇది ఒక ఉదాహరణ. వీటికి మంచి ఉదాహరణ భన్వారీ దేవి ఉదంతం. భన్వారీ దేవి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆమె క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. బాల్య వివాహాలు జరిగితే ఆ విషయాలు ప్రభుత్వానికి తెలియజేయడం ఆమె ఉద్యోగంలోని ఒక విధి. అలాంటి సంఘటన ఒకటి జరిగే అవకాశం ఉందని ఆమె ప్రభుత్వానికి సమాచారం అందిం చింది. ఆ వివాహాన్ని పోలీసులు నిరోధించటానికి ప్రయత్నించి విఫల మయ్యారు. ఆ వివాహం రహస్యంగా జరిగింది. ఆ వివాహం జరిగే విషయంలో ఆమె జోక్యం చేసుకున్న కారణంగా వివాహం అయిన కొద్ది నెలలకి ఆమె మీద దాడి జరిగింది. ఆమె భర్త సమక్షంలో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో ముద్దాయిలను ఆ కేసుని విచారించిన సెషన్స్ జడ్జి విడుదల చేశాడు. ఆ న్యాయమూర్తి ఇచ్చిన వివరణ చాలా విచిత్రంగా ఉంది. అత్యాచారాన్ని టీనేజీలో ఉన్న యువకులు చేస్తారు. ఈ కేసులో ఉన్న ముద్దాయిలు మధ్య వయ స్కులు. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు. వాళ్లు ఈ నేరం చేయడానికి అవకాశం లేదు. అందులోనూ ఆధిపత్యæ కులానికి చెందిన వ్యక్తులు నిమ్న కులానికి చెందిన వ్యక్తితో అపవిత్రం కారు. ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి. కాబట్టే ఇలాంటి తీర్పు వెలువడింది. ఈ తీర్పుమీద అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అదేవిధంగా కొంతమంది న్యాయ మూర్తులు ‘ఆమోద యోగ్యం కాని వక్రబుద్ధితో కూడిన (పర్వర్స్) తీర్పులని ప్రకటిస్తూ ఉంటారు. అలాంటి ఒక తీర్పుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని డివిజన్ బెంచ్ క్రిమినల్ అప్పీలు నెం. 1025 ఆఫ్ 2008 కేసులో 17.08.2012 నాడు ప్రకటించింది. ఈ తీర్పు పర్వర్స్ తీర్పు అని సుప్రీంకోర్టు డివిజన్ బెంచి 2017 ఫిబ్రవరి 9న ప్రకటించింది. కానీ ఈవిధంగా హైకోర్టు తీర్పుని పర్వర్స్ తీర్పు అని ప్రకటించడం సంతోషకరమైన వ్యక్తీకరణ కాదని కూడా సుప్రీంకోర్టు సి. ఏక్నాథ్ వర్సెస్ వై. అమరనాథ రెడ్డి కేసులో అభిప్రాయపడింది. ప్రభుత్వ భూముల వేలం కేసు నుంచి వైదొలగాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసుని పరిష్కరించాల్సిన జస్టిస్ రాకేశ్ కుమార్ తన పరిధిలో లేని అంశాలపై వ్యాఖ్యానించారు. ఇది ఆందోళనకరం. దేశానికి జస్టిస్ మురళీధర్, జస్టిస్ చంద్రూ వంటి న్యాయమూర్తులు అవసరం. దేశం ఇలాంటి న్యాయమూర్తులనే కోరుకుంటోంది. ఏపీ హైకోర్టులో జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ రమేష్ నేతృత్వం లోని డివిజన్ బెంచ్ 2020 డిసెంబర్ 30న ఇచ్చిన తీర్పుని గమనిం చినప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఇది ఊహించని ఉత్తర్వు. ఎందుకంటే తన విచారణ పరిధిలో లేని చాలా అంశాలని కోర్టు స్పృశించి తన అసంతృప్తిని వ్యక్తపరిచింది. ఈ అసంతృప్తికి కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయడం. అంతేకాదు. వై.యస్. జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం హైకోర్టుని తక్కువ చేస్తోందని కూడా ఈ తీర్పు అక్కసుని వెళ్లగక్కింది. కోర్టు కేసు నుంచి ఓ న్యాయమూర్తి తప్పుకోవాలన్న దరఖాస్తుని పరిష్కరిస్తూ డివిజన్ బెంచ్ ఈ కటువైన పరిశీలనలని చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏపీ హైకోర్టు నిర్వహణ మీద భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ బాబ్డేకి రాసిన లేఖల పర్యవసానంవల్లే ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు కూడా జరిగాయని డివిజన్ బెంచి అభిప్రాయపడింది. ముఖ్యమంత్రికి కావాల్సింది సుప్రీంకోర్టు కొలీజియం చేసిందన్న భావన కలిగేవిధంగా కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనమీద ఉన్న కేసుల విచారణలో జాప్యం జరగడానికి అలా ఆరోపణలు చేశారని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక్కడ అర్థం కాని విషయం ఏమంటే ఆ కేసు విచారణని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చేయడం లేదు. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఆ కేసులని విచారిస్తు న్నారు. ఈ బదిలీల వల్ల ఆ కేసుల విచారణ ఏ విధంగా కుంటు పడుతుందో అర్థం కాని విషయం. కోర్టు ఎన్ని రోజుల్లో పరిష్కరిం చాలో హైకోర్టులు చెబుతాయి తప్ప ఏ విధంగా పరిష్కరించాలో చెప్పజాలవు. అలా చెబితే అది న్యాయవ్యవస్థ స్వతంత్రతకే భంగం వాటిల్లుతుంది. ప్రభుత్వ భూముల వేలం కేసునుంచి న్యాయమూర్తి రాకేశ్ కుమార్ వైదొలగాలని ప్రభుత్వం దాఖలు చేసిన కేసుని పరిష్కరించా ల్సిన కోర్టు తన పరిధిలో లేని అంశాల గురించి వ్యాఖ్యానించడం ఆశ్చర్యాన్ని కాదు ఆందోళనని కల్గిస్తుంది. పైగా లెజిస్లేటివ్ కౌన్సిల్ మీద ప్రభుత్వం దాడి చేసింది. ఆ తరువాత ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేసింది. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టుల మీద అధికారంలో ఉన్న వ్యక్తులు దాడి చేస్తున్నారని కోర్టు తన ఆందోళనని వ్యక్తం చేసింది. అక్కడితో ఊరుకోలేదు. 2011 నుంచి విచారణలో ఉన్న కేసుల్లో ఇంతవరకు విచారణాంశాలను నిర్ధారించకపోవడం అపహాస్యం కాదా అని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. కోర్టుల్లో జాప్యానికి కారణాలు అనేకం. దానికి సమాధానాన్ని సంబం ధిత కోర్టు వివరిస్తుంది. మరొకరు వివరించలేరు. సీబీఐ ఏర్పాటు న్యాయబద్ధం కాదని అస్సాం హైకోర్టు ఇచ్చిన తీర్పు దాదాపు ఎని మిదేళ్లుగా సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఈ జాప్యానికి కారణం ఏమిటి? సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఇటీవల ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూడా. న్యాయమూర్తి రాకేశ్ కుమార్ విచారణ అంశం కానీ చాలా విష యాలను తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. అందులో ముఖ్యమైంది గూగుల్లో ముఖ్యమంత్రి గురించిన ప్రస్తావన. కోర్టు విచారణలో ఉన్న అంశం ఏమిటి? న్యాయమూర్తి ప్రస్తావించిన అంశాలు ఏమిటి? విచిత్రమైన అంశం ఏమంటే మనదేశ జ్యురిస్ప్రుడెన్స్ ప్రకారం నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిలను అమాయకులుగా పరిగణిం చాలి. ఇది ప్రాథమిక సూత్రం. ఈ విషయాన్ని ఎవరూ విస్మరించ కూడదు. తప్పుచేసిన వ్యక్తికి శిక్ష పడటం ఎంత అవసరమో, అమాయ కులకి శిక్ష పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా కోర్టుల మీద ఉంటుంది. అంతేకాని కోర్టు విచారణలో లేని అంశాల మీద మాట్లా డటం పరిశీలనలు చేయడంలోని ఔచిత్యం బోధపడటం లేదు. కోర్టుల మీద విశ్వసనీయత పెరగాలంటే కోర్టులు జారీచేసే ఉత్త ర్వులు, తీర్పులు తగు కోణాలతో ఉండాలి. అంతేకాదు అవి వెంటనే పార్టీలకు అందుబాటులో ఉండాలి. తీర్పులు నిష్పక్షపాతంగా ఉండా లంటే అవి తగు కారణాలతో ఉండాలి. కోర్టు పరిధిలో ఉన్న అంశాల మీదే చర్చ జరగాలి. వాటి గురించి విశ్లేషణ ఉండాలి. అదేవిధంగా కోర్టు ఒక నిర్ణయానికి రావడానికి కారణాలనేవి ఎలాంటి పూర్వ భావ నలు, పక్షపాతం లేకుండా ఉండాలి. విచారించాల్సిన దరఖాస్తులో కానీ కేసులో గానీ లేని విషయాలని ప్రస్తావిస్తే అది తగు కారణాలతో చెప్పిన ఉత్తర్వుగా గానీ తీర్పుగా కానీ పరిగణించ బడదు. పార్టీలు లేవనెత్తిన అంశాలన్నింటిపైనా సమాధానాలు కోర్టు ఉత్తర్వుల్లో ఉండాలి. అలా లేనప్పుడు ఆ కోర్టు మీద విశ్వసనీయత ఏర్పడదు. అనవసర కామెంట్స్, తగు కారణాలు లేనప్పుడు ఆ వ్యాఖ్యానాలని తొలగించుకోవడానికి, సరైన కోణాలలో తీర్పు కోసం పార్టీలు పై కోర్టులకి వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల కోర్టులమీద అనవసర భారం పడుతుంది. తగు కారణాలతో తీర్పులు ప్రకటించడంవల్ల కోర్టుల మీద భారం తగ్గుతుంది. న్యాయమూర్తి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అతను స్వేచ్ఛగా, స్వతంత్రంగా తీర్పులను ప్రకటించాలి. తన మనఃసాక్షిగా, చట్టానికి అనుగుణంగా తీర్పులను ఇవ్వాలి తప్ప, కోర్టు విచారణలో లేని అంశాలను ప్రస్తావించకూడదు. నిష్పక్షపాతం గురించి సుప్రీంకోర్టు ఎస్.పి గుప్తా కేసులో వివరించింది. అది ఇప్పటికీ ఓ గీటురాయి. కేసు విచారణ గురించి సుప్రీంకోర్టు ఆ తీర్పుని ప్రకటించినప్పటికీ అది అన్ని ఉత్తర్వులకి, తీర్పులకి వర్తిస్తుంది. ఓ న్యాయమూర్తి నిష్పక్ష పాతాన్ని, అతని ఉత్తర్వులు ఎలాంటి పక్షపాతంలో లేవని అనుకోవ డానికి రెండు పరీక్షలు ఉన్నాయి. అవి– వ్యక్తిగత పరీక్ష: న్యాయమూర్తికి కేసులో ఎలాంటి వ్యక్తిగత ఆసక్తి ఉండకూడదు. తన విశ్వాసాల వల్ల ఎదుటి వ్యక్తికి హాని జరుగకూడదు. తటస్థ పరీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్): తన నిష్పక్షపాతం మీద ఎలాంటి సంశయం రాకుండా ఉండే విధంగా విచారణ జరపాలి. చాలాసార్లు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పార్టీలకు విశ్వాసం లేనప్పుడు న్యాయమూర్తి ఆ కేసుని నిష్పక్ష పాతంగా పరిష్కరించినా అలాంటి భావన పార్టీలకు కలగదు. అలాం టప్పుడు ఆ కేసులని పరిష్కరించడం ఎందుకు? అనవసర విషయాల ప్రస్తావన మరెందుకు? ఇలాంటి వాటివల్ల కోర్టులపై గౌరవం తగ్గే అవకాశం లేదా? చివరగా ఇద్దరు న్యాయమూర్తులు గుర్తుకొస్తున్నారు. ఒకరు జస్టిస్ మురళీధర్. రెండవవారు జస్టిస్ చంద్రూ. మొదటి న్యాయమూర్తి ఢిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్/హరియాణాకి బదిలీ అయినప్పుడు చండీగఢ్లో న్యాయమూర్తులు దారి పొడవునా నిల్చొని ఆహ్వానం పలికారు. అదే విధంగా జస్టిస్ చంద్రూ నిరాడంబరంగా తన పదవీ విరమణ చేశారు. ప్రజల న్యాయమూర్తిగా ఆయనను కొని యాడారు. దేశం ఇలాంటి న్యాయ మూర్తులనే కోరుకుంటుంది. మంగారి రాజేందర్ (వ్యాసకర్త గతంలో జిల్లా జడ్జిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పనిచేశారు) ఈ–మెయిల్ : rajenderzimbo@gmail.com -
జస్టిస్ రాకేశ్కుమార్ పదవీ విరమణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్కుమార్ గురువారం పదవీ విరమణ చేశారు. గత ఏడాది నవంబర్ 9న పాట్నా హైకోర్టు నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయన 13 నెలల పాటు ఇక్కడ ఉన్నారు. పదవీ విరమణ అనంతర కార్యక్రమం తరువాత గురువారం రాత్రే ఆయన కుటుంబ సమేతంగా తన స్వస్థలం పాట్నా కు వెళ్లిపోయారు. ప్రతి న్యాయమూర్తి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసే అధికారిక వీడ్కోలు కార్యక్రమాన్ని హైకోర్టు ఈసారి ఏర్పాటు చేయలే దు. ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలులో న్యాయమూర్తులంతా సమావేశం కావడం సంప్రదాయంగా వస్తోంది. కరోనా నేపథ్యంలో ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు నిర్వహించింది. అయితే తనకు అధికారిక వీడ్కోలు కార్యక్రమం వద్దని జస్టిస్ రాకేశ్కుమారే తిరస్కరించినట్లు హైకోర్టు వర్గాలు చెబుతున్నాయి. దీంతో న్యాయమూర్తులు జడ్జిల లాంజ్లోనే జస్టిస్ రాకేశ్ కుమార్ దంపతులను సత్కరించారు. తరువాత తెలుగుదేశం పార్టీ న్యాయవాదులు జస్టిస్ రాకేశ్ కుమార్ను ఆయన చాంబర్లో ప్రత్యేకంగా కలిసి సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. చివరిగా న్యాయమూర్తులందరూ కారు వరకు వచ్చి జస్టిస్ రాకేశ్కుమార్కు వీడ్కోలు పలికారు. జస్టిస్ రాకేశ్కుమార్ కారులో వెళుతూ రోడ్డుకు ఇరువైపులా నిల్చున్న అమరావతి రైతుల్ని చూసి కారును స్లో చేసి, కారు తలుపు తీశారు. దీంతో రైతులు ఆయన వద్దకు వెళ్లి కండువాలతో సత్కరించి, జ్ఞాపికలు బహూకరించారు. ఆయన నవ్వుతూ వాటిని స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. సిక్కిం హైకోర్టుకు బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి జనవరి 4న అక్కడ ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. -
గత సర్కారు నుంచి భూములు తీసుకున్నారు..
సాక్షి, అమరావతి: ‘‘అమరావతిలో గత ప్రభుత్వం నుంచి న్యాయమూర్తులు నామమాత్రపు రేట్లకే భూములు తీసుకున్నారు. ఇలా న్యాయమూర్తులు భూములు తీసుకోవచ్చా? తీసుకుంటే ఆ న్యాయమూర్తులు పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలకు సంబంధించిన కేసులను నిష్పాక్షికంగా విచారణ జరపగలరా? అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇది న్యాయవ్యవస్థ మౌలిక స్వరూపానికి సంబంధించిన అంశం. దీనిపై వాదనలు వినిపించేందుకు నాకు అవకాశమివ్వండి. కనీసం వాదనలు వినిపించే అవకాశం కూడా ఇవ్వకపోవడం రాజ్యాంగం నాకు ప్రసాదించిన హక్కును హరించడమే అవుతుంది. ఒకవేళ ఈ వ్యాజ్యంపై విచారించడానికి ఇబ్బంది ఉంటే, దానిపై జ్యుడిషియల్ ఆర్డర్ జారీ చేయండి. తదనుగుణంగా మేం తదుపరి చర్యలు చేపడతాం’’ అని న్యాయవాది సింహంభట్ల శరత్కుమార్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యానికి, తమ ముందున్న రాజధానుల కేసుకు సంబంధం లేదని, ఇది పూర్తిగా వేరే అంశమని, ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు జ్యుడిషియల్ ఆర్డర్ ఇస్తామని స్పష్టం చేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి సోమవారం విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) శ్రీరామ్ స్పందిస్తూ.. తొలుత ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మంగళవారం తన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. కాగా, ఈ కేసులపై విచారణ ప్రారంభమవడానికి ముందే.. శరత్కుమార్ తన కేసును ప్రస్తావించారు. పలుమార్లు తన కేసును ప్రస్తావించినప్పటికీ, వాదనలు వినిపించేందుకు తనకు ఇప్పటివరకు అవకాశం రాలేదన్నారు. న్యాయమూర్తులకు గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల గురించి ప్రస్తావిస్తూ.. తన పిటిషన్లోని పలు కీలకాంశాల్లో ఇదొకటని వివరించారు. అయితే ధర్మాసనం ఈ వ్యాజ్యానికీ, తమ ముందున్న వ్యాజ్యాలకు సంబంధం లేదంది. కనీసం తన వ్యాజ్యం విచారణకు నిర్దిష్టమైన తేదీని ఇవ్వాలని శరత్కుమార్ అభ్యర్థించగా.. ధర్మాసనం స్పందించలేదు. -
న్యాయమూర్తులు ఆదర్శప్రాయమైన జీవితం గడపాలి
గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయమూర్తులు విధి నిర్వహణలో నీతి, నిజాయితీతో పని చేసి ఆదర్శప్రాయ జీవితాన్ని గడపాలని ఏపీ ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. గుంటూరులో వైఎస్సార్ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ జి.శాంతమూర్తి అధ్యక్షతన ‘సుపరిపాలన సాధనలో న్యాయ వ్యవస్థ పాత్ర’ అంశంపై శనివారం ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు రాజ్యాంగానికి మూల స్తంభాలని, వాటి మధ్య ఘర్షణ ఉండకూడదన్నారు. ఎవరో ఒక వ్యక్తి అవినీతిపరుడు అయినంత మాత్రాన వ్యవస్థ ఎప్పటికీ కళంకం కాదన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రి వ్యవస్థలో చోటు చేసుకుంటున్న లోపాలపై ఆధారాలతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. -
ఇంటిపెద్దకు కాకుంటే ఇంకెవరికి ఫిర్యాదు చేయాలి?
సాక్షి, అమరావతి: కొందరు న్యాయమూర్తుల వ్యవహార శైలిపై ఫిర్యాదు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయడం ఏమాత్రం తప్పు కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అలహాబాద్ హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దంతులూరి శ్రీనివాస రంగనాథవర్మ స్పష్టం చేశారు. ఇంట్లో వాళ్లు తప్పు చేసినప్పుడు ఇంటి పెద్దకే ఫిర్యాదు చేస్తారని, ఇది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తమపై ఫిర్యాదులు చేయడానికి వీల్లేదనేందుకు న్యాయమూర్తులేమీ చట్టాలకు అతీతులు కారన్నారు. రాష్ట్ర హైకోర్టుపై ఓ వ్యక్తికి ఉన్న పట్టు గురించి విదేశీ పరిశోధకులే తమ పరిశోధన పత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నారని, ఆ తరువాత ఈ విషయాన్ని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆధారాలతో సహా బయట పెట్టారని చెప్పారు. ప్రశ్నిస్తే కోర్టు ధిక్కారమంటే అది గొంతు నొక్కేయడమేనన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పలు అంశాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం.. ఓ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయకూడదని గానీ, లేఖ రాయకూడదని గానీ ఎక్కడా లేదు. గతంలోనూ చాలా మంది రాశారు. ప్రభుత్వాలు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత హోదాలో కాకుండా ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేశారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. లేఖను బహిర్గతం చేయడంలో మంచి చెడులను ప్రజల విజ్ఞతకే వదిలేద్దాం. గతంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, జోసెఫ్ మరొకరు మీడియా ముందుకు వచ్చి రోస్టర్ విషయంలో నాటి ప్రధాన న్యాయమూర్తి పారదర్శకంగా వ్యవహరించడం లేదని బహిరంగంగా తమ ఆవేదనను గొంతెత్తి చెప్పారు. ఆయన ఎవరో అందరికీ తెలుసు.. 2004–05లో ఇంగ్లాడ్ బర్మింగ్హాం యూనివర్సిటీకి చెందిన ఓ వ్యక్తి భారతీయ న్యాయవ్యవస్థపై పరిశోధన చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాష్ట్ర న్యాయవ్యవస్థపై గట్టి పట్టుకలిగి ఉన్నారని పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. ఆ ముఖ్యమంత్రి పేరును కూడా ఉదహరించారు. ఆయన ఎవరో అందరికీ తెలుసు. విదేశీ స్కాలర్స్ కూడా భారత న్యాయవ్యస్థ గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ గురించి అలా మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫిర్యాదు చేయకూడదంటే ఎలా..? ముఖ్యమంత్రి ఫిర్యాదుపై సుప్రీంకోర్టు సీజే ఓ కమిటీ ద్వారా అంతర్గత విచారణ జరుపుతారు. హైకోర్టు న్యాయమూర్తుల విషయంలో ఆరోపణలు రుజువైతే సాధారణంగా బదిలీ చేస్తారు. లేదా రకరకాల కారణాలతో చర్యలు తీసుకుండానే వదిలేస్తారు. అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తులు తప్పులు చేశారనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఫిర్యాదు చేయకూడదంటే ఎలా? ఆధారాలున్నప్పుడు కూడా ఫిర్యాదు చేయకూడదంటే ఎలా? బాధతోనే సీఎం స్పందించారు.. ప్రభుత్వానికి నష్టం కలిగించేలా, అభద్రతా భావం కలిగించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించరాదు. వ్యవస్థలను అభద్రతా భావంలోకి నెట్టడం న్యాయవ్యవస్థ పని కాదు. అలా అభద్రతా భావం కలిగించినప్పుడు బాధతోనే ముఖ్యమంత్రి స్పందించి సీజేఐకి లేఖ రాశారు. అందులో తప్పేమీ లేదు. కోర్టు ధిక్కార చట్టాన్ని ఇష్టమొచ్చినట్లు వాడరాదు. అలా చేస్తే ప్రశ్నించే వ్యక్తులు, ప్రభుత్వాల గొంతు నొక్కేయడమే అవుతుంది. లోతుగా విచారణ జరిపి ఆరోపణలకు ఆస్కారం రాకుండా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ చాలా తప్పు... ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ చాలా తప్పు. అది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత దర్యాప్తు పూర్తి చేయాలి. అది ఆపడానికి వీల్లేదు. హైకోర్టు దర్యాప్తును ఆపేయడమే కాకుండా గ్యాగ్ ఉత్తర్వులిచ్చింది. అలా చేసి ఉండాల్సింది కాదు. నియామకాల్లో పారదర్శకత ఉండాలి.. న్యాయవ్యవస్థలో చాలా వరకు రాజకీయ నియామకాలేనన్న ఆరోపణలున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే న్యాయవ్యవస్థలో సంస్కరణలు రావాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. న్యాయమూర్తుల నియామకాల్లో పారదర్శకత ఉండాలి. అభిప్రాయ సేకరణ జరగాలి. సమర్థతకు పట్టం కట్టాలి. ఇష్టానుసారంగా నిందలు సరికాదు... న్యాయమూర్తుల బెంచ్ మీద నుంచి ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నది నా అభిప్రాయం. నేను జడ్జిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తి ఒకరు ఓ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వమే పెద్ద భూ కబ్జాదారని వ్యాఖ్యానించడంపై సీజేకు ఫిర్యాదు వెళ్లింది. ప్రభుత్వమే భూ కబ్జాదారంటే ఎలా? అది ఎంత పెద్ద మాట? కోర్టులు, న్యాయమూర్తులు ఇలా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఇక సుప్రీంకోర్టు సీజేకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటారు? ఆ లేఖలు.. మక్కీకి మక్కీ జస్టిస్ చలమేశ్వర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు.. ఓ న్యాయమూర్తికి, నాటి ప్రభుత్వాధినేతకు మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బహిర్గతం చేయడం సంచలనం రేకెత్తించింది. న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఒకరు లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి నాటి ప్రభుత్వాధినేత నుంచి కూడా సుప్రీంకోర్టుకు లేఖ వచ్చింది. రెండు లేఖలు మక్కీకి మక్కీగా ఉన్నాయి. దీన్ని ఎలా భావించాలి? ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలన్నదే ప్రజల ఆకాంక్ష. -
అచ్చు గుద్దినట్లు ఇద్దరిదీ ఒకే మాట
సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన సమయంలో న్యాయమూర్తుల విభజన విషయంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబు నాయుడు, అదే సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వి రమణలు ఏకతాటిపై నడిచారు. అచ్చు గుద్దినట్లు ఇద్దరూ ఒకే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల విభజనపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణ సీఎం వెంటనే కొలీజియంకు తన అభిప్రాయాలు చెబితే, చంద్రబాబు మాత్రం కొన్ని నెలల సమయం తీసుకుని 2017 మార్చి 21న కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు తన అభిప్రాయాన్ని చెబుతూ లేఖ రాశారు. ఆ తర్వాత ఆయన సిఫార్సు చేసిన పేర్లు, వ్యాఖ్యలు, యథాతథంగా జస్టిస్ ఎన్వి రమణ తన అభిప్రాయంగా చెబుతూ 2017 మార్చి 23న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆరుగురిపై చంద్రబాబు, ఎన్వీ రమణ వెల్లడించిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. (ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం’ కమాండ్) డీవీఎస్ సోమయాజులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఆయన తండ్రి డీవీ సుబ్బారావు పనిచేశారు. విశాఖ పట్టణంలో న్యాయవాదిగా పని చేసిన సోమయాజులు హైకోర్టులో ఎలాంటి ముఖ్యమైన కేసు ఫైల్ చేయలేదు. ఈయనపై లైంగిక వేధింపులున్నాయని సహోద్యోగులు ఫిర్యాదు చేశారు. ఇతన్ని న్యాయమూర్తిగా సిఫార్సు చేయడానికి విశాఖపట్టణం కోర్టులో ఎలాంటి గుర్తింపు పొందిన కేసు వాదించిన దాఖలాలు లేవు. శ్రీమతి కొంగర విజయలక్ష్మి మంచి న్యాయవాదిగా ఎలాంటి గుర్తింపు పొందిన దాఖలా లేవు. వృత్తి పరమైన అదనపు అర్హతలు లేవు. ఇప్పటి వరకు 194 కేసులు, 75 వకాల్తాలు మాత్రమే ఫైల్ చేశారు. కానీ రెండు కేసులు మాత్రమే ఆమె విషయంలో మంచివిగా చెప్పుకోవాలి. 2012-16 వరకు 91 కేసులు మాత్రమే ఫైల్ చేశారు. అందులోనూ ఆమె వృత్తిపరమైన ప్రాధాన్యత కన్పించ లేదు. ఇలాంటి వ్యక్తిని న్యాయమూర్తిగా ఎలా సిఫార్సు చేశారనేది ఆశ్చర్యంగా ఉంది. టి అమర్నాథ్ గౌడ్ ఈయన హైకోర్టు మాజీ న్యాయమూర్తి బంధువు. అంతకు మించి అతని వృత్తి నైపుణ్యాన్ని ఎప్పుడూ న్యాయ వ్యవస్థలతో కనబరచిన దాఖలాలు లేవు. 1545 కేసులు, 366 వకాలత్లు ఆయన కెరీర్లో ఫైల్ చేశారు. ఐదేళ్లలో (2012-16) 123 మాత్రమే ఫైల్ చేశారు. వృత్తిపరమైన దక్షత, సమగ్ర అవగాహన లోపాలున్నాయి. ఇలాంటి వ్యక్తి న్యాయమూర్తిగా సమర్థనీయం కాదు. అభినంద కుమార్ షావ్లీ జస్టిస్ నూతి రామ్మోహన్రావు ఛాంబర్లో జూనియర్గా పని చేశారు. ఆయన బదిలీ అవ్వడానికి షావ్లీనే కారణమనే ఆరోపణలున్నాయి. ఇతనికి ఎలాంటి అదనపు వృత్తి నైపుణ్యం లేదు. 1513 కేసులు, 414 వకల్తాలు మాత్రమే చేశారు. ఏదీ చెప్పుకోదగ్గది కాదు. ఐదేళ్లలో 262 కేసులు మాత్రమే ఫైల్ చేశాడు. ఇతను ఎంతమాత్రం సిఫార్సు చేయదగ్గవ్యక్తి కాదు. ఎం.గంగారావు ఆంధ్రప్రదేశ్ మాజీ జడ్జి జస్టిస్ సీవీ రాములు వద్ద పనిచేశారు. అంతకు మంచి ఎలాంటి మంచి కేసులు వాదించలేదు. ఐదేళ్లలో 123 కేసులు ఫైల్ చేసినా, ప్రతి దాంట్లో అతని వృత్తి నైపుణ్యం ఏమాత్రం కన్పించలేదు. పి కేశవరావు ఉన్నవాళ్లతో పోలిస్తే మంచి వృత్తి నైపుణ్యం ఉన్న వ్యక్తే. -
ఆ కేసును సీబీఐకి అప్పగించడం ఉత్తమం
సాక్షి, అమరావతి : ఇటీవల వివిధ సందర్భాల్లో హైకోర్టు తీర్పులిచ్చినప్పుడు సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై వచ్చిన పోస్టులపై స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఆదేశించడం ఉత్తమమని హైకోర్టు గురువారం అభిప్రాయపడింది. స్వతంత్ర సంస్థ పరిధి విస్తృతమైనది కావడం.. దానికి దేశవ్యాప్తంగా శాఖలు ఉండటం.. తదితర కారణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ పరిణామం ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సీఐడీకి కూడా మేలు చేస్తుందని, దానిని ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదని హైకోర్టు తెలిపింది. అలాగే, సీఐడీపై తమ ఉత్తర్వుల్లో ఎలాంటి దురుద్దేశాలను, నిందలను మోపబోమని హైకోర్టు స్పష్టంచేసింది. దీంతో, ఆ పోస్టులపై స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఆదేశించడంపై తమకెలాంటి అభ్యంతరంలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్, సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని, అలాంటి వాటిని ప్రభుత్వం ఎన్నడూ ప్రోత్సహించదని శ్రీరామ్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకోర్టు, ఈ వ్యవహారంపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ రాకేశ్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై వ్యాఖ్యలు, పోస్టులు చేసిన వారి వివరాలతో రిజిస్ట్రార్ జనరల్ దాఖలు చేసిన సవరణ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. టీడీపీ ఇంప్లీడ్ పిటిషన్కు నో అనంతరం.. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ టీడీపీ నేత ఎం.శివానందరెడ్డి తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతించబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. కేసు దర్యాప్తును సీఐడీ కొనసాగించేలా ఆదేశాలివ్వడమా? లేక దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించడమా? అన్నదే తమ ముందున్న ప్రధాన ప్రశ్న అని.. దీనిపైనే తాము తేలుస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది. నాకెలాంటి పరిమితుల్లేవు : ఏజీ ఈ సమయంలో ఏజీ శ్రీరామ్.. ఉన్నం మురళీధరరావు వాదనలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. టీడీపీ నేతలు హైకోర్టును ఓ వేదికగా చేసుకుంటున్నారని ఏజీ చెప్పగా, అడ్వొకేట్ జనరల్గా మీకు కొన్ని పరిమితులున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టుకు సహకరించే విషయంలో తనకెలాంటి పరిమితులు లేవని శ్రీరామ్ తేల్చిచెప్పారు. ఎవ్వరూ కూడా గొంతెత్తడానికి వీల్లేదు : ధర్మాసనం రిజిస్ట్రార్ జనరల్ తరఫున ఎన్.అశ్వినీకుమార్ వాదనలు వినిపిస్తూ.. కోర్టుల నుంచే పాలన సాగిస్తారా? అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను చదివి వినిపించారు. ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనని ధర్మాసనం స్పష్టంచేసింది. ఎవరూ వీధుల్లో గొంతెత్తడానికి వీల్లేదని జస్టిస్ రాకేశ్కుమార్ వ్యాఖ్యానించారు. అవి సీఐడీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి : నిరంజన్రెడ్డి ఆ తర్వాత.. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో సీఐడీ సక్రమంగా దర్యాప్తు చేయడంలేదన్న అభిప్రాయానికి రావొద్దని ధర్మాసనాన్ని కోరారు. సీఐడీ సమర్థతను శంకించవద్దని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. సీబీఐ పరిధి విస్తృతమని స్పష్టంచేస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై నిరంజన్రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాఖ్యలు పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తాయని, అవన్నీ సీఐడీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయలేదని భావిస్తే, సంబంధిత మేజిస్ట్రేట్ను ఆశ్రయించాలే తప్ప, అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని.. సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. హైకోర్టుకూ ఈ తీర్పు వర్తిస్తుందని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. సీబీఐకి అప్పగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. న్యాయమూర్తులూ మానవమాత్రులేనని, తప్పులు చేయడం సహజమేనని.. తీర్పు తప్పని భావిస్తే పైకోర్టుకు వెళ్లాలే తప్ప జడ్జీలను దూషించడం సరికాదని వ్యాఖ్యానించింది. దీంతో.. దర్యాప్తును ఏ సంస్థకు అప్పగించినా తమకు ఇబ్బందిలేదని.. సీఐడీ సమర్థతను శంకించే రీతిలో ఉత్తర్వులు ఉండకూడదన్నదే తన అభిప్రాయమని నిరంజన్రెడ్డి తెలిపారు. సీఐడీపై ఎలాంటి దురుద్దేశాలను, నిందలను మోపబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఒక వ్యవస్థ మరో వ్యవస్థను గౌరవించాలి : ఏజీ ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ప్రతీ వ్యవస్థా వారి వారి పరిధిలో పనిచేయాలని, ఒక వ్యవస్థను మరో వ్యవస్థ గౌరవించాలని రాజ్యాంగం చెబుతోందని శ్రీరామ్ తెలిపారు. పిటిషనర్ న్యాయవాది 151 ఎమ్మెల్యేల సీట్ల గురించి మాట్లాడాల్సిన అవసరంలేదన్నారు. కేసు దర్యాప్తును సీబీఐకి ఇచ్చినా తమకు అభ్యంతరంలేదని, ప్రభుత్వానికీ ఉండదన్నారు. ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. విజయవాడలోనే సీబీఐ ఆఫీసు తెరవాల్సి ఉంటుంది: హైకోర్టు రాష్ట్రంలో పోలీసుల చర్యలపై దర్యాప్తులకు ఆదేశించాలంటే విజయవాడలోనే సీబీఐ ఆఫీసును తెరవాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ డైరెక్టర్ను పిలిచి సీబీఐ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని కోరేలా రాష్ట్రంలో పరిస్థితులున్నాయంది. పోలీసులు తమ సంబందీకులను అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పోలీసుల తరఫున సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. టీడీపీకి చెందిన మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్, ఆయన భార్యపై నిరుద్యోగులను మోసం చేసిన ఆరోపణలున్నాయన్నారు. వీరిపై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయని, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వీరిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ సీనియర్ సివిల్ జడ్జి నివేదిక చాలా స్పష్టంగా ఉందని, పోలీసులు చేసిన అన్ని పనులను అందులో వివరించారని తెలిపింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
న్యాయమూర్తులపై దూషణల కేసు సీబీఐకి: హైకోర్టు
సాక్షి, అమరావతి : ఇటీవల వివిధ సందర్భాల్లో హైకోర్టు తీర్పులిచ్చినప్పుడు సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై వచ్చిన పోస్టులపై స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఆదేశించడం ఉత్తమమని హైకోర్టు గురువారం అభిప్రాయపడింది. స్వతంత్ర సంస్థ పరిధి విస్తృతమైనది కావడం.. దానికి దేశవ్యాప్తంగా శాఖలు ఉండటం.. తదితర కారణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ పరిణామం ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న సీఐడీకి కూడా మేలు చేస్తుందని, దానిని ఎవరూ వేలెత్తి చూపే అవకాశం ఉండదని హైకోర్టు తెలిపింది. అలాగే, సీఐడీపై తమ ఉత్తర్వుల్లో ఎలాంటి దురుద్దేశాలను, నిందలను మోపబోమని హైకోర్టు స్పష్టంచేసింది. దీంతో, ఆ పోస్టులపై స్వతంత్ర సంస్థ దర్యాప్తునకు ఆదేశించడంపై తమకెలాంటి అభ్యంతరంలేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్, సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. (ఆంధ్రజ్యోతి తప్పుడు కథనం: ఆ పిల్ను కొట్టేయండి) సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని, అలాంటి వాటిని ప్రభుత్వం ఎన్నడూ ప్రోత్సహించదని శ్రీరామ్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హైకోర్టు, ఈ వ్యవహారంపై తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ రాకేశ్కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై వ్యాఖ్యలు, పోస్టులు చేసిన వారి వివరాలతో రిజిస్ట్రార్ జనరల్ దాఖలు చేసిన సవరణ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. టీడీపీ ఇంప్లీడ్ పిటిషన్కు నో అనంతరం.. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ టీడీపీ నేత ఎం.శివానందరెడ్డి తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతించబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. కేసు దర్యాప్తును సీఐడీ కొనసాగించేలా ఆదేశాలివ్వడమా? లేక దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించడమా? అన్నదే తమ ముందున్న ప్రధాన ప్రశ్న అని.. దీనిపైనే తాము తేలుస్తామని ధర్మాసనం స్పష్టంచేసింది. నాకెలాంటి పరిమితుల్లేవు : ఏజీ ఈ సమయంలో ఏజీ శ్రీరామ్.. ఉన్నం మురళీధరరావు వాదనలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. టీడీపీ నేతలు హైకోర్టును ఓ వేదికగా చేసుకుంటున్నారని ఏజీ చెప్పగా, అడ్వొకేట్ జనరల్గా మీకు కొన్ని పరిమితులున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టుకు సహకరించే విషయంలో తనకెలాంటి పరిమితులు లేవని శ్రీరామ్ తేల్చిచెప్పారు. ఎవ్వరూ కూడా గొంతెత్తడానికి వీల్లేదు : ధర్మాసనం రిజిస్ట్రార్ జనరల్ తరఫున ఎన్.అశ్వినీకుమార్ వాదనలు వినిపిస్తూ.. కోర్టుల నుంచే పాలన సాగిస్తారా? అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను చదివి వినిపించారు. ఈ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారమేనని ధర్మాసనం స్పష్టంచేసింది. ఎవరూ వీధుల్లో గొంతెత్తడానికి వీల్లేదని జస్టిస్ రాకేశ్కుమార్ వ్యాఖ్యానించారు. అవి సీఐడీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి : నిరంజన్రెడ్డి ఆ తర్వాత.. సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో సీఐడీ సక్రమంగా దర్యాప్తు చేయడంలేదన్న అభిప్రాయానికి రావొద్దని ధర్మాసనాన్ని కోరారు. సీఐడీ సమర్థతను శంకించవద్దని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. సీబీఐ పరిధి విస్తృతమని స్పష్టంచేస్తూ పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనిపై నిరంజన్రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ వ్యాఖ్యలు పత్రికల్లో పతాక శీర్షికల్లో వస్తాయని, అవన్నీ సీఐడీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయలేదని భావిస్తే, సంబంధిత మేజిస్ట్రేట్ను ఆశ్రయించాలే తప్ప, అధికరణ 226 కింద హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని.. సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. హైకోర్టుకూ ఈ తీర్పు వర్తిస్తుందని వివరించారు. ధర్మాసనం స్పందిస్తూ.. సీబీఐకి అప్పగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. న్యాయమూర్తులూ మానవమాత్రులేనని, తప్పులు చేయడం సహజమేనని.. తీర్పు తప్పని భావిస్తే పైకోర్టుకు వెళ్లాలే తప్ప జడ్జీలను దూషించడం సరికాదని వ్యాఖ్యానించింది. దీంతో.. దర్యాప్తును ఏ సంస్థకు అప్పగించినా తమకు ఇబ్బందిలేదని.. సీఐడీ సమర్థతను శంకించే రీతిలో ఉత్తర్వులు ఉండకూడదన్నదే తన అభిప్రాయమని నిరంజన్రెడ్డి తెలిపారు. సీఐడీపై ఎలాంటి దురుద్దేశాలను, నిందలను మోపబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. ఒక వ్యవస్థ మరో వ్యవస్థను గౌరవించాలి : ఏజీ ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ప్రతీ వ్యవస్థా వారి వారి పరిధిలో పనిచేయాలని, ఒక వ్యవస్థను మరో వ్యవస్థ గౌరవించాలని రాజ్యాంగం చెబుతోందని శ్రీరామ్ తెలిపారు. పిటిషనర్ న్యాయవాది 151 ఎమ్మెల్యేల సీట్ల గురించి మాట్లాడాల్సిన అవసరంలేదన్నారు. కేసు దర్యాప్తును సీబీఐకి ఇచ్చినా తమకు అభ్యంతరంలేదని, ప్రభుత్వానికీ ఉండదన్నారు. ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. విజయవాడలోనే సీబీఐ ఆఫీసు తెరవాల్సి ఉంటుంది: హైకోర్టు రాష్ట్రంలో పోలీసుల చర్యలపై దర్యాప్తులకు ఆదేశించాలంటే విజయవాడలోనే సీబీఐ ఆఫీసును తెరవాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీబీఐ డైరెక్టర్ను పిలిచి సీబీఐ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని కోరేలా రాష్ట్రంలో పరిస్థితులున్నాయంది. పోలీసులు తమ సంబం«దీకులను అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పోలీసుల తరఫున సత్యనారాయణ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. టీడీపీకి చెందిన మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడు రెడ్డి గౌతమ్, ఆయన భార్యపై నిరుద్యోగులను మోసం చేసిన ఆరోపణలున్నాయన్నారు. వీరిపై బహుళ ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయని, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వీరిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ సీనియర్ సివిల్ జడ్జి నివేదిక చాలా స్పష్టంగా ఉందని, పోలీసులు చేసిన అన్ని పనులను అందులో వివరించారని తెలిపింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
జడ్జీలూ సోషల్ మీడియా బాధితులే
న్యూఢిల్లీ: అవాకులు చెవాకులు అర్థం పర్థం లేని నిందలు మోపుతూ చేసే సోషల్ మీడియా పోస్టింగులతో జడ్జీలూ బాధితులుగా మారుతున్నారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా పోస్టులకు జడ్జీలెవరూ స్పందించకుండా దూరంగా ఉంటే మంచిదన్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ భానుమతి రచించిన ‘జ్యుడీషియరీ, జడ్జి అండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ రమణ మాట్లాడారు. జడ్జీలందరూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని భావించడం సరైంది కాదన్నారు. ఇతర వ్యక్తుల కంటే జడ్జీల జీవితాలు ఏమంత మెరుగ్గా ఉండవని, ఒక్కోసారి కుటుంబ సభ్యులూ త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడుతూ న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జడ్జీల వ్యక్తిగత లబ్ధి కోసమని కాకుండా, మొత్తం న్యాయవ్యవస్థ సమర్థంగా పని చేయడం కోసమైనా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పారు. లాయర్ ప్రశాంత్ భూషణ్ న్యాయవ్యవస్థను కించపరిచేలా పోస్టింగులు చేసి రూ.1 జరిమానా కట్టిన నేపథ్యంలో జడ్జీలు ఈ వ్యాఖ్యలు చేశారు. రచయిత్రి జస్టిస్‡ భానుమతి మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో విభిన్న కోణాలను పుస్తకంలో తన అభిప్రాయాలు చెప్పానన్నారు. -
కేంద్రానికి సహాయమంత్రి కిషన్ రెడ్డి వినతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 42 కు పెంచాలని కోరుతూకేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. విభజన సమయంలో తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీల నియామకానికి అనుమతించారని లేఖలో పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం హైకోర్టులో 14 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని కిషన్ రెడ్డి కేంద్రమంత్రికి తెలియజేశారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోందని, ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే జడ్జిల సంఖ్యను పెంచాలని కిషన్ రెడ్డి కేంద్రన్యాయ శాఖ మంత్రిని కోరారు. చదవండి: నిజామాబాద్లో 173 మంది వీఆర్ఓల బదిలీ -
కళ్లజోళ్ల కోసం ఒక్కో జడ్జికి రూ.50వేలు
ముంబై: కళ్ళజోళ్లు కొనుగోలు చేసేందుకు బొంబాయి హైకోర్టులోని ప్రతి న్యాయమూర్తికి సంవత్సరానికి రూ. 50 వేలు చెల్లించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రూపొందించిన గవర్నమెంట్ రిసొల్యూషన్(జీఆర్)ను సోమవారం ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రాల చట్టం, న్యాయవ్యవస్థ జీఆర్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. న్యాయమూర్తులు, వారి జీవిత భాగస్వాములతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా దీని పరిధిలోకి వస్తారు. ఈ మొత్తంలో పునరావృత ఖర్చులు కూడా ఉంటాయి. ఈ జీఆర్పై జూలై 10 జిఆర్ న్యాయ సలహాదారు, జాయింట్ సెక్రటరీ యోగేశ్ అమేటా సంతకం చేశారు. -
రెగ్యులర్ విచారణ ఇప్పట్లో కుదరదు
న్యూఢిల్లీ: కోర్టు విచారణలను గతంలో మాదిరిగానే మళ్లీ ప్రారంభించాలన్న న్యాయవాద సంఘాల డిమాండ్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కమిటీ ప్రస్తుతానికి తోసిపుచ్చింది. కరోనా విస్తృతిని పరిశీలించి, జూన్ 30న మరోసారి భేటీ కావాలని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఏడుగురు సీనియర్ జడ్జీల కమిటీ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఢిల్లీలో కరోనా నేపథ్యంలో కోర్టు కార్యకలాపాలను కొనసాగించే అవకాశాలపై కమిటీ సమీక్ష జరిపింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టు కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ ప్రతిపాదనను కమిటీ తోసిపుచ్చిందని, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని స్పష్టం చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ 30న మరోసారి సమావేశమై, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కమిటీ భావించిందని తెలిపాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆన్లైన్ విచారణలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. -
ఏపీ హైకోర్టు నూతన జడ్జీల ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి : రాష్ట్ర హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా నియమితులైన బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్ రెడ్డి, కన్నెగంటి లలితకుమారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ఇవాళ ఉదయం 11 గంటలకు వీరితో ప్రమాణం చేయించారు. కాగా ఈ ముగ్గురి నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరింది. -
ఆరుగురు సుప్రీం జడ్జిలకు హెచ్1ఎన్1 వైరస్
సాక్షి, న్యూఢిల్లీ: స్వైన్ ఫ్లూ కేసులు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఆందోళన రేపుతున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెందిన ఆరుగురు జడ్జిలకు ప్రాణాంతక మైన హెచ్1ఎన్1 (స్వైన్ప్లూ) వైరస్ సోకింది. దీంతో న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేతో అత్యవసరంగా సమావేశమయ్యారు. స్వైన్ ప్లూ వ్యాప్తి చెందుతున్న వైనంపై సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. అత్యవసర పరిస్థితులలో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) కోరామని తెలిపారు. అలాగే సుప్రీంకోర్టులో పనిచేసే వ్యక్తులపై టీకాలు వేయడానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అలాగే ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దేవ్తో కూడా సమావేశమయ్యారు. అనంతరం దేవ్ మాట్లాడాతూ వైరస్ వ్యాప్తిపై బాబ్డే చాలా ఆందోళన వ్యక్తం చేశారని, టీకాలు వేసేందుకు వీలుగా ఒక డిస్పెన్సరీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారన్నారు. కాగా కశ్మీర్, బెంగళూరు నగరాల్లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు గాకా, తాజా కేసులతో ఈ వైరస్ ఢిల్లీ నగరానికి కూడా విస్తరించింది. బెంగళూరుకు చెందిన సాప్ ఇండియా సంస్థ తన ఉద్యోగుల్లో ఇద్దరికి హెచ్1ఎన్1 పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్త చర్యగా అన్ని కార్యాలయాలను (శుభ్రపరిచేందుకు)మూసివేసింది. ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం చేయాల్సిందిగా సూచించిన సంగతి తెలిసిందే. -
ప్రత్యేక కోర్టుల్లో న్యాయమూర్తుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలపై జరిగే అత్యాచార కేసులను విచారించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలు జరిగాయి. 11 ప్రత్యేక కోర్టుల్లో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేస్తూ హైకోర్టు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం వేర్వేరు పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తులు ఈ నెల 28 లోగా బాధ్యతలను స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోర్టు–న్యాయమూర్తుల వివరాలు.. హైదరాబాద్–బి.శ్రీనివాసరావు, ఎల్బీనగర్ –కె.మారుతిదేవి, ఆదిలాబాద్–వై.జయప్రసాద్, వరంగల్–పి.ముక్తి దా, మహబూబ్నగర్–పి.ఆనీరోజ్, నల్లగొండ –వి.శారదాదేవి,ఖమ్మం–కె.అరుణకుమారి, కూకట్పల్లి(రంగారెడ్డిజిల్లా) –జె.మైత్రేయి,కరీంనగర్–డి.మాధవికృష్ణ, సంగారెడ్డి (మెదక్ జిల్లా)–ఎం.శ్యాం శ్రీ, నిజామాబాద్–టి.నర్సి రెడ్డి. -
జడ్జీలకూ ఝలక్!
కోడూరు చైతన్య.. బెంగళూరులోని ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్. సొంతూరు విజయవాడ వస్తుండగా 2012లో చిలకలూరిపేట వద్ద లారీ ఢీ కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. కనీసం కూర్చోలేరు. ఏం కావాలన్నా ఇతరులపై ఆధారపడాల్సిందే. ఈ పరిస్థితుల్లో భర్త కూడా దూరమయ్యారు. ప్రమాద బీమా కోసం న్యాయ పోరాటం చేశారు. 2017లో కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిస్తూ రూ.65 లక్షలను పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. బీమా కంపెనీ పీడీ ఖాతాలో జమ చేసిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. దీంతో ఇప్పటివరకు ఆమెకు పరిహారం అందక అవస్థలు ఎదుర్కొంటున్నారు. గుంటూరుకు చెందిన ఆటో డ్రైవర్ దీనయ్య 2003లో ప్రమాదానికి గురయ్యాడు. కింది కోర్టు రూ.1.20 లక్షలను పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది. బాధితుడు హైకోర్టులో పోరాటం చేయడంతో పరిహారం మొత్తాన్ని న్యాయస్థానం రూ.1.50 లక్షలకు పెంచింది. 2017లో కోర్టు దీనయ్యకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడంతో బీమా కంపెనీ పరిహారం మొత్తాన్ని జడ్జీ ఖాతాలో జమ చేసింది. ప్రభుత్వం ఆ డబ్బులను సొంతానికి వాడుకోవడంతో దీనయ్యకు ఒక్క పైసా కూడా అందలేదు. విశాఖకు చెందిన సుబ్బారావు దంపతుల కుమారుడు, కోడలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మనువడు, మనవరాలిని పోషించే భారం వారిపైనే పడింది. పరిహారం కింద రూ.42 లక్షలు చెల్లించాలన్న కోర్టు ఆదేశాల మేరకు బీమా కంపెనీ ఆ డబ్బును జిల్లా జడ్జి ఖాతాల్లో జమ చేసింది. అయితే పరిహారం డబ్బులను కూడా ప్రభుత్వం తన్నుకుపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సాక్షి, అమరావతి: సాఫీగా సాగిపోతున్న ప్రమాద బీమా పరిహారం చెల్లింపుల ప్రక్రియను ప్రభుత్వం సంక్లిష్టంగా మార్చేసింది. సుదీర్ఘ న్యాయ పోరాటం ద్వారా కోర్టు ఉత్తర్వుల మేరకు బీమా కంపెనీలు అందచేసిన పరిహారం సొమ్ము దాదాపు రూ.400 కోట్లకుపైగా పరిహారాన్ని బాధితులకు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాల బారినపడి జీవనోపాధి, కుటుంబ సభ్యులను పోగొట్టున్న బాధితులు ఎంతో మంది ఉన్నారు. వీరు పరిహారం కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి సానుకూల ఉత్తర్వులు పొందినా రాష్ట్ర ప్రభుత్వం కనికరించకపోవడంతో గత డిసెంబర్ నుంచి డబ్బులు పొందలేకపోతున్నారు. పరిహారం సొమ్ము ప్రభుత్వానిది కాదు.. వాస్తవానికి ప్రమాద బీమా పరిహారం చెల్లింపులతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. ప్రమాద బీమా కేసులు కోర్టుకు, బీమా కంపెనీలకు, బాధితులకు మాత్రమే సంబంధించినవి. బీమా కంపెనీలు జిల్లా జడ్జీల నియంత్రణలో ఉండే ఖాతాల్లో డబ్బు జమ చేస్తాయి. కక్షిదారులు కూడా కోర్టు ఫీజుల కింద జడ్జీల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ ఖాతాల్లోకి ఎంత డబ్బు వచ్చింది? ఎంత వెళ్లిందనే విషయాలను ట్రెజరీ విభాగం పరిశీలిస్తుంది. ఎన్నికల ముందు రూ.వందల కోట్లు దారి మళ్లింపు.. ఎన్నికల ముందు ఈ ఖాతాల్లోని సొమ్ములపై కన్నేసిన టీడీపీ సర్కారు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)ను అడ్డం పెట్టుకుంది. ఎన్నికలకు కొద్ది నెలల ముందు దీని ద్వారా జడ్జీల ఖాతాలన్నింటినీ స్తంభింప చేసి రూ.వందల కోట్లను దారి మళ్లించింది. కోటరీ కాంట్రాక్టర్లకు, ఎన్నికల తాయితాల కోసం పందేరం చేసింది. దీనిపై హైకోర్టులో న్యాయ పోరాటం చేసేందుకు బాధితులు, న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ఏ ప్రభుత్వమూ ఈ సొమ్మును తాకలేదు.. జడ్జీల పేరు మీద ఉండే ఖాతాల్లోని డబ్బు సర్కారుది కాదు. అదంతా కక్షిదారులు, బీమా కంపెనీలు జమ చేసిన సొమ్ము. దానికీ, ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకున్నా అక్రమ పద్ధతుల్లో సీఎఫ్ఎంసీ ద్వారా ఇష్టానుసారంగా ఖర్చు చేసింది. ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రమాద బీమా పరిహారం సొమ్ము జోలికి వెళ్లలేదని విశ్రాంత న్యాయాధికారులు స్పష్టం చేస్తున్నారు. పరిహారం డబ్బులను ప్రభుత్వం సొంత సొమ్ములా ఖర్చు చేయడమే కాకుండా తిరిగి చెల్లించకపోవడం దారుణమని పేర్కొంటున్నారు. న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో.. ఇటీవల ఈ ఫిర్యాదులు పెరగడంతో ఓ కక్షిదారుడి తరఫున రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, మోటారు వాహనాల ప్రమాద కేసుల్లో అనుభవజ్ఞుడైన వొట్టిజొన్నల బ్రహ్మారెడ్డి గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ దృష్టికి ఈ వ్యవహారాన్ని తెచ్చారు. మద్దు ఈశ్వర్రెడ్డి అనే కక్షిదారుడికి కోర్టు ఆదేశాల మేరకు పరిహారం చెల్లించడం లేదని తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ దీనిపై వివరణకు ఆదేశించడంతో అధికారులు ఆగమేఘాలపై ఈశ్వర్రెడ్డికి పరిహారం చెల్లించారు. ఇలా ఎంతమంది కక్షిదారులు ఈశ్వర్రెడ్డిలా తిరిగి న్యాయపోరాటం చేయగలరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి పరిహార ఉత్తర్వులు పొందిన బాధితులు మరోసారి న్యాయస్థానాలను ఆశ్రయించలేక కుమిలిపోతున్నారు. దీనిపై సీఎఫ్ఎంఎస్ అధికారుల వివరణ కోరగా స్పందించేందుకు నిరాకరించారు. కోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించడం లేదు న్యాయాన్యాయాలను చెప్పే న్యాయస్థానాలకే అన్యాయం జరుగుతోంది. కోర్టు తీర్పులను ప్రభుత్వమే గౌరవించడం లేదు. బాధితుల కోసం బీమా కంపెనీలు ఇచ్చిన సొమ్మును దారి మళ్లించడం దుర్మార్గం. ప్రభుత్వం శృతిమించి జోక్యం చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. బాధితులకు న్యాయం చేసేందుకు మోటారు వాహనాల చట్టాన్ని తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వం చర్యల వల్ల లక్ష్యం నీరుగారుతోంది. కక్షిదారులకు చెల్లించాల్సిన డబ్బులను ఇష్టానుసారంగా ఖర్చు చేయడం దారుణం. దీనిపై న్యాయ పోరాటం చేస్తా. – వి.బ్రహ్మారెడ్డి (ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు) -
జడ్జీలుగా పదోన్నతిలో నిబంధనల సడలింపు
న్యూఢిల్లీ: జడ్జీలుగా పదోన్నతి కల్పించే విషయంలో కొన్ని కేటగిరీల్లో నిబంధనలను సుప్రీంకోర్టు కొలీజియం సడలించింది. వివిధ హోదాల్లో పనిచేస్తున్న 13 మందికి హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం కేంద్రానికి సిఫారసు చేసింది. వీరిలో అలహాబాద్ హైకోర్టుకు 12 మంది, కేరళ హైకోర్టుకు ఒకరు ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ఏ బాబ్డేలతో కూడిన కొలీజియం ఈ నెల 12వ తేదీన తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం వెబ్సైట్లో ఉంచింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులతోపాటు ప్రభుత్వ ప్లీడర్లుగా పనిచేస్తున్న వారి వృత్తిపరమైన ఆదాయం ఏడాదికి కనీసం రూ.7 లక్షలు ఉండాలన్న నిబంధనను కొలీజియం పక్కన పెట్టినట్లు అందులో సుప్రీంకోర్టు తెలిపింది. కేరళ హైకోర్టు జడ్జీగా లాయర్ పీవీ కున్హికృష్ణన్తోపాటు అలహాబాద్ హైకోర్టుకు జడ్జీలుగా 10 మంది లాయర్లు, ఒక జడ్జీని పదోన్నతిపై పంపాలని సిఫారసు చేసింది. ప్రభుత్వ ప్లీడర్లుగా పనిచేస్తున్న వారికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల వృత్తిపర ఆదాయం ఏడాదికి కనీసం రూ.7లక్షలు ఉండాలన్న పరిమితి సహేతుకంగా లేనందున, దానిని పక్కనబెట్టినట్లు అందులో పేర్కొంది. -
సీబీఐ ప్రిన్సిపల్ జడ్జిగా మధుసూదన్రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీలను భర్తీ చేసేందుకు బుధవారం సాయంత్రం హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఏయే న్యాయాధికారులకు ఎక్కడెక్కడ పోస్టింగ్లు ఇవ్వాలన్న దానిపై కమిటీ తుది నిర్ణయం తీసుకున్న అరగంటలోపే ఆ వివరాలను హైకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. బదిలీలు, పోస్టింగులపై ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడం.. వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. ఏడుగురు జిల్లా జడ్జీలను వేర్వేరు స్థానాలకు బదిలీ చేసి పోస్టింగ్లు ఇవ్వగా, 25 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా పదోన్నతి కల్పించి ఆ మేర పోస్టింగ్లు ఇచ్చారు. కమ్యూనల్ అఫెన్సెస్ అదనపు సెషన్స్ జడ్జి కమ్ 7వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్ కమ్ 21వ అదనపు చీఫ్ జడ్జి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్న బీఆర్ మధుసూదన్రావు హైదరాబాద్, సీబీఐ ప్రిన్సిపల్ జడ్జిగా నియమితులయ్యారు. న్యాయవర్గాల్లో ఈయనకు చాలా సౌమ్యుడిగా పేరుంది. సికింద్రాబాద్ జుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్గా ఉన్న జీవీ సుబ్రహ్మణ్యం మహబూబ్నగర్ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న సీహెచ్కే భూపతిని జుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్గా నియమించింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు రెండవ అదనపు చీఫ్ జడ్జి బి.పాపిరెడ్డిని సంగారెడ్డి మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించింది. సీబీఐ కోర్టు మూడవ అదనపు స్పెషల్ జడ్జిగా ఉన్న డాక్టర్ టి.శ్రీనివాసరావును హైదరాబాద్ 4వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కమ్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ 18వ అదనపు చీఫ్ జడ్జిగా నియమించింది. ఈ కోర్టు ఎన్ఐఏ హోదా కలిగి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద దాఖలయ్యే కేసులను విచారిస్తున్న ఎస్.నాగార్జున హైదరాబాద్, లేబర్కోర్టు–1 ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. తెలంగాణ వక్ఫ్ ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరిస్తున్న ఎస్.గోవర్ధన్రెడ్డిని ఏసీబీ ప్రిన్సిపల్ జడ్జిగా నియమించింది. ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి వీరంతా ఈ నెల 18లోపు రిలీవ్ అయి, 25లోపు కొత్త పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వరరెడ్డి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 25 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా పదోన్నతులు కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన ఈ 25 మందికి పలు చోట్ల పోస్టింగ్లు ఇచ్చింది. వీరు కూడా ఈ నెల 25లోపు కొత్త బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. -
చైల్డ్ఫ్రెండ్లీ కోర్టుకు ప్రత్యేక న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: అఘాయిత్యాల బారినపడిన చిన్నారులకు సత్వర న్యాయం అందించడానికి దేశంలోనే తొలిసారిగా నగరంలో ఏర్పాటైన చైల్డ్ఫ్రెండ్లీ కోర్టుకు ప్రత్యేక న్యాయమూర్తిని కేటాయించనున్నారు. ఈ మేరకు మంగళవారం న్యాయమూర్తులు పోలీసు ఉన్నతాధికారులకు సూత్రప్రాయ అంగీకారం తెలిపారు. హాకా భవన్లో ఉన్న ఈ కోర్టును సందర్శించిన హైకోర్టు సీజే జస్టిస్ రాధాకృష్ణన్, ఇతర న్యాయమూర్తులు పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల విచారణ వేగంగా పూర్తి కావాలంటే ప్రత్యేక న్యాయమూర్తి అవసరమన్న పోలీసుల ప్రతిపాదనపై సీజే సానుకూలంగా స్పందించారు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బృందం చైల్డ్ఫ్రెండ్లీ కోర్టుతో పాటు భరోసా కేంద్రం, షీ–టీమ్స్ను సందర్శించింది. ఈ కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్రెడ్డి, కొత్వాల్ అంజనీకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
మూడు ధర్మాసనాలు.. ఏడుగురు సింగిల్ జడ్జిలు
సాక్షి, హైదరాబాద్: కేసుల విచారణ సాఫీగా, వేగవంతంగా సాగేందుకు వీలుగా హైకోర్టులో ధర్మాసనాలను, ఆయా న్యాయమూర్తులు విచారించే సబ్జెక్టులను మారుస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్కుమార్ పాలనాపరమైన నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు నాలుగు ధర్మాసనాలుండగా.. వాటిని మూడుకు కుదించారు. మొదటి ధర్మాసనానికి ఏసీజే జస్టిస్ ప్రవీణ్కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి నేతృత్వం వహిస్తారు. రెండో ధర్మాసనం.. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్వీ భట్, జస్టిస్ మంతోజ్ గంగారావు నేతృత్వంలో పనిచేస్తుంది. మూడో ధర్మాసనానికి న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ జవలాకర్ ఉమాదేవి నేతృత్వం వహిస్తారు. మిగిలిన న్యాయమూర్తులు సింగిల్ జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం.. చట్టాలను, చట్ట నిబంధనలను సవాలు చేస్తూ దాఖలయ్యే వ్యాజ్యాలను విచారిస్తుంది. అలాగే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, హెబియస్ కార్పస్ పిటిషన్లు, పర్యావరణం, కాలుష్యం సంబంధిత వ్యాజ్యాలతో పాటు క్రిమినల్ అప్పీళ్లను, ఉరిశిక్ష ఖరారు వ్యాజ్యాలపై విచారణ జరుపుతుంది. ఇక ఎస్వీ భట్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఐటీ ట్రిబ్యునల్ అప్పీళ్లు, ఐటీ కేసులు, సెంట్రల్ ఎక్సైజ్ కేసులు, ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలను, జీఎస్టీ, డీఆర్టీ తదితర చట్టాలను సవాలు చేస్తూ దాఖలయ్యే కేసులను విచారిస్తుంది. జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం.. ఉద్యోగుల సర్వీసు వివాదాలకు సంబంధించిన అప్పీళ్లు, సర్వీసు చట్ట నిబంధనలను సవాలు చేస్తూ దాఖలయ్యే వ్యాజ్యాలపై విచారణ జరుపుతుంది. ఏ ఏ కేసులు.. ఎవరు విచారిస్తారంటే.. ఇక సింగిల్ జడ్జిలుగా జస్టిస్ మంథాట సీతారామమూర్తి.. పురపాలక, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, సమాచార హక్కు చట్టం తదితర విషయాలకు సంబంధించిన కేసులపై విచారణ జరుపుతారు. జస్టిస్ ఉమ్మాక దుర్గాప్రసాద్రావు.. పంచాయతీరాజ్, భూసేకరణ, పౌర సరఫరాలు, వ్యవసాయం, నీటి పారుదలశాఖ తదితర విషయాలకు సంబంధించిన కేసులను విచారిస్తారు. అలాగే కంపెనీ పిటిషన్లు, కంపెనీల అప్పీళ్లపై కూడా విచారణ జరుపుతారు. జస్టిస్ తాళ్లూరు సునీల్చౌదరి.. 2009 నుంచి దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, క్రిమినల్ రివిజన్ పిటిషన్లు (ఏసీబీ, సీబీఐతో సహా) విచారిస్తారు. జస్టిస్ గుడిసేవ శ్యాంప్రసాద్.. విద్యా, యూనివర్సిటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సాంఘిక, మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖలు, వైద్య, ఆరోగ్యం తదితర విషయాలకు సంబంధించిన కేసులను విచారిస్తారు. జస్టిస్ తేలప్రోలు రజనీ.. బెయిల్, క్రిమినల్ పిటిషన్లతో పాటు 2008 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, క్రిమినల్ రివిజన్ పిటిషన్లపై (ఏసీబీ, సీబీఐ సహా) విచారణ జరుపుతారు. జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు.. సివిల్ రివిజన్ పిటిషన్లు, సెంకడ్ అప్పీళ్లు తదితరాలను విచారిస్తారు. జస్టిస్ కొంగర విజయలక్ష్మి.. హోం, గనులు, పరిశ్రమలు, రవాణా, దేవాదాయ, ఎక్సైజ్, జీఏడీ తదితర విషయాలకు సంబంధించిన కేసులను విచారిస్తారు. ఈ ఏర్పాట్లు ఈ నెల 21వ తేదీ నుంచి తదుపరి మార్పులు చేసేంత వరకు అమల్లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటయ్యే నాటికి 14 మంది న్యాయమూర్తులుండగా.. ఈ నెల 14న జస్టిస్ బాలయోగి పదవీవిరమణ చేయడంతో న్యాయమూర్తుల సంఖ్య 13కి చేరింది. రాష్ట్ర హైకోర్టులో దాదాపు 1.90 లక్షల వరకు పెండింగ్ కేసులుండే అవకాశం ఉంది. ఇంత తక్కువ మంది న్యాయమూర్తులు ఈ స్థాయి కేసులను విచారించడం చాలా కష్టం. న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోకుంటే ప్రస్తుత ఉన్న 13 మంది న్యాయమూర్తులు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
సుప్రీంకోర్టు జడ్జీలుగా ఇద్దరికి పదోన్నతి!
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేశ్ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నాను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జనవరి 10న సమావేశమైన కొలీజియం వీరిద్దరికి పదోన్నతి కల్పించాలని నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్ 12న అప్పటి కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని తాజా సమావేశంలో న్యాయమూర్తులు సమర్థించారు. ‘సుప్రీంకోర్టు జడ్జీలుగా సిఫార్సు చేసిన వ్యక్తులు అన్నివిధాలుగా అర్హులైనవారు, సమర్థులు’ అని కొలీజియం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు కొలీజియంలో సీజేఐ జస్టిస్ గొగోయ్తో పాటు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. -
ఉరిశిక్షపై జడ్జీల భిన్నాభిప్రాయాలు
న్యూఢిల్లీ: ఉరిశిక్షపై సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు బుధవారం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. నేరాలను నియంత్రించడంలో ఉరిశిక్ష విఫలమైందని ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి అభిప్రాయపడగా, మిగిలిన ఇద్దరు జడ్జీలు అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష వేయొచ్చని సుప్రీంకోర్టు గతంలోనే ఇచ్చిన తీర్పును సమర్థించారు. ముగ్గురిని హత్య చేసిన ఓ దోషికి ఛత్తీస్గఢ్ హైకోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చడంలో మాత్రం జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన తీర్పులో జస్టిస్ జోసెఫ్ తన అభిప్రాయం తెలుపుతూ ‘అత్యంత అరుదైన కేసుల్లోనే మరణ శిక్ష విధించాలని 1980లోనే సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కొన్ని కోర్టులు అనవసరంగా దోషులకు ఉరిశిక్ష వేస్తున్నాయి. శిక్షలకు సంబంధించి రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఉరిశిక్ష విఫలమైంది. ఉరి శిక్షను ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారో ఆ ఉద్దేశంలోనే మనం దానిని చూడాల్సిన సమయం వచ్చింది. ఉరిశిక్ష ఉన్నంతకాలం.. ఆ కేసు ఉరిశిక్ష విధించదగ్గంత అత్యంత అరుదైన, హీనమైనదేనా కాదా అన్న విషయాన్ని నిర్ధారించాల్సిన భారీ బాధ్యత జడ్జీలపై ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును ఈ ఉరిశిక్ష హరిస్తుంది. కాబట్టి ఉరిశిక్షను విధించేటప్పుడు జడ్జీలు రాజ్యాంగానికి లోబడి అత్యంత జాగ్రత్తగా, కచ్చితంగా తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది’ అని అన్నారు. అయితే జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ హేమంత్ గుప్తాలు జస్టిస్ కురియన్ అభిప్రాయంతో విభేదించారు. 1980లోనే ఓ కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉరిశిక్షను సమర్థించిందనీ, ఐపీసీలో ఉన్న ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమైనదేనని స్పష్టం చేసిందని వారు పేర్కొన్నారు. అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష విధించొచ్చని నాడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందనీ, దీన్ని ఇప్పుడు మళ్లీ పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు. -
జడ్జీల సంఘం అధ్యక్షుడిపై ఏసీబీ కేసు
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో మరో న్యాయాధికారిపై కేసు నమోదు చేసేందుకు ఏసీబీకి హైకోర్టు అనుమతినిచ్చింది. హైకోర్టు అనుమతితో రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు వైద్య వరప్రసాద్పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయన ఇళ్లపై బుధవారం దాడులు నిర్వహించారు. ఆయన సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజాము నుంచి ఏసీబీ ప్రత్యేక బృందాలు సరూర్నగర్ గడ్డిఅన్నారం, కొండాపూర్ ఇజ్జత్నగర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాయి. అలాగే హైదరాబాద్ నగరంలో మరో నాలుగు చోట్ల, సిరిసిల్లలోని మూడు ప్రాంతాలు, మహారాష్ట్రలో రెండు చోట్ల తనిఖీలు నిర్వహించాయి. వరప్రసాద్ భారీ ఖర్చుతో తన కుటుంబ సభ్యులతోసహా పలుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లినట్లు ఏసీబీ గుర్తించింది. ఆయన చేసిన భారీ ఖర్చులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సేకరించింది. రూ.1.50 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. వీటి మార్కెట్ విలువ రూ.3 కోట్లపైనే ఉంటుందని ఏసీబీ తెలిపింది. ఒకట్రెండు రోజుల్లో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అనుమతిలేకుండా ప్రెస్మీట్! ఇటీవల తెలంగాణ న్యాయాధికారుల విభజన వ్యవహారంపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినందుకే ఈ దాడి జరిగిందన్న ప్రచారాన్ని హైకోర్టు వర్గాలు తోసిపుచ్చాయి. గత మూడు నెలలనుంచి వరప్రసాద్ ఆస్తులపై ఏసీబీ విచారణ చేస్తోందని, ఏసీబీ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగానే వరప్రసాద్పై కేసు నమోదుకు ప్రధాన న్యాయమూర్తి అనుమతినిచ్చారని ఆయా వర్గాలు తెలిపాయి. ఏసీబీ విచారణ గురించి తెలుసుకున్నాకే సానుభూతి కోసం ఆయన విలేకరుల సమావేశంలో న్యాయాధికారుల విభజన అంశంపై మాట్లాడారని, విలేకరులతో మాట్లాడేందుకు ఆయన హైకోర్టు అనుమతి కూడా తీసుకోలేదని ఆ వర్గాలు చెప్పాయి. మూడు నెలలుగా ఆధారాల సేకరణ వరప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు మూడు–నాలుగు నెలల క్రితం హైకోర్టుకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును పరిశీలించిన హైకోర్టు ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు సేకరించాలని ఏసీబీని ఆదేశించింది. ఆదాయానికి మించి ఆయన ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా తేల్చింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను హైకోర్టు ముందు ఉంచింది. సాక్ష్యాధారాలపై సంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు వరప్రసాద్పై కేసు నమోదుకు అనుమతినిచ్చింది. ఏసీబీ కేసు నమోదుచేసిన నేపథ్యంలో వరప్రసాద్ను త్వరలో హైకోర్టు సస్పెండ్ చేయనుంది. ఏసీబీ గుర్తించిన ఆస్తులివే..: కొండాపూర్లో రూ.53 లక్షలు విలువ చేసే ఫ్లాట్, దిల్సుఖ్నగర్లోని వికాస్నగర్లో రూ.12.63 లక్షల ఫ్లాట్, అక్కడే రూ.5.68 లక్షల విలువ చేసే ఫ్లాట్, పలు బ్యాంకుల్లో రూ.38.16 లక్షల డబ్బు, రూ.14 లక్షల విలువచేసే హోండా సిటీ కారు, రూ.5.13 లక్షల విలువ చేసే ఐ10 కారు, దిల్సుఖ్నగర్లోని ఇంటిలో వస్తువులు రూ.2.61 లక్షలు, కొండాపూర్ ఇంటిలో రూ.9.80 లక్షల విలువైన వస్తువులు. తొమ్మిది నెలల్లో నాలుగో కేసు.. గత 9 నెలల్లో న్యాయాధికారులపై ఏసీబీ నమోదు చేసిన నాల్గవ కేసు ఇది. ఈ మార్చి, ఏప్రిల్ల్లో న్యాయాధికారులు మధు, మల్లంపాటి గాంధీ, ఎస్.రాధాకృష్ణమూర్తిలపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. లంచం అడిగిన కేసులో మధు, రాధాకృష్ణమూర్తిలపై ఏసీబీ కేసు నమోదుచేయగా, గాంధీపై ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో కేసు నమోదైంది. వీరందరినీ కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. -
స్త్రీలోక సంచారం
♦ దేశంలోని హైకోర్టులలో మహిళా జడ్జీలు 9 శాతమే. మొత్తం 24 హైకోర్టులకు 1,221 మంది జడ్జీల నియామకం జరగగా ప్రస్తుతం 891 మంది జడ్జీలు మాత్రమే విధుల్లో ఉన్నారు. వాళ్లలో మహిళా జడ్జీల సంఖ్య కేవలం 81. ♦ వారం రోజులుగా ఈజిప్ట్లో జరుగుతున్న వరల్డ్ యూత్ ఫోరమ్ ఫెస్టివల్ భారత కాలమానం ప్రకారం శనివారం ముగిసింది. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న దేశీ వనిత, ఆల్ లేడీస్ లీగ్ (ఏఎల్ఎల్), విమెన్ ఎకనమిక్ ఫోరమ్ల వ్యవస్థాపకురాలు, ఆ సంస్థల గ్లోబల్ చైర్పర్సన్ డాక్టర్ హర్బీన్ అరోరా ప్రెసిడెన్షియల్ ఆనర్ పొందారు. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతే అల్ సిసి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. ప్రెసిడెన్షియల్ ఆనర్ పొందిన మొదటి భారతీయురాలిగా డాక్టర్ హర్బీన్ అరోరా అరుదైన మరో గౌరవానికీ పాత్రులయ్యారు. ♦ ‘‘ప్రస్తుతం మనకున్న టెక్నాలజీ, అవకాశాలను ఉపయోగించుకొని క్షేమంగా మనిషిని అంతరిక్షంలోకి పంపగలం.. అంతే సురక్షితంగా తిరిగి భూమికి రప్పించగలం’’ – ఇస్రోలోని హ్యూమన్ స్పేస్ ఫ్లయిట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ వీఆర్ లలితాంబికా నోట ఆమె ఆత్మవిశ్వాసం పలికించిన మాట ఇది. మైసూరు పట్టణంలో శుక్రవారంనాడు స్వదేశీ విజ్ఞాన ఆందోళన కర్ణాటక సంస్థ నిర్వహించిన పదకొండో నేషనల్ విమెన్స్ కాంగ్రెస్ సదస్సులో ‘మేరీ క్యూరీ మహిళా విజ్ఞాన పురస్కారం’’ అవార్డుతో లలితాంబికను సత్కరించారు. ‘ఎనాబ్లింగ్ మదర్హుడ్ అండ్ ఎనేబ్లింగ్ విమెన్ ఫర్ లీడర్షిప్ ఇన్ సైన్స్’ థీమ్తో ఈ సదస్సు సాగింది. న్యాయస్థానాల్లో జడ్జీలుగా స్త్రీలు తొమ్మిది శాతమే ఉన్నా.. ఇంకోచోట హైరార్కీలో పన్నెండు శాతమే ఉన్నా.. స్పేస్ చాలెంజెస్లోనూ విజయం సాధిస్తామని చెప్పే ఆడవాళ్లూ తక్కువే అయినా.. అసలంటూ ఉన్నారు. ఆ ఉనికి చాలు.. మిగిలిన మహిళలు స్ఫూర్తిగా తీసుకొని రాశి పెరగడానికి... అవకాశాలు రావడానికి! -
మీటూ ఉద్యమంపై స్పందించిన కేంద్రం
-
సీజేల పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం
న్యూఢిల్లీ: దేశంలోని ఐదు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం శుక్రవారం కేంద్రానికి సిఫార్సు చేసింది. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.హెచ్.పాటిల్ను, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీకే గుప్తాను నియమించాలని సూచించింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం.. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమేశ్ రంగనాథన్ను, జస్టిస్ ఏఎస్ బోపన్నను గువాహటి హైకోర్టు సీజేగా, జస్టిస్ విజయ్ కుమార్ బిస్త్ను సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని ప్రతిపాదించింది. బాంబే హైకోర్టు తాత్కాలిక సీజేగా ఉన్న జస్టిస్ పాటిల్ పదవీకాలం మరో 7 నెలల్లో ముగియనున్నందున.. ఆయనకు సొంతరాష్ట్రంలోనే పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కొలీజియం తెలిపింది. అలాగే మద్రాస్ హైకోర్టులో అదనపు జడ్జీలుగా ఉన్న జస్టిస్ ఆర్ఎంటీ టికా రామన్, జస్టిస్ ఎన్.సతీశ్ కుమార్, జస్టిస్ ఎన్.శేషసాయిలకు శాశ్వత జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే కర్ణాటక హైకోర్టులో ఏడుగురు అదనపు జడ్జీలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని తీర్మానించింది. వీరితోపాటు ఇద్దరు న్యాయాధికారులు, ఇద్దరు లాయర్లను కేరళ హైకోర్టులో జడ్జీలుగా నియమించాలంది. -
పది లక్షల మందికి 19 మంది జడ్జీలు
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి పది లక్షల మందికి సరాసరిన 19 మంది చొప్పున జడ్జీలున్నారని కేంద్ర న్యాయ శాఖ వెల్లడించింది. దిగువ కోర్టుల్లోని ఐదు వేల మందితోపాటు దేశవ్యాప్తంగా మొత్తం 6వేల మంది జడ్జీల కొరత ఉందని స్పష్టం చేసింది. పార్లమెంట్లో చర్చ కోసం రూపొందించిన ఈ నివేదికను న్యాయ శాఖ ఈ ఏడాది మార్చిలో తయారు చేసింది. దీని ప్రకారం దేశంలో జడ్జీలు– ప్రజల నిష్పత్తి 10,00,000:19.49గా ఉంది. దిగువ కోర్టుల్లో 5,748, హైకోర్టుల్లో 406 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దిగువ కోర్టుల్లో ఆమోదిత సిబ్బంది సంఖ్య 22,474 కాగా ప్రస్తుతం 16,726 మందే పనిచేస్తున్నారు. అలాగే, హైకోర్టుల్లో 1079 గాను ప్రస్తుతం 673 మంది సిబ్బందే ఉన్నారు. సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులకు గాను 25 మంది ఉన్నారు. ప్రతి పది లక్షల మంది ప్రజలకు 50 మంది జడ్జీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని 1987లోనే న్యాయ కమిషన్ ప్రతిపాదించగా ఇప్పటికీ ఆ పరిస్థితి మారలేదని 2016లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఆందోళన వ్యక్తం చేశారు. జడ్జీల పోస్టుల్లో ఖాళీల కారణంగా దేశ వ్యాప్తంగా జిల్లా, దిగువ స్థాయి కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య 2.76 కోట్లకు చేరిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఇటీవల తెలిపారు. -
సుప్రీం చరిత్రలో మొదటిసారి ముగ్గురు మహిళా జడ్జీలు
-
నేడు సుప్రీంలో మహిళా బెంచ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు చరిత్ర పునరావృతం కానుంది. జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన మహిళా ధర్మాసనం కేసుల విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా 2013లో జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ల మహిళా ధర్మాసనం ఓ కేసుపై విచారణ జరిపింది. ప్రస్తుత మహిళా జడ్జీల్లో సీనియర్ అయిన జస్టిస్ భానుమతి 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్లో జస్టిస్ ఇందూ మల్హోత్రా, ఆగస్టులో జస్టిస్ ఇందిరా బెనర్జీ రాకతో సుప్రీంకోర్టులో సిట్టింగ్ మహిళా జడ్జిల సంఖ్య మూడుకు చేరింది. ఏకకాలంలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉండటం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. 39 ఏళ్ల తర్వాత మహిళా జడ్జి.. 1950లో ఏర్పాటైన సుప్రీంకోర్టులో ఓ మహిళ జడ్జిగా నియమితురాలు కావడానికి 39 ఏళ్లు పట్టింది. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ ఫాతిమా బీవీ 1989లో జడ్జిగా సుప్రీంకోర్టులో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాలంలో వరుసగా జడ్జీలు సుజాతా మనోహర్, రుమా పాల్, జ్ఞాన్ సుధా మిశ్రా, రంజనా ప్రకాశ్ దేశాయ్, ఆర్.భానుమతి, ఇందూ మల్హోత్రా సుప్రీంకోర్టులో జడ్జీలయ్యారు. దిగువ కోర్టుల్లో 28 శాతమే! సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య 12 శాతమేనని ప్రభుత్వ గణాంల్లో తేలింది. 7 హైకోర్టుల్లో మహిళా జడ్జి ఒక్కరు కూడా లేరు. 33 శాతం మహిళా జడ్జీలతో సిక్కిం తొలిస్థానంలో ఉంది. ఢిల్లీ హైకోర్టు ఆ తర్వాత స్థానంలో (27 శాతం) ఉంది. దిగువ కోర్టుల్లో మరీ అన్యాయంగా ఉందనీ, మొత్తం జడ్జీల్లో స్త్రీలు ఇంచుమించు 28 శాతమని విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ నివేదించింది. బిహార్ (11.52%), జార్ఖండ్ (13.98%), గుజరాత్ (15.11%), కశ్మీర్ (18.68%), యూపీ(21.4%),ఏపీæ(37.54%)కోర్టుల్లో స్త్రీల ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉంది. తెలంగాణ లో 44.03 శాతం, పుదుచ్చేరి 41.66 శాతం మహిళా జడ్జీలు ఉన్నారు. -
న్యాయమూర్తులపై పని ఒత్తిడి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులు పని ఒత్తిడిని ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని, దీనిని అందరూ అంగీకరించి తీరాల్సిందేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. తాను సీజేగా బాధ్యతలు చేపట్టి నెల రోజులే అవుతోందని, కాబట్టి న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి అర్హులైన న్యాయవాదుల పేర్లను సిఫారసు చేసే విషయంలో కొంత సమయం పడుతుందని తెలిపారు. ఖాళీల భర్తీకి కృతనిశ్చయంతో ఉన్నామని, కొన్ని సందర్భాల్లో తొందరపడితే మొత్తం వ్యవహారం చెడిపోతుందని సీజే వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితి రావాలనుకుంటున్నారా? అంటూ పిటిషనర్ను ప్రశ్నించారు. ఖాళీల భర్తీ విషయంలో కొంత కాలం వేచి చూడాలని పిటిషనర్కు స్పష్టం చేశారు. తదుపరి విచారణను నెల రోజులకు వాయిదా వేశారు. ఈ మేరకు సీజే జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకునేలా హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ న్యాయవాది ఎస్.రాజ్కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ రాజ్కుమార్ వాదనలు వినిపిస్తూ, ఉమ్మడి హైకోర్టుకు మొత్తం 61 పోస్టులు కేటాయించారని, అందులో ప్రస్తుతం 29 మంది న్యాయమూర్తులే ఉన్నారని, 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కోర్టుకు నివేదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కేసులు సకాలంలో పరిష్కారం కాకపోవడానికి తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం ఒక్కటే కారణం కాదని, న్యాయవాదులు సైతం పదే పదే వాయిదాలు కోరడం కూడా ఓ కారణమని పేర్కొంది. న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో సానుకూల దృక్పథంతో ఉండాలని పిటిషనర్కు సూచిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. -
న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి ఆదేశాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయ మూర్తుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకునేలా హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులపై పనిభారం ఎక్కువగా ఉందని, దీంతో పౌరులకు సత్వర న్యాయం అందే పరిస్థితులు కనిపించటం లేవంటూ న్యాయవాది ఎస్.రాజ్కుమార్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఉమ్మడి హైకోర్టుకు మొత్తం 61 పోస్టులు కేటాయించగా.. అందులో ప్రస్తుతం 29 మంది న్యాయమూర్తులే ఉన్నారని, 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతోందని వ్యాజ్యంలో పిటిషనర్ వివరించారు. -
హైకోర్టు జడ్జీలుగా నియమించలేం
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న ఇద్దరికి అదే హైకోర్టులో న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం రెండోసారి కూడా వెనక్కు పంపింది. కొలీజియం సిఫారసు చేసిన న్యాయవాదులపై ఫిర్యాదులు ఉన్నందున వారిని జడ్జీలుగా నియమించలేమని కేంద్రం పేర్కొంది. ఆ ఇద్దరు న్యాయవాదుల్లో ఒకరైన మహ్మద్ మన్సూర్.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దివంగత సాఘిర్ అహ్మద్ కుమారుడు కావడం గమనార్హం. న్యాయవాదులు మహ్మద్ మన్సూర్తోపాటు బష్రత్ అలీని అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించాలంటూ చాలా రోజుల క్రితమే సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆ ఇద్దరిపై ఫిర్యాదులున్నాయన్న కారణం చూపుతూ అప్పట్లో కేంద్రం ఈ ప్రతిపాదనను తిప్పిపంపింది. ఆ ఫిర్యాదులు తీవ్రమైనవేమీ కాదంటూ కొలీజియం మరోసారి అవే పేర్లను సిఫారసు చేయగా, ఏ నిర్ణయమూ తీసుకోకుండా రెండున్నరేళ్లు కాలయాపన చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు వారిరువురీ పేర్లను తిరస్కరిస్తున్నట్లు గత నెలలో కొలీజియంకు తెలిపింది. కొలీజియం సభ్యుల్లో ఒకరైన జస్టిస్ చలమేశ్వర్ ఇటీవలే పదవీ విరమణ పొందినందున కొత్త కొలీజియం ఏర్పాటైన అనంతరం ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. -
న్యాయ వ్యవస్థపై కూడా మోదీ ముద్ర
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని న్యాయ వ్యవస్థ స్వతంత్రపై ఆందోళన మొదలైంది. సుప్రీం కోర్టు కొలీజియం చేసిన రెండు సిఫార్సుల్లో ఒక సిఫార్సును ఆమోదించిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో సిఫార్సును తిరస్కరించడమే అందుకు కారణం. సుప్రీం కోర్టు జడ్జీలుగా సీనియర్ అడ్వకేట్ ఇందు మల్హోత్ర, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసఫ్ల పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం గురువారం ప్రతిపాదించగా వారిలో ఇందు మల్హోత్ర నామినేషన్ను అంగీకరించిన మోదీ ప్రభుత్వం జోసఫ్ నామినేషన్ను అంగీకరించని విషయం తెల్సిందే. ఈ కొలీజియం వ్యవస్థకు రాజ్యాంగ భద్రతగానీ, పార్లమెంట్ చట్టం భద్రతగానీ లేదు. కేవలం సుప్రీం కోర్టు అభిప్రాయం మేరకు కేంద్రం ఈ కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తితోపాటు మరో నలుగురు సీనియర్ సుప్రీం కోర్టు జడ్జీలు ఉంటారు. హైకోర్టు కొలీజియంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు నలుగురు సీనియర్ హైకోర్టు జడ్జీలు ఉంటారు. ఈ కొలీజియంలు మెజారిటీ అభిప్రాయంతో దిగువ కోర్టుల నుంచి తమ కోర్టులకు పదోన్నతులతో పాటు జడ్జీల బదిలీ వ్యవహారాలను నిర్వర్తిస్తాయి. ఇందులో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అవకాశం లేదు. అయితే సదరు వ్యక్తుల ప్రవర్తన, గత జీవితాలను తెలుసుకునేందుకు ఇంటెలిజెన్సీ బ్యూరో ద్వారా సమాచారాన్ని సేకరించుకోవచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల నుంచి ఈ కొలీజియం వ్యవస్థ ఒత్తిడికి గురవుతూనే ఉంది. న్యాయవ్యవస్థ నియామకాలను తన పరిధిలోకి తీసుకోవడానికి వీలుగా 2014లోనే మోదీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ చట్టాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. అప్పటి నుంచి మోదీ ప్రభుత్వం దొడ్డిదారిన, అంటే మౌఖికంగా న్యాయ వ్యవస్థ నియామకాలను ప్రభావితం చేస్తోంది. కర్ణాటక హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జయంతి పటేల్ను 2017లో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. దాంతో కర్ణాటకకు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. కక్షతోనే తనను బలి చేశారని నాడు ఆయన ఆరోపించారు. 2004లో ముంబైకి చెందిన ఇశ్రాత్ జహాన్ను గుజరాత్ పోలీసులు హత్య చేశారనే ఆరోపణలపై సీబిఐ దర్యాప్తునకు జయంతి పటేల్ ఆదేశించారు. నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. హైకోర్టు కొలీజియం సిఫార్సులను పట్టించుకోకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2016లో గుజరాత్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఓ జడ్జీ బదిలీని అడ్డుకుంది. 2017లో కూడా ఢిల్లీ హైకోర్టు నుంచి వాల్మీకీ మెహతా బదిలీని కూడా మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు కేఎం జోసఫ్ నియమకాన్ని మోదీ ప్రభుత్వం అడ్డుకోవడానికి కూడా కారణం ఉంది. 2016లో ఉత్తరాఖండ్లో మోదీ ప్రభుత్వం విధించిన రాష్ట్రపతి పాలనను జోసఫ్ రద్దు చేశారు. జోసఫ్ తరహాలోనే 2014లో కొలీజియం సిఫార్సు చేసిన గోపాల్ సుబ్రమణియం నామినేషన్ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించి మరో ముగ్గురు నామినేషన్లను అంగీకరించినప్పుడు అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా ఏకపక్షంగా గోపాల్ సుబ్రమణియం నామినేషన్ను ఎలా తిరస్కరిస్తారంటూ కేంద్రాన్ని విమర్శించారు. ఇప్పుడు జోసఫ్ విషయంలో అది జరగలేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర గురించి మాట్లాడే ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ప్రభుత్వ నిర్ణయనికి తలొగ్గి జోసఫ్ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. సుప్రీం కోర్టు బెంచీలను నిర్ణయించడంలో కేసులను కేటాయించడంలో తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీలు ప్రజల్లోకి వచ్చి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంతో సుప్రీం కోర్టు స్వతంత్రత గురించి చర్చ మొదలైంది. కేసుల కేటాయింపుల్లో దీపక్ మిశ్రాపై ప్రభుత్వ ప్రభావం ఉండొచ్చన్న ఆరోపణలను ఖండించిన ఆయన న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే తాను ప్రాధాన్యం ఇస్తానన్నారు. అలాంటప్పుడు ఆయన ప్రభుత్వ నిర్ణయంతో విభేదించాల్సి ఉంది. న్యాయ వ్యవస్థకు సంబంధించిన నియామకాలను న్యాయవ్యవస్థనే జరుపుకునే విధానం భారత్లో తప్పా ప్రపంచంలో మరెక్కడా లేదు. అది వేరే విషయం. -
ఓట్ల కోసం బీసీలను వాడుకుంటున్న పార్టీలు..
సాక్షి, అమరావతి: బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు అడ్డుకుంటున్నారని, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఏముంటుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. ఈ ప్రభుత్వానికి బీసీలు మద్దతు ఇచ్చారని, ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. గురువారం విజయవాడలోని ఐలాపురం హోటల్లో జరిగిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలంటే ఉన్నత ఉద్యోగాల్లో ఉండకూడదనే కుట్ర సీఎం మనసులో ఉండటం ఏమిటని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం చేస్తే ఒప్పుకునేది లేదని, బీసీ కార్యకర్తలందరూ పార్టీ పెట్టాలని కోరుతున్నారన్నారు. బీసీ న్యామవాదులు తీవ్ర స్థాయిలో సీఎం లేఖను వ్యతిరేకిస్తున్నారని, బీసీ సంఘాలు కూడా అదే స్థాయిలో వ్యతికేకిస్తున్నట్లు చెప్పారు. ఆరుగ్గురు బీసీ న్యాయవాదులు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకోవడం అంటే బీసీలకు అన్యాయం చేయడమేనన్నారు. కొలీజియం తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్యగా సీఎం చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు ఏకంగా హైకోర్టునే తప్పుపట్టారంటే ఏ విధమైన ఆలోచనా విధానంతో ఉన్నారో అర్థమవుతుందన్నారు. దేశంలో ఓట్ల కోసం బీసీలను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని, జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగ బద్ధమైన హక్కు కల్పించాలని కోరుతున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఎన్నో పోరాటాల ద్వారా బీసీల హక్కులు సాధించుకున్నట్లు చెప్పారు. బీసీల హక్కులు, సమస్యల పరిష్కారానికి పార్టీలు ఆసక్తి చూపడం లేదన్నారు. చట్ట సభల్లో నామినేటెడ్ పదవులకు 50 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజ్యాంగాధికారం లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటుకు తగిన సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో బీసీలకు చంద్రబాబు నాయుడు పూర్తిగా అన్యాయం చేశారన్నారు. ఇప్పుడు మాలో రాజకీయ చైతన్యం వచ్చినందున రాజ్యాధికారం కోసం పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. బీసీ సంఘాలతో చర్చించి త్వరలోనే రాజకీయ పార్టీ విధి విధానాలు రూపొందిస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి సంఘాన్ని పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఫుల్కోర్ట్ సమావేశం ఏర్పాటు చేయండి
న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేస్తున్న వ్యవస్థాగత లోపాలపై చర్చించేందుకు ఫుల్కోర్ట్ (సుప్రీంకోర్టులోని అందరు న్యాయమూర్తులతో) సమావేశం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్.బి.లోకూర్ సీజేఐ దీపక్ మిశ్రాకు లేఖ రాశారు. సీజేఐకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇచ్చిన అభిశంసన తీర్మానం నోటీసును రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించడానికి ముందు రోజు అంటే ఈ నెల 22న ఈ లేఖ రాశారు. రెండే రెండు వాక్యాలు మాత్రమే ఉన్న ఈ లేఖపై గొగోయ్, లోకూర్ సంతకాలు చేశారు. మార్చి 21న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఏప్రిల్ 9న మరో న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ కూడా న్యాయ వ్యవస్థలోని లోపాలపై ఫుల్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరడం గమనార్హం. సోమవారం ఉదయం టీ మీటింగ్కు న్యాయమూర్తులంతా హాజరైన సమయంలో ఈ లేఖ అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. అయితే అప్పటికే అభిశంసన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించినట్టు ప్రకటించారు. దీంతో ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను గురించి సీజేఐ ఎక్కడా మాట్లాడలేదని తెలిసింది. -
న్యాయమూర్తులకి అవార్డులా?
అభిప్రాయం అవి అవార్డులు కావొచ్చు. రివార్డులు కావొచ్చు. న్యాయమూర్తులకి అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించకూడదు. న్యాయమూర్తులు అలాంటివి స్వీకరించకూడదు. ఇది ఎక్కడా వ్రాయని, నమోదు చేయని నీతి, నియమం. ప్రజాస్వామ్య మనుగడకి స్వతంత్ర, నిర్భయ, నిష్పక్ష పాత న్యాయ వ్యవస్థ అవసరం. న్యాయమూర్తులు నిర్భయంగా లేకపోతే వాళ్లు భారత పౌరులకి రాజ్యాం గం ప్రసాదించిన ప్రాథమిక హక్కులని, ఇతర హక్కులని పరిరక్షించలేరు. న్యాయమూర్తులు బలహీనంగా ఉండి ఒత్తిడులకి, ప్రలోభాలకి లొంగిపోతే వాళ్లు ప్రజల హక్కులని పరిరక్షించలేరు. ఫలితంగా న్యాయవ్యవస్థ మీద విశ్వసనీయత సన్నగిల్లుతుంది. చిన్న చిన్న ప్రలోభాలకి కూడా న్యాయమూర్తులు లొంగకూడదు. మన దేశంలో న్యాయ వ్యవస్థ సంక్షోభంలో ఉంది. న్యాయమూర్తుల నియామకాల్లో జాప్యం, అభిప్రాయభేదాలు ఇలాంటి వాటితో న్యాయ వ్యవస్థ విశ్వసనీయత మసకబారుతుంది. కొన్ని సంఘటనలు చిన్నవిగా అన్పించినా వాటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అవి న్యాయ వ్యవస్థ స్వతంత్రత మీద అనుమానాలు వచ్చేవిధంగా ఉంటున్నాయి. మిగతా వ్యవస్థల్లో ఉన్న అవలక్షణాలు మెల్లమెల్లగా న్యాయ వ్యవస్థకి సంక్రమిస్తున్నాయని అన్పిస్తుంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన న్యాయవ్యవస్థని ప్రభుత్వం ఏ విధంగా కూడా ప్రభావితం చేయకూడదు. న్యాయం జరగడం ఎంత ముఖ్యమో, న్యాయం జరిగిందని అన్పించడం అంతకన్నా ముఖ్యం. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ విషయాలని జాగ్రత్తగా గమనించి అలాంటి ప్రభావితం చేసే విషయాలకి దూరంగా ఉండాలి. అవి అవార్డులు కావొచ్చు. రివా ర్డులు కావొచ్చు. న్యాయమూర్తులకి అవార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నించకూడదు. న్యాయమూర్తులు అలాంటివి స్వీకరించకూడదు. ఇది ఎక్కడా రాయని, నమోదు చేయని నీతి, నియమం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వ స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ 30 మంది మహిళలకి నారీ శక్తి పురస్కారాలను ప్రకటించింది. మహిళలకి న్యాయం అందే విధంగా, వాళ్లకి స్వాధికారికత లభించే విధంగా కృషి చేసినందుకు గుర్తింపుగా నారీ శక్తి పురస్కారాన్ని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్కి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆమె స్వీకరించింది కూడా. గతంలో ఏ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ విధంగా అవార్డులని ప్రభుత్వం నుంచి గానీ, ప్రైవేట్ సంస్థల నుంచి గానీ స్వీకరించలేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎం.ఎల్. వెంకటాచలయ్యకి, పి.ఎన్. భగవతికి పద్మభూషణ్ల్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే వాళ్లు పదవీ విరమణ చేసిన తరువాత ఇచ్చింది. మరో ప్రధాన న్యాయమూర్తి జె.ఎస్. వర్మకి ఆయన మరణించిన తరువాత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుని ప్రకటించింది. అయితే ఆయన కుటుంబ సభ్యులు ఆ అవార్డుని నిరాకరించారు. కానీ ఢిల్లీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న గీతా మిట్టల్ ఈ అవార్డుని స్వీకరించారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష రూపాయల మొత్తాన్ని ధార్మిక సంస్థలకి ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఏమైనా అవార్డు స్వీకరించడంవల్ల ఆమె ప్రభుత్వం నుంచి కొంత లబ్ధిని పొందినట్టుగా భావించాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కేసులని ఆమె పరిష్కరించటంలో స్వతంత్రత కోల్పోతుందన్న భావన ప్రజలకి కలిగే అవకాశం ఉంది. మరో విధంగా చెప్పాలంటే అవార్డు స్వీకరించడంవల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతకి భంగం వాటిల్లుతుందని భావించవచ్చు. పదవీ విరమణ తరువాత న్యాయమూర్తులు ఏదో ఒక పదవిని స్వీకరించడం విషయంలోనే దేశంలో విమర్శలు వస్తున్నాయి. అప్పటి ప్రధాన న్యాయమూర్తి సదాశివం గవర్నర్ పదవి స్వీకరించడంలో చాలా విమర్శలు వచ్చాయి. పదవీ విరమణ తరువాత కనీసం రెండు సంవత్సరాలు ఏ పదవీ స్వీకరించకుండా కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండాలని మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా అన్నారు. పదవీ విరమణ చేసిన వెంటనే మరో పదవిని స్వీకరించడమంటే న్యాయమూర్తిగా చేసిన ప్రమాణానికి ద్రోహం చేసినట్టేనని మరో మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి గోపాల గౌడ అన్నారు. ఈ మాట లని ఎవరూ పట్టించుకోవడం లేదు. న్యాయమూర్తి లోధా తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన హెచ్ఎల్. దత్తు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఉండటానికి తన సంసిద్ధతని వెలిబుచ్చారు. ఆ పదవిని స్వీకరించారు. ఆయనే కాదు. చాలామంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ తరువాత వివిధ చదువుల్లో ఉన్నారు. అవార్డు స్వీకరించడం అనేది చిన్న విషయంగా కన్పిస్తూ ఉండవచ్చు. కానీ పదవిలో ఉన్న న్యాయమూర్తి ఈ విధంగా అవార్డు స్వీకరించడంవల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రతని దెబ్బతీస్తాయి. మిగతా వ్యవస్థలకి భిన్నంగా న్యాయవ్యవస్థ ఉండాలి. కానీ రోజు రోజుకూ అన్ని వ్యవస్థల్లాగే ఇది కూడా మారిపోతోందని అన్పిస్తుంది. న్యాయమూర్తులని రిసీవ్ చేసుకోవడానికి ప్లకార్డులు ఫ్లెక్సీలు, నిలువెత్తు బొమ్మలు, గజమాలలు కన్పిస్తుంటే న్యాయ వ్యవస్థ ఎటు ప్రయాణం చేస్తుందని భయమేస్తుంది. విజిల్ బౌలర్లుగా ఉండాల్సిన న్యాయవాదులే ఈ పని చేస్తుంటే ఈ పరిస్థితికి ఆనకట్ట వేసేదెవరు? - మంగారి రాజేందర్ వ్యాసకర్త కవి, రచయిత ‘ 94404 83001 -
కోర్టుల్లో కేసులు తేల్చాలంటే 300 ఏళ్లు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కోర్టుల్లో 3 కోట్ల 25 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి , నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ చాన్స్లర్ జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు. శనివారం శామీర్పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన 16 వ ఏడీఆర్ (ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్), ఎఫ్డీఆర్ (ఫ్యామిలీ డిస్ప్యూట్ రిసొల్యూషన్) పీజీ డిప్లొమా కోర్సుల పట్టాల స్నాతకోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ రమేశ్ రంగనాథన్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు కోర్టుల్లో ఉన్న కేసులు పరిష్కారం కావాలంటే సుమారు 300 ఏళ్లు పడుతుందన్నారు. న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు తక్కువగా ఉన్నందున కేసుల పరిష్కారం ఆలస్యమవుతుందని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులను త్వరగా పరిష్కరించే అవకాశం ఉందన్నారు. ప్రతీ రోజు 150 కేసులు పరిష్కరిస్తున్నా అంతకంతకూ పెరుగుతున్నాయని తెలిపారు. న్యాయవ్యవస్థలో కోర్టుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఏడీఆర్, ఎఫ్డీఆర్ కోర్సులు పూర్తిచేసిన వారు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ కోర్టులకు అనుసంధానంగా కేసులు పరిష్కరించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. అనంతరం ఏడీఆర్ కోర్సులో 157, ఎఫ్డీఆర్ కోర్సులో ఏడుగురికి పట్టాలను అందించారు. ఏడీఆర్ కోర్సులో 2015 బ్యాచ్లో పీజీ డిప్లొమాలో ఉన్నత ప్రతిభ కనబరిచిన సయ్యద్ ముజీబ్కు గోల్డ్ మెడల్, ప్రవీణ్కుమార్కు సిల్వర్ మెడల్ను ప్రదానం చేశారు. కార్యక్రమంలో నల్సార్ వైస్ చాన్స్లర్ ముస్తఫా, నల్సార్ రిజిస్ట్రార్ బాలకృష్ణ, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఆందోళన బాటలో హైకోర్టు న్యాయవాదులు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీల భర్తీలో జరుగుతున్న జాప్యంపై ఆందోళన బాట పట్టాలని హైకోర్టు న్యాయవాదులు నిర్ణయించారు. హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి తక్షణమే చర్యలు తీసుకోవాలని, హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిని నియమించాలని, హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో మార్చి 1, 2 తేదీల్లో హైకోర్టు విధులను బహిష్కరించనున్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల న్యాయవాద సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. అందరు న్యాయవాదుల అభిప్రాయ సేకరణ తర్వాత ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు ఇరు సంఘాల అధ్యక్షులు జె.కనకయ్య, సీహెచ్ ధనంజయ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇద్దరు అధ్యక్షుల నేతృత్వంలో మంగళవారం హైకోర్టులో ఇరు సంఘాల సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో 5 తీర్మానాలు చేశారు. హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి కేంద్రం, సుప్రీంకోర్టు తగిన చర్యలు తీసుకోవాలని, హైకోర్టు పూర్తిస్థాయి ప్రధాన న్యాయ మూర్తి నియామకానికి కేంద్రం, సుప్రీం కోర్టు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2012 లోపు దాఖలైన కేసులను నిర్దిష్ట కాల పరిమితిలోపు పరిష్కరించాలంటూ జారీ చేసిన సర్క్యులర్ను సుప్రీంకోర్టు ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. హైకోర్టులో తగిన న్యాయమూర్తుల్లేని నేపథ్యంలో ఈ సర్క్యులర్ అమలు చేయడం అటు న్యాయమూర్తులకు, ఇటు కక్షిదారులకు ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. హైకోర్టులోని బార్ కౌన్సిల్ భవనం నుంచి మదీన వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత కూడా సుప్రీంకోర్టు, కేంద్రం నుంచి స్పందన రాకపోతే 15 రోజుల తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
జడ్జీల కొరత తీవ్రతరం
సాక్షి, న్యూఢిల్లీ : న్యాయమూర్తుల కొరతతో పలు కేసులు పెండింగ్లో ఉంటున్న క్రమంలో ఈ ఏడాది ఏకంగా ఏడుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు రిటైర్ కానుండటంతో సమస్య మరింత జటిలం కానుంది. సర్వోన్నత న్యాయస్ధానం ఇప్పటికే ఆరుగురు న్యాయమూర్తుల కొరతతో సతమతమవుతోంది. ఇద్దరు న్యాయమూర్తుల నియామకం సత్వరమే చేపట్టాలన్న సూచన ఇంకా ప్రభుత్వం వద్ద పెండింగ్లోనే ఉంది. మార్చి 1న జస్టిస్ అమితవ రాయ్ పదవీవిరమణ చేయనుండగా, మే 4న జస్టిస్ రాజేష్ అగర్వాల్ రిటైర్ కానున్నారు. ఇక చీఫ్ జస్టిస్ తర్వాత సుప్రీం కోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జే . చలమేశ్వర్ జూన్ 22న, జస్టిస్ ఆదర్శ్ గోయల్ జులై 6న పదవీవిరమణ చేయనున్నారని సుప్రీం కోర్టు, న్యాయమంత్రిత్వ శాఖ వెబ్సైట్లు పేర్కొన్నాయి. ఇక సీజేఐ దీపక్ మిశ్రా అక్టోబర్ 2న, జస్టిస్ కురియన్ జోసెఫ్ నవంబర్ 29న, జస్టిస్ మదన్ బీ లోకూర్ డిసెంబర్ 30న పదవీవిరమణ చేయనున్నారు. న్యాయమూర్తులు పెద్దసంఖ్యలో రిటైర్ కానుండటం, ఇప్పటికే ఆరుగురు న్యాయమూర్తుల కొరత నెలకొనడంతో కొలీజియం జడ్జీల ఎంపికపై ఒత్తిడి ఎదుర్కోనుంది. న్యాయమూర్తుల నియామకంపై ప్రభుత్వం సత్వరమే స్పందించి పెండింగ్ కేసులు పేరుకుపోకుండా చూడాల్సిఉంది. -
ఐదు హైకోర్టులకు 37 మంది జడ్జీలు
న్యూఢిల్లీ: అలహాబాద్, రాజస్తాన్, కేరళ, గుజరాత్, బొంబాయి హైకోర్టుల్లో పనిచేస్తున్న 37 మంది అదనపు జడ్జీలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ జడ్జీల్లో కొందరిపై ఫిర్యాదులు అందినప్పటికీ వారిపై చర్యలు తీసుకోదగ్గ కారణాలేవీ తమకు కన్పించలేదని కొలీజియం తెలిపింది. ఈ మేరకు కొలీజియం చేసిన సిఫార్సులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. -
న్యాయుమూర్తులకు భారీ బొనాంజా..
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు, రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలను రెండింతలు పైగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని నోటిఫై చేసింది. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత వేతనం రూ లక్ష నుంచి రూ 2.80 లక్షలకు పెరిగింది. ఇవి కాకుండా డీఏ, ఇతర అలవెన్సులు, అధికారిక నివాసం, కారు సిబ్బంది వంటి సౌకర్యాలు అదనం. సుప్రీం కోర్టు ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు చీఫ్ జస్టిస్ల వేతనం ప్రస్తుతం ఉన్న రూ 90,000 నుంచి రూ 2.5 లక్షలకు పెరిగింది. క్యాబినెట్ కార్యదర్శి స్దాయిలో వీరికీ అలవెన్సులూ, ఇతర సౌకర్యాలు వర్తిస్తాయి. ప్రస్తుతం నెలకు రూ 80,000 వేతనం అందుకుంటున్న హైకోర్టు న్యాయమూర్తులకు పెరిగిన వేతనం రూ 2.25 లక్షలుగా ఖరారు చేశారు. జనవరి 1, 2016 నుంచి వేతన పెంపును అమలు చేస్తారు. సిట్టింగ్ జడ్జీలతో పాటు పదవీవిరమణ చేసిన న్యాయమూర్తులకూ వేతన పెంపు వర్తిస్తుంది. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు వేతనాలు పెంచాలని 2016లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. -
‘సుప్రీం’ సంక్షోభం ముగిసింది
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జిల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలకు తాత్కాలిక తెరపడింది. సంక్షోభం ముగిసినట్లేనని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ప్రకటించారు. ఓ జాతీయ మీడియా ఛానెల్తో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని తెలిపారు. సోమవారం లోపు సమస్యను పరిష్కరిస్తామని ఇది వరకే ఆయన ప్రకటించిన విషయం విదితమే. ఇక అధికారికంగా ఈ విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీడియా ఎదుట ప్రకటించనుంది. న్యాయ నిపుణులు, బార్ అసోషియేషన్ సభ్యులు విడివిడిగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, అసంతృప్త న్యాయమూర్తులతో దఫాలుగా భేటీ అయ్యారు. చివరకి వారి మధ్యవర్తిత్వంతో వివాదాన్ని ముగించేందుకు సర్వోన్నత న్యాయస్థాన న్యాయమూర్తులంతా ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అటార్నీ జనరల్ వేణుగోపాల్ వ్యాఖ్యానిస్తూ... న్యాయమూర్తుల మధ్య సఖ్యత ఏర్పడిందని, దీన్ని మరింత పొడిగించాలని వారు కూడా అనుకోవడం లేదు. ఇప్పుడంతా ఓకే అని పేర్కొన్నారు. భారతదేశ న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారిగా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) దీపక్ మిశ్రా పనితీరుపై సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కొన్ని రోజులుగా సర్వోన్నత న్యాయస్థానంలో పాలన వ్యవహారాలు సవ్యంగా జరగడం లేదని, వాటిని సరిదిద్దేలా సీజేఐని ఒప్పించడంలో తాము విఫలమయ్యామని, విధిలేని పరిస్థితుల్లోనే ప్రజల ముందుకొచ్చి వాస్తవాలను వెల్లడించాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. -
గతంలో ‘న్యాయ’ వివాదాలు..!
న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. పలువురు న్యాయమూర్తులు అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు ఎదుర్కోగా, ఓ మాజీ జడ్జీ కోర్టు ధిక్కార నేరం కింద ఆరు నెలల జైలుశిక్ష అనుభవించారు. ► 1993లో అప్పటి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామస్వామిపై అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై లోక్సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో ఆ తీర్మానం వీగిపోయింది. ► 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రా సేన్ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు రాజ్యసభ గుర్తించింది. ఆయన్ను తొలగించేందుకు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అయితే ఈ తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టడానికి ముందే సేన్ తన పదవికి రాజీనామా చేశారు. ► కొలీజియంతో పాటు సుప్రీం, హైకోర్టు జడ్జీలపై పరువు నష్టం వ్యాఖ్యలు చేసినందుకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్కు 2016లో ఆరు నెలల జైలుశిక్ష పడింది. దీంతో జైలుశిక్ష ఎదుర్కొన్న తొలిజడ్జీగా కర్ణన్ నిలిచారు. ► 2010లో వ్యక్తిగత ఆస్తుల్ని వెల్లడించడానికి సుప్రీం, హైకోర్టుల్లోని న్యాయమూర్తులు జంకుతున్న సమయంలో కర్ణాటక హైకోర్టు జడ్జీ జస్టిస్ శైలేంద్ర కుమార్ అప్పటి సీజేఐ జస్టిస్ బాలకృష్ణన్ను విమర్శించారు. ► 2012లో కర్ణాటక హైకోర్టు సిట్టింగ్ జడ్జీ జ్ఞాన్ సుధా మిశ్రా ప్రకటించిన ఆస్తుల్లో తన పెళ్లికాని కుమార్తెలను అప్పుగా చూపించడంతో మరో వివాదం రాజుకుంది. ► 2012లోనే కర్ణాటక హైకోర్టులో విడాకుల కోసం ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ భక్తవత్సల.. గృహహింస ప్రతి ఇంట్లోనూ ఉంటుందని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ► గతేడాది ఓ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై తన బ్లాగ్లో చేసిన కామెంట్లపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా అత్యున్నత ధర్మాసనం మాజీ జడ్జి జస్టిస్ మార్కాండేయ కట్జూను ఆదేశించింది. ► 2015లో హార్దిక్ పటేల్ అరెస్ట్ కేసును విచారించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు వ్యతిరేకంగా 58 మంది రాజ్యసభ ఎంపీలు అభిశంసన నోటీసును అప్పటి సభ చైర్మన్ హమీద్ అన్సారీకి పంపారు. ► సుప్రీం కోర్టు మాజీ సీజేఐ జస్టిస్ సదాశివం, న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీలు తమ వద్ద శిక్షణ పొందుతున్న న్యాయ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలో ఆరోపణలు వచ్చాయి. -
'సుప్రీం' సంక్షోభం
దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే సంచలనం! దేశంలో ఇంతకు ముందెన్నడూ చోటుచేసుకోని అనూహ్య పరిణామం. సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన నలుగురు న్యాయమూర్తులు తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. సుప్రీంకోర్టులో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై గొంతువిప్పారు. కొద్దినెలలుగా కోర్టు పాలన వ్యవస్థలో అవాంఛనీయ పరిణామలు చోటు చేసుకుంటున్నాయని, ఇది దేశ ప్రజాస్వామ్యానికే ముప్పు అని వ్యాఖ్యానించారు. కేసుల కేటాయింపు, కొన్ని కేసుల్లో కోర్టు ఉత్తర్వులను ప్రస్తావిస్తూ.. ఒకవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ దీపక్ మిశ్రాపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ అసాధారణ పరిణామం అటు న్యాయవ్యవస్థలో ఇటు ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. – సాక్షి, న్యూఢిల్లీ దేశ అత్యున్నత న్యాయస్థానం ఔన్నత్యాన్ని కాపాడాలి. లేదంటే దేశంలో ప్రజాస్వామ్యం మనజాలదు. సుప్రీం కోర్టులో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ నలుగురం ప్రధాన న్యాయమూర్తిని కలిశాం. కానీ మా ప్రయత్నాలన్నీ విఫల మయ్యాయి. న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడేలా చర్యలు చేపట్టాల్సిందిగా మేం సీజేని ఒప్పించలేకపోయాం. ఇలా న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం దేశంలో అసాధారణం. కానీ తప్పలేదు. సుప్రీంకోర్టు పాలన విషయంలో జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. సీజేఐ అభిశంసన విషయంపై దేశమే నిర్ణయం తీసుకోవాలి. – ‘ప్రెస్మీట్’లో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ముఖ్యమైన కేసులను కూడా గతంలో పని చేసిన సీజేఐలు ఎలాంటి హేతుబద్ధ ప్రాతిపదిక లేకుండా, తమ ఇష్టానుసారంగా వివిధ బెంచ్లకు కేటాయించేవారు. ఈ పోకడకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఇది అవాంఛనీయ పరిస్థితులకు దారి తీస్తుంది. న్యాయ వ్యవస్థ నిజాయతీపైనా అనుమానాలకు తావిస్తుంది. సీజేకు ఉన్న కేసుల కేటాయింపు, రోస్టర్ అధికారం కోర్టు మరింత సమర్థంగా పనిచేయడానికి మాత్రమే. అంతేకానీ జడ్జీలపై అధికారం చలాయించేందుకు కాదు. చీఫ్ జస్టిస్ అంటే ‘సమానుల్లో ప్రథముడు.’ అంతే తప్ప ఎవరికంటే ఎక్కువ కాదు. తక్కువ కాదు. – ‘లేఖ’లో నలుగురు ‘సుప్రీం’ న్యాయమూర్తులు తీవ్ర ఆవేదనతో మీడియా ముందుకొచ్చాం.. సుప్రీం కోర్టు సీనియర్ జడ్జిలు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లు శుక్రవారం జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో మీడి యా సమావేశం నిర్వహించారు. జడ్జిలు ఇలా మీడియా ముందుకు రావడం అసాధారణమని, కానీ మరో మార్గం లేక తీవ్ర ఆవేదన, బాధతో ఇలా రాక తప్పలేదని స్వయంగా జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. సుప్రీంకోర్టులో గత కొద్ది నెలలుగా జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలపై ఆవేదన చెంది, వాటిని ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లామని, కానీ ఆయన ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లిన అంశాలతో కూడిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖను కొద్ది నెలల ముందే సీజేకు పంపినట్టు వివరించారు. కోర్టు పాలనా తీరును సరిదిద్దాలంటూ శుక్రవారం ఉదయం కూడా ఆయన్ను కలిసినట్టు వివరించారు. ‘‘దేశ అత్యు న్నత న్యాయస్థానం ఔన్నత్యాన్ని కాపాడాలి. లేదంటే దేశంలో ప్రజాస్వామ్యం మనజాలదు. సుప్రీంకోర్టులో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ మేం నలుగురం ప్రధాన న్యాయమూర్తిని కలిశాం. కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరాం. కానీ దురదృష్టవశాత్తూ మా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడేలా చర్యలు చేపట్టాల్సిందిగా మేం సీజేని ఒప్పించలేకపోయాం. న్యాయవ్యవస్థ, దేశం పట్ల మేం బాధ్యతాయుతంగా ఉన్నాం. ఇలా జడ్జిలు మీడియా ముందుకు రావ డం దేశంలో అసాధారణమే అయినా.. కానీ రాక తప్పలేదు. సుప్రీంకోర్టు పాలన విషయంలో జరుగుతున్న పరిణామాలు దేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న విషయంలో మేం నలుగురం ఏకాభిప్రాయంతో ఉన్నాం’’ అని జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. కోర్టు పాలనలో జరుగుతున్న అవాంఛనీయ అంశాలు ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘సీజే ద్వారా జరుగుతున్న కేసుల కేటాయింపు’వంటివి అందులో కొన్ని అని బదులిచ్చారు. ఉన్నట్టుండి.. కోర్టును వీడి మీడియా ముందుకు వచ్చి సంచలనం సృష్టించిన నలుగురు జడ్జిలు శుక్రవారం ఉదయం ఎప్పట్లాగే సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఉదయం 11.30 గంటల సమయంలో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తమ కోర్టు రూంలకు చేరుకున్నారు. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్ కూడా తమ చాంబర్లో కేసులు విన్నారు. నిమిషాల వ్యవధిలోనే ఈ నలుగురు కోర్టును వీడి 4, తుగ్లక్ రోడ్ బంగ్లాలో ఉన్న జస్టిస్ చలమేశ్వర్ నివాసానికి చేరుకుకొని కాసేపటికే మీడియా ముందుకు వచ్చారు. జడ్జిలు ఉన్నట్టుండి బయటకు వెళ్లారన్న వార్త కోర్టు కారిడార్లలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక జడ్జిల మీడియా సమావేశానికి హేమాహేమీలైన లాయర్లు, పాత్రికేయులు హాజరయ్యారు. శేఖర్ గుప్తా, ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ తదితరులు తరలి వచ్చారు. జైసింగ్ కొన్ని ప్రశ్నలు అడగబోగా.. ఇది మీడియా సమావేశమని, మేమే అడగాలని కొందరు పాత్రికేయులు అభ్యంతరం తెలిపారు. అయితే తాను ఓ పౌరురాలిగా అడుగుతున్నట్టు జైసింగ్ వారికి బదులిచ్చారు. మొత్తంగా జడ్జిలు 7–8 నిమిషాలు మీడియాతో మాట్లాడారు. సీజేతో ఏజీ భేటీ.. జడ్జిల మీడియా సమావేశం నేపథ్యంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సీజే జస్టిస్ దీపక్ మిశ్రాతో భేటీ అయ్యారు. సమావేశంలో వీరిద్దరు ఏం చర్చించారన్న అంశాలు తెలియరాలేదు. సీజే, ఏజీలు కూడా మీడియా సమావేశంలో మాట్లాడతారన్న వార్తలు వచ్చాయి. దీంతో పాత్రికేయులంతా సుప్రీంకోర్టుకు హుటాహుటిన వెళ్లి సాయంత్రం 4 గంటల దాకా నిరీక్షించారు. కానీ వారు మీడియా ముందుకు రాలేదు. అభిశంసనపై దేశమే నిర్ణయించాలి.. సీజేఐని అభిశంసించాలని కోరుకుంటున్నారా అని మీడియా జస్టిస్ చలమేశ్వర్ను అడగ్గా.. ‘‘ఆ విషయంపై జాతి నిర్ణయం తీసుకుంటుంది’’అని సమాధానమిచ్చారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం 25 మంది జడ్జిలు ఉన్నారు. గత ఆగస్టు 28న జస్టిస్ మిశ్రా సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది అక్టోబర్ 2న ఆయన పదవీకాలం ముగియనుంది. ఈయనతోపాటు ప్రస్తుతం మీడియా ముందుకు వచ్చిన నలుగురు న్యాయమూర్తులు కొలీజియంలో ఉన్నారు. సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసుపై విచారణ జరుపుతున్న సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి బీహెచ్ లోయా అనుమానాస్పద మృతి కేసును సుప్రీం శుక్రవారమే విచారణకు స్వీకరించింది. ఇదే సమయంలో జడ్జీలు మీడియా ముందుకు రావడం సంచలనం రేకెత్తించింది. పలు అంశాల్లో సీజే వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావించిన నలుగురు జడ్జిలు.. కొద్ది నెలల కిందట ఆయనకు రాసిన ఏడు పేజీల లేఖను కూడా మీడియాకు విడుదల చేశారు. ఈ పెడ పోకడను అడ్డుకోవాలి.. కేసుల రోస్టర్, వాటి కేటాయింపు అంశాల్లో ప్రధాన న్యాయమూర్తి వ్యవహార శైలిని జడ్జిలు తమ లేఖలో పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ముఖ్యమైన కేసులను కూడా గతంలో పని చేసిన సీజేఐలు ఎలాంటి హేతుబద్ధ ప్రాతిపదిక లేకుండా, తమ ఇష్టానుసారంగా, తమకు కావాల్సిన బెంచ్లకు కేటాయించేవారు. ఈ పోకడకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఇది అవాంఛనీయ పరిస్థితులకు దారి తీస్తుంది. న్యాయవ్యవస్థ నిజాయతీపైనా అనుమానాలకు తావిస్తుంది. న్యాయ వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవద్దన్న ఉద్దేశంతోనే మేం వివరాల్నింటినీ వెల్లడించడం లేదు. కానీ సదరు చర్యల వల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఇప్పటికే కొద్దిగా మసకబారింది’’అని పేర్కొన్నారు. ‘‘సీజేకు ఉన్న కేసుల కేటాయింపు, రోస్టర్ అధికారం కోర్టు మరింత సమర్థంగా పనిచేయడానికి ఉద్దేశించింది మాత్రమే. అంతేకానీ జడ్జిలపై అధికారం చెలాయించేందుకు ఏమాత్రం కాదు. ప్రధాన న్యాయమూర్తి అంటే ‘సమానుల్లో ప్రథముడు’. అంతేగానీ ఎవరికంటే ఎక్కువ కాదు. తక్కువ కాదు..’’అని స్పష్టంచేశారు. జస్టిస్ చలమేశ్వర్ను కలిసిన రాజా జస్టిస్ చలమేశ్వర్ను సీపీఐ నేత డి.రాజా ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ‘నాకు జస్టిస్ చలమేశ్వర్ చాలాకాలంగా తెలుసు. ఏం జరిగిందో తెలుసుకోవాలని వచ్చా. న్యాయవ్యవస్థలో ఇలాంటి సమస్యల పరిష్కారానికి పార్లమెంటే ఓ మార్గం చూపాలి’అని భేటీ అనంతరం రాజా అన్నారు. కొందరు జడ్జిలు కూడా చలమేశ్వర్ను కలిసినట్టు తెలిసింది. ‘‘రాజా వ్యక్తిగతంగా వెళ్లి చలమేశ్వర్ను కలిశారు. దీంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’అని పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి పేర్కొన్నారు. న్యాయమూర్తుల అంశంలో తమ పార్టీ తలదూర్చబోదని, సమస్యను న్యాయ వ్యవస్థనే పరిష్కరించుకుంటుందని అన్నారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 1997 జూన్ 23న నియమితులయ్యారు. ఆ తర్వాత గౌహతి, కేరళ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిం చారు. 2011 అక్టోబర్ 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ప్రస్తుతం నెంబర్ టూగా కొనసాగుతున్నారు. ఇంటర్నెట్లో పోస్టు చేయడం వాక్స్వాతంత్య్రమంటూ ప్రక టించిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్జేఏసీ) ఏర్పాటుపై 2015లో ఇచ్చిన తీర్పులో మిగిలిన న్యాయమూర్తులతో విభేదించారు. కొలీజియం వ్యవస్థ ఆశ్రిత పక్షపాతానికి అలంకారంగా మారిందని ఆక్షేపించారు. ఆధార్ తప్పనిసరి కాదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనంలో చలమేశ్వర్ కూడా ఉన్నారు. గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని 2017 ప్రకటించిన తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు. పార్లమెంటరీ కార్యదర్శులను నియమించుకుంటూ చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలకు లేదంటూ తీర్పునిచ్చిన ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహించారు. జస్టిస్ రంజన్ గొగోయ్ గౌహతి హైకోర్టులో 2001 ఫిబ్రవరి 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010లో పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకు బదిలీ తర్వాత అక్కడే ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2012, ఏప్రిల్ 23న పదోన్నతి పొందారు. జస్టిస్ దీపక్ మిశ్రా తరువాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. రాజకీయ నాయకుల ఉచిత కానుకల హామీలపై మార్గదర్శకాలను రూపొందించాలని తీర్పునిచ్చిన ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నారు. అలాగే ఓటు వేసే సమయంలో పౌరులు ఒక నిర్ణయం తీసుకోవటానికి వీలుగా.. అభ్యర్థులు నామినేషన్ అఫిడవిట్లో పూర్తి సమాచారాన్ని అందించటం తప్పనిసరని తీర్పునిచ్చిన ధర్మాసనంలోనూ సభ్యుడిగా ఉన్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా... జస్టిస్ దీపక్ మిశ్రా 1953 అక్టోబర్ 3న జన్మించారు. 1977, ఫిబ్రవరి 14న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. రాజ్యాంగం, సివిల్, క్రిమినల్, రెవెన్యూ సర్వీసు, పన్నులకు సంబంధించిన కేసులను వాదించారు. 1996 జనవరి 17న ఒరిస్సా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 డిసెంబర్ 19న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2009 డిసెంబర్ 23న పదోన్నతిపై పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2010 మే 24న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2011 అక్టోబర్ 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఆగస్టు 28న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018, అక్టోబర్ 2న పదవీ విరమణ చేయనున్నారు. బాబ్రీ కేసు, సిక్కుల ఊచకోత, బీసీసీఐలో సంస్కరణలు లాంటి కీలక కేసులను విచారిస్తున్న బెంచ్లకు నేతృత్వం వహిస్తున్నారు. జస్టిస్ మదన్ బి.లోకూర్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా 1999లో నియమితులయ్యారు. 2010లో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత గౌహతి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 జూన్ 4న పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. న్యాయవ్యవస్థలో కంప్యూటరీకరణ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. గత దశాబ్ద కాలంలో మణిపూర్లో జరిగిన 98 ఎన్కౌంటర్ హత్యలపై సీబీఐ దర్యాప్తు జరపాలని జస్టిస్ లోకూర్, జస్టిస్ ఉదయ్ లలిత్లతో కూడిన ధర్మాసనం 2017 జూలైలో ఆదేశించింది. దేశంలో రైతు ఆత్మహత్యలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీచేసిన, జైల్లో అసహజ మరణాలకు గురైన వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందచేయాలని కేంద్రంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనాలకు నేతృత్వం వహించారు. జస్టిస్ కురియన్ జోసెఫ్ కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా 2000, జూన్ 12న నియమితులయ్యారు. కేరళ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత పదోన్నతిపై హిమాచల్ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ట్రిపుల్ తలాక్ను నిషేధించిన, బొగ్గు కేటాయింపు కుంభకోణం కేసును విచారించిన ధర్మాసనాల్లో సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంటుపై దాడి కేసులో.. ముద్రణపత్రాలు, సీడీలను ఎలాంటి నిర్ధారణ లేకుండా ప్రాథమిక సాక్ష్యాలుగా పరిగణించటాన్ని సమర్థిస్తూ 2005లో ఇచ్చిన తీర్పును ధర్మాసనం తరఫున జస్టిస్ కురియన్ రాశారు. చదవండి: ⇒ ‘సుప్రీం’ సంక్షోభంపై న్యాయ నిపుణుల స్పందనలు ⇒ ‘సుప్రీం’లో సంక్షోభానికి కారణాలివి! -
జస్టిస్ చలమేశ్వర్ ఏం చెప్పారంటే..
-
న్యాయవ్యవస్థకు ఇదొక దుర్దినం: ఇంకా ఎవరేమన్నారు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నలుగురు సీనియర్ న్యాయవాదులు నిర్వహించిన మీడియా సమావేశం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు పనితీరు బాగా లేదంటూ తొలిసారి బహిరంగంగా సుప్రీం చీఫ్పై విమర్శలకు దిగడం కలవరం పుట్టిస్తోంది. దీనిపై పలువురు న్యాయనిపుణులు, ఇతర ప్రముఖులు స్పందించారు. ప్రశాంత్ భూషణ్ సీనియర్ న్యాయవాది: సుప్రీం జడ్జిల పట్ల తన కృతజ్ఞత వ్యక్తం చేసిన ఆయన సుప్రీం చీఫ్ దీపక్ మిశ్రా చాలా ఘోరంగా తన అధికారాలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక ఫలితాలను సాధించడానికి 'రోస్టర్ ఆఫ్ మాస్టర్' గా తన పవర్ను వాడుకున్నారని విమర్శించారు. ఏ మాత్రం బాధ్యత ఉన్నా చీఫ్ జస్టిస్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికం: న్యాయవ్యవస్థకు ఇదొక బ్లాక్ డే అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా సుప్రీం న్యాయవాదులు మాట్లాడారు. ఇకపై సామాన్య పౌరుడు కూడా ప్రతీ తీర్పును అనుమానించే అవకాశం ఉంది. ప్రతీ తీర్పు ప్రశ్నించబడుతుంది. సీనియర్ న్యాయవాది, బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి: వారిని విమర్శించలేమనీ, గొప్ప సమగ్రత గల వ్యక్తులు, చట్టపరమైన వృత్తిని త్యాగం చేశారంటూ న్యాయమూర్తుల పట్ల సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలన్నారు. సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి: ఇది తనను చాలా షాక్కు గురిచేసింది.సీనియర్ అధిక న్యాయమూర్తులకు ఈ చర్య వెనుక బలమైన కారణాలు ఉండి ఉంటాయని, వారు మాట్లాడుతున్నప్పుడు వారి ముఖాలపై బాధ కనిపించింది. ప్రధాన న్యాయమూర్తి తక్షణమే రాజీనామా చేయాలి. కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ : అంతిమంగా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. న్యాయమూర్తులు తమలో తాము సమస్యలను పరిష్కరించుకొని వుంటే బావుండేది. మాజీ ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్దాస్ పాయ్: ఈ అంశంపై స్పందిస్తూ పార్లమెంటు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంట్, సుప్రీంకోర్టే న్యాయమూర్తులను నియమిస్తుందన్నారు. అలాగే నలుగురు న్యాయవాదులు మీడియా ముందుకు రాకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమన్నారు. ప్రముఖ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్: న్యాయమూర్తుల ప్రెస్మీట్ను సమర్ధించారు. బయటకు వచ్చిన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్కు వ్యతిరేకులు కాదనీ, కానీ కొల్లీజియంలో ఏమి జరుగుతుందో తెలుసుకునే హక్కు భారత ప్రజలకు వుంటుందన్నారు. రిటైర్డ్ జస్టిస్ ఆర్ సోధి: ఇది పరిపాలనా అంశంపై విమర్శ. ఇపుడు బయటికి వచ్చింది కేవలం నలుగురే, ఇంకా 23 మంది ఉన్నారు. అపరిపక్వత, పిల్లతనం తప్ప మరోటి కాదంటూ నలుగురు న్యాయమూర్తులపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని వారెలా చెబుతారు. మనకు పార్లమెంటు, కోర్టులు, పోలీసు వ్యవస్థలు ఉన్నాయి. మరోవైపు ఇదే అంశంపై సీనియర్ న్యాయవాదులు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ నివాసంలో ఈ సాయంత్రం 5 గంటలకు సమావేశం కానున్నారు. -
మార్కెట్లకు సుప్రీం జడ్జిల ప్రెస్మీట్ షాక్
సాక్షి, ముంబై: సరికొత్త రికార్డులతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రెస్మీట్ షాక్ తగిలింది. ముఖ్యంగా దేశ అత్యున్నత న్యాయస్థానం పనితీరుపై ఆరోపణలు గుప్పిస్తూ మీడియా సమావేశం నిర్వహించడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో దేశీయ స్టాక్మార్కెట్లలో కూడా తీవ్ర ఆందోళన నెలకొంది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో దేశీ సూచీలు గరిష్ట స్థాయిల నుంచి వెనక్కి తగ్గాయి. ఒక దశలో నిఫ్టీ 10, 700 స్థాయికి అతి సమీపంలోకి వచ్చింది. కానీ అనూహ్య పరిణామంతో ప్రస్తుతం సెన్సెక్స్ 133 పాయింట్లు కుప్పకూలగా నిఫ్టీ కూడా అదే బాటలో 50 పాయింట్లు కోల్పోయింది. టాప్ విన్నర్స్గా ఉన్న స్టాక్స్ ఒక్కసారిగా ఇండియా బుల్స్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, గెయిల్ నష్టాల్లోకి జారుకున్నాయి. జీ, సన్టీవీ, వేదాంతా లాభాల్లో కొనసాగుతున్నాయి. -
సీజే తీరు బాగోలేదు.. జరగకూడనివి జరిగాయి
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశ న్యాయ చరిత్రలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై మిగతా సీనియర్ న్యాయమూర్తులు బహిరంగంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఊహించని విధంగా మీడియా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ తన నివాసంలో మరో ముగ్గురు న్యాయమూర్తులు (జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ కురియన్ జోసెఫ్)తో కలిసి జరిగిన పరిణామాలను మీడియా ముందు వివరించారు. అయితే పూర్తి అంశాలను వెల్లడించకుండా మీడియాకు లేఖలు విడుదల చేశారు. జస్టిస్ చలమేశ్వర్ ఏం చెప్పారంటే... ‘‘దేశంలోనే కాదు.. ప్రపంచ న్యాయ చరిత్రలోనే బహుశా ఇలాంటి ఘట్టం చోటు చేసుకోలేదేమో. సుప్రీంకోర్టులో గత కొన్ని నెలలుగా పరిపాలన విధానం సరిగా లేదు. జరగకూడని పరిణమాలు చోటు చేసుకున్నాయి. మీడియాలో వస్తున్నట్లు ఇవేం రాజకీయ అంశాలు కావు. న్యాయ వ్యవస్థలో స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. సుప్రీంకోర్టు గౌరవాన్ని పరిరక్షించాలని.. ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దామని ప్రధాన న్యాయమూర్తికి(లేఖ ద్వారా) విజ్ఞప్తి చేశాం. కానీ, ఆయన నుంచి సానుకూల స్పందన లభించలేదు. అందుకే లోపాలను సరిదిద్దాలని మేం నలుగురం భావించాం. న్యాయవ్యవస్థలో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే వాటిని వివరించేందుకు మీడియా ముందుకు వచ్చాం. చీఫ్ జస్టిస్ ను అభిశంసించాలా లేదా అన్నది దేశ ప్రజలే తేల్చుకోవాలి' అని ఆయన చెప్పారు. కాగా ఇంతకు ఏ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విభేదాలు వచ్చాయి? ఏ అంశాన్ని ఆయన నిరాకరించారు అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు. అన్ని వివరాలను లేఖ రూపంలో ఇస్తామని తొలుత చెప్పి అనంతరం వాటిని మీడియాకు అందజేశారు. తమ ముందు మరో అవకాశం లేకుండా పోవటంతోనే ప్రజల ముందుకు వచ్చామని మరో న్యాయమూర్తి లోకూర్ తెలిపారు. ఇక గత డిసెంబర్ లో ఓ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా-జస్టిస్ చలమేశ్వర్ల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏకపక్షంగా చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నిర్ణయాలు తీసుకుంటున్నారని జస్టిస్ చలమేశ్వర్ ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు. వరుస భేటీలు.. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధానితో న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ భేటీ అయ్యారు. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు విమర్శల నేపథ్యంలో అటార్నీ జనరల్తో ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా భేటీ కావటం విశేషం. -
సుప్రీంకోర్టు చరిత్రలో ఊహించని పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చర్రితలో ఎన్నడూ లేని విధంగా ఊహించని పరిణామం చోటుచేసుకోనుంది. కొలీజియం నియామకాల్లో పారదర్శకత, కేసుల కేటాయింపులపై తదితర అంశాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చారు. జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ గొగోయ్ శుక్రవారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో వీరు మీడియా సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు చరిత్రలో జడ్జిలు మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. దీంతో సుప్రీంకోర్టు సిటింగ్ న్యాయమూర్తులు నిర్వహిస్తున్న ఈ మీడియా సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులో గత కొద్ది నెలలుగా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని, విధిలేని పరిస్థితిలోనే మీడియా ముందుకు వచ్చామని జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది ఊహించని పరిణామం అన్నారు. తమ అభిప్రాయాలు తెలుపుతూ నాలుగు నెలల క్రితమే చీఫ్ జస్టిస్కు లేఖ ఇచ్చామన్నారు. ఈ అంశాలను పరిష్కరించాలని సీజేను తాము కోరినా, సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని, అందుకే ఈ అంశాన్ని దేశానికి చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చామన్నారు. శుక్రవారం ఉదయం కూడా సీజేను కలిసి ఓ లేఖ ఇచ్చామని, అందులో ఉన్న అంశాలను పరిష్కరించాలని తాము కోరామని జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. తాము రాజకీయాలు చేయడం లేదన్నారు. చీఫ్ జస్టిస్ను అభిశంసన చేయాలా? వద్దా అనేది దేశ ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. సుప్రీంకోర్టు గౌరవాన్ని పరిరక్షించాలని ఆయన అన్నారు. -
తొలిసారిగా టీటీడీ ఘోరంగా విఫలమైంది
-
శ్రీవారి భక్తులకు ‘ముక్కోటి’కష్టాలు!
సాక్షి, తిరుమల : పవిత్రమైన వైకుంఠ ఏకాదశి దర్శన ఏర్పాట్లలో తొలిసారిగా టీటీడీ ఘోరంగా విఫలమైంది. వీఐపీలకు అడుగడుగునా మర్యాదలు చేయగా.. సామాన్యులకు మాత్రం ప్రత్యక్ష నరకాన్ని చూపించింది. సర్వదర్శన క్యూలైన్లలో తోపులాటలతో భక్తుల ఆర్తనాదాలు మిన్నంటాయి. టీటీడీ ఉన్నతాధికారుల తీరుపై భక్తులు విరుచుకుపడ్డారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వీఐపీలకు ఏకాదశి దర్శన టికెట్లు, స్వామి దర్శనం కల్పించటంలో టీటీడీ ఉన్నతాధికారులు పెద్దపీట వేశారు. మొత్తం 3,563 టికెట్లు కేటాయించారు. వీరందరికీ ఉ.4గం.ల నుండి 8గం.ల వరకు స్వామివారి దర్శనం కల్పించారు. వీఐపీ హోదాను బట్టి నిరీక్షణ, హారతులు, తీర్థం, శఠారి, ఇతర ప్రత్యేక మర్యాదలు కల్పించారు. దీంతో వీరికే 4 గంటల సమయం పట్టింది. గత ఏడాది వీఐపీలకు 4200 టికెట్లు కేటాయించినా రెండున్నర గంటల్లోనే దర్శనాలు ముగించి సామాన్యులకు త్వరగా దర్శనం కల్పించారు. శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంతాన గౌడర్ దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రామలింగేశ్వరరావు, జస్టిస్ ఎ.శంకర్ నారాయణ, జస్టిస్ సునీల్ చౌదరి, జస్టిస్ నాగార్జునరెడ్డి, అమర్నాథ్ గౌడ్, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, జస్టిస్ నూతి రామ్మోహన్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. –సాక్షి, తిరుమల -
వారి వేతనం రెండింతలు పైగా..
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలను రెండింతలు పైగా పెంచుతూ రూపొందిన బిల్లును ప్రభుత్వం గురువారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే భారత ప్రధాన న్యాయమూర్తి వేతనం ప్రస్తుతమున్న లక్ష రూపాయల నుంచి రూ. 2.80 లక్షలకు, సుప్రీం న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తుల వేతనం రూ. 90,000 నుంచి రూ. 2.50 లక్షలకు పెరుగుతుంది. ప్రస్తుతం నెలకు రూ. 80,000 వేతనం పొందుతున్న హైకోర్టు న్యాయమూర్తులు ఇక రూ. 2.25 లక్షల వేతనం అందుకుంటారు. ఏడో వేతన సంఘ సిఫార్సులకు అనుగుణంగా న్యాయమూర్తుల వేతన పెంపును చేపట్టారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలను పెంచాలని కోరుతూ 2016లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. -
జడ్జీల కంటే కోర్టు గదుల సంఖ్య తక్కువ..
న్యూఢిల్లీ: దేశంలో కింది స్థాయి కోర్టుల్లో పనిచేసే జడ్జీల సంఖ్య కంటే అక్కడ ఉన్న గదుల సంఖ్య తక్కువ ఉన్నట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తన నివేదికలో వెల్లడించింది. జిల్లా కోర్టులు, వాటి అధీనంలో పనిచేసే(సబ్ ఆర్డినేట్) కోర్టుల్లో జడ్జీలు, గదుల సంఖ్యలను సమం చేస్తే దేశంలో న్యాయవ్యవస్థ పనితీరు మెరుగవుతుందని అభిప్రాయపడింది. దేశంలో మొత్తం 17,576 కోర్టు రూమ్లు, 14,363 రెసిడెన్షియల్ యూనిట్లు ఉండగా.. జడ్జీల సంఖ్య 22,288 ఉందని తెలిపింది. ఈ మేరకు పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సభ్యులకు నివేదిక ఇచ్చింది. -
జడ్జీలకు లంచం కేసులో నేడు తీర్పు
న్యూఢిల్లీ: జడ్జీలకు లంచం ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విచారణార్హతపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ అంశంపై మంగళవారం తీర్పు వెలువరించే అవకాశముందని జస్టిస్ ఆర్కె అగర్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ తెలిపింది. పిటిషన్ను ఉపసంహరించుకోవాలని, అది న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. ఈ పిటిషన్ను నవంబర్ 9న జస్టిస్ జే.చలమేశ్వర్, ఎస్.అబ్దుల్ నజీర్ల ధర్మాసనం విచారణకు స్వీకరిస్తూ ఐదుగురు అత్యంత సీనియర్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించాలని ఆదేశించింది. సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అత్యవసరంగా సమావేశమై. ‘ధర్మాసనాల ఏర్పాటు, కేసుల అప్పగింత అధికారం పూర్తిగా ప్రధాన న్యాయమూర్తికే ఉంటుంది’ అని తేల్చింది. ఫలానా సభ్యులతో ధర్మాసనం ఏర్పాటు, కేసు అప్పగింతకు ఇతర ధర్మాసనాలు ఆదేశాలు జారీ చేయలేవని తేల్చి చెప్పింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సుప్రీంలో ఒక స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. -
జడ్జీల వేతనాల పెంపుపై కమిషన్
న్యూఢిల్లీ: దిగువ కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న 21 వేల మంది జడ్జీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. వారి వేతనాల పెంపును సిఫార్సు చేసే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని అధ్యక్షతన శుక్రవారం జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పి.వెంకట రామారెడ్డి నేతృత్వంలో ఏర్పాటుకానున్న ఈ కమిషన్లో కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్.బసంత్ సభ్యుడిగా ఉంటారు. 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కమిషన్ సిఫార్సుల్ని అందచేస్తుంది. జడ్జీలు, కింది కోర్టుల్లోని జ్యుడీషియల్ అధికారులకు 2010లో చివరిసారిగా జీతాలు పెంచినా.. జనవరి1, 2006 నుంచి జీతాల పెంపును అమలు చేశారు. ఢిల్లీకి భారీ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం ఎగ్జిబిషన్ మార్కెట్లో షాంఘై, హాంకాంగ్, సింగపూర్తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ద్వారకాలో రూ. 25,703 కోట్లతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం(ఈసీసీ) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ), నాన్–పీపీపీ పద్ధతిలో 2025 నాటికి ఈసీసీని పూర్తి చేయనున్నారు. ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏన్టీఏ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రారంభంలో సీబీఎస్ఈ నిర్వహిస్తున్న పరీక్షల్ని ఎన్టీఏ నిర్వహిస్తుందని, క్రమంగా మిగతా పరీక్షల్ని నిర్వహణను చేపడుతుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. అలాగే జాతీయ గ్రామీణ తాగు నీటి పథకం(ఎన్ఆర్డీడబ్యూపీ) పునర్వ్యవస్థీకరణకు 2017–18 నుంచి 2019–20 వరకూ రూ. 23,050 కోట్లు ఖర్చు చేసేందుకు ఓకే చెప్పింది. -
ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు, ఇద్దరు జడ్జీలు ఔట్
సాక్షి, భోపాల్: ఇద్దరు కన్నా ఎక్కువ పిల్లలు కలిగి ఉన్నందుకు ఇద్దరు జడ్జీలపై వేటు పడింది. మధ్యప్రదేశ్ హైకోర్టు వీరిని విధుల నుంచి తొలగిస్తూ ఈ తీర్పునిచ్చింది. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉండకూడదనే రాష్ట్రప్రభుత్వ నిబంధనను అతిక్రమించినందుకు గాను, కింది స్థాయి కోర్టులకు చెందిన ఇద్దరు ట్రైనీ జడ్జీలను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్(జనరల్ కండీషన్ ఆఫ్ సర్వీసెస్) నిబంధనలు 1961ను సవరించిన ఆ రాష్ట్రప్రభుత్వం, 2001 జనవరి 26 తర్వాత నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మూడో సంతానాన్ని కలిగి ఉంటే, వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ నిబంధనలు అతిక్రమించినందుకు గాను, గౌలియర్లో అదనపు జిల్లా సేవల(ట్రైనీ) జడ్జీ మనోజ్ కుమార్, జబల్పూర్కు చెందిన జిల్లా అదనపు(ట్రైనీ) జడ్జీ అష్రఫ్ అలీలను విధుల నుంచి తొలగిస్తున్నట్టు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మహమ్మద్ ఫహిమ్ అన్వర్ తెలిపారు. వీరి తొలగింపుపై హైకోర్టు జడ్జీలందరూ సమావేశమైన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. హైకోర్టు ఈ మేర చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. జనాభాను తగ్గించడానికి అసోం ప్రభుత్వం కూడా ఈ ఏడాది మొదట్లో ఇదే రకంగా ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే, వారిని ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటిస్తూ అసోం ప్రభుత్వం కూడా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగానే సంచలన నిర్ణయం ప్రకటించింది. అంతేకాక యూనివర్సిటీ స్థాయి వరకు ఆడపిల్లలకు ఉచిత విద్యను కూడా అసోం ప్రభుత్వం అందిస్తోంది. ఈ జనాభా పాలసీ డ్రాఫ్ట్ను అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత్ బిస్వా శర్మ ప్రకటించారు. ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉంటే, వారు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కారని చెప్పేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు టూ-చైల్డ్ పాలసీని అమలుచేస్తున్న రాష్ట్రాల్లో అసోం 12వది. -
చరిత్రాత్మక తీర్పునిచ్చిన న్యాయమూర్తులు వీరే...
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ దేశ సర్వోన్నత న్యాయస్థానం 44వ ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ సింగ్ ఖేహర్ ఈ నెల 27న(ఆదివారం) పదవీ విరమణ చేయనున్నారు. సిక్కు మతస్థుల నుంచి ఈ అత్యున్నత స్థానాన్ని చేరుకున్న తొలి వ్యక్తిగా ఆయన ప్రత్యేకతను సాధించారు. ఈ ఏడాది జనవరి 4న ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఆయన, 2011 సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకు ముందు ఉత్తరాఖండ్, కర్ణాటక హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్గా బాధ్యతలను నిర్వహించారు. 2జీ కుంభకోణం కేసులో, సహారా సంస్థ చీఫ్ సుబ్రతా రాయ్ కేసులో కీలక తీర్పులిచ్చారు. అరుణాచల్ప్రదేశ్లో విధించిన రాష్ట్రపతి పాలనను కేంద్రం విరమించుకునేలా ఆయన తీర్పునిచ్చారు. తాజాగా ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ కేసులో మెజారిటీ తీర్పును (3 ః 2 నిష్పత్తితో) విభేదిస్తూ మైనారిటీ తీర్పును వెలువరించారు. ఈ ఆచారాన్ని గత 1,400 ఏళ్లుగా ఆచరిస్తున్నందున, దీనిలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించాలని, ఆరునెలల్లోగా తగిన చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాజకీయపార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలంటూ తమ తీర్పులో సూచించారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ 2011 అక్టోబర్ 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీల సీనియారిటీలో మూడోస్థానంలో ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీగా పదోన్నతి పొందడానికి ముందు గువహటి, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను నిర్వహించారు. ఎవరైనా ఈ–మెయిల్స్ లేదా ఎలక్ట్రానిక్ మెసేజ్లలో పెట్టే పోస్టుల ద్వారా సంబంధిత వ్యక్తులను అసౌకర్యానికి, కోపానికి గురిచేస్తే వారిని పోలీసులు అరెస్ట్ చేసే హక్కును కల్పించే ఐటీ యాక్ట్ లోని 66 (ఏ) సెక్షన్ను కొట్టేస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరిగా ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జీగా 2018 జూన్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ ఎస్ఏ బోబ్డే బొంబాయి హైకోర్టు జడ్జీగా, ఆ తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాక 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆధార్ కార్డు లేని కారణంగా దేశ పౌరుడికి ఎవరికి కూడా ప్రాథమిక, ప్రభుత్వ సేవలను నిరాకరించరాదంటూ 2015లో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన స్పష్టీకరణలో బోబ్డే భాగస్వామిగా ఉన్నారు. జస్టిస్ ఆర్కే అగర్వాల్ 2013 అక్టోబర్లో మద్రాసు హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఆర్కే అగర్వాల్ నియమితులయ్యారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ రోహింగ్టన్ ఫాలి నారిమన్ 1979లో న్యాయవాదిగా తమ కెరీర్ను ప్రారం భించిన ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పలు కేసులను వాదించారు. 2011 జూలై 27–2013 ఫిబ్రవరి 4 మధ్యకాలంలో భారత సోలిసిటర్ జనరల్గా పనిచేశారు. 2014 జూలై 7న సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికప్పుడు ఇచ్చే విడాకులు (ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్) రాజ్యాంగ విరుద్ధమంటూ తాజాగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చిన ఐదుగురు జడ్జీల్లో ఒకరిగా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో కించపరిచే పోస్టులపై దాఖలైన పిటిషన్లో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ 66 (ఏ)ను కొట్టేస్తూ తీర్పునిచ్చిన ఇద్దరు జడ్జీల్లో ఈయన ఒకరు. జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే మణిపూర్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా, గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన అనంతరం 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ మానవహక్కుల విషయంలో చంద్రచూడ్ నైపుణ్యతను సాధించారు. బొంబాయి హైకోర్టు జడ్జీగా, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను నిర్వహించారు. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2017 ఫిబ్రవరిలో నియమితులయ్యారు. గతంలో పంజాబ్, హరియాణా, మద్రాస్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగానూ విధులు నిర్వర్తించారు. ప్రఖ్యాత చిత్రకారుడు ఎమ్మెఫ్ హుస్సేన్ వేస్తున్న పెయింటింగ్లలో అశ్లీలత ఉందంటూ 2008లో దాఖలైన పిటిషన్ను కౌల్ తిరస్కరించారు. జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ 1958లో కర్ణాటకలోని మూడ్బిద్రీలో జస్టిస్ నజీర్ జన్మించారు. బీకామ్ ఆ తర్వాత న్యాయశాస్త్ర పట్టాను పొందాక 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 సెప్టెంబర్ 24న అక్కడే శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఉన్నపళంగా 3 పర్యాయాలు తలాక్ (ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్) చెప్పడం చట్టవిరుద్ధమంటూ ఇచ్చిన తీర్పును విభేదిస్తూ చీఫ్ జస్టిస్ ఖేహర్ ఇచ్చిన మైనారిటీ తీర్పుతో జస్టిస్ నజీర్ ఏకీభవించారు. -
స్వాతంత్య్ర సిద్ధిలో న్యాయవాదుల పాత్ర
వారి త్యాగఫలాలే ఈ స్వేచ్ఛా వాయువులు.. స్వాతంత్య్ర వేడుకల్లో ఏసీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్ సాక్షి, హైదరాబాద్ : భారతదేశ స్వాతంత్య్ర సిద్ధిలో అనేక మంది న్యాయవాదుల పాత్ర ఉందని, వారి ప్రాణ త్యాగాల వల్లే ఇప్పుడు మనమంతా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు. బాల గంగాధర తిలక్, మహాత్మా గాంధీ, లాలాలజ్పత్ రాయ్, బీఆర్ అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ, సి.రాజగోపాలాచారి, బాబు రాజేంద్ర ప్రసాద్ తదితరులంతా కూడా ప్రఖ్యాత న్యాయవాదులని, వీరిని ఈ 71వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా స్మరించుకోవడం ఆనందాన్ని ఇస్తోందన్నారు. ఉమ్మడి హైకోర్టులో మంగళవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర సమరంలో భూలాభాయ్ దేశాయ్, వల్లభాయ్ పటేల్, వీపీ మీనన్ తదితరుల పాత్రను వివరించారు. దేశం లౌకిక రాజ్యమే భారతదేశం లౌకిక రాజ్యమని నమ్మి, దానిని ఆచ రణలో చూపిన గొప్ప వ్యక్తి వల్లభాయ్ పటేల్ అన్నారు. మైనారిటీల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన బాధ్యతని ప్రకటించి, ఆ మేర మైనారిటీలకు అన్ని హక్కులు కల్పించేలా చూశారన్నారు. స్వాతంత్య్రం అనంతరం 552 రాచరిక రాష్ట్రాలను దేశంలో విలీనం చేయడంలో వల్లభాయ్ పటేల్, రాష్ట్రాల మంత్రిత్వశాఖ కార్యదర్శి వీపీ మీనన్ల కృషి అసాధారణ మన్నారు. పటేల్ కృషి వల్లే ఆధునిక ఆల్ ఇండియా సర్వీసెస్ ఏర్పాటైం దన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా యుద్ధ ఖైదీలుగా నిర్బంధానికి గురైన పలువురు భారత ఆర్మీ అధికారులకు స్వేచ్ఛ ప్రసాదించడంలో భూలాభాయ్ దేశాయ్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆరోగ్య సహకరించకున్నా తన బలమైన వాదనలతో ఆ అధికారులు విడుదల య్యేలా చేశారన్నారు. అనంతరం చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన హైకోర్టు సిబ్బంది పిల్లలకు జస్టిస్రంగనాథన్ చేతుల మీదుగా అవార్డులు, ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయ మూర్తులు, సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయ మూర్తులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, ఉభయ రాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్, తెలంగాణ అదనపు ఏజీ, ఉభయ రాష్ట్రాల హైకోర్టు న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు, బార్ కౌన్సిల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు న్యాయమూర్తులకు ‘లా క్లర్క్లు’
నియామకపు మార్గదర్శకాలను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: హైకోర్టు న్యాయ మూర్తులకు ఆయా కేసుల్లో సహాయ సహకారాలు అందించేందుకు ‘లా క్లర్క్’లను నియమించుకునే విషయంలో మార్గదర్శకాలను రూపొందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు ఫైళ్లను చదివి ఆ కేసు సారాంశాన్ని అందచేయడం, కేసులో జరిగిన పరిణామాలను తేదీల వారీగా పట్టిక తయారు చేయడం, ఆ కేసులో ప్రధానంగా తలెత్తిన ప్రశ్నలను రూపొందించడం,సమావేశాల్లో పాల్గొనే న్యాయమూర్తులకు స్టడీ మెటీరియల్ సిద్ధం చేసి ఇవ్వడం తదితర పనులను ఈ లా క్లర్క్ లు చేయాల్సి ఉంటుంది. లా క్లర్క్ల నియామకాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేపడతారు. లా క్లర్క్గా నియమితులయ్యే వ్యక్తి వయస్సు 30 ఏళ్ళు దాటకూడదు. గుర్తింపు పొందిన న్యాయ విశ్వ విద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొంది ఉండాలి. 10+2 తరువాత ఐదేళ్ల విద్యను పూర్తి చేసి ఉండాలి. లా క్లర్క్గా పనిచేసే సమయంలో మరే ఇతర కోర్సులో విద్యాభ్యాసం చేయడం గానీ, మరే ఇతర వృత్తిలో కొనసాగడంగానీ చేయరాదు. ఏ బార్ కౌన్సి ల్లో కూడా న్యాయవాదిగా నమోదై ఉండకూడదు. హైకోర్టు దరఖాస్తులను ఆహ్వానించినప్పుడు దరఖాస్తు చేసుకోవాలి. లా స్కూళ్లు, వర్సిటీలు తమ పూర్వ విద్యార్థులను సిఫారç సు చేయవచ్చు. సొంత ఖర్చులమీద ఇంటర్వూకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేసిన కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. ఎంపిక ప్రతిభ ఆధారంగా జరుగు తుంది. ఎంపికైన వారికి నెలకు రూ.25వేలను గౌరవ వేతనంగా చెల్లిస్తారు. లా క్లర్క్గా పని చేసే సమయంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి వీలు లేదు. లా క్లర్క్గా రెండేళ్ల గడువు ముగిసిన తరువాత ఏ న్యాయమూర్తి వద్ద లా క్లర్క్గా పనిచేశారో, ఆ న్యాయ మూర్తి ముందు న్యాయవాదిగా వాదనలు వినిపించడానికి వీల్లేదు. -
న్యాయం కావాలి!
ఉమ్మడి హైకోర్టును పీడిస్తున్న ఖాళీలు - పని ఒత్తిడితో న్యాయమూర్తులు ఉక్కిరిబిక్కిరి - పోస్టుల భర్తీలో కేంద్రం తీవ్ర జాప్యం - రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలపై మీనమేషాలు - కక్షిదారులు, న్యాయవాదుల్లో పెరిగిపోతున్న అసహనం సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తుల ఖాళీలు.. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టును పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య. న్యాయమూర్తుల పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఉన్నతస్థాయిలో జరుగుతున్న అసాధారణ జాప్యంతో పెరిగిపోతున్న పని ఒత్తిడి న్యాయమూర్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి తోడు న్యాయవ్యవస్థలో చోటు చేసుకుంటున్న సంస్కరణల నేపథ్యంలో పెరిగిపోతున్న ఇతర అధికారిక పనులతో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలను ఉపయోగించుకునేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, ఆ మేర హైకోర్టు నుంచి సిఫారసులు అందినా ఇప్పటివరకు వారి నియామకానికి మాత్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఇదే సమయంలో విచారణకు నోచుకోని కేసులతో.. భరించలేని ఒత్తిడితో కక్షిదారులు, న్యాయవాదుల్లో అసహనం రోజు రోజుకు పెరిగిపోతోంది. రిటైర్డ్ న్యాయమూర్తులేమైనట్లు..? రాజ్యాంగంలోని అధికరణ 224ఎ కింద రిటైర్డ్ న్యాయమూర్తులను హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులుగా నియమించుకోవచ్చు. రిటైర్డ్ న్యాయమూర్తుల సేవల వినియోగంపై అప్పటి లా కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు నిర్ధిష్టమైన ప్రతిపాదనలు చేశారు. అయితే అవి ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం కేంద్ర న్యాయశాఖ గత ఏడాది నవంబర్లో రిటైర్డ్ న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గత ఏడాది చివర్లో నలుగురు రిటైర్డ్ న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేశారు. జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావు, జస్టిస్ ఎస్.రవికుమార్ పేర్లను కేంద్రానికి పంపారు. ఇలా నాలుగు హైకోర్టుల నుంచి 18 పేర్లు పంపినా.. కేంద్రం ఇప్పటికీ గ్రీన్సిగ్నల్ ఇవ్వలేదు. అయినా ప్రయోజనం లేదు... అయితే పెరుగుతున్న సంఖ్యలకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్య లేకపోవడంతో సిట్టింగ్ న్యాయమూర్తులపై పని ఒత్తిడి తీవ్రమవుతోంది. రోజుకు ఒక్కో న్యాయమూర్తి ముందు వందల సంఖ్యలో కేసులు వస్తున్నప్పటికీ, వాటిలో గరిష్టంగా 60–80 కేసులు మాత్రమే విచారించడం సాధ్యమవుతోంది. దీంతో కక్షిదారుల నుంచి న్యాయవాదులకు, న్యాయవాదుల నుంచి న్యాయమూర్తులకు ఒత్తిడి ఎదురవుతోంది. ఒక్కో జడ్జి పరిష్కరించిన కేసులు...(సుప్రీంకోర్టు తాజా లెక్కల ప్రకారం) ► ఉమ్మడి హైకోర్టులో (గత సెప్టెంబర్ నాటికి) పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య: 2,85,663. ► ఇందులో క్రిమినల్ కేసులు: 41,172... సివిల్ కేసులు: 2,44,491. ► 2016 మూడో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్)లో హైకోర్టు పరిష్కరించిన కేసు సంఖ్య: 17,991 ► ఆ క్వార్టర్లో హైకోర్టు పని దినాలు: 60 ► ఈ లెక్కన ఒక్కో న్యాయమూర్తి పరిష్కరించిన సరాసరి కేసులు: 299 పెరుగుతున్న కేసుల సంఖ్య(ఒక ఏడాదికి)... ► రాష్ట్ర విభజనకు ముందు దాఖలయ్యే రిట్ పిటిషన్ల సంఖ్య: 35 వేల నుంచి 38 వేలు ► ప్రస్తుతం: దాదాపు 47 వేలు ► రాష్ట్ర విభజనకు ముందు క్రిమినల్ కేసుల సంఖ్య: 11 వేల నుంచి 13 వేలు ► ప్రస్తుతం: 22 వేలకుపైగా... ► ఇప్పుడు తెలంగాణకు పరిపాలన ట్రిబ్యునల్ లేకపోవడంతో, ఉద్యోగ వివాదాల కేసులను హైకోర్టే విచారించాల్సి వస్తోంది. వీటికి తోడు ఆస్తి వివాదాలు, కుటుంబ వివాదాల కేసులు కూడా భారీగానే దాఖలవుతున్నాయి. -
మెరిశారి‘లా’..
♦ న్యాయవృత్తిలో ఉన్నత స్థానాల్లో అక్కాచెల్లెళ్లు ♦ ఆలమూరు ఏఎఫ్సీఎం కోర్టు జడ్జిగా చెల్లి దివ్య ♦ న్యాయమూర్తిగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అక్క దీప్తి అపారమైన పరిజ్ఞానం ఆ అక్కాచెల్లెళ్ల సొంతం. గ్రామీణ ప్రాంతంలోని ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన వారు.. కన్న తల్లిదండ్రుల కలలు నెరవేర్చేందుకు అహర్నిశలు శ్రమించి.. అకుంఠిత దీక్షతో తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఏడాది వ్యవధిలోనే ఇద్దరూ న్యాయవృత్తిలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. న్యాయవ్యవస్థపై గౌరవాన్ని పెంపొందిస్తామంటున్నారు. ఇంతకీ ఆ అక్కాచెల్లెళ్లు ఎవరు? వారిది ఏ ఊరు? జడ్జిలు కావడానికి కారణాలేంటీ? తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. – ఆలమూరు(కొత్తపేట) వీర్ల దివ్య, వీర్ల దీప్తి ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వీరి స్వగ్రామం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కంచర్లవారిపల్లె. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఆలమూరులోని రాజుగారి దివారణంలో నివసిస్తున్నారు. ఆలమూరు ఏఎఫ్సీఎం కోర్టు జడ్జిగా దివ్య ఇటీవల బాధ్యతలు స్వీకరించగా.. ఆమె అక్క దీప్తి 2016లో నిర్వహించిన పోటీ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి న్యాయమూర్తిగా ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరి తండ్రి వీర్ల బ్రహ్మయ్య బీకాం బీఎల్ విద్యను అభ్యసించి వ్యవసాయంపై మక్కువ పెంచుకోగా.. తల్లి రమణమ్మ సమీపంలోని వీరభద్రాపురం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఇ‘లా’ మొదలైంది.. విశాఖపట్నంలోని దామోదర సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో జడ్జి దివ్య ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. అలాగే జడ్జిగా ఎంపికైన దీప్తి హైదరాబాద్లోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం చెల్లెలు దివ్యను స్ఫూర్తిగా తీసుకుని మళ్లీ హైదరాబాద్లోని కేవీ రంగారెడ్డి లా కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. వీరిద్దరూ ఆయా లా కళాశాలల్లో క్రిమినల్ లా, టార్ట్స్, ఎకనావిుకల్, హిస్టరీ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి యూనివర్సిటీ స్థాయిలో మెడల్స్, షీల్డ్లు, మెమెంటోలు అందుకున్నారు. సమాజ సేవకు పాటుపడతా నాన్న బ్రహ్మయ్య స్ఫూర్తితో ఆయన ఆశయాన్ని నెరవేర్చేందుకు చిన్ననాటి నుంచే లా చదవాలని, జడ్జిని కావాలనే స్పష్టమైన లక్ష్యం ఉండేది. లా చదివించేందుకు కుటుంబసభ్యులు పడిన కష్టాన్ని దగ్గరుండి చూసిన నాకు జడ్జి కావాలనే కోరిక బలంగా నాటుకుంది. 2014లో ఎల్ఎల్ఎం పూర్తి చేశా. 2015 జూ¯ŒSలో నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు దరఖాస్తు చేసుకుని ప్రిలిమ్స్, మెయి¯Œ్స ఇంటర్యూలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించా. ఆరు నెలల శిక్షణ అనంతరం ఆలమూరు ఏఎఫ్సీఎం జడ్జిగా నియామకం పొందా. భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సమాజ సేవకు వినియోగిస్తా. – దివ్య, ఆలమూరు ఏఎఫ్సీఎం కోర్టు జడ్జి అందరికీ సమన్యాయం కుటుంబ సభ్యులను ప్రేరణగా తీసుకుని తొలుత బీటెక్ పూర్తి చేసి, మళ్లీ లా చదివా. తొలివిడత 2015లో చెల్లి దివ్యతో పాటు జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు సంబంధించి తుది వరకూ పోరాడినా ఇంటర్వూ్యలో ఒక్క మార్కు తేడాతో జడ్జి అవకాశాన్ని కోల్పోయా. మళ్లీ 2016లో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుకు దరఖాస్తు చేసుకుని మలివిడత ప్రయత్నంలో జడ్జిగా అర్హత సాధించా. వచ్చే నెలలో శిక్షణకు వెళ్లి అనంతరం ప్రజలకు జడ్జిగా సేవలందించనున్నా. అందరికీ సమన్యాయం చేసేందుకు కృషి చేస్తా. – వి.దీప్తి -
జడ్జిలకు సన్మానం
అనంతపురం మెడికల్ : నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) హాల్లో సోమవారం రాత్రి పలువురు జడ్జిలకు ‘స్నేహ’ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఇటీవల జిల్లా జడ్జిగా ఉద్యోగ విరమణ చేసిన కిష్టప్పతో పాటు అనంతపురం ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా ఉంటూ తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమితులైన రామచంద్రుడు, జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ సాకే గంపన్న కుమార్తె జ్యోతిలకు అభినందనలు తెలియజేశారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం స్నేహ క్లబ్ జిల్లా గవర్నర్ రామాంజనేయులు, మాజీ గవర్నర్ క్రిష్ణమూర్తి, ఎస్కేయూ ప్రొఫెసర్ బాల సుబ్రమణ్యం, ఏఆర్ ఎస్ఐ నీలకంఠప్ప మాట్లాడారు. డిప్యూటీ మేయర్ గంపన్న, స్నేహ క్లబ్ సభ్యులు బాలనరసింహులు, వన్నూరప్ప, ప్రకాశ్బాబు, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు న్యాయమూర్తులుగా నలుగురి ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ జె. ఉమా దేవి, జస్టిస్ ఎన్.బాలయోగి, జస్టిస్ టి.రజని, జస్టిస్ షమీమ్ అక్తర్లతో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ మంగళవారం ప్రమాణం చేయించారు. అనంతరం వీరు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ రమేశ్ రంగనాథన్తో కలసి జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ రామసుబ్రమణియన్తో కలసి జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ నాగార్జునరెడ్డితో కలసి జస్టిస్ రజని, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్తో కలసి జస్టిస్ బాలయోగి కేసులను విచారించారు. కొత్తగా బాధ్య తలు స్వీకరించిన నలుగురు న్యాయమూర్తులకు పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. -
ఉమ్మడి హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు
రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం 17న ప్రమాణ స్వీకారం చేయనున్న కొత్త న్యాయమూర్తులు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులుగా డాక్టర్ షమీమ్ అక్తర్, జవలకర్ ఉమాదేవి, నక్కా బాలయోగి, తెల్లప్రోలు రజని నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వీరి నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళవారం ఈ నలుగురు న్యాయమూర్తులుగా ప్రమాణం చేయనున్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ వీరితో ప్రమాణం చేయించనున్నారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయ మూర్తుల సంఖ్య 27కు చేరింది. జిల్లా జడ్జీల కోటాలో వీరు హైకోర్టు న్యాయ మూర్తులుగా నియమితుల య్యారు. డాక్టర్ షమీమ్ అక్తర్ జన్మస్థలం నల్లగొండ జిల్లా. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు రిజిష్ట్రార్(జ్యుడీషియల్)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జె.ఉమాదేవి జన్మస్థలం అనంతపురం జిల్లా. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నక్కా బాల యోగి తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సివి ల్ కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో జన్మించిన టి.రజని ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
10 మంది జడ్జీలకు కేంద్రం క్లియరెన్స్
న్యూఢిల్లీ: ‘హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకాలు చేపట్టకుండా న్యాయవ్యవస్థను స్తంభింపజేస్తారా’ అంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన కొద్ది రోజుల్లోనే ఢిల్లీ, గువాహటి హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియామకం కోసం పది మంది పేర్లకు కేంద్రం క్లియరెన్స్ ఇచ్చింది. వీరిలో ఢిల్లీ హైకోర్టుకు 5 మందిని, గువాహటి హైకోర్టుకు 5 మందిని న్యాయమూర్తులుగా నియమిస్తారు. ఢిల్లీ హైకోర్టుకు ప్రతిపాదించిన 5 మందిని జ్యుడీషియల్ సర్వీసెస్ నుంచి తీసుకుంటుండగా, గౌహతి హైకోర్టుకు ప్రతిపాదించిన 5 మందిని బార్ కౌన్సిల్ నుంచి, రాష్ట్ర న్యాయ సేవల నుంచి తీసుకుంటున్నారు. తుది ఆమోదం కోసం ప్రతిపాదనలను కేంద్రం రాష్ట్రపతి భవన్కు పంపించింది. ఈ వారాంతం కల్లా అనుమతి ఆమోదం లభించే అవకాశం ఉంది. -
ఈ భారం న్యాయమా?
- గతంలో ఎన్నడూ లేనంత ఒత్తిడిలో హైకోర్టు జడ్జీలు - రోజుకు సగటున 60 కేసుల విచారణ - ఒక వైపు పెద్ద సంఖ్యలో దాఖలవుతున్న కేసులు - మరోవైపు భారీగా పేరుకుపోతున్న కేసులు హైకోర్టు న్యాయమూర్తులు పనిభారంతో అల్లాడిపోతున్నారు. తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడంతో గతంలో ఎన్నడూ లేనంత పని భారాన్ని, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఓవైపు ఇబ్బడిముబ్బడిగా దాఖలవుతున్న కేసులు.. మరోవైపు అదే స్థాయిలో పేరుకుపోతున్న కేసులు జడ్జీలను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నాయి. న్యాయమూర్తులే కాదు.. సిబ్బందిది కూడా ఇదే పరిస్థితి. కేసులు దాఖలు చేస్తున్నా విచారణ జాబితాలో వాటికి స్థానం లభించడం లేదని, దాంతో తమ కేసులు విచారణకు రావడం లేదంటూ కోర్టు సిబ్బందిపై అటు న్యాయవాదులు, ఇటు కక్షిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చిన్నపాటి గొడవలు హైకోర్టులో ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి. అనేక సందర్భాల్లో సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఇచ్చేంత స్థాయికి పరిస్థితులు దిగజారిపోయాయి. గతంలో హైకోర్టులో ఎప్పుడూ ఇంతటి దారుణమైన పరిస్థితులు లేవు. దీనంతటికీ ప్రధాన కారణం తగినంత మంది న్యాయమూర్తులు లేకపోవడమే! - సాక్షి, హైదరాబాద్ 38 పోస్టులు ఖాళీ..చరిత్రలో ఇదే తొలిసారి హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 61. ప్రస్తుతం పనిచేస్తున్న వారు కేవలం 23. ఏకంగా 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సగానికిపైగా ఖాళీలు ఉండటం హైకోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే గత రెండున్నరేళ్లలో అంటే 23 అక్టోబర్ 2013 నుంచి 20 మే 2016 వరకు కేవలం ఒక్క జడ్జి పోస్టు మాత్రమే భర్తీ అయింది. జస్టిస్ బొసాలే తాతాల్కిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు అప్పటి కొలీజియం పలువురు న్యాయాధికారులు, న్యాయవాదులను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. అయితే ఆ జాబితా విషయంలో ఇప్పటివరకు తగిన పురోగతి మాత్రం లేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో విచారణ పూర్తయినా నియామకాల్లో ఆల స్యం జరుగుతుండంపై న్యాయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం రాజకీయ కారణాలతో ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల నియామకం ఆలస్యం జరుగుతోందని ఆ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నియామకం ఆలస్యం కావడానికి సైతం రాజకీయ జోక్యమే కారణమని ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి. 10 లక్షల మందికి 12 మందే.. తాజా గణాంకాల ప్రకారం దేశంలో జడ్జీలు-జనాభా దామాషా విషయంలో తెలుగు రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. దేశంలో ప్రతీ పది లక్షల మందికి జడ్జీల సగటు 18 కాగా, తెలుగు రాష్ట్రాల్లో 12 మాత్రమే. అంటే ప్రతీ పది లక్షల మందికి ఉభయ రాష్ట్రాల్లో 12 మంది న్యాయమూర్తులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ విషయంలో దేశంలోనే మనం 30వ స్థానంలో ఉన్నాం. ప్రస్తుతం హైకోర్టులో 2.75 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టులో ప్రతిరోజూ దాఖలయ్యే తాజా కేసులు (అడ్మిషన్) 400 నుంచి 500 వరకు ఉంటాయి. ఈ రోజు కేసులు దాఖలు చేస్తే అవి మరుసటి రోజు కేసుల విచారణ జాబితా (కాజ్లిస్ట్)లో ఉంటాయి. వీటికి లంచ్మోషన్ రూపంలో అత్యవసరంగా దాఖలు చేసే కేసులు అదనం. ఈ కేసులన్నింటినీ ఆయా సబ్జెక్టుల వారీగా పలువురు న్యాయమూర్తులకు కేటాయిస్తారు. ఇందులో రిట్ పిటిషన్లు కీలకమైనవి. అడ్మిషన్ కేసులను విచారించే న్యాయమూర్తులు ముందుకు తాజా కేసులతో పాటు గత విచారణ సమయంలో వాయిదా పడ్డ కేసులు కూడా వస్తుంటాయి. ఇలా అన్ని కేసులూ కలిపి ఆ న్యాయమూర్తుల ఒక్కొక్కరి జాబితాలో కనీసం 200 కేసులు ఉంటాయి. అయితే వీటిలో విచారణకు నోచుకునేది 60 నుంచి 80 కేసులు మాత్రమే. ఇది ఒక్కో జడ్జీని బట్టి ఉంటుంది. కొందరు 90 కేసులను కూడా విచారిస్తే.. మరికొందరు 60 కన్నా తక్కువ కేసులను విచారించే పరిస్థితులున్నాయి. సగటున న్యాయమూర్తులు రోజుకు 70 కేసులకు తక్కువ కాకుండా విచారిస్తున్నారు. ఇళ్ల వద్దా అధ్యయనం ప్రతిరోజూ హైకోర్టులో దాఖలయ్యే కేసుల్లో కొన్నింటిని సబ్జెక్టులను బట్టి ఆయా న్యాయమూర్తులు తమ తమ ఇళ్లకు తీసుకెళ్తారు. ప్రస్తుతం హైకోర్టులో న్యాయమూర్తుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొందరు న్యాయమూర్తులు రాత్రి 11.30 గంటల వరకు ఆ కేసులను అధ్యయనం చేస్తున్నారు. మళ్లీ ఉదయం 6 గంటలకు లేచి ఓ గంటన్నర పాటు కేసులను అధ్యయనం చేసి కోర్టుకు వస్తున్నారు. ఈ స్థాయిలో న్యాయమూర్తులు కసరత్తు చేస్తుంటేనే రోజుకు 60 కేసులను విచారించడానికి సాధ్యమవుతోంది. ఇది కాక తీర్పులను సిద్ధం చేసినప్పుడు దానిని వెలువరించడానికి ముందు తప్పులను సవరించడానికి కూడా న్యాయమూర్తులకు అత్యధిక సమయం పడుతూ ఉంటుంది. సాయంత్రం 4.30 గంటలకు కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత పాలనాపరమైన నిర్ణయాల నిమిత్తం నిత్యం న్యాయమూర్తుల నేతృత్వంలో ఏదో ఒక కమిటీ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. ఇదే సమయంలో ఆయా జిల్లాల జడ్జీలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు, వాటిపై విచారణకు సైతం న్యాయమూర్తులు సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఇవి కూడా కేసుల విచారణ సమయంలో జడ్జీలను ఒకింత ఒత్తిడి వైపు నెడుతున్నాయి. 4 నిమిషాలకో కేసు! హైకోర్టు రోజుకు 5 గంటల పాటు పనిచేస్తుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, భోజన విరామం తర్వాత తిరిగి 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు. గంటకు 60 నిమిషాల చొప్పున 5 గంటలకు 300 నిమిషాలు. ఈ 5 గంటల సమయంలో న్యాయమూర్తులు ఒక్కొక్కరు సగటున రోజుకు 70 కేసులను విచారిస్తున్నారు. అంటే నాలుగు నిమిషాలకు ఒక కేసు చొప్పున విచారిస్తున్నారు. ఇది అసాధ్యంగా కనిపిస్తున్నా.. న్యాయమూర్తులు ఇలానే పనిచేస్తున్నారు. దీనిని బట్టి న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో కొన్ని కేసులను అప్పటికప్పుడు పరిష్కరిస్తుంటే.. మరికొన్ని కేసులను విచారణకు స్వీకరించి కౌంటర్ల దాఖలుకు ఆదేశాలు ఇస్తుంటారు. మరికొన్నింటిలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుంటారు. ఇవి కాక అత్యవసరంగా లంచ్మోషన్ రూపంలో కేసులు దాఖలవుతుంటాయి. ఈ కేసుల విచారణకు ఒకసారి అనుమతినిచ్చాక కోర్టు పనివేళలతో నిమిత్తం లేకుండా వాటిని విచారించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ కేసుల విచారణకు అత్యధిక సమయం పడుతుంది. న్యాయవాదులు చెప్పే వాదనలను బట్టి కేసుల విచారణ సమయం ఆధారపడి ఉంటుంది. దీంతో ఆ న్యాయమూర్తులపై తెలియకుండానే ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో విచారణకు నోచుకోని కేసులు కాజ్లిస్ట్లో వెనక్కి వెళ్లిపోతుంటాయి. కొన్ని సందర్భాల్లో వారం రోజులకు కూడా ఆ కేసులు విచారణకు నోచుకోని పరిస్థితులు ప్రస్తుతం హైకోర్టులో ఉన్నాయి. దీంతో అటు కక్షిదారులు, ఇటు న్యాయవాదులు సదరు న్యాయమూర్తులను తిట్టుకోవడం హైకోర్టులో పరిపాటిగా మారిపోయింది. ఇక తుది విచారణలు చేపట్టే న్యాయమూర్తులు కూడా రోజుకు 10 నుంచి 20 కేసులను విచారిస్తున్నారు. తుది విచారణ కేసులకు అత్యధిక సమయం పడుతుంది. అంతిమంగా ఓ కేసును విచారించాల్సి ఉన్న నేపథ్యంలో అదేస్థాయిలో వాదనలు కూడా వినాల్సి ఉంటుంది. దీంతో విచారణ ఆలస్యమవుతూ ఉంటుంది. అయినా న్యాయమూర్తులు వీలైనంత త్వరగానే ఆ కేసులను విచారిస్తున్నారు. -
‘జడ్జీలకు ఎవరి సర్టిఫికెట్లూ అవసరం లేదు’
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత కోసం ఓ సంస్థను ఏర్పాటు చేయాలంటూ జాతీయ న్యాయవాదుల సంఘం వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులకు ఎవరి సర్టిఫికెట్లు అవసరంలేదని జస్టిస్ ఏకే మిశ్రా, జస్టిస్ లలిత్ల ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో బంధుప్రీతి చోటుచేసుకుటోందన్న జాతీయ న్యాయవాదుల సంఘం చేసిన వాదనలతో ధర్మాసనం విభేదించింది. ప్రతిభ కలిగిన వారికి కొలీజియం అన్యాయం చేసిందన్న వాదనలు అవాస్తవమంటూ పిటిషన్ను కొట్టేసింది. -
న్యాయమూర్తుల స్వచ్ఛభారత్
కదిరి : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పుర స్కరించుకుని శనివారం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో న్యాయమూర్తులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. చీపుర్లు చేతబట్టి కోర్టు భవనంతో పాటు ప్రాంగణం శుభ్రపరిచారు. వ్యతిగత పరిశుభ్రతే కాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎస్ఎండీ ఫజులుల్లా, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.వాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వి.ఆదినారాయణ అన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగాల లోకేశ్వర్రెడ్డి, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
కలకత్తానే ముద్దు.. కోల్కతా వద్దు
కోల్కతా: బాంబే, మద్రాస్, కలకత్తా హైకోర్టుల పేర్లను ముంబై, చెన్నై, కోల్కతా హైకోర్టులుగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కలకత్తా హైకోర్టు పేరును కోల్కతాగా మార్చవద్దంటూ ఆ కోర్టులో పనిచేస్తున్న జడ్జిలు, న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. కలకత్తా హైకోర్టు పేరును యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జడ్జీలందరూ ఓ తీర్మానాన్ని చేసి, దానిని కేంద్ర న్యాయ శాఖకు పంపారు. భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు అయిన కలకత్తా హైకోర్టుకు 154 ఏళ్ల చరిత్ర ఉందని, కలకత్తా పేరును స్థానికులు సెంటిమెంట్ గానూ భావిస్తారని పైగా షిప్పింగ్, బ్యాంకింగ్ ఇంతర వ్యాపారాలకు సంబంధించిన వివాదాల్లో ప్రపంచ దేశాలకు ఇది(కోర్టు) కలకత్తా హైకోర్టుగానే పరిచయమని లా సొసైటీ ఆఫ్ కలకత్తా (ఐఎల్ఎస్ సీ) అధ్యక్షుడు ఆర్కే ఖన్నా అంటున్నారు. ఏ రకంగా చూసినా హైకోర్టు పేరు మార్పు తగదని, అందుకే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరినట్లు ఖన్నా తెలిపారు. ఇదిలా ఉండగా, కేంద్రం ఆదేశాలతో ఇప్పటికే మూడు హైకోర్టుల పేర్లను మార్చేశారు అధికారులు. కలకత్తా హైకోర్టు వెలుపల 'కోల్ కతా' హైకోర్టు అని బెంగాలీలో బోర్డులు ఏర్పాటుచేశారు. కానీ ఇంగ్లిష్ పేరు మాత్రం కలకత్తా హైకోర్టుగానే ఉంచారు. హైకోర్టుల పేర్ల మార్పుకు సంబంధించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లిందని, తాము సుప్రీంకోర్టు అప్పీలుకు వెళ్లేది, లేనిది రాష్ట్రపతి నిర్ణయం తర్వాత స్పష్టత వస్తుందని జడ్జిలు చెబుతున్నారు. -
న్యాయవాదులకు అండగా ఉంటాం
♦ న్యాయాధికారులు, న్యాయవాదుల డిమాండ్లు న్యాయసమ్మతమే ♦ ఉద్యోగులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి ♦ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఇబ్రహీంపట్నం : న్యాయాధికారుల, న్యాయవాదుల డిమాండ్లు న్యాయ సమ్మతమైనవని.. పోరాటంలో వారికి అండగా ఉంటామని పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైకోర్టును విభజించాలని ఇబ్రహీంపట్నంలో రిలే దీక్షలు నిర్వహిస్తున్న న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని ఆయన సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సస్పెండ్ చేసిన అధికారులపై వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది చేస్తున్న పోరాటానికి తాము అండగా ఉన్నామని.. కుల సంఘాలు కూడా వారికి బాసటగా నిలవాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. న్యాయాధికారులు, కోర్టు సిబ్బందికి అన్ని వర్గాల నుంచి సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రిలే నిరహారదీక్షలో న్యాయవాదులు వేణుగోపాల్రెడ్డి, వెంకటేష్, మహేందర్, శ్రీనివాస్, రవి, కిషన్, అంజన్రెడ్డి, అరుణ్కుమార్, 4వ, 22వ మెట్రోపాలిటిన్, స్పెషల్ కోర్టు సూపరింటెండెంట్లు రజని, పద్మ, ఇదయతుల్లాతోపాటు న్యాయవాదులు మోకిళ్ల శ్రీనివాస్రెడ్డి, రవీందర్రెడ్డి, జగన్గౌడ్, జేఏసీ చైర్మన్ చల్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీక్ష చేపట్టిన వారికి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, టీఆర్ఎస్ నాయకుడు కంచర్ల చంద్రశేఖర్రెడ్డి, సతీష్, టీడీపీ నాయకుడు ఎండీ. మోహిజ్పాష, బీజేపీ నాయకుడు పోరెడ్డి నర్సింహారెడ్డి, సీపీఐ నాయకుడు మస్కు నర్సింహ, నవ్యపౌండేషన్ అధ్యక్షురాలు శ్రీరమ్య, వేణుగోపాల్రావు తదితరులు సంఘీభావం తెలిపారు. -
రాజేంద్రనగర్ కోర్టులో ఉద్రిక్తత
- న్యాయమూర్తులను అడ్డుకున్న న్యాయవాదులు రాజేంద్రనగర్(రంగారెడ్డి జిల్లా) రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి 8వ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు వద్ద న్యాయవాదుల ఆందోళన తీవ్రతరమైంది. సోమవారం ఉదయం న్యాయమూర్తులు కోర్టుకు వెళ్లకుండా న్యాయవాదులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు, న్యాయవాదులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల పహారాలో మేజిస్ట్రేట్ కోర్టులోకి వెళఅలారు. న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది. -
హైకోర్టు విభజన ప్రక్రియను వెంటనే చేపట్టాలి: జానా
హైదరాబాద్ : హైకోర్టు విభజనలె జాప్యం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామకంలో అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఈ మేరకు జానారెడ్డి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. న్యాయమూర్తులపై సస్పెన్షన్ వేయటాన్ని జానారెడ్డి ఖండించారు. న్యాయమూర్తులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే హైకోర్టు విభజనకు తగు చర్యలు చేపట్టాలన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుతో సంప్రదింపులు జరపాలన, అందుకు తమ మద్దతు ఉంటుందని జానారెడ్డి తెలిపారు. -
తెలంగాణ జడ్జీల మూకుమ్మడి రాజీనామా
హైదరాబాద్: ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ జడ్జీలు మూకుమ్మడిగా రాజీనామాకు సిద్ధపడ్డారు. తెలంగాణ జడ్జీల రాజీనామా లేఖలను జడ్జెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్కు ఇచ్చారు. అనంతరం గన్పార్క్ నుంచి రాజ్భవన్ వరకు న్యాయాధికారులు గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాలు ఇవ్వడానికి ర్యాలీగా బయలుదేరారు. గవర్నర్ అపాయింట్మెంట్ లేకపోవడంతో జడ్జీలను అడ్డుకునేందుకు రాజ్భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. -
లాయర్లను నిలదీసిన చట్టం
- విశ్లేషణ న్యాయార్థులను మోసం చేసిన న్యాయవాదుల మీద బార్ కౌన్సిల్కు ఇచ్చిన ఫిర్యాదులు ఏమయ్యాయో తెలుసుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. లాయర్లలో జవాబుదారీతనాన్ని తెచ్చిన ఘనత ఆర్టీఐదే. న్యాయవాదులు లేకపోతే న్యాయమూర్తులు లేరు. అసలు న్యాయవ్యవస్థే లేదు. న్యాయవాదులను ఎవరూ నియమించనవసరం లేదు. పూర్తి స్వాతంత్య్రం ఉన్న వృత్తి ఏదైనా ఉన్నదీ అంటే, అది న్యాయవాద వృత్తి ఒక్కటే. ప్రతి తగాదాను దశాబ్దాల తరబడి కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలనే సంస్కృతి మన సొంతం కాదు. పంచాయతీలలో కులపెద్దల సమావేశాలలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడం తెలుసు. పరస్పర వ్యతిరేకవాదాల వ్యాజ్యం ఆంగ్లేయుల విధానం. చట్టాలన్నీ ఆంగ్లంలో ఉంటాయి. ఆంగ్లేయులు వందల ఏళ్ల కిందట పాటించినవీ, పాలించినవీ ప్రస్తుతం మనం పాటిస్తున్నాం. వారు మార్చుకున్నా, మారని పాత బ్రిటిష్ చట్టాలనే పట్టుకుని మనం వేలాడుతున్నాం. మనదేశంలో నిజం చెప్పినవాడు జైల్లో ఉంటాడు. ఒక నటుడు వేగంగా కారు నడిపి మనుషుల్ని కుక్కల్ని చంపినట్టు చంపేశాడని ఫిర్యాదు చేసిన సెక్యూరిటీ పోలీసు ఉద్యోగం కోల్పోయాడు. డబ్బు జబ్బుతో వెలిగిపోతున్న అబద్ధాలకోరులకు విజయాలు కోకొల్లలు. బ్రిటిష్ వారు స్వాతంత్య్ర సమరవీరుల మీద ఇష్టం వచ్చినట్టు వాడిపారేసిన రాజద్రోహ చట్టాన్ని వాళ్లు వదిలేసినా మనం ప్రత్యర్థుల మీద వాడుకుంటూనే ఉన్నాం. పరువు నష్టం నేరం సెక్షన్ కూడా మనదేశంలో 1860లో ప్రవేశపెట్టినవారు వదిలేసుకున్నారు. మనం వాడుకుంటున్నాం. కాలం తీరిన బ్రిటిష్ చట్టాలు అని మనం వారిని తిట్టాల్సిన అవసరం ప్రస్తుతం లేదు. మనల్ని మనమే తిట్టుకోవాలి. మన న్యాయశాస్త్రం ఇది. న్యాయ విద్యాలయాలలో లాయర్లు తయార వుతారు. ఆ కాలేజీలలో విద్యా ప్రమాణాలను కాపాడే బాధ్యత భారత న్యాయవాదుల మండలికి (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బీసీఐ)కి అప్పగిం చారు. బీసీఐ కమిటీ కాలేజీలను తనిఖీ చేసి అనుమతిస్తేనే మనుగడ. కొనసాగే అర్హత. విద్యా బోధన విషయాలు వీరే నిర్ణయిస్తారు. మన న్యాయ విద్య ఘోరంగా పతనమైతే ప్రత్యామ్నాయంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలను ఎన్ఆర్ మాధవమీనన్ సృష్టించారు. అయితే రాష్ట్రానికొకటి ఉన్న ఈ విశ్వవిద్యాలయాలు ఈ దేశానికి ఏమాత్రం చాలవు. పాత న్యాయ కళాశాలలను కూడా బాగు చేసుకోవలసిందే. అవినీతికి పాల్పడి ప్రమాణాలు లేని సంస్థలకు అనుమతులిస్తే న్యాయవిద్య పతనమై, న్యాయవాదులు, వారిలోంచి వచ్చిన న్యాయమూర్తుల సమర్థత క్షీణించి, స్వతంత్రతను కోల్పోతుంది. 2010లో న్యాయ కళాశాలలను తనిఖీ చేసిన వివరాలు కావాలని ఆర్టీఐ కింద కేఆర్ చిత్ర అనే న్యాయవాది బీసీఐని అడిగారు. తనిఖీ చేసిన వారి పేర్లు, కళాశాలల పేర్లు, నివేదికల సారాంశం ఇవ్వాలని కోరారు. వేలాది కళాశాలల తనిఖీ సమాచారం చాలా ఎక్కువ కనుక ఇవ్వలేమన్నారు. సీడీ రూపంలో మొత్తం వివరాలు కావాలని చిత్ర పట్టుపట్టారు. కనీసం కొన్ని కళాశాలలకో లేదా కొంత ప్రాంతానికో డిమాండ్ను పరిమితం చేయాలన్న సూచనను చిత్ర అంగీకరించలేదు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) ప్రకారం ఇటువంటి సమాచారం ఎవరో అడగవలసిన పని లేకుండా తమంత తామే బీసీఐ ఇవ్వవలసి ఉంటుంది. ఎన్ఐసీ వారు తమకు సమగ్ర వెబ్సైట్ తయారు చేస్తున్నారనీ, అందులో ఈ సమాచారం ఉంచుతామనీ జవాబిచ్చారు. సమాచార హక్కు చట్టం వచ్చి పదేళ్లయినా, ఇంకా సొంతంగా సమగ్ర సమాచారం ఇచ్చేందుకు న్యాయవాదుల మండలే ఏర్పాట్లు చేసుకోకపోవడం ఏమాత్రం న్యాయం కాదని కమిషన్ విమర్శించింది. న్యాయార్థులను మోసం చేసిన న్యాయవాదుల మీద బార్ కౌన్సిల్కు ఇచ్చిన ఫిర్యాదులు ఏమ య్యాయో తెలుసుకునే అవకాశాన్ని సమాచార హక్కు చట్టం కల్పించింది. న్యాయవాదుల సేవాలోపాన్ని ప్రశ్నించి పరిహారం కోరుకునే అవకాశం వినియోగదారుల చట్టం కింద ఉంది. చెడు ప్రవర్తన ఆరోపణ అందిన తరువాత న్యాయవాదిపైన విచారణ జరిపి అతను వృత్తి కొనసాగించకుండా నిలిపివేసే అధికారం బార్ కౌన్సిల్కు ఉంది. దాని గురించి అనేక మంది న్యాయార్థులు ఆర్టీఐ కింద అడగడం ఈ మధ్య తలెత్తిన కొత్త పరిణామం. విచారణ వివరాలు, పత్రాలు, నిర్ణయంలో ఆలస్యాలు, మోసపోయిన వ్యక్తి చెప్పుకునే అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. బీసీఐ న్యాయవాదులలో ప్రమాణాలను, న్యాయ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను కాపాడే బాధ్యతను నిర్వర్తించవలసిన అవసరం ఉందని ఆర్టీఐ ద్వారా న్యాయార్థులు హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా లాయర్లలో జవాబుదారీతనాన్ని తెచ్చిన ఘనత ఆర్టీఐదే. (కేఆర్ చిత్ర వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఐసీ/ఎస్ఏ/ ఏ/ 2016/000023 కేసులో 7.4. 2016న సీఐసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా) - మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆ తీర్పుల్లో మహిళల పేర్లు వెల్లడించరాదు
న్యూఢిల్లీ: అత్యాచార కేసులో న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చే సమయంలో బాధిత మహిళల పేర్లను వెల్లడించరాదని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇది సమాజంలో వారి ఆత్మగౌరవంపై ప్రభావం చూపుతుందని తెలిపింది. జిల్లా న్యాయస్థానం 2013 అక్టోబర్ 21 న ఓ కేసుకు సంబంధించి వెలువరించిన తీర్పులో బాధితురాలి పేరును ప్రస్తావించడాన్ని జస్టిస్ ఎస్ పీ గార్గ్ గుర్తించారు. జిల్లా, ప్రత్యేక న్యాయ స్థానాలు బాధిత మహిళ పేరును వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. -
న్యాయాధికారుల కేటాయింపులో కుట్ర
న్యాయం చేయాలంటూ ఏసీజేకు తెలంగాణ న్యాయవాదుల వినతి సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనకు సంబంధించి న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల్లో పెద్ద కుట్ర దాగి ఉందని హైకోర్టు తెలంగాణ న్యాయవాదుల సంఘం, న్యాయవాదుల జేఏసీలు గురువారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు నివేదించాయి. హైకోర్టు రూపొందించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారని, ఈ విషయం తెలిసి కూడా వారిని తెలంగాణకే కేటాయిస్తూ ప్రాథమిక జాబితాను తయారు చేశారని వివరించారు. ఈ జాబితాను న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్ కోర్ట్ మెజారిటీ అభిప్రాయం మేరకు రూపొందించినట్లు తెలిసిందని, మార్గదర్శకాలు ఉన్నప్పుడు వాటి ఆధారంగానే కేటాయింపులు ఉండాలే తప్ప మెజారిటీ ఆధారంగా కాదని వారు తెలిపారు. ఫుల్ కోర్టులో ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తులతో పోలిస్తే తెలంగాణ న్యాయమూర్తులు మైనారిటీ అని, ఈ విషయం తెలిసి కూడా కేటాయింపుల వ్యవహారాన్ని ఫుల్ కోర్టుకు నివేదించడం కుట్రేనని వారు ఏసీజేకు వివరించారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు, జేఏసీ చైర్మన్ రాజేందర్రెడ్డి నేతృత్వంలో తెలంగాణ న్యాయవాదులు ఏసీజేకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఉపసంహరణకు ఆదేశాలివ్వండి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ విడుదల చేసిన ప్రాథమిక జాబితాను తక్షణమే ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని జేఏసీ నేతలు ఏసీజేను కోరారు. కేటాయింపుల సందర్భంగా న్యాయాధికారులు తమ సర్వీసు రికార్డుల్లో పేర్కొన్న సొంత ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేశారన్నారు. తెలంగాణలో జిల్లా జడ్జీల కేడర్ సంఖ్య 94 కాగా 95 మందిని తెలంగాణకు కేటాయించారని, ఇందులో 46 ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన వారు ఉన్నారని ఏసీజే దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో జిల్లా జడ్జీల కేడర్లో 140 పోస్టులంటే 110 మందినే కేటాయించారని, ఇంకా 30 ఖాళీలున్నాయన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన 31 మంది సీనియర్ సివిల్ జడ్జీలను, 53 మంది జూనియర్ సివిల్ జడ్జీలను తెలంగాణకు కేటాయించారని వివరించారు. దీని వల్ల తెలంగాణ న్యాయవాదులకు, న్యాయాధికారులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణకు చెందిన హైకోర్టు జడ్జి పోస్టులను ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారులు సొంత చేసుకునేందుకే ఈ కుట్ర జరిగిందని వారు వివరించారు. తమ అభ్యర్థనలను సావధానంగా విన్న ఏసీజే తమకు తప్పక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని గండ్ర మోహనరావు, రాజేందర్రెడ్డి తెలిపారు. అనంతరం వారు ప్రాథమిక కేటాయింపుల జాబితాపై తమ అభ్యంతరాలను రిజిస్ట్రార్ జనరల్ సి.హెచ్.మానవేంద్రనాథ్ రాయ్కు అందచేశారు. -
తెలంగాణ లాయర్ల ‘ఉద్యమ’ బాట!
చిచ్చు రేపిన న్యాయాధికారుల కేటాయింపులు సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల విభజనపై మరో ఉద్యమానికి తెలంగాణ న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ న్యాయాధికారులు ఇందుకు పరోక్షంగా మద్దతిస్తున్నారు. భావి కార్యాచరణ కోసం తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అత్యవసర కార్యవర్గ సమావేశం గురువారం జరగనుంది. జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులతో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కూడా శనివారం భేటీ జరపనుంది. తెలంగాణ న్యాయాధికారులు కూడా ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. న్యాయాధికారుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించిన హైకోర్టు, కేటాయింపులను మాత్రం వాటికి విరుద్ధంగా చేసిందంటూ లాయర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన వారిలో 141 మంది ఏపీ చెందిన న్యాయాధికారులున్నారని తెలిసి కూడా హైకోర్టు ప్రాథమిక జాబితాను విడుదల చేసిందని, ఇది సరికాదన్నారు. కేటాయింపుల్లో అన్యాయంపై అంతా కలిసి తమ వాదనలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ‘‘ఈ కేటాయింపులను ఆమోదిస్తే వచ్చే రెండేళ్లల్లో ఏపీలో భారీగా ఖాళీలు ఏర్పడతాయి గానీ తెలంగాణలో మాత్రం అందుకు ఆస్కారముండదు. తెలంగాణ న్యాయాధికారులకు పదోన్నతుల్లోనూ తీరని అన్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేదాకా దీనిపై పోరాటం చేస్తాం’’ అని వారంటున్నారు. -
ఏపీకి 492.. తెలంగాణకు 335
♦ కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనలో ముందడుగు ♦ న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపు ♦ జాబితాను విడుదల చేసిన ఉమ్మడి హైకోర్టు ♦ అభ్యంతరాలకు పది రోజుల గడువు ♦ కేటాయింపులపై టీ న్యాయవాదుల అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనలో ముందడుగు పడింది. ఇరురాష్ట్రాలకు న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపులకు సంబంధించిన జాబితాను ఉమ్మడి హైకోర్టు మంగళవారం విడుదల చేసింది. న్యాయాధికారులిచ్చిన ఆప్షన్లు ఆధారంగా రూపొందించిన ఈ జాబితాను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ విడుదల చేశారు. ఉభయ రాష్ట్రాల్లో జిల్లా జడ్జీలు, సీనియర్ సివిల్ జడ్జీలు, జూనియర్ సివిల్ జడ్జీలు.. మొత్తం కలిపి 830 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురుతప్ప మిగతా 827 మంది ఆప్షన్లు ఇచ్చారు. దీని ఆధారంగా 827 మందిలో 492 మందిని ఆంధ్రప్రదేశ్కు, 335 మందిని తెలంగాణకు కేటాయించారు. పదవీ విరమణ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని.. పదవీ విరమణ చేసిన, మరణించిన న్యాయాధికారుల్ని కూడా ఆయా రాష్ట్రాలకు కేటాయించారు. హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు అయిన జిల్లా జడ్జీలు జె.ఉమాదేవి, శ్యాంప్రసాద్, ఎన్.బాలయోగి, రజనీలను ప్రాథమికంగా తెలంగాణకు కేటాయించగా.. వారు తమను ఆంధ్రప్రదేశ్కు కేటాయించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలసి విజ్ఞప్తి చేశారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన జరగకపోవడంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో న్యాయాధికారుల విభజనకోసం హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వీటికనుగుణంగా ఆప్షన్లు ఇవ్వాలని రెండు రాష్ట్రాల్లోని న్యాయాధికారులను ఆదేశించింది. ఆ మేరకు న్యాయాధికారులు ఆప్షన్లు ఇవ్వగా.. వాటి ఆధారంగా ప్రాథమిక జాబితాను హైకోర్టు రూపొందించింది. దీనిపై అభ్యంతరాలుంటే న్యాయాధికారులు పదిరోజుల్లోగా సీల్డ్ కవర్లో ఆయా జిల్లాల జడ్జీలకు పంపాలని రిజిస్ట్రార్ జనరల్ స్పష్టం చేశారు. జిల్లా జడ్జీలు వాటిని ఈనెల 18కల్లా హైకోర్టుకు పంపాలన్నారు. తెలంగాణకు కేటాయింపులు... తెలంగాణకు 335 మందిని కేటాయించగా.. అందులో 77 మంది జిల్లా జడ్జిల కేడర్, 65 మంది సీనియర్ సివిల్ జడ్జీల కేడర్, 193 మంది జూనియర్ సివిల్ జడ్జీల కేడర్ న్యాయాధికారులున్నారు. ఈ మూడు కేడర్లలోని 28 మంది విశ్రాంత న్యాయాధికారులను తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కు కేటాయింపులు... ఆంధ్రప్రదేశ్కు 492 మందిని కేటాయించగా.. అందులో 79 మంది జిల్లా జడ్జీల కేడర్, 123 మంది సీనియర్ సివిల్ జడ్జీల కేడర్, 290 మంది జూనియర్ సివిల్ జడ్జీల కేడర్ న్యాయాధికారులున్నారు. 34 మంది విశ్రాంత న్యాయాధికారులను ఏపీకి కేటాయించారు. ముగ్గురు న్యాయాధికారులు ఆప్షన్లు ఇవ్వకపోవడంతో సర్వీసు రికార్డుల్లోని వివరాల ఆధారంగా వారిని ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. తెలంగాణ న్యాయవాదుల అభ్యంతరం.. తాజా కేటాయింపులపై తెలంగాణ న్యాయవాదులు మండిపడుతున్నారు. హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ జాబితా ఉందని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ ఎం.రాజేందర్రెడ్డి చెప్పారు. దీనిపై బుధవారం ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 141 మంది ఏపీకి చెందిన న్యాయాధికారులు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణకు ఆప్షన్ ఇచ్చారని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ న్యాయాధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు నిమ్మ సత్యనారాయణ పేర్కొన్నారు. -
శాశ్వత జడ్జీలుగా పదిమంది ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పది మంది న్యాయమూర్తులు బుధవారం శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే బుధవారం మధ్యాహ్నం వీరితో ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన వారిలో జస్టిస్ ఆశపు రామలింగేశ్వరరావు, జస్టిస్ బులుసు శివశంకరరావు, జస్టిస్ మంథాట సీతారామ్మూర్తి, జస్టిస్ సారిపల్లె రవికుమార్, జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ మిస్రిలాల్ సునీల్ కిషోర్ జైశ్వాల్, జస్టిస్ అంబటి శంకరనారాయణ, జస్టిస్ అనిస్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రమాణం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
నాలుగు రాష్ట్రాలకు కొత్త సీజేలు!
జస్టిస్ రోహిణి మద్రాసు హైకోర్టుకు! న్యూ ఢిల్లీ: మేఘాలయ, రాజస్తాన్, కర్ణాటక, గువాహటి హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు(సీజే)గా నియమించాలంటూ నలుగురు సీనియర్ జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ హైకోర్టులకు ప్రస్తుతం ఆపద్ధర్మ సీజేలేఉన్నారు. వారిలో కర్ణాటక హైకోర్టు ఆపద్ధర్మ సీజే జస్టిస్ ఎస్కే ముఖర్జీని అదే హైకోర్టుకు సీజేగా నియమించాలని కొలీజియం సూచించింది. పంజాబ్, హరియాణా హైకోరు జడ్జి జస్టిస్ సతీశ్ కుమార్ మిట్టల్ను రాజస్తాన్ హైకోర్టుకు, రాజస్తాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ అజిత్ సింగ్ను గువాహటి హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచ్ జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరిని మేఘాలయ హైకోర్టుకు సీజేలుగా నియమించాలంది. ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ జీ రోహిణిని మద్రాసు హైకోర్టుకు అదే హోదాలో బదిలీ చేయాలని, మద్రాసు హైకోర్టు సీజే జస్టిస్ ఎస్కే కౌల్ను అలహాబాద్ హైకోర్టుకు, అలహాబాద్ హైకోర్టు సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్ను ఢిల్లీ హైకోర్టు సీజేగా పంపించాలని సిఫారసు చేసింది. -
శాసనకర్తల వేతన యాతనలు
నియోజకవర్గాల విస్తీర్ణం, ఓటర్ల సంఖ్య కూడా పరిగణనలోకి తీసుకుంటే మన దేశంలో ప్రజాప్రతినిధుల వేతనాలు ఎందుకూ కొరగావనే సత్యం బోధపడుతుంది. అయినా వారిపై విమర్శలు ఆగడం లేదు. న్యాయమూర్తులను న్యా యమూర్తులే ఎంపిక చేయ డం, శాసనకర్తలు తమ జీత భత్యాలను స్వయంగా నిర్ధా రించుకోవడం అనేవి మన అపరిపక్వ ప్రజాస్వామ్యానికి 14వ లోక్సభ స్పీకర్గా పని చేసిన సోమనాథ్ ఛటర్జీ భావించేవారు. న్యాయమూ ర్తుల నియామకానికి సంబంధించి, పార్లమెంటు ఇటీ వల ‘కొలీజియం’ పద్ధతిని తొలగించేందుకు రాజ్యాం గానికి సవరణలు చేసింది, కొత్త చట్టాన్నీ తెచ్చింది. కానీ స్వయంగా జీతభత్యాలు నిర్ధారించుకునే హక్కును వదులుకోవడానికి పార్లమెంటు ఇప్పటికే ముందుకు రాలేదు. విమర్శలకు తావిస్తున్న ఈ పద్ధతిని మార్చడానికి ఛటర్జీ ఒక ప్రయత్నం చేశారు. 2005లో మార్చి 23న ఆయన నిర్వహించిన అఖిలపక్ష సమా వేశంలో, స్వయంగా జీతభత్యాలు నిర్ధారించుకునే పద్ధతికి స్వస్తి పలకాలని, ఈ బాధ్యతను ఒక స్వతంత్ర వేతన సంఘానికి అప్పగించాలని ఏకగ్రీవంగా నిర్ణ యించారు. నేటికి దశాబ్దం గడచినా ఆ నిర్ణయం అమ లుకు నోచుకోలేదు. ఆ తర్వాత 2006, 2010లో పాత పద్ధతిలోనే ఎంపీలు జీతభత్యాలు పెంచుకున్నారు. ఇటీవలే విశాఖపట్నంలో ముగిసిన 17వ అఖిల భారత విప్ల మహాసభలో ఈ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చే ప్రయత్నం జరిగింది. శాసనకర్తల జీతభ త్యాల నిర్ధారణకు స్వతంత్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడం ఉత్తమమని ఈ మహాసభలో తీర్మానించారు కూడా. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చట్టసభలు, తమంత తాముగా సభ్యుల జీతాలను పెంచుకోవడం వల్ల వారి జీతాల పెంపుదలనే ప్రజలు వ్యతిరేకిస్తున్నా రన్న నిరాధారమైన అపప్రధ వ్యాప్తమవుతోంది. నిజా నికి కేంద్రంలోనూ, చాలా రాష్ట్రాల్లోనూ శాసనకర్తల జీతభత్యాలు నామమాత్రమే. కానీ రాజ్యాంగ సభలో ముసాయిదా అధికరణాలు 86, 170 (ప్రస్తుత రాజ్యాం గంలో 106, 195 అధికరణాలు) చర్చకు వచ్చినప్పుడు, ఈ జీతాల నిర్ధారణ బాధ్యతను చట్టసభలకే అప్పగించే ప్రతిపాదనను ఆనాటి హేమాహేమీల్లో ఏ ఒక్కరూ ప్రశ్నించకపోవడం గమనార్హం. స్వతంత్ర భారతదేశంలో ఈ అధికరణాలు ఇంత వరకూ అమలైన తీరు పరిశీలనార్హం. ఎంపీల జీతభ త్యాలు సిఫారసు చేసేందుకు మొట్టమొదటి సంయుక్త పార్లమెంటరీ కమిటీ 1952 జూన్ 6న ఏర్పాటయింది. ఈ కమిటీ ఎంపీల జీతభత్యాల చట్టాన్ని ఆమోదిం చింది. తొలి పార్లమెంటులో ఎంపీలకిచ్చిన జీతం నెలకు 400 రూపాయలు. అంతకుముందు వారికి సభ జరిగిన రోజుల్లో కేవలం దినసరి భత్యం చెల్లించేవారు. చివరిసారి ఈ జీతభత్యాలు, పింఛను చట్టాన్ని 2010లో సవరించారు. ఈ సవరణతో వారి జీతం నెలకు 50 వేల రూపాయలకు పెరిగింది. 1954 మొదలుకొని 2010 వరకు 56 ఏళ్ల వ్యవధిలో ఎంపీల జీతభత్యాల చట్టంలో 28సార్లు సవరణలు జరిగాయి. అంటే ఎంపీలు ఆచితూచి పత్రికల, ప్రజల విమర్శలను గమనంలో ఉంచుకుని స్వల్ప మొత్తాల్లోనే తమ జీతాలను పెంచుకున్నారని స్పష్టమవుతోంది. స్వయంగా జీతాలు నిర్ధారించుకుంటే జరగగల నష్టం గురించి రాజ్యాంగ సభలో డా॥పీఎస్ దేశ్ముఖ్ 1949, మే 20న ఈ విధంగా హెచ్చరించారు. ‘‘...సభ్యులకు తగినంతగా వేతనాలు చెల్లిం చాలి.... కొంత మంది సభ్యులు తమ సొంత భత్యాల గురించి మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు... ప్రభుత్వం (మన సమస్యలను) అర్థం చేసుకోగల ప్రజ ల నుండి వచ్చే విమర్శలకు సిద్ధంగా ఉండాలి. కానీ సభ్యులకు సరిపడినంత జీతభత్యాలు చెల్లించాలి...’’ శాసనకర్తలు ఎదుర్కొంటున్న విమర్శలకు మరో ముఖ్యకారణం జీతాల పెంపు ప్రక్రియలో పారదర్శకత లోపించడం మరోకారణం. సభలో చర్చ లేకుండా హడావుడిగా బిల్లు ఆమోదించడం. 1952లో వేతనాల సిఫారసుకు తొలి కమిటీ ఏర్పాటు చేసినప్పుడు, కమిటీ నివేదికపై పూర్తి స్థాయి చర్చకు సభ్యులకు అవకాశం లభిస్తుందని అప్పటి స్పీకర్ జీవీ మావలంకర్ హామీ ఇచ్చారు. కానీ పార్లమెంటు రికార్డులు పరిశీలిస్తే అది ఒట్టి హామీగా మిగిలిపోయిందని భావించక తప్పదు. 2015 ఆగస్టు 21న ఢిల్లీ శాసనసభ ఈ విషయంలో ఒక ప్రగతిశీల నిర్ణయం తీసుకుంది. అక్కడి సభా సంఘం విజ్ఞప్తి మేరకు స్పీకర్ శ్రీరాం నివాస్ గోయల్, శాసనసభ్యుల జీతభత్యాలను సిఫారసు చేయడానికి సభ్యులతో సంబంధం లేకుండా ఒక స్వతంత్ర నిపు ణుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పని తుది దశకు చేరుకుంది. త్వరలోనే నివేదిక సమర్పించబో తోంది. అసంబద్ధ చట్టాల చిక్కుముడులతో సతమత మవుతున్న ఢిల్లీ శాసనసభ ఈ విషయంలో దేశంలోని మిగతా చట్టసభలకు మార్గదర్శిగా నిలిచింది. 2005లో శ్రీ ఛటర్జీ చేసిన ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం అమల్లోకి తెచ్చి ఉంటే మన దేశం యావత్తు కామన్వెల్త్ దేశాలకు ఆదర్శంగా అవతరించి ఉండేది. ఆ అవకాశం 2012లో యునెటైడ్ కింగ్డమ్కు దక్కింది. యూకేలో 2012 ఏప్రిల్ నుండి పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను నిర్ధారించే బాధ్యతను ‘స్వతంత్ర పార్ల మెంటరీ ప్రమాణాల సాధికార సంస్థ’’ (ఐపీఎఫ్ఏ)కి అప్పగించారు. సగటు ప్రభుత్వరంగ ఆదాయాల ఆధా రంగా ఈ సంస్థ ఎంపీల జీతభత్యాలను సవరిస్తూ ఉం టుంది. ఈ సంస్థ యాజమాన్య బోర్డు 2015 జూలైలో సమర్పించిన తాజా నివేదికలోని కొన్ని పంక్తులు మన దేశంలో ప్రజాప్రతినిధులకు ఎంతో ఉపయుక్తం. ‘‘ఎంపీల జీతభత్యాల పరిశీలన అనేది నిస్సందే హంగా ఒక వివాదాస్పదమైన అంశం... వేతనాల పెం పుదలను నిలిపివేయడానికి వెయ్యిన్కొక్క కారణాలు చూపవచ్చు... వేతనాల పెంపుదలకు సరైన సమయ మంటూ ఏదీ ఉండదు... మన ప్రజాస్వామ్యంలో ఎంపీలు విడదీయరాని భాగం... వారికి తగినంత జీత భత్యాలు అందించడం మన బాధ్యత. వారికిచ్చే జీతభ త్యాలు రాజకీయ జీవితంలోకి రాదలచుకున్న వారికి ఆకర్షణీయంగా ఉండాలి. ఇతరత్రా ధనికులైన వారు మాత్రమే రాజకీయాల్లో మనగలిగేంత తక్కువగా జీతా లు ఉండకూడదు’’. ఇండియాలో శాసనకర్తలకు ఇదొక సందేశం. నిపుణులను విశ్వసించండి. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రజల విశ్వాసాన్ని చూరగొనండి. వ్యాసకర్త కార్యదర్శి, ఢిల్లీ శాసనసభ Suryadevara.pk@gmail.com - ఎస్.ప్రసన్న కుమార్ -
పుష్కర స్నానమాచరించిన న్యాయమూర్తులు
తూర్పుగోదావరి (రాజమండ్రి) : రాజమండ్రి వీఐపీ ఘాట్లో శనివారం పలువురు న్యాయమూర్తులు పుష్కర స్నానాలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్మిశ్రా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోంస్లేలు పుష్కర స్నానాలాచరించారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, ఏపీ ట్రిబ్యునల్ కోర్టు న్యాయమూర్తి ఎల్.రవిబాబుతోపాటు పలు జిల్లాల జడ్జిలు కూడా పుష్కర స్నానాలు చేశారు. అనంతరం తమ పూర్వీకులకు పిండ ప్రదానాలు చేశారు. -
శ్రీవారి సేవలో న్యాయమూర్తులు
తిరుమల శ్రీవారిని ఆదివారం ఇద్దరు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేసీ భాను ఉదయం నైవేద్య విరామ సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయంలోకి వెళ్లారు. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తరువాత వకుళమాతదేవిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. న్యాయమూర్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూప్రసాదాలు అందజేశారు. - తిరుమల -
తెలంగాణలో ఆరుగురు న్యాయమూర్తుల బదిలీ
హైదరాబాద్:తెలంగాణలో ఆరుగురు జిల్లా న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీబీఐ కోర్టు జడ్జిగా వెంకరమణను, సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా బాలయోగిని నియమించింది. నిజామాబాద్ జిల్లా జడ్జిగా అరవింద్ రెడ్డి, వరంగల్ జిల్లా చీఫ్ జడ్జిగా విజయసారథి, నాంపల్లి నాలుగో అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తిగా సాంబశివరావు నాయుడు, నాంపల్లి రెండో అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తిగా తిరుమలరావులను నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
జడ్జిలను ఫూల్స్ అన్నందుకు.. 4 వారాల జైలు
న్యూఢిల్లీ: కేరళకు చెందిన సీపీఎం నాయకుడు జడ్జిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుపాలయ్యాడు. మాజీ ఎమ్మెల్యే అయిన ఎంవీ జయరాజన్ హైకోర్టు జడ్జిలీను ఫూల్స్ అంటూ నిందించాడు. రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశ్యంతో కేరళ హైకోర్టు.. రోడ్లు, రోడ్డ పక్కన బహిరంగ సభలను నిషేధించింది. జయరాజన్ ఈ తీర్పుపై మండిపడుతూ తీర్పు చెప్పిన జడ్జిలను పరుష పదజాలంతో (ఫూల్/ఇడియట్) దూషించారు. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు జయరాజన్కు నాలుగు వారాల జైలు శిక్ష విధించింది. జస్టిస్ విక్రమ్ జీత్ సేన్, జస్టిస్ నాగప్పన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. తీర్పులపై విమర్శలు చేస్తే సమస్య లేదని, అయితే న్యాయాధికారులపై అనాగరిక, పరుష పదజాలం వాడితే సహించేదిలేదని హెచ్చరించింది.