హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు | Andhra Pradesh High Court has two judges | Sakshi
Sakshi News home page

హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు

Published Tue, Dec 7 2021 3:55 AM | Last Updated on Tue, Dec 7 2021 3:55 AM

Andhra Pradesh High Court has two judges - Sakshi

సాక్షి అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌ డాక్టర్‌ కుంభజడల మన్మధరావు, జస్టిస్‌ బొడ్డుపల్లి శ్రీ భానుమతి నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో కేంద్రం వీరి నియామకాలను నోటిఫై చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ వారంలో వీరు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. వీరిద్దరి నియామకంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరనుంది.

న్యాయమూర్తుల నేపథ్యం ఇది..
న్యాయమూర్తి జస్టిస్‌ కుంభజడల మన్మధరావు
జననం: 1966, జూన్‌ 30
ఊరు: ప్రకాశం జిల్లా సింగరాయకొండ
విద్యాభ్యాసం: ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, డాక్టరేట్‌

ప్రస్థానం: 
► 1991లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. ఒంగోలులో నాగిశెట్టి రంగారావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 
► 1999లో హైకోర్టుకు ప్రాక్టీస్‌ మార్చారు. 
► ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ వంటి కీలక సంస్థలకు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 
► పలు బ్యాంకులకు న్యాయ సలహాదారుగా ఉన్నారు.

న్యాయమూర్తి జస్టిస్‌ బొడ్డుపల్లి శ్రీ భానుమతి
స్వగ్రామం: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు
విద్యాభ్యాసం: రాజమహేంద్రవరంలో ‘లా’ అభ్యసించారు.

ప్రస్థానం: 
► న్యాయాధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనిచేశారు. 
► 2020 జూన్‌లో హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌గా నియమితులయ్యారు. తొలి మహిళా రిజిస్ట్రార్‌ జనరల్‌ భానుమతి కావడం విశేషం. అప్పటి నుంచి అదే పోస్టులో కొనసాగుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement