ఇద్దరు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ | Transfer Of Two Telangana High Court Judges | Sakshi
Sakshi News home page

ఇద్దరు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ

Published Tue, Nov 14 2023 10:22 AM | Last Updated on Tue, Nov 14 2023 11:11 AM

Transfer Of Two Telangana High Court Judges - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ సోమవారం రాత్రి ట్వీట్‌ చేశారు. జస్టిస్‌ సుధీర్‌కుమార్‌ను మద్రా స్‌ హైకోర్టుకు, జస్టిస్‌ చిల్లకూర్‌ సుమలతను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని కొద్ది రోజుల కిందట సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

ఆ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. వీరితోపాటు ఇతర రాష్ట్రాల కు చెందిన మరో ముగ్గురు న్యాయమూర్తుల బదిలీకికూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తు ల సంఖ్య (సీజేతో కలిపి) 42 కాగా, ప్రస్తుతం 28 మంది ఉన్నారు. జస్టిస్‌ చిల్లకూర్‌ సుమలత, జస్టిస్‌ సుధీర్‌కుమార్‌ బదిలీతో ఆ సంఖ్య 26కు చేరగా.. ఖాళీల సంఖ్య 16కు పెరిగింది. 

చదవండి: కేసీఆర్‌కు కోటి అప్పు ఇచ్చిన వివేక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement