Ramnath Kovind
-
శరవేగంగా ‘జమిలి’ అడుగులు! బిల్లు ఆమోదం పొందాలంటే..
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని.. అందుకోసం ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ను తీసుకురావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ ఇవాళ న్యూఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశం ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ శీతాకాల సమావేశాల్లోనే గనుక చర్చకు వస్తే.. అసలు ఓటింగ్ ఎలా జరుగుతుంది? జమిలి ఎన్నికల బిల్లును ఆమోదింపజేసుకోగలిగే ‘బలం’ ఎన్డీయేకు ఉందా?..రాబోయే సాధారణ ఎన్నికలు.. జమిలిగానే జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకోసం వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. కానీ, పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యా బలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు ముందుకెళ్లాలని మోదీ భావిస్తున్నారు.ముందుగా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెడతారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దానిని రిఫర్ చేసే అవకాశం ఉండొచ్చు. అవసరం అనుకుంటే జేపీసీ.. వివిధ పార్టీలతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టొచ్చు.మెజారిటీ ఎంత ఉండాలంటే.. ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానం కోసం రూపొందించిన బిల్లు.. రాజ్యాంగ సవరణలతో ముడిపడిన అంశం. కాబట్టి.. ఉభయ సభల్లోనూ మూడింట రెండో వంతు మెజారిటీ కచ్చితంగా అవసరం.👉రాజ్యసభలో 245 మంది సభ్యులంటే.. కనీసం 164 ఓట్లు పడాలి👉అలాగే.. లోక్సభలో 545 మంది సభ్యులుంటే.. 364 ఓట్లు రావాలి.ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం సాధారణ మెజారిటీతోనే నడుస్తోంది. కాబట్టి.. ఓటింగ్ సమయానికల్లా మూడింట రెండో వంతు మెజారిటీ మద్దతు సంపాదించుకోవాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు మొత్తం 47 పార్టీల్లో 32 పార్టీలు జై కొట్టిన సంగతి తెలిసిందే. అంటే 13 రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లును రూపకల్పన చేసే పని.. కేంద్ర న్యాయ శాఖ చూసుకుంటోంది. ఇక ఈ బిల్లు బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశం ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ అది కుదరకుంటే.. వచ్చే బుధవారం జరగబోయే కేబినెట్ సమావేశానికి ముందైనా రావొచ్చు. సంబంధిత ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం గనుక పొందితే.. పార్లమెంటు ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు రానుంది.ప్రస్తుత లోక్సభ గడువు 2029 దాకా ఉంది. కానీ, ఈ మధ్యలోనే దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది.వచ్చే ఏడాది అంటే 2025లో.. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2026లో..అసోం(పూర్వపు అస్సాం)పశ్చిమ బెంగాల్పుదుచ్చేరితమిళనాడుకేరళ2027లో..గోవాఉత్తరాఖండ్పంజాబ్మణిపూర్ఉత్తర ప్రదేశ్హిమాచల్ ప్రదేశ్గుజరాత్ఈ స్టేట్స్ ఎన్నికల టైంలోనే.. జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ భావిస్తోంది. 2028లో..త్రిపురమేఘాలయానాగాలాండ్కర్ణాటకమిజోరాంఛత్తీస్గఢ్మధ్యప్రదేశ్రాజస్థాన్తెలంగాణ2029లో..అరుణాచల్ ప్రదేశ్సిక్కింఆంధ్రప్రదేశ్ఒడిషాజమ్ము కశ్మీర్హర్యానాజార్ఖండ్మహారాష్ట్రకోవింద్ కమిటీ సిఫార్సులుజమిలి ఎన్నికల కోసం.. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొన్ని నెలల పాటు చర్చలు, సూచనలు, సలహాలు తీసుకుని ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికకు గతంలోనే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే. కోవింద్ నివేదిక ఆధారంగా.. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ముసాయిదా బిల్లును కేబినెట్ భేటీలో ఓకే చేసి .. ఆపై బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి.. ఆమోదం కల్పించాలని మోదీ సర్కార్ యోచిస్తోంది.ఇప్పుడు కాకుంటే..జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బిల్లు రూపొందినట్లు బీజేపీ వర్గాల పేర్కొంటున్నాయి. ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత ఈ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమావేశాల్లో వీలు కాని పక్షంలో వచ్చే సమావేశాల్లో అయినా.. దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. -
ఇది ఏకగ్రీవ సి‘ఫార్సు’
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీ ఊహించినట్టుగానే జమిలి ఎన్నికలకు జైకొట్టింది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో, ఆ తర్వాత వంద రోజుల్లో మునిసిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలు జరపాలని ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తూ, సదరు కమిటీ గత వారం నివేదిక సమర్పించింది. సిఫార్సులు ఊహించినవే అయినప్పటికీ, నిర్ణీత కాలవ్యవధి ఏమీ లేకపోయినా 2024 సార్వత్రిక ఎన్నికలకు కొద్దిగా ముందుగా కమిటీ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ (ఓఎన్ఓఈ) ప్రతిపాదనను తెర మీదకు తేవడం అనుమానాలు రేపింది. రాజ్యాంగ సవరణ, ఒకే ఎన్నికల జాబితా – ఎన్నికల గుర్తింపు కార్డు, త్రిశంకు సభ – అవిశ్వాస తీర్మాన పరిస్థితులు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు – పోలింగ్ సిబ్బంది – పోలీసు బలగాల ఏర్పాట్ల లాంటి పలు అంశాలపై కమిటీ కీలక సిఫార్సులు ఇప్పుడు చర్చ రేపుతున్నాయి. మన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలనూ, సమాఖ్య చట్రాన్నే మార్చేసే సత్తా ఈ ప్రతిపాదనకు ఉండడమే అందుకు కారణం. కోవింద్ సారథ్యంలో 2023 సెప్టెంబర్లో ఈ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి కమిటీలో భాగం కావడానికి నిరాకరించారు. మొత్తం 8 మంది సభ్యుల కమిటీ 65 సమావేశాలు జరిపి, అనుకున్నట్టుగానే ప్రభుత్వ వైఖరికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. జాతీయ, రాష్ట్ర పార్టీల అభిప్రాయాల్ని తెలుసుకున్నామనీ, న్యాయకోవిదుల మొదలు ఆర్థికవేత్తల దాకా పలువురి సూచనలు కోరామనీ కమిటీ తెలిపింది. అయితే, నివేదికను గమనిస్తే అవసరమైన లోతైన అధ్యయనం, విశ్లేషణ సాగినట్టు తోచదు. అన్ని వర్గాలనూ ఈ అధ్యయన ప్రక్రియలో భాగం చేసినట్టు అనిపించదు. తూతూ మంత్రపు తతంగం చివరకు 21 సంపుటాల్లో, 18,626 పేజీల్లో, మొత్తం 11 అధ్యాయాలు, అనేక అనుబంధాల బృహన్నివేదిక రూపం మాత్రం సంతరించుకుంది. రాష్ట్రపతికి మార్చి 14న కమిటీ తన నివేదికను అందించడంతో ప్రధాన ఘట్టం ముగిసింది. త్వర లోనే లా కమిషన్ సైతం తన నివేదికను ఇవ్వనుంది. ఇక, వచ్చే 2029 ఎన్నికల్లోగా దాన్ని ఎలా ఆచ రణలోకి తేవాలన్నది కేంద్రం చేతిలో ఉంది. కమిటీ ఏకగ్రీవ సిఫార్సు గనక అది ముగిసిన కథ అన కుండా, వ్యతిరేకిస్తున్న వారి సముచితమైన భయాందోళనల్ని విని, సమాధానపరచడం అవసరం. నిజానికి, ఒకేసారి లోక్సభ, శాసనసభలకు ఎన్నికలు జరగడం కనివిని ఎరుగనిదేమీ కాదు. చట్టం ఏమీ లేకపోయినా స్వతంత్ర భారతావనిలో ఎన్నికలు మొదలయ్యాక తొలి రోజుల్లో ఏకకాలంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. అయితే, అయిదేళ్ళ కాలవ్యవధి పూర్తికాక ముందే రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే ధోరణి మొదలయ్యాక, 1967 తర్వాత నుంచి ఈ ఏకకాల విధానానికి తెర పడింది. తరువాత కూడా మధ్య మధ్యలో ఈ జమిలి ఎన్నికల ఆలోచన తొంగిచూసినా, వడివడిగా అడుగులు పడింది మాత్రం ఇప్పుడే. మోదీ సారథ్యంలోని బీజేపీ ఆది నుంచి జమిలి ఎన్నికల నిర్వహణ జపం చేస్తోంది. అందుకు తగ్గట్టే ఇప్పుడు కోవింద్ కమిటీ జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసింది. జమిలి ఎన్నికలను 15 పార్టీలు వ్యతిరేకించాయని కమిటీ పేర్కొంది కానీ, వ్యతిరేకిస్తున్నవారిని ఒప్పించడానికీ, సద్విమర్శలను తీసుకొని సరిదిద్దుకోవడానికీ చేసిందేమిటో తెలియదు. అలాగే, ఒకే దశలో ఎన్నికలు చేయలేక 7 విడతల్లో, 40 రోజులపైగా ఎన్నికలు జరుపుతున్న పాలకులు ఒకేసారి ఎన్నికలు ఎలా చేయగలరన్నదీ సందేహమే! ఒకరకంగా, ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ వల్ల అటు ప్రభుత్వానికీ, ఇటు పార్టీలకూ ఎన్నికల ఖర్చు తగ్గుతుందనే మాట నిజమే. అలాగే, కాస్తంత వ్యవధి తేడాతో మునిసిపల్, పంచాయతీ సహా అన్ని ఎన్నికలూ ఒకేసారి జరగడం వల్ల పాలనకు తరచూ అంతరాయాలు ఏర్పడవు. అయితే, ఈ విధానం మన సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందనేదీ అంతే వాస్తవం. ఇక, ఈ పద్ధతిలో రాష్ట్ర అసెంబ్లీలకు నిర్ణీత కాలవ్యవధి కన్నా ముందే మంగళం పాడి, ఆనక ప్రతి ప్రభుత్వానికీ నిర్ణీత వ్యవధిని నిర్ణయించడం ప్రజాస్వామ్య సిద్ధాంతాలకే విరుద్ధం. ఒకవేళ గనక ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అర్ధంతరంగా కూలిపోతే, ఆ తర్వాత ఎన్నికైన ప్రభుత్వం ఆ వర్తమాన లోక్సభా కాలం ఉన్నంత వరకే అధికారంలో కొనసాగాలనడం మరో తిరకాసు. అన్నిటి కన్నా పెద్ద భయం మరొకటుంది. ఏకకాలంలో కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల వల్ల ప్రాంతీయ, స్థానిక అంశాలను మింగేసి, జాతీయ అంశాలే పైకొచ్చే ప్రమాదం ఉంది. ఎన్నికల వ్యూహంలో, వ్యయంలో జాతీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి పార్టీలు దీటుగా నిలబడడమూ కష్టమే. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా చిన్న పార్టీలు కనిపించకుండా పోతాయని సమాజ్వాదీ పార్టీ లాంటివి బాహాటంగానే చెబుతున్నాయి. నిజానికి, ఏకకాలపు ఎన్నికల వల్ల ఓటర్లలో 77 శాతం మంది కేంద్రంలో, రాష్ట్రంలో – రెండు చోట్లా ఒకే పార్టీకి ఓటేస్తారని 2015 నాటి ఓ సర్వే తేల్చింది. రెండు ఎన్నికల మధ్య ఆరు నెలల విరామం ఉంటే, 61 శాతమే అలా ఓటేస్తారట. అంటే ఒక రకంగా ఈ జమిలి ఎన్నిక కేంద్రంలో చక్రం తిప్పుతున్న పార్టీలకే వాటంగా మారవచ్చు. అసలు ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అనే ఈ ఆలోచన వెనుక అసలు మతలబు... దేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకు రావాలన్న బీజేపీ ఆలోచన అని మరికొందరి వాదన. అందుకు రాజ్యాంగ సవరణలు సహా అనేకం అవసరం. దానికి తగ్గట్టే దీర్ఘకాలిక వ్యూహంతో బీజేపీ 400 పైచిలుకు సీట్లతో సంపూర్ణ మెజారిటీని కోరుతోందని విశ్లేషణ. అవతలి వారివి ‘అనవసర భయాందోళనలు’ అని కొట్టిపారేస్తే సరిపోదు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొనే ముందు మరింత విస్తృత స్థాయి సంప్రతింపులు జరపడం అవసరం. అంతేకానీ, డబ్బు ఆదా పేరిట ప్రజాస్వామ్య స్ఫూర్తినీ, సమాఖ్య స్వభావాన్నీ నీరు గార్చడం సమర్థనీయం కానే కాదు. -
ONOE: హంగ్ వస్తే?
ఎప్పటి నుంచో వినిపిస్తున్నట్లుగానే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జమిలి ఎన్నికలకు జైకొట్టింది. ఈ కమిటీ తను నివేదించిన నివేదికలో పలు అంశాలకు సిఫార్సు చేసింది. హంగ్ వచ్చినా, అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు నెలకొన్నా,మళ్ళీ ఎన్నికలు నిర్వహించి కొత్త సభను ఏర్పాటుచేయాలని సూచించింది. ఒకప్పటి ఏకకాల ఎన్నికలను పునరుద్ధరించాలన్నది ప్రధాన సిఫార్సు.దేశానికి స్వాతంత్ర్య లభించిన తొలిరోజుల్లో ఈ వ్యవస్థ ఉండేది. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంతో పాటు దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయని బిజెపి ప్రభుత్వం చెబుతున్న మరోమాట. అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం తొలిదశ కాగా,ఈ ఎన్నికలు జరిగిన 100రోజుల లోపే మున్సిపాలిటీలు, పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించడం రెండో దశలో జరగాల్సిన కార్యాచరణగా ఉండాలని ఈ కమిటీ బలంగా చెబుతోంది. కాకపోతే,దీనికోసం ఆర్టికల్ 325ను సవరించాలి. ఈ సవరణకు రాష్ట్రాల సహకారం అవసరం. రేపటి ఎన్నికల ఫలితాల తర్వాత కానీ,ఆ యా పార్టీల బలాబలాలు తెలియరావు. 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆ మధ్య వివరణ ఇచ్చారు.జమిలి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటుచేసిన అత్యున్నత కమిటీ తుది నివేదిక అందించడానికి నిర్దిష్టమైన గడువేమీలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే,ఇప్పుడప్పుడే ఈ వ్యవహారం తేలదని అర్థం చేసుకోవచ్చు.2024 లోపే జమిలి ఎన్నికలు జరుగవచ్చని గతంలో కొందరు జోస్యం చెప్పారు. దానికి తెరపడిందన్నది సత్యం. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సివుంది. ఆ తర్వాత భవిష్యత్తులో జరుగబోయే ఎన్నికల నాటికి ఏదైనా స్పష్టత వస్తుందేమో! చూడాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు,లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలనే నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే వినిపిస్తూనే వున్నారు. మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై ఆయన పట్టుదలగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత సంవత్సరం సెప్టెంబర్ లో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే దిశగా కమిటీ పనిచేయడం కూడా ప్రారంభించింది. ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. స్పందన కూడా విశేషంగా వచ్చింది. వేలాదిగా ఈ -మెయిల్స్ వచ్చాయి. కేంద్రం మొన్నామధ్యనే 6 జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. ఇప్పటివరకూ 35 పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది.జమిలి ఎన్నికలకు సంబంధించి న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది. మరి కొన్ని నెలల వ్యవధిలోనే సాధారణ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో,ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యల వేడి పెరుగుతోంది. ముఖ్యంగా తృణమూల్ పార్టీ అధినేత్రి,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జమిలి ఎన్నికలకు ససేమిరా అంటున్నారు.అదే విషయాన్ని స్పష్టం చేస్తూ రామ్ నాథ్ కోవింద్ కమిటీకి ఉత్తరం కూడా రాశారు. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వాన్ని అనుమతించే వ్యవస్థగా మారుతుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలకు తాము దూరంగానే ఉంటామని స్పష్టం చేశారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలువివిధ కారణాలతో తమ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోవచ్చని గత చరిత్రను గుర్తుచేస్తున్నారు. అనేకసార్లు లోక్ సభ రద్దయిందని, భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితులు తలెత్తుతాయనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఓటర్ల ఎన్నికల విశ్వాసాన్ని ఉల్లంఘించడం న్యాయమా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.తృణమూల్ పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలకు అనేక భయాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. 'జమిలి' అంటే రాష్ట్రాలపై దాడి చేయడమేనని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శనా బాణాలు సంధిస్తునే వున్నారు.ఈ ఎన్నికల వల్ల సామాన్యులకు ఒరిగేదేంటని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. 2029 నుంచి లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లా కమిషన్ ఇంకా తుది నివేదికను తయారుచేయాల్సివుంది. పంచాయతీల నుంచి పార్లమెంట్ దాకా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది బిజెపి ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ముఖ్యంగా,దీనివల్ల డబ్బు ఆదా అవుతుందని,ఆ ధనాన్ని అభివృద్ధి పనుల కోసం కేటాయించవచ్చని మోదీ సర్కార్ వాదిస్తోంది.ఈ చర్చ ఈనాటిది కాదు.2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అన్ని పార్టీలను ఆహ్వానించి దీనిపై చర్చ కూడా జరిపారు.అప్పట్లో దేశ వ్యాప్తంగా మొత్తం నలబై రాజకీయ పార్టీలను ఈ సమాలోచనకు ఆహ్వానించారు. 21పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు అప్పట్లో జమిలి ఎన్నికలకు జై కొట్టాయి. వచ్చిన మిగిలిన పార్టీలు విభిన్న స్వరాలను వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే ఉంది. లోక్ సభకు,శాసనసభలకు సమాంతరంగా ఏకకాలంలో జరపడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ప్రధానంగా ఖర్చు కలిసివస్తుందన్నది వాస్తవమే. వివిధ ఎన్నికల కోడ్ పేరుతో జరగాల్సిన కార్యక్రమాలు జరగకుండా పనులు ఆగిపోవడం, సమయం వృధా అవ్వడం మొదలైన వాటికి అడ్డుగోడ పడుతుంది.తద్వారా పనిరోజులు పెరుగుతాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కనీసం రెండు,మూడు రాష్ట్రాలలో ఎన్నికలు తప్పనిసరిగా వస్తుంటాయి.ఈ నేపథ్యంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడే పరిస్థితి వస్తుంది.అదే అన్ని చోట్ల సమాంతర ఎన్నికల విధానం అందుబాటులో ఉంటే,కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మరింతగా పరిపాలనపై దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ఐదేళ్లకొకసారి అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల రాజకీయ సుస్థిరత నెలకొనే అవకాశం ఉంది.బిజెపి ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలపై కొందరు అనేక అనుమానాలు, సందేహాలు,అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఈ ప్రతిపాదన వల్ల ఎటుచూసినా,కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికే ఎక్కువ మేలుజరుగుతుందనీ,అందుకే, దీనిపై బలంగా ప్రచారం చేస్తోందనే భావంలో ప్రతిపక్షాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి సంపూర్ణమైన బలం లేకపోతే, వివిధ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వస్తుందనీ, దీని వల్ల కేంద్రంలో పాలనకు అవరోధాలు ఏర్పడతాయనే అనుమానాలు బిజెపికి ఉన్నాయి. ప్రస్తుతం,దేశంలో బిజెపి బలంగానే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బలహీనంగా వుంది. ఆంధ్రప్రదేశ్లో చాలా బలహీనంగా ఉంది. తమిళనాడు,కేరళలో కూడా అదే తీరు. తెలంగాణలో కాస్త బలిపడినట్లు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో మాత్రం బిజెపి బలంగా కనిపిస్తోంది. కొన్ని రోజుల వ్యవధిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. ఫలితాలు ఎలా ఉండబోతాయో ఇంకా స్పష్టత రావాల్సివుంది. జమిలి ఎన్నికలు జరిగితే, ఐదేళ్లపాటు యథేచ్ఛగా తమ విధానాలను అమలుపరిచే స్వేచ్ఛ మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయంలోనే బిజెపి మొదటి నుంచి వుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఆధిక్యత వస్తుందనీ,దాని వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే భయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.దీని వల్ల వారు అనుసరించే విధానాల వల్ల దేశ సమగ్రతకు జమిలి ఎన్నికల వల్ల భంగం కలిగే ప్రమాదం ఉందనీ కొందరు విమర్శిస్తున్నారు.పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు నిర్మాణం చేపట్టే ప్రతిపాదనలు దీని వెనకాల దాగి ఉన్నాయనే భయాలు కొందరిలో లేకపోలేదు.ఈ భయాలన్నీ ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ కు, ఆ పార్టీని అనుసరిస్తున్న కొన్ని పార్టీలకు ఉన్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే, కొన్ని శాసనసభల పదవీకాలాన్ని కుదించాలి,కొన్నింటిని పొడిగించాలి.ఇటువంటి కీలకమైన చర్యలకు రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికి సరిపడా బలం ఉభయ సభల్లోనూ బిజెపికి ఉంది. 'సమాంతర ఎన్నికల'పై, 2018 ఆగస్టులో లా కమీషన్ ఒక ముసాయిదా నివేదిక సమర్పించింది. చట్ట సవరణ జరిగిన తర్వాత, దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాల్సిన అవసరం కూడా ఉంది.ఇక్కడ కూడా బిజెపికి వాతావరణం అనుకూలంగానే ఉంది.లోక్ సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పుడు కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. శాసనసభకు స్థానిక పార్టీకి వేసి, లోక్ సభకు జాతీయ పార్టీకి వేసే మైండ్ సెట్ కొందరు ఓటర్లలో ఉంటుంది.ఫలితాలు తదనుగుణంగా వచ్చిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎల్లవేళలా,అధికారంలో ఉండే పార్టీలకు సంపూర్ణమైన మెజారిటీ ఉండకపోవచ్చు.సంకీర్ణంగా ప్రభుత్వాలు నడిపే క్రమంలో, విభేదాల వల్ల ప్రభుత్వం పడిపోయినప్పుడు,ఎన్నికలు మళ్ళీ నిర్వహించాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఏమి చేయాలి? అనే సందేహాలు ఉన్నాయి. ఇలా జమిలి ఎన్నికల అంశంలో అనేక అనుకూల, ప్రతికూల అంశాలు,సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటిపై దేశ వ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాలి. ప్రజామోదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి.మంచిచెడు, లాభనష్టాలు బేరీజువేసుకోవాలి. "కేవలం ఇది చర్చించే విషయం కాదని,భారత్ కు ఎంతో అవసరం", అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేకమార్లు ఉద్ఘాటించారు. పార్టీల రాజకీయ స్వార్ధాలు ఎట్లా ఉన్నా,దేశ ప్రజల మంచికి,దేశ ప్రగతికి పట్టంకట్టే విధానాలను స్వాగతించవచ్చు. 2029 లో నైనా జరుగుతాయా? అన్నది వచ్చే ఎన్నికల్లో ఫలితాలను బట్టి కొంత అంచనా వెయ్యవచ్చు.ఈసారి ఎన్నికల్లో 400 స్థానాల లక్ష్యంతో బిజెపి కదనరంగంలో దిగుతోంది.కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా చాలా బలంగా వున్నాయి. ఇండియా కూటమి మధ్య ఐక్యత ఆశించిన స్థాయిలో లేదన్నది నేటి మాట.జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే? ప్రణాళిక చాలా అవసరం.ఈవిఎంలు, వీవీప్యాట్ లు,భద్రతా సిబ్బంది మొదలైన అనేక అంశాలలో పకడ్బందీ ప్రణాళికలు రచించుకోవాల్సివుంటుంది. :::మాశర్మ -
రెండు దశల్లో 'జమిలి' ఎన్నికలు..
-
రెండు దశల్లో జమిలి ఎన్నికలు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు నివేదిక సమర్పించిన రామ్నాథ్ కోవింద్ కమిటీ..ఇంకా ఇతర అప్డేట్స్
-
జమిలి ఎన్నికలు: రాష్ట్రపతికి నివేదిక అందించిన కోవింద్ కమిటీ
సాక్షి, ఢిల్లీ: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ నేడు నివేదకను అందించింది. ఈ సందర్భంగా పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ఒకేసారి జరగాలని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే, ఈ ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల నివేదికను తయారు చేశారు. ఈ నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కోవింద్ సహా కమిటీ సభ్యులు సమర్పించారు. The High-Level Committee on simultaneous elections, chaired by Ram Nath Kovind, Former President of India, met President Murmu at Rashtrapati Bhavan and submitted its report. Union Home Minister Amit Shah was also present. pic.twitter.com/zd6e5TMKng — ANI (@ANI) March 14, 2024 కాగా, దాదాపు 190 రోజుల పాటు జమిలీ ఎన్నికలపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించింది. అనంతరం నివేదికను రూపొందించింది. లోక్సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్ను సవరించాలని కమిటీ తమ నివేదికలో సూచించినట్లు సమాచారం. మూడుస్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. The High-Level Committee on simultaneous elections, chaired by Ram Nath Kovind, Former President of India, has met President Murmu at Rashtrapati Bhavan and submitted its report. The Report comprises of 18,626 pages, and is an outcome of extensive consultations with… — ANI (@ANI) March 14, 2024 ఇదిలా ఉండగా.. ఏకకాల ఎన్నికల జరగాలని కేంద్రంలోని మోదీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే 2023 సెప్టెంబరులో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్గా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను నియమించింది. కేంద్ర మంత్రి అమిత్షా, లోక్సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది. -
‘జమిలి ఎన్నికలు.. అధ్యయన కమిటీని రద్దు చేయండి’
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ రకమైన ఆలోచనే అప్రజాస్వామికమని ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికల విధానం.. సమాఖ్య విధానానికి, రాజ్యాంగ మూలాలకు చాలా వ్యతిరేకమని తెలిపారు. ఆయన శుక్రవారం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన జమిలి ఎన్నికల అధ్యయన కమిటికీ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానాన్ని వ్యతిరేకిస్తోందని అన్నారు. అభివృద్ధి చెందుతున్న, బలమైన రాజ్యాంగం ఉన్న భారత దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించటం అంత అవసరం లేదన్నారు. దానిని అమలు చేయటం కోసం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ రద్దు చేయాలని కమిటీ కార్యదర్శి నితిన్ చంద్ర రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగానికి పాల్పడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 18, 2023న ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ.. జమిలి ఎన్నికల విధానంపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కూడా కోరిన విషయం తెలిసిందే. అయితే వారు ముందుగానే అమలు చేద్దామని నిశ్చయించుకున్న తర్వాత ప్రజల వద్ద నుంచి సంప్రదింపులను కోరటం ఎందుకని ప్రశ్నించారు. అధ్యయన కమిటీని సైతం పక్షపాత ధోరణితో ఏర్పాటు చేశారని అన్నారు. కమిటీ ఏర్పాటు విషయంతో ప్రతిక్షాలు, పలు రాష్ట్రాల అభిప్రాయాల మేరకు ఏర్పాటు చేయలేదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం ఎన్నికల ఖర్చును ప్రజలు కూడా అంగీకరించడనికి సిద్ధం ఉన్నారని తెలిపారు. ఐదేళ్లలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎన్నికలకు ఖర్చు చేసే డబ్బు.. చాలా తక్కువని ఆయన లేఖలో గుర్తుచేశారు. చదవండి: లాలూ, తేజస్వీలకు మళ్లీ ఈడీ నోటీసులు -
జమిలి ఎన్నికల ఉన్నతస్థాయి కమిటీ తొలి భేటీ
ఢిల్లీ: జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఏర్పడిన కమిటీ నేడు ఢిల్లీలో తొలిసారి సమావేశం కానుంది. లోక్సభకు, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నిక జరపడానికి కావాల్సిన రోడ్మ్యాప్ను సిద్ధం చేయనున్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక నిర్వహించడానికి రాజకీయ పార్టీలు, నిపుణుల సలహాలు స్వీకరించనున్నారు. ఒకే దేశం-ఒకే దేశం ఎన్నిక నిర్వహించడానికి ఏర్పడిన కమిటీ అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్ నిన్న ఒడిశా పర్యటనలో భాగంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న జమిలి ఎన్నికల కమిటీ మొదటి భేటీ ఉందని చెప్పారు. జమిలీ ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఎనిమిది మందితో కూడిన ఓ కమిటీని ఏర్పరిచింది. ఒకేసారి లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సిన సర్దుబాట్లు, సూచనలను కమిటీ పరిశీలించనుంది. రామ్నాథ్ కోవింద్తో పాటు కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. ఇదీ చదవండి: Tender Voting: టెండర్ ఓటింగ్ అంటే ఏమిటి? -
'ఒకే దేశం ఒకే ఎన్నికలు' కమిటీ మొదటి సమావేశానికి డేట్ ఫిక్స్!
న్యూఢిల్లీ: ఒకే దేశం ఒకే ఎన్నికలు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన వేసిన కమిటీ తొలిసారి అధికారికంగా సమావేశం కానుంది. ఈ సమావేశానికి సెప్టెంబర్ 23న ముహూర్తం ఖరారైంది. ముహూర్తం ఫిక్స్.. కొద్ది రోజుల క్రితం ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చిన కేంద్రం అనుకుందే తడవు హుటాహుటిన ఈ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాయాలు గురించి అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలోని కీలక సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి నితిన్ చంద్ర సహా ఇతర ముఖ్య నేతలు సెప్టెంబర్ 6న సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి అధికారిక సమావేశాన్ని సెప్టెంబర్ 23న నిర్వహించాలని నిర్ణయించింది కమిటీ. కమిటీ కర్తవ్యం ఏమిటి? అయితే ఈ నెల 23న జరిగే సమావేశంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయమై ప్రాధమిక కార్యాచరణ గురించి చర్చించనున్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణలు చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా ఒకవేళ ఉంటే వాటి గురించి పూర్తిస్థాయి అధ్యయనం చేసి కేంద్రానికి నివేదించనున్నారు. రాజ్యాంగంతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం లేదా ఇతర చట్టాల సవరణలు చేయాల్సి ఉందా అన్న అంశాలపై కూడా గురించి చర్చించనున్నారు. ఉన్నతస్థాయి కమిటీ.. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షత వహించనున్న ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ లోక్సభ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి, మాజీ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్, మాజీ లోక్సభ సెక్రెటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి సభ్యులుగా ఉన్నారు. కేంద్ర న్యాయ శాఖా మంత్రి అర్జున్ మేఘవాల్ ప్రత్యేక ఆహ్వానితులుగా సమావేశాలకు హాజరు కానుండగా న్యాయ శాఖ కార్యదర్శి నితిన్ చంద్ర ఈ ప్యానెల్కు సెక్రెటరీగా వ్యవహరించనున్నారు. పార్లమెంట్ సెషన్ ముగిసిన వెంటనే! ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18-22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు పూర్తైన మరుసటి రోజునే ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏకకాలంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడంపైనే ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరగనుందని పుకార్లు చక్కెర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ కమిటీ సమావేశాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. #WATCH | On the 'One Nation, One Election' committee, former President and chairman of the committee, Ram Nath Kovind says "The First meeting will take place on 23rd September" pic.twitter.com/FU1gvzMi7j — ANI (@ANI) September 16, 2023 ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? -
రామ్నాథ్ కోవింద్ కమిటీ మొదటి సమావేశంలో కీలకాంశాలు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివాసంలో జమిలీ ఎన్నికలపై జరుగుతున్న తొలి సమావేశం సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి ఇతర నేతలు హాజరయ్యారు. 'వన్ నేషన్ వన్ ఎలెక్షన్'పై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు మొదటిసరి అధికారికంగా సమావేశమయ్యింది. ఈ హైలెవెల్ కమిటీ సమావేశంలో ఏడు కీలక అంశాలపై చర్చించి సిఫారసులు చేయనుంది. రాజ్యాంగ సవరణలు: ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. అందుకు ఏయే రాజ్యాంగ అధికారణల సవరణలు చెయ్యాలో, ఏయే చట్టాల సవరణ చెయ్యాలో కమిటీ అధ్యయనం చేస్తుంది. రాష్ట్రాల అనుమతి: ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించడానికి ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే వాటి సవరణకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? లేక కేంద్రమే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళవచ్చా అన్నదానిపై కూడా స్పష్టతనివ్వాలి. సంకీర్ణాలైతే : ఇక ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను కూడా అధ్యయనం చేసి హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై కూడా ఈ కమిటీ సూచనలు తెలియజేయాలి. సాధ్యం కాకపోతే: ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కమిటీ పూర్తి వివరాలను తెలియజేయాలి. భవిష్యత్తు : ఒకసారి పరిస్థితులు అనుకూలించి ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, మళ్లీ ఇది దెబ్బ తినకుండా తదనంతరం కూడా కొనసాగడానికి అవసరమైన చర్యలపై కూడా సిఫారసులు చెయ్యాలి. సిబ్బంది: ఒకేసారి ఎన్నికలకు ఈవీఎంలు, వివి ప్యాట్ల అవసరం ఎంత? వాటితో పాటు మానవ వనరుల అవసరమెంతో కూడా స్పష్టమైన నివేదిక సమర్పించాలి. ఒక్కటే ఓటర్ కార్డు: లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు తీసుకునే అంశమై ఎటువంటి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలో తెలియజేయాలి. ఇది కూడా చదవండి: ఇండియా కంటే 'భారత్' మేలు: లాలూ ప్రసాద్ యాదవ్ -
‘జమిలి’తో మరింత జోష్!
సాక్షి, హైదరాబాద్: ‘జమిలి’ఎన్నికల అంశం రాష్ట్ర బీజేపీలో మరింత జోష్ నింపుతోంది. అసెంబ్లీతోపాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో బీజేపీకి లాభమని ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. ఈ నెల 18న మొదలుకాబోయే పార్లమెంటు సమావేశాల్లో జరిగే చర్చలు, ప్రకటించే అంశాలతో దేశంలో రాజకీయాలు, ఎన్నికల ఎజెండా మారిపోతాయని.. పరిస్థితి పూర్తిగా బీజేపీకి అనుకూలంగా మారిపోతుందని అంటున్నారు. కొంతకాలంగా ‘వన్ నేషన్– వన్ ఎలక్షన్’అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చిన కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. తాజాగా దీనిపై కసరత్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ ఉన్నతస్థాయి కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ నెల 18 నుంచి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ‘జమిలి’తోపాటు ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్–యూసీసీ), ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టవచ్చనే ప్రచారం సాగుతోంది. ఇవన్నీ బీజేపీకి రాజకీయంగా అనుకూలత పెంచుతాయని భావిస్తున్నారు. ఆలస్యంగా జరిగితే ఎంతో మేలు! నిర్ణీత గడువు కంటే మూడు, నాలుగునెలలు ఆలస్యమవడంతోపాటు లోక్సభతో కలిపి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. బీజేపీకి తిరుగు ఉండదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయని అంచనా వేస్తున్నారు. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ వరకు ఎన్నికలు ఆగితే.. ఆలోగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పు, ఇతర అంశాలతో పార్టీ కేడర్లో ఏర్పడిన సందిగ్థత తొలగిపోతుందని అంటున్నారు. పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు వీలవుతుందని పేర్కొంటున్నారు. అభ్యర్థులపై కసరత్తు రాష్ట్ర అసెంబ్లీతోపాటు లోక్సభకు సంబంధించి కూడా బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని గోవా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల ముఖ్యనేతలకు రాష్ట్రంలోని మూడేసి ఎంపీ స్థానాలకు ఇన్చార్జులుగా బాధ్యతలు అప్పగించారు. వారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పని మొదలుపెట్టారు. ఆయా చోట్ల పార్టీ బలాబలాలు, సత్తా ఉన్న, క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలను గుర్తించడంలో మునిగిపోయారు. మరోవైపు అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్లోని అసంతృప్త నేతలను ఆకర్షించేందుకూ బీజేపీ ప్రయత్నిస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై ఫోకస్ బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్.. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గతంలో నిర్ణయించినట్టుగా ఈ నెల 7న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టకుండా.. ఉమ్మడి జిల్లాల వారీగానే కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇక అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక.. పది ఉమ్మడి జిల్లాల వారీగా అసెంబ్లీ కోర్ కమిటీల సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనితోపాటు సెపె్టంబర్ 17న చేపట్టాల్సిన కార్యక్రమాలు, బస్సుయాత్రలపై సమీక్షించినట్టు సమాచారం. -
వన్ నేషన్-వన్ ఎలక్షన్పై కమిటీ ఏర్పాటు.. సభ్యులు వీరే..
సాక్షి, హైదరాబాద్: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్పై తాజాగా హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఎనిమిది మంది సభ్యులతో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. వివరాల ప్రకారం.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రక్రియపై కేంద్రం స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే శనివారం రామ్నాథ్ కోవింద్ ఛైర్మన్గా ఎనిమిది మంది సభ్యుల హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కేంద్రహోం అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ, గులాం నబీ ఆజాద్, సంజయ్ కొఠారి, హరీష్ సాల్వే, సుభాష్ కష్యప్, 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్కే సింగ్ ఉన్నారు. ఈ కమిటీకి కార్యదర్శిగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. Govt of India constitutes 8-member committee to examine ‘One nation, One election’. Former President Ram Nath Kovind appointed as Chairman of the committee. Union Home Minister Amit Shah, Congress MP Adhir Ranjan Chowdhury, Former Rajya Sabha LoP Ghulam Nabi Azad, and others… pic.twitter.com/Sk9sptonp0 — ANI (@ANI) September 2, 2023 ఇక, దేశంలోని వ్యక్తులు, సంస్థలు, నిపుణుల నుంచి అభిప్రాయాలు సలహాలును హై లెవెల్ కమిటీ తీసుకోనుంది. కాగా, సాధ్యమైనంత త్వరగా కమిటీ సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏడు కీలక అంశాలపై సిఫారసు చేయాలని కమిటీకి లక్ష్యం 1. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాల పరిశీలన. ఏ రాజ్యాంగ సవరణలు చట్టాలకు సవరణ చేయాలో సిఫారసు చేయాలి. 2. రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా? కాదా?. 3. హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై సిఫారసు ఇవ్వాలి. 4. ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కానీ పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశంపై సిఫారసు. 5. ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ సైకిల్ దెబ్బ తినకుండా అవసరమైన చర్యలపై సిఫారసులు. 6. ఒకేసారి ఎన్నికలకు అవసరమయ్యే ఈవీఎంలు, వీవీప్యాట్లు, మానవ వనరుల అవసరమెంతో తేల్చాలి. 7. లోకసభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు. ఇది కూడా చదవండి: మళ్ళీ అధికారంలోకి వస్తే వారిని తలకిందులుగా వేలాడదీస్తాం: అమిత్ షా -
Jamili Elections: 'జమిలి'పై కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై ఓవైపు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి కార్యాచరణ సిద్ధం చేస్తుండగా, మరోవైపు ముందస్తు ఎన్నికల ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం పదును పెడుతోంది. ఈ నెల 18 నుంచి 5 రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించి ముందస్తు ఎన్నికల అంశాన్ని కేంద్రం ఇప్పటికే తెరపైకి తీసుకొచ్చింది. దానికి మరింత బలం చేకూర్చేలా ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. జమిలి ఎన్నికల అంశాన్ని తేల్చడానికి 16 మంది సభ్యులతో ఈ కమిటీని నియమించింది. కమిటీ విధివిధానాలు, గడువుపై కేంద్రం త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయనుందని సమాచారం. ఈ పరిణామాలన్నీ చూస్తే ముందస్తు ఎన్నికల హడావుడి మొదలైనట్లే కనిపిస్తోంది. జమిలి ఎన్నికలపై ఇప్పటికే పార్లమెంటరీ స్థాయీ సంఘం, లా కమిషన్ అధ్యయనం చేసి, తమ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి. జమిలి ఎన్నికల పట్ల అవి సానుకూలంగా స్పందించాయి. భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలు తెలుసుకోనున్న కమిటీ ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’పై తొలిసారిగా 2019 జూన్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. అప్పట్లో సమాజ్వాదీ పార్టీ, టీఆర్ఎస్(ఇప్పటి బీఆర్ఎస్), శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు ఆ ఆలోచనకు మద్దతు ప్రకటించాయి. ఆ తర్వాత 2020 నవంబర్లో 80వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సదస్సులో ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దాదాపు 3 సంవత్సరాల అనంతరం కేంద్ర ప్రభుత్వం దీనిపై కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. జమిలి ఎన్నికలకు సంబంధించిన చట్టపరమైన అంశాలను కమిటీ పరిశీలిస్తుంది. నిపుణులు, రాజకీయ పార్టీల నేతలతోపాటు సామాన్య ప్రజల అభిప్రాయాలను సైతం స్వీకరిస్తుంది. భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత తన నివేదికను కేంద్ర పభుత్వానికి సమర్పిస్తుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలతోపాటే మొత్తం 12 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తారన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. కోవింద్తో జేపీ నడ్డా భేటీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం రామ్నాథ్ కోవింద్తో సమావేశమయ్యారు. కోవింద్ నేతృత్వంలో కమిటీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత ఈ భేటీ జరిగింది. కమిటీ కూర్పుపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. కమిటీలో సభ్యులుగా ఎవరెవరు ఉండాలన్న దానిపై అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. ప్రత్యేక సమావేశాల అజెండా త్వరలోనే: ప్రహ్లాద్ జోషీ ఈ నెల 18వ తేదీ నుంచి జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా రూపకల్పన తుది దశలో ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. అజెండాలో పొందుపరిచే అంశాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. అతి త్వరలోనే అజెండాను బహిర్గతం చేస్తామన్నారు. ప్రత్యేక సమావేశాలకు కావాల్సినంత సమయం ఉందన్నారు. ఇదిలా ఉండగా, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల చివరి రోజైన ఈ నెల 22న పార్లమెంట్ సభ్యుల గ్రూప్ ఫొటోల చిత్రీకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా ఇలాంటి ఫొటోలను పార్లమెంట్ టర్మ్ మొదలైన తొలి రోజు లేదా చివరి రోజు చిత్రీకరిస్తుంటారు. తరచూ ఎన్నికలతో నష్టమే.. దేశంలో ‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ నిర్వహించాల్సిన అవసరం ఉందని రామ్నాథ్ కోవింద్ గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. ‘‘తరచూ దేశంలో ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతుండడంతో మానవ వనరులపై భారం పడుతోంది. ఎన్నికల వ్యయం పెరిగిపోతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది’’ అని 2018లో పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో కోవింద్ చెప్పారు. 2014 మేలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే దేశం–ఒకే ఎన్నికపై చర్చ ప్రారంభమైంది. దేశంలో లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతాయని లా కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతోపాటు అభివృద్ధి పనులకు ఆటంకాలు ఉండవని వెల్లడించింది. దేశంలో 1967 దాకా లోక్సభకు, రాష్ట్రాల శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మోదీ ప్రభుత్వ పదవీ కాలం మరికొన్ని నెలల్లో ముగియనుంది. జమిలి ఎన్నికల వ్యవహారాన్ని ఇంకా సాగదీయకుండా ఏదో ఒకటి తేల్చేయాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ‘సమాఖ్య’కు విఘాతం: విపక్షాలు ‘జమిలి’పై రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి స్పందించింది. కేంద్ర ప్రభుత్వ ఆలోచనను తప్పుపట్టింది. లోక్సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. సమాఖ్య వ్యవస్థను దెబ్బతీయొద్దని డిమాండ్ చేసింది. రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ అనేది ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఇది కూడా చదవండి: దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టు షాక్.. -
బాబాసాహెబ్ కలల సాకారంలో...
అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. మోదీ బలమైన సంకల్పం ఫలితంగా ఆర్టికల్ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలన్నింటి లోనూ అంబేడ్కర్ ప్రభావం సుస్పష్టం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్ ముద్ర ఆయన పాలనా శైలిలో సర్వత్రా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభిప్రాయం. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మన సమాజ భాగ స్వాములైన బడుగు, బలహీన వర్గాల వారి ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు తొడిగిన రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంత యినా ఉంది. స్వాతంత్య్రం తర్వాత దేశ ప్రగతికి వివిధ ప్రభుత్వాలు తమ వంతు కృషి చేసినప్పటీకీ అంబేడ్కర్ కన్న కలల్లో ఏళ్ల తరబడి నెరవేరని ఎన్నో స్వప్నాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేసింది. ఈ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి పుట్టినరోజు. ఆయనతో నాది చాలా సుదీర్ఘ, చిరస్మరణీయ అనుబంధం. సంస్థలో ఒకరిగా, ముఖ్యమంత్రిగా, ఇవాళ ప్రధానమంత్రిగా ఆయన పనిచేయడం నేను చూస్తూ వచ్చాను. దళితులు, ఆదివాసీలు, మహిళల సాధికారతలో ఆయన ప్రదర్శించిన శ్రద్ధాసక్తులు నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఆ మేరకు బాబాసాహెబ్కు నిజమైన శిష్యుడిగా భారతదేశాన్ని సమసమాజంగా రూపుదిద్దడానికి మోదీ ముమ్మర కృషి చేస్తున్నారు. మోదీ చేపట్టిన చర్యలు, కార్యక్రమాలు, విధానాలు తదితరాలన్నింటిలోనూ అంబే డ్కర్ ప్రభావం సుస్పష్టం. ఒక సంస్థలో సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా, నేడు ప్రధానమంత్రిగానూ మోదీ సదా బాబాసాహెబ్ బాటలోనే నడుస్తున్నారు. తదనుగుణంగా దేశానికేగాక ప్రపంచం మొత్తానికీ చిరకాలం గుర్తుండిపోయే బహుమతిని ‘పంచతీర్థం’ రూపంలో మోదీ అందించారు. బాబాసాహెబ్ జయంతిని ‘సమతా దినోత్సవం’గా నిర్వహించాలని నిర్ణయించడమేగాక నవంబర్ 26ను భారత ‘రాజ్యాంగ దినోత్సవం’గానూ మోదీ ప్రకటించారు. ప్రధాని మోదీ చూపిన ఈ చొరవతో ఐక్యరాజ్య సమితి కూడా బాబాసాహెబ్ 125వ జయంతి వేడుకను నిర్వహించింది. అంబేడ్కర్ కృతనిశ్చయంతో ఉన్నప్పటికీ నెరవేరని– ఆర్టికల్ 370 రద్దు, స్వయం సమృద్ధ భారతం స్వప్నాలను మోదీ ప్రభుత్వం పటిష్ఠ చర్యలతో సాకారం చేయగలిగింది. కాగా, ఆనాడు అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో భాగమైంది. దీంతో భారతదేశంలో జమ్ము–కశ్మీర్ విలీనానికి అడ్డుకట్ట పడింది. అయితే, మోదీ బలమైన సంకల్పం, దీక్ష ఫలితంగా ఆర్టికల్ 370 రద్దు సాధ్యమై, ఇవాళ భారతదేశంతో జమ్ము–కశ్మీర్ ఏకీకరణ స్వప్నం సాకారమైంది. అదేవిధంగా శక్తిమంతమైన స్వయం సమృద్ధ భారతదేశ నిర్మాణం దిశగా ప్రధానమంత్రి మోదీ ఉద్యమ సంక ల్పంతో శ్రమిస్తున్నారు. ‘స్వయం సమృద్ధం’ కావడం ద్వారానే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించగలదని అంబేడ్కర్ గట్టిగా విశ్వసించారు. కానీ, భారతదేశాన్ని స్వావలంబన మార్గంలో నడి పించడంలో మునుపటి ప్రభుత్వాలకు సంకల్పం, చిత్తశుద్ధి లోపిం చాయి. కానీ, మోదీ ఈ పరిస్థితిని చక్కదిద్ది, భారత ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించడం ద్వారా ప్రపంచానికి మన శక్తిని చాటారు. కాబట్టే మన బలమేమిటో ప్రపంచం ఇవాళ గుర్తించింది. రాష్ట్రపతి హోదాలో నేను పలు సామాజిక సమస్యలు, పాలనా వ్యవహారాలపై ప్రధానితో సంభాషించినప్పుడల్లా వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన అవినీతి గురించి ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేసేవారు. ఈ జాడ్యం కారణంగా ఎక్కువగా నష్టపోతున్నది పేదలేనని చెప్పేవారు. ఈ నేపథ్యంలో గడచిన ఎనిమిదేళ్లుగా మోదీ అవినీతిపై అలుపెరుగని నిర్ణయాత్మక పోరాటం చేస్తున్నారు. తదనుగుణంగా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలన్నీ నిరుపేద లందరికీ అందేలా ఆయన చేసిన కృషిని మనమంతా ప్రత్యక్షంగా చూశాం. పర్యవసానంగా ఇవాళ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ సాఫీగా సాగిపోతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ పథకాలన్నీ నిరుపేదలపై కరుణను ప్రతిబింబించేవి కావడం గమనార్హం. మన ప్రజాస్వామ్య వ్యవస్థను అనువంశిక రాజకీయాలు నియంత్రించడం మోదీకి తీవ్ర ఆందోళన కలిగించిన మరో అంశం. ఈ అనువంశిక రాజకీయాలు చిత్తశుద్ధితో, శ్రమించి పనిచేసే రాజ కీయ కార్యకర్తల హక్కులను ఏ విధంగా లాగివేసుకుంటాయనే అంశంపై ఆయన సదా గళం విప్పుతూనే వచ్చారు. మోదీ ఎల్లప్పుడూ అర్హత ప్రాతిపదికగానే నాయకులను, కార్యకర్తలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అనువంశిక రాజకీయాలపై మోదీ చేసిన యుద్ధం ఇప్పటికే తన ప్రభావం చూపుతోంది. ఈ మేరకు మన ప్రజాస్వా మ్యాన్ని పటిష్ఠం, మరింత శక్తిమంతం చేసేది ప్రతిభ ఆధారిత రాజకీయాలే తప్ప అనువంశిక రాజకీయాలు కావన్నది స్పష్టమైంది. మోదీ పాలన శైలికి మరో నిలువెత్తు నిదర్శనం ‘పద్మ’ పురస్కరాలు. ఒకనాడు సంపన్న, పలుకుబడిగల వర్గాలకు ‘విశేష పరి గణన’ ఇచ్చేవిగా భావించబడిన ఈ పురస్కారం నేడు ‘సామా న్యుడి’తో తన అనుబంధాన్ని పునరుద్ధరించుకుంది. ఈ మేరకు ఇవాళ ‘జన సామాన్యం’తో మమేకమైన వారికి అంకితం చేయబడ్డాయి. అత్యంత వెనుకబడిన రంగాలలో అభివృద్ధి, తదనుగుణంగా అట్టడుగు వర్గాల జీవితాల్లో కొత్త అధ్యాయం లిఖించే విధంగా ప్రభుత్వం చేపట్టిన రెండు కీలక చర్యల గురించి ఈ సందర్భంగా నేను ప్రస్తావించదలిచాను. ఇందులో ఒకటి ‘ఆకాంక్షాత్మక జిల్లాల కార్య క్రమం’ కాగా, రెండోది ‘ఆదర్శ గ్రామాల పథకం’. మోదీ విశిష్ట ఆలోచన శైలికి ఇదే నిదర్శనం. వేలెత్తి చూపలేని పటిష్ట ప్రణాళికలు, లోపరహితంగా వాటిని అమలు చేయడం వల్ల నిరుపేదల జీవితాల్లో సుస్పష్టమైన మార్పులు వచ్చాయి. అనేక సాంఘిక సంక్షేమ పథకాలే ఇందుకు తిరుగులేని ఉదాహరణలు. వీటిలో ప్రపంచంలోనే అత్యంత భారీ ఉచిత రేషన్ పథకమైన ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అత్యంత విశిష్టమైనది. భారతీయులు కరోనా మహ మ్మారిపై సాహసోపేత పోరాటం సలుపుతున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ పథకం ద్వారా 80 కోట్ల మందికిపైగా ప్రజలు ప్రయోజనం పొందారు. మహమ్మారి వైరస్పై భారత్ పోరాటాన్ని ప్రధాని మోదీ ఏ విధంగా ముందుండి నడిపారో నేను ప్రత్యక్షంగా చూశాను. మన శాస్త్రవేత్తలు, వైద్యులు ఒకటికి రెండు ‘దేశీయ’ (మేడ్ ఇన్ ఇండియా) టీకాలను రూపొందించడంలో ఆయనిచ్చిన చేయూత, మద్దతు నిరుపమానం. దీంతో మనందరికీ భద్రత లభించడమేగాక అనేక ఇతర దేశాల ప్రజానీకం సంక్షేమానికీ మనమంతా తోడ్పడినట్ల యింది. మరోవైపు మహమ్మారి గరిష్ఠ స్థాయిలో విజృంభించే నాటికి 100 కోట్ల మంది భారతీయులకు టీకాలు వేసే బృహత్తర కార్యాచర ణను కూడా ప్రధానమంత్రి చేపట్టారు. తద్వారా ప్రపంచంలోనే అత్యంత భారీ, వేగవంతమైన టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి, విజయవంతం చేశారు. అనేక అభివృద్ధి చెందిన దేశాలను కోవిడ్ ఊపిరాడకుండా చేసిన సమయంలో ప్రధాని మన ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమేగాక విస్తరించారు. సమయ స్ఫూర్తితో కూడిన విధానపరమైన కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధి స్తంభించకుండా ఎంతో జాగ్రత్త వహించారు. మోదీ గత ఎనిమిదేళ్ల పాలన అత్యద్భుతం. మోదీ అనేకమంది నాయకుల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ, అంబేడ్కర్ ముద్ర ఆయన పాలన శైలిలో సర్వత్రా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ‘భారతీయతే మన నిజమైన గుర్తింపు. బలమైన దేశ నిర్మాణం కోసం మనమంతా కుల, మత, జాతి భేదాలను పక్కకునెట్టి ముందడుగు వేయాలి’ అన్న మన భారతరత్న అంబేడ్కర్కు మోదీ నిజమైన వారసుడన్నది నా అభి ప్రాయం. అంబేడ్కర్ అడుగుజాడల్లో మన ప్రధాని ‘దేశమే ప్రథమం’ అనే నినాదాన్ని తారకమంత్రంగా స్వీకరించారు. మరోవైపు సుపరి పాలన, సామాజిక సమన్వయం, క్రమశిక్షణలనే విశిష్ట లక్షణాలతో ఆయన ప్రభుత్వం దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తోంది. (నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు) రామ్నాథ్ కోవింద్ (భారత మాజీ రాష్ట్రపతి) -
తప్పులు పట్టలేక టీడీపీ కులాల ప్రస్తావన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎటువంటి వివక్ష లేకుండా సామరస్యంతో కలిసిమెలిసి ఉంటున్న ప్రజల మధ్య కులం, మతం అంటూ విష బీజాలు నాటి పబ్బం గడుపుకోవాలని టీడీపీ చూస్తోందని వైఎస్సార్పీపీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో పాలక పక్షమైన వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రంలో కులమతాల చిచ్చు పెట్టాలని చూస్తున్నారని టీటీడీ నేత చంద్రబాబు అంటుంటే, ఆయన పుత్రరత్నం లోకేష్ ఒకడుగు ముందుకేసి సీఎం జగన్ పెత్తనం మొత్తం ఒక సామాజికవర్గానికి అప్పజెప్పారని రంకెలు వేయడం సిగ్గుచేటు అని బుధవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుపట్టడానికి కారణాలేవీ కనిపించని పచ్చ పార్టీ నేతలు కులం ప్రస్తావనతో ప్రభుత్వం పైన, సీఎం జగన్ పైన అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. టీడీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన పర్యటన అనుభవం పేరుతో ఏపీ రాజకీయాలకు కుల విశ్లేషణ జోడిస్తున్నారని అన్నారు. సీఎం కులం వారికే ఎక్కువ మేలు జరుగుతోందని అదే పార్టీకి చెందిన కొందరు నేతలంటుంటే.. జగన్ కులం వారూ అసంతృప్తితో ఉన్నారని బుచ్చయ్య వంటి వృద్ధ నేతలు వెల్లడించడం చంద్రబాబు పార్టీలోని గందరగోళానికి అద్దం పడుతోందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎలా వ్యవహరించాలో టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఎవరైనా అమరావతిలో శిక్షణ ఇస్తే ఐదు కోట్ల మంది ఆంధ్రులకు మేలు జరుగుతుందని విజయసాయిరెడ్డి హితవు పలికారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో విజయసాయిరెడ్డి భేటీ సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా రామ్నాథ్ కోవింద్తో భేటీ అయిన విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారి ప్రతిమను బహూకరించారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం మహాత్మాగాంధీ స్మృతి స్థల్ను సందర్శించిన విజయసాయిరెడ్డి గాంధీజీకి నివాళులర్పించారు. -
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు ప్రసంగం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జాతినుద్దేశించి వీడ్కోలు ప్రసంగం ఇచ్చారు రామ్నాథ్ కోవింద్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చాలా గొప్పగా ఉందన్నారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ సంస్కృతి నేటి యువతను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. 21వ శతాబ్దం భారత్దే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను కాన్పుర్ దేహాత్ జిల్లా పరౌఖ్ గ్రామంలోని పేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి చేరినట్లు కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రపతిగా తన శాయశక్తుల మేరకు బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపారు. తనకు సమాజంలోని అన్ని వర్గాలు, ముఖ్యంగా పార్లమెంటేరియన్లు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. సోమవారం ఆమె భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చదవండి: ఉద్ధవ్ థాక్రేకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు.. ఆయన తలరాత ఆ రోజే ఖరారైంది -
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 16వ రాష్ట్రపతి ఎన్నికల కోసం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. జూలై 25వ తేదీలోగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోనుంది. ఇక, ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు. నామినేటెడ్ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కులేదు. కాగా, పార్లమెంట్ ప్రాంగణం, రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ ప్రక్రియ జరగనుంది. రిట్నరింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరించనున్నారు. - ఇక, ఈనెల 15వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. - నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29. - నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జూలై 2. - జూలై 18న పోలింగ్, - జూలై 21వ తేదీన కౌంటింగ్ జరుగనుంది. బ్యాలెట్ విధానంలో రాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి కూడా ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. ఈసారి బ్రాహ్మణులకు రాష్ట్రపతి, ముస్లింలకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, అగ్రవర్ణాల నుంచి రేసులో సుమిత్రా మహాజన్, రాజ్నాథ్ సింగ్ ఉన్నట్టు సమాచారం. మైనార్టీ కోటాలో గులామ్ నబీ ఆజాద్, నఖ్వీ, అరిఫ్ మహ్మద్ ఖాన్ ఉన్నారు. ఎంపీ ఓటు విలువ 700 ఉండగా.. అత్యధికంగా యూపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,98,903 ఓట్లు ఉండగా.. బీజేపీకి 4,65,797, మిత్రపక్షాలకు 71,329 ఓటు ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకు 49 శాతం ఓట్లు ఉన్నాయి. యూపీఏకు 24.02 శాతం, ఇతర పార్టీలకు 26.98 శాతం ఓట్లు ఉన్నాయి. -
ఫ్యాక్టరీలో భారీ పేలుడు... 13 మంది మృతి
లక్నో: ఢిల్లీ సమీపంలోని యూపీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా.. ఆరుగురు గాయపడనట్లు తెలిపారు. ఈ ఘటన పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలోని ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 30 మంది ఇన్నారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు తాకిడికి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫ్యాక్టరీల పైకప్పులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఐతే ఈ ఫ్యాక్టరీకి ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కోసం లైసెన్స్ ఇస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం బాణసంచా తయారు చేస్తున్నామని చెబుతుండటం గమనార్హం. దీంతో పోలీసులు ఫ్యాక్టరీ యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ మేరకు ఈ ఘటనలో చనిపోయిన మృతుల పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు గల కారణాల గురించి ప్రత్యేక నిపుణులతో సత్వరమే విచారణ జరపించాలని ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. అంతేకాదు బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహయం అందించాలని ఆదిత్యనాథ్ జిల్లా పరిపాలనాధికారులను కోరారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు ఆన్లైన్లో తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: ఢిల్లీలో భానుడి భగభగలు... ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ) -
చిన్న ఫోటోగ్రాఫర్...అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతికే వ్యక్తిగత ఫోటోగ్రాఫర్గా
పావగడ: తాలూకాలోని ఓబుళాపుర గ్రామంలో ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన కృష్ణమూర్తి, నాగరత్నమ్మ దంపతుల కుమారుడు వై కే లోకనాథ్ ఫొటోగ్రఫీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగాడు. చిన్నపాటి ఫొటోగ్రాఫర్గా వృత్తిని ప్రారంభించిన ఆయన నేడు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వ్యక్తిగత ఫొటో గ్రాఫర్గా ఎదిగాడు. బెంగుళూరులో కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న అతని చిన్నాన్న ఎంసీ గిరీశ్ ప్రేరణతో ప్రభుత్వ చలనచిత్ర, జయచామరాజేంద్ర పాలిటెక్నిక్లో చేరారు. 1989లో డిప్లొమా పూర్తి చేశాడు. ప్రసార భారతి ఛానల్లో విధులు నిర్వహించాడు. తదనంతరం ఢిల్లీలో అడుగు పెట్టి ఛాయాగ్రహ వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి చివరకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ఛాయాగ్రాహకుడిగా ఎంపికయ్యాడు. రెండు దశాబ్దాల పాటు ప్రధాని కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆయన ఇటీవల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్గా రాష్ట్రపతి భవన్లో విధులు నిర్వహిస్తున్నాడు. అతని ఎదుగుదల పట్ల గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు హర్షం ప్రకటించారు. (చదవండి: ‘మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త’) -
రాష్ట్రపతి, సీజేఐతో ఏపీ గవర్నర్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను ఆయన రాష్ట్రపతికి వివరించారని సమాచారం. అంతకుముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, హోంమంత్రి అమిత్షాలను గవర్నర్ విడివిడిగా కలిశారు. సీజేఐను కలిసిన గవర్నర్.. అలాగే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కూడా గవర్నర్ హరిచందన్ కలిశారు. కాగా, ఈ నెల 22న ఢిల్లీ వచ్చిన గవర్నర్ 23వ తేదీన ప్రధాని మోదీని కలవగా, 24న నేషనల్ వార్ మెమోరియల్ను తన సతీమణితో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే. గవర్నర్ దంపతులు మంగళవారం ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్తారని సమాచారం. -
పద్మభూషణ్ అందుకున్న కృష్ణ ఎల్ల దంపతులు
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో సేవలు చేసినవారికి అందజేసే పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతిభవన్లో జరిగింది. మార్చి 21న తొలి విడతలో 54 మందికి అవార్డులు ఇవ్వగా.. సోమవారం 74 మందికి పురస్కారాలు అందజేశారు. అందులో నలుగురు తెలుగువారు ఉన్నారు. భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర ఎల్ల ఇద్దరికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేశారు. కూచిపూడి నాట్య కళాకారిణి గడ్డం పద్మజారెడ్డి, కోయ కళాకారుడు సకిని రామచంద్రయ్య కూడా పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం పద్మజారెడ్డి, రామచంద్రయ్య ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పద్మశ్రీ అవార్డు తనకు మహాశివుడు ఇచ్చిన వరమని, దీనిని తన నాట్య గురువు దివంగత శోభానాయుడుకు అంకితం చేస్తున్నానని పద్మాజారెడ్డి చెప్పారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆదివాసీ కథలే తనను ఈ స్థాయికి తెచ్చాయని సకిని రామచంద్రయ్య అన్నారు. (చదవండి: గూర్ఖాల్యాండ్ డిమాండ్ను వదిలిన మోర్చా) -
పద్మ అవార్డుల ప్రదానంలో ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా కేంద్రం దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి గాను మొత్తం 128 పద్మ పురస్కారాలను ప్రకటించగా.. అందులో నలుగురికి పద్మ విభూషణ్,17 మంది పద్మభూషణ్, 107 మంది పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. అయితే, ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. పద్మా పురస్కారాలను రామ్నాథ్ కోవింద్ గ్రహీతలకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అవార్డుల ప్రదానం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పద్మ శ్రీ అవార్డు అందుకునే ముందు 125 ఏళ్ల యోగా గురువు స్వామి శివానంద ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ సైతం ఆయనకు ప్రతి నమస్కారం చేశారు. ఈ సందర్భంగానే శివానంద.. రాష్ట్రపతికి కూడా పాదాభివందనం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి కోవింద్ ప్రేమతో పైకి లేపారు. మరోవైపు.. భారత తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించారు. ఈ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన కుమార్తెలు క్రితిక, తరణి స్వీకరించారు. కాగా, రాధే శ్యామ్ ఖేంకాకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించగా.. ఆయన కుమారుడు అవార్డును అందుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, పారాలింపిక్ రజత పతక విజేత దేవేంద్ర జఝారియా పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు. తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్కు చెందిన కిన్నెర మొగిలయ్య, తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనకర్త గరికపాటి నరిసింహారావులు పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. అయితే, విడతల వారీగా అవార్డుల ప్రదానం చేపట్టగా.. సోమవారం ఇద్దరికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. రెండో విడతలో అవార్డుల ప్రదానం మార్చి 28న జరగనుంది. #WATCH Swami Sivananda receives Padma Shri award from President Ram Nath Kovind, for his contribution in the field of Yoga. pic.twitter.com/fMcClzmNye — ANI (@ANI) March 21, 2022 -
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన ప్రధాని మోదీ
-
మన శక్తిని చాటిచెప్పారు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘సముద్ర జలాల్లో ఎదురవుతున్న సమస్యల్ని తిప్పికొట్టేందుకు స్నేహపూర్వక దేశాలతో కలిసి భారత నౌకాదళం రాజీలేని పోరాటం చేయాలి. హిందూ మహా సముద్రంలో ప్రధాన భద్రతా భాగస్వామిగా భారత్ వ్యవహరించాలి’ అని భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. విశాఖపట్నం సముద్ర జలాల్లో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి పాల్గొన్నారు. భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రయాణిస్తూ.. లంగరు వేసిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను ఆయన సమీక్షించారు. ‘‘70 శాతం నౌకలు స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. ఇది శుభపరిణామం. కోవిడ్ సమయంలో భారత నావికాదళం చేసిన సేవలు అమోఘం. స్నేహపూర్వక దేశాలకు అవసరమైన మందులను సముద్రసేతు, మిషన్ సాగర్ వంటి కార్యక్రమాల ద్వారా వారికి చేరవేసింది. వైజాగ్ అని పిలిచే విశాఖ నగరం అందమైన చారిత్రక నగరం. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుత సహకారం అందించింది’’ అని రాష్ట్రపతి కొనియాడారు. నౌకాదళంతో పాటు జాతినుద్దేశించి ప్రసంగించిన రామ్నా«థ్ కోవింద్ ఇంకా ఏమన్నారంటే.. ఆనందం కలిగించింది.. ఈరోజు మీతో కలిసి ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంది. నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, హెలికాప్టర్లు మొదలైన భారత నౌకాదళ సంపత్తి సామర్థ్యాన్ని సమీక్షించడం చాలా ఆనందం కలిగించింది. పీఎఫ్ఆర్ సందర్భంగా నిర్వహించిన విన్యాసాలు, కవాతు, ఇతర అంశాలన్నీ సముద్ర జలాల్లో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని, దేశానికి ఇండియన్ నేవీ అందిస్తున్న సేవల్ని ప్రతిబింబిస్తున్నాయి. అకస్మాత్తుగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారత నౌకాదళం ఎంత సంసిద్ధతతో ఉంటుందో ఇవి ప్రస్ఫుటిస్తున్నాయి. వైజాగ్.. ఓ అందమైన నగరం వైజాగ్.. అని పిలిచే విశాఖపట్నం అందమైన నగరం. శతాబ్దాల కాలంగా ముఖ్యమైన ఓడరేవుగా గుర్తింపు పొందింది. దేశాల మధ్య వాణిజ్య, వ్యాపారాలకు ఇది కీలక ప్రాంతం. ఆరో శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకూ పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థకు విశాఖపట్నం ముఖ్యమైన కేంద్రం. రానున్న రోజుల్లో కూడా ఇది కొనసాగాలి. ఇక్కడ ఏర్పాటైన తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఈ విషయాలన్నింటికీ సాక్షీభూతంగా ఉంది. 1971లో పాకిస్థాన్ యుద్ధ సమయంలో వైజాగ్ అద్భుతమైన సహకారం అందించింది. ఈ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘ది గోల్డెన్ స్వర్ణిమ్ విజయ్’ వేడుకలు ఇటీవలే ముగిశాయి. ఈ విజయోత్సవాలు తూర్పు నౌకాదళం పాటవాల్ని గుర్తుచేస్తుంటాయి. పాకిస్థాన్ జలాంతర్గామి ’ఘాజీ’ని సముద్రంలో జలసమాధి చేయడమనేది పాక్కు నిర్ణయాత్మక దెబ్బ. ఈ ఘటన తర్వాతే 1971 యుద్ధం దేశ చరిత్రలో అత్యంత బలమైన విజయాలలో ఒకటిగా నిలిచింది. నౌకాదళ సేవలు ప్రశంసనీయం సముద్ర భద్రతని పటిష్టపర్చుకుంటూ.. దేశంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, అందరికీ భద్రత కల్పించేందుకు నౌకాదళం దృష్టి కేంద్రీకరించాలి. మిత్ర దేశాలతో సహకార చర్యలు కొనసాగించాలి. ప్రపంచ వాణిజ్యంలో సింహభాగం శాసిస్తున్న హిందూ మహా సముద్ర ప్రాంతం భద్రతాపరంగా చాలా కీలకం. ఇక్కడ ఏ చిన్న సంఘటన ఎదురైనా సత్వరమే స్పందిస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్న భారత నౌకాదళ సేవలు ప్రశంసనీయం. ముఖ్యంగా.. కోవిడ్ కష్ట కాలంలో భారత నౌకాదళం అందించిన సేవలు శ్లాఘనీయం. ఔషధాలను సరఫరా చేయడంతోపాటు వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో కీలకంగా వ్యవహరించింది. హిందూ మహా సముద్రంలో ఏ సమస్య తలెత్తినా.. ‘ప్రాధాన్య భద్రతా భాగస్వామి’గానూ. ‘మొట్టమొదట స్పందించే దేశంగానూ భారత్ ముందు వరుసలో నిలబడాలని కాంక్షిస్తున్నాను. ఏపీ ప్రభుత్వానికి అభినందనలు ఇండియన్ నేవీ స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపుతో ముందంజలో ఉంటూ ఇటీవల కాలంలో తయారుచేస్తున్న యుద్ధ నౌకలు, జలాంతర్గాముల్లో 70 శాతం స్వదేశీ పరిజ్ఞానం ఉండటం భారత్ గర్వించదగ్గ విషయం. అణు జలాంతర్గాముల్నీ నిర్మిస్తున్నాం. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు తయారుచేస్తున్న అగ్రదేశాల సరసన భారత్ నిలవడం గర్వకారణం. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంతో ఇది సాధ్యమైంది. గతేడాది డిసెంబర్లో నా కొచ్చి పర్యటనలో ‘విక్రాంత్’ను పరిశీలించాను. ’ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణానికి ఇది నాంది పలుకుతోంది. ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక విన్యాసాల్ని నిరంతరం నిర్వహిస్తుండటం ద్వారా.. స్నేహపూర్వక దేశాలతో సత్సంబంధాలు పటిష్టం చేసుకుంటూ ఇంటర్ ఆపరేబిలిటీని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. సముద్ర సమస్యలను పరిష్కరించడానికి పరస్పర సహకార భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలి. ఈ విషయంలో త్వరలో నిర్వహించనున్న మిలాన్–2022 విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ చారిత్రాత్మకమైన విన్యాసాలకు ఆహ్వానం పలుకుతున్న భారత నౌకాదళాన్ని అభినందిస్తున్నాను. అలాగే, పీఎఫ్ఆర్, మిలాన్–2022 వేడుకల్ని ఘనంగా నిర్వహించే విషయంలో పూర్తి సహకారం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాను. పీఎఫ్ఆర్ విజయవంతం చేసేందుకు మద్దతు పలికిన జిల్లా అధికారులు, విశాఖ ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు ఎంతో సంతృప్తినిచ్చింది. భారత నౌకాదళాన్ని చూసి దేశం గర్విస్తోంది. భారతదేశ జాతీయ ప్రయోజనాలను పరిరక్షిస్తున్న భారత నౌకాదళానికి శుభాకాంక్షలు చెబుతున్నాను.. అంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తన ప్రసంగాన్ని ముగించారు. -
ఉప్పొంగిన తూర్పుతీరం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారతదేశ నౌకాదళ శక్తి సామర్థాల్ని చూసి సంద్రం ఉప్పొంగింది. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశ రక్షణ విషయంలో అగ్రరాజ్యాలతో పోటీపడుతూ.. తన పాటవాన్ని భారత నౌకాదళం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. సమరానికి ఏ క్షణమైనా సన్నద్ధమంటూ సంద్రంలో సవాల్ చేస్తూ నాలుగు వరుసల్లో నిలుచున్న యుద్ధ నౌకలు.. త్రివర్ణ పతాకానికి సగర్వంగా సెల్యూట్ చేస్తూ శత్రు సైన్యాన్ని జలసమాధి చేసేందుకు సిద్ధమంటూ సబ్మెరైన్లు.. గాలికంటే వేగంగా దూసుకెళ్తూ మిగ్ విమానాలు హోరెత్తించాయి. గగన తలంలో దేశ గర్వానికి ప్రతీకలుగా యుద్ధ విమానాల విన్యాసాలు.. సముద్ర కెరటాలతో పోటీపడుతూ చేతక్ హెలికాప్టర్లు అలరించాయి. యుద్ధమైనా, సహాయమైనా క్షణాల్లో వాలిపోతామంటూ మెరైన్ కమాండోలు చేసిన విన్యాసాలు.. వెరసి భారత నౌకాదళ సర్వ సంపత్తి ఒకేచోట చేరి నిర్వహించిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ప్రపంచ దేశాలు మొత్తం విశాఖ వైపు చూసేలా చేసింది. మొత్తంగా త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నిర్వహించిన భారత యుద్ధ నౌకల సమీక్ష ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్–2022) ఆద్యంతం ఆకట్టుకుంది. గౌరవ వందనం భారతదేశ చరిత్రలో ఇది 12వ ఫ్లీట్ రివ్యూ. దేశ తూర్పు తీరంలో మూడో సమీక్షగా విశాఖలో జరుగుతున్న పీఎఫ్ఆర్ సోమవారం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి హార్బర్కు రాకముందు 150 మంది సెయిలర్స్ గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. 9 గంటలకు రాష్ట్రపతి హార్బర్ చేరుకున్నారు. ఈయనకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, నాలుగు నౌకాదళ కమాండ్ల చీఫ్లు వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా, వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, వైస్ అడ్మిరల్ హంపిహోలి, లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ్ తదితరులు స్వాగతం పలికారు. ముందుగా 21 తుపాకులతో భారత నౌకాదళం సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్రపతి.. ప్రెసిడెన్షియల్ యాచ్గా సిద్ధంగా ఉన్న ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధనౌకలో సతీసమేతంగా సమీక్షకు బయలుదేరారు. నౌక ముందుభాగంలో ప్రత్యేకంగా సిద్ధంచేసిన డెక్పై రాష్ట్రపతి దంపతులు ఆశీనులు కాగా.. రెండువైపులా రక్షణ మంత్రి, గవర్నర్, నౌకాదళాధిపతి కూర్చున్నారు. నౌకాదళ గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్. చిత్రంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నౌకాదళాధిపతి హరికుమార్ నౌకాదళ పాటవాల్ని సమీక్షించిన రాష్ట్రపతి ఈ ఏడాది పీఎఫ్ఆర్కు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సమన్వయకర్తగా వ్యవహరించారు. రాష్ట్రపతిని తీసుకుని ప్రెసిడెన్షియల్ యాచ్ ఐఎన్ఎస్ సుమిత్ర ముందుకు సాగుతుండగా.. సుమిత్ర కాన్వాయ్గా ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ సావిత్రి, టాంగో–39, టాంగో–40 యుద్ధనౌకలు బయల్దేరాయి. బంగాళాఖాతం సముద్ర జలాల్లో నాలుగు వరుసల్లో లంగరు వేసిన యుద్ధనౌకల మధ్యగుండా సాగుతూ వాటిపై నుంచి నౌకాదళ సిబ్బంది సమర్పించిన గౌరవ వందనాన్ని త్రివిధ దళాధిపతి స్వీకరించారు. యుద్ధ నౌకల సిబ్బంది ప్రతి వార్ షిప్ ముందు నిల్చుని టోపీలని చేతితో తిప్పుతూ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. మొత్తం షిప్లను సమీక్షించిన తర్వాత సబ్మెరైన్ కాలమ్లో ఉన్న ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ సింధుకీర్తి, ఐఎన్ఎస్ సింధురాజ్ జలాంతర్గాముల్ని ఆయన సమీక్షించారు. అబ్బురపరిచిన విన్యాసాలు ఇక రెండు గంటలకు పైగా సాగిన నౌకాదళ సమీక్షలో ఇండియన్ నేవీ.. తన సామర్థ్యాల్ని ఘనంగా ప్రదర్శించింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన చేతక్ హెలికాప్టర్లతో పాటు సీకింగ్స్, కామోవ్, యుటిలిటీ హెలికాఫ్టర్ (యూహెచ్)–త్రీహెచ్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఎఎల్హెచ్)లతో పాటు డార్నియర్స్, మిగ్–29కే, హాక్స్, మల్టీ మిషన్ మేరీటైమ్ ఎయిర్క్రాఫ్టŠస్ పీ8ఐ, ఐఎల్ 38 మొదలైన యుద్ధ విమానాలు నిర్వహించిన విన్యాసాలు ఉత్కంఠగా సాగాయి. యుద్ధ నౌకల సమీక్ష అనంతరం ఒకేసారి అన్ని ఎయిర్క్రాఫ్ట్లు గాల్లోకి దూసుకుపోతూ ఫ్లై పాస్ట్ నిర్వహించాయి. ఈ యుద్ధ విమానా విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఈ సందర్భంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల డెమోతో మెరైన్ కమాండోలు నిర్వహించిన వాటర్ పారా జంప్స్, విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తపాలా బిళ్ల విడుదల చేసిన రాష్ట్రపతి ప్రతి పీఎఫ్ఆర్ లేదా ఐఎఫ్ఆర్ నిర్వహించిన తర్వాత దాని పేరుతో పోస్టల్ స్టాంప్, కవర్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం పీఎఫ్ఆర్–2022 జ్ఞాపకార్థం తపాలా శాఖ రూపొందించిన స్టాంప్, పోస్టల్ కవర్ని నేవల్ బేస్లో రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర కమ్యునికేషన్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ జె చౌహాన్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత నౌకాదళ శక్తి పాటవాలను సమీక్షించేందుకు సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేరుకున్నారు. ఆదివారం ఆయనకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం (21వ తేదీ) విశాఖలో జరగనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్)లో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగకు చేరుకున్నారు. అంతకుముందే విశాఖకు చేరుకున్న గవర్నర్, సీఎంలు ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం 6.25 గంటలకు సీఎం జగన్ తాడేపల్లికి బయలుదేరారు. విశాఖ తీరంలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు సందడి చేస్తున్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పీఎఫ్ఆర్లో ప్రెసిడెన్షియల్ యాచ్గా ఉన్న ఐఎన్ఎస్ సుమిత్ర నుంచి మొత్తం 60 యుద్ధనౌకలను త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి సమీక్షించనున్నారు. చివరిగా భారతీయ నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ ఏకకాలంలో పైకి ఎగిరి రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తాయి. పీఎఫ్ఆర్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఏపీ గవర్నర్, అండమాన్ నికోబార్ లెఫ్ట్నెంట్ గవర్నర్ పాల్గొంటున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కన్నబాబు, మేకతోటి సుచరిత, ముత్తంశెట్టి శ్రీనివాస్, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి ఉన్నారు. ‘ఐఎన్ఎస్ విశాఖ’కు అరుదైన గౌరవం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారై మొదటిసారిగా విశాఖకు వచ్చిన ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకకు అరుదైన గౌరవం దక్కనుందని తెలుస్తోంది. పీఎఫ్ఆర్ ప్రారంభమైన వెంటనే ప్రెసిడెన్షియల్ యాచ్ నుంచి బయలుదేరనున్న రాష్ట్రపతి తొలుత ఈ యుద్ధ నౌక వద్దకు చేరుకుంటారు. అక్కడ నౌకాదళ అధికారులు, సిబ్బంది రాష్ట్రపతికి గౌరవ వందనం చేస్తారు. ఈ నౌకను గతేడాది నవంబర్ 21న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ జాతికి అంకితం చేశారు. ప్రాజెక్ట్–15బి పేరుతో పూర్తి దేశీయంగా నాలుగు స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలను తయారు చేయాలన్న భారత నౌకాదళ నిర్ణయంలో భాగంగా ఈ నౌకను తయారు చేశారు. 2013లోనే ఈ నౌక తయారీ పనులను ముంబయిలో ప్రారంభించారు. ఈ యుద్ధ నౌక క్షిపణులను తీసుకెళ్లడమే కాకుండా మిసైల్ డిస్ట్రాయర్గా సేవలందించనుంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళం పరిధిలో చేరింది. దీంతో పాటు వివిధ నావికాదళాల 60 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు పీఎఫ్ఆర్లో పాలుపంచుకుంటున్నాయి. ప్రధానంగా ముంబయి కేంద్రంగా ఉన్న పశ్చిమ నావికాదళం నుంచి ఐఎన్ఎస్ చెన్నై, అండమాన్ నికోబార్ కమాండ్ నుంచి ఐఎన్ఎస్ ఢిల్లీ, విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళం నుంచి ఐఎన్ఎస్ సాయద్రీ, కొచ్చి కేంద్రంగా ఉన్న దక్షిణ నావికాదళం నుంచి ఐఎన్ఎస్ సాపుత్ర పాల్గొంటున్నాయి. శివాలిక్ క్లాస్ కింద ఉన్న 4 నౌకలు, కమోర్టా క్లాస్లో ఉన్న 3 నౌకలు, చేతక్, ఏఎల్హెచ్, సీ కింగ్స్ హెలికాప్టర్స్తో పాటు కామోవ్స్, డార్నియర్స్, ఐఎల్–38ఎస్డీ, పీ8ఐ, హాక్స్, మిగ్ 29 కే యుద్ధ విమానాలు కూడా పీఎఫ్ఆర్లో విన్యాసాలు చేయనున్నట్టు భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ వెల్లడించారు. పీఎఫ్ఆర్కు సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. కాగా, ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకపై నుంచే ఈ నెల 18న బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించిన విషయం తెలిసిందే. -
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు స్వాగతం పలికిన సీఎం జగన్
అప్డేట్స్: ► రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ తిరుగు పయనమయ్యారు. రాష్ట్రపతి ఐఎన్ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకుంటారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొంటారు. ► విశాఖ ఎయిర్పోర్టు నుంచి రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్కు స్వాగతం పలికేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐఎన్ఎస్ డేగాకు బయల్దేరారు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఘనస్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్కు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి అవంతి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి స్వాగతం పలికారు. విశాఖపట్నంలో సోమవారం జరిగే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(పీఎఫ్ఆర్) కార్యక్రమానికి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. ఐఎన్ఎస్ డేగాలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తరువాత సీఎం వైఎస్ జగన్ తిరుగు పయనమవుతారు. అనంతరం రాష్ట్రపతి ఐఎన్ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకోనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొంటారు. -
నేడు విశాఖకు రాష్ట్రపతి
-
త్రివిధ దళాధిపతీ అందుకో వందనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత త్రివిధ దళాధిపతికి నావికా దళం వందనానికి సర్వ సన్నద్ధమైంది. సముద్రంలో బారులు తీరిన యుద్ధ నౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ సాగర తీరం సందడి చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ థీమ్తో భారత నావికాదళ సేవలు, పరాక్రమం ఉట్టిపడేలా సోమవారం (21న) 12వ ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్) అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నౌకా దళ సామరధ్యన్ని సమీక్షిస్తారు. ఇందుకోసం రాష్ట్రపతి ఆదివారం సాయంత్రం 5.20 కు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు చేరుకొంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తూర్పు నావికా దళం అధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా ఆయనకు సాదర స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ఆదివారం రాత్రి తూర్పు నావికా దళం (ఈఎన్సీ) ప్రధాన కార్యాలయంలో బస చేస్తారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఫ్లీట్ రివ్యూ మొదలవుతుంది. 21 గన్లతో రాష్ట్రపతికి సెల్యూట్ చేయడంతో కార్యక్రమం ప్రారంభమై, 11.45 గంటల వరకూ జరుగుతుంది. ఈ రివ్యూలో నావికాదళంతో పాటు కోస్ట్గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ), మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన సుమారు 60 నౌకలు, నౌకా దళం జలాంతర్గాములు, 50కి పైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు పాల్గొంటాయి. 10 వేల మంది నావికాదళ అధికారులు, సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు పీఎఫ్ఆర్ గ్రూపు ఫోటో దిగడంతో పాటు తపాలా బిళ్లను, పోస్టల్ కవర్ను రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. 22వ తేదీ ఉదయం 10.20 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. వేడుకలు ఇలా.. త్రివిధ దళాలకు అధిపతి హోదాలో భారత రాష్ట్రపతి తన పదవీకాలంలో యుద్ధ నౌకలను సమీక్షించే కార్యక్రమమే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ. విశాఖ తీరంలో 44 యుద్ధ నౌకలను ఒక్కో వరుసలో 11 చొప్పున నాలుగు వరుసల్లో నిలిపి ఉంచారు. వీటిని విశాఖ బీచ్ నుంచి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ ప్రజలు కూడా వీక్షించవచ్చు. రాత్రి సమయంలో యుద్ధ నౌకలు విద్యుద్దీపాలంకరణతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి నౌకాదళ సమీక్ష కోసం ఐఎన్ఎస్ సుమిత్ర నౌకను ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. ప్రెసిడెంట్ యాచ్గా పిలిచే ఈ నౌక డెక్పై రాష్ట్రపతి ఆశీనులవుతారు. ఆయన పక్కన అశోక చక్ర ఎంబ్లమ్ కూడా ఉంటుంది. ఇదే యాచ్లో వేడుకల్లో పాల్గొనే కేంద్ర మంత్రులు, రాష్ట్రాల గవర్నర్లు కూడా ఆశీసులయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి అధిరోహించిన ఐఎన్ఎస్ సుమిత్ర తమ చెంతకు రాగానే ఒక్కో యుద్ధనౌకలో ఉన్న నౌకా దళాల అధికారులు, సిబ్బంది టోపీలను చేతిలో ఉంచుకుని తిప్పుతూ గౌరవ వందనం సమర్పిస్తారు. చివరగా నౌకా దళ యుద్ధ విమానాలు ఏకకాలంలో పైకి ఎగురుతూ.. రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తాయి. అనంతరం సెయిలర్స్ పరేడ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వాటర్ ఫ్రంట్ యాక్టివిటీస్, సముద్రంలో యుద్ధ విన్యాసాలు, సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్, హాక్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా ఏరోబాటిక్స్, మార్కోస్ నిర్వహించే వాటర్ పారాజంప్ వంటి విన్యాసాల్ని రాష్ట్రపతి తిలకిస్తారు. అనంతరం గ్రూప్ ఫొటో దిగుతారు. తపాలా బిళ్ల, పోస్టల్ కవర్ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవ్సిన్హ్ జె చౌహాన్, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి కూడా పాల్గొంటారు. విశాఖ కేంద్రంగా మూడోసారి గతంలో విశాఖ కేంద్రంగా ఒక ఫ్లీట్ రివ్యూ, ఒక అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగాయి. 2006లో తొలిసారి పీఎఫ్ఆర్ జరిగింది. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భారత నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షించారు. అనంతరం 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) జరిగింది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. ఇప్పుడు జరుగుతున్నది రెండో పీఎఫ్ఆర్. భారత దేశంలో మొదటి ఫ్లీట్ రివ్యూ 1953 అక్టోబరు 19న ముంబైలో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పటివరకు 11 పీఎఫ్ఆర్లు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నది 12వ ఫ్లీట్ రివ్యూ. -
రాష్ట్రపతి పర్యటనలో మార్పులు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ విశాఖ పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 20వ తేదీ మ.1.45 గంటలకు రావాల్సి ఉంది. కానీ, సా.5.30కు విశాఖ ఐఎన్ఎస్ డేగాలోని నేవల్ ఎయిర్ స్టేషన్కు చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్ (చోళా సూ ట్)కి వెళ్లి బసచేస్తారు. 21న ఉదయం నేవల్ డాక్ యార్డుకు చేరుకుని గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత 9గంటల నుంచి 11.45 వరకు జరిగే ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. మ.12.15 గంటల నుంచి పీఎఫ్ఆర్ గ్రూప్ ఫొటో సెషన్లో.. అనంతరం విందులో పాల్గొంటారు. 22న ఉ.10.20 గంటలకు విమానంలో ఢిల్లీకి బయల్దేరుతారు. అలాగే, రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా ఈనెల 20న మ.3.10కి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని నోవోటెల్ హోటల్కు వెళ్తారు. సా.5.05 నిమిషాలకు ఐఎన్ఎస్ డేగాలోని నేవల్ ఎయిర్ స్టేషన్కు చేరుకుని రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. తిరిగి నోవోటెల్కు వచ్చి రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక 21న ఉదయం రాష్ట్రపతితో కలిసి పీఎఫ్ఆర్లో.. మధ్యాహ్నం ఫొటో కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అనంతరం రాష్ట్రపతితో కలిసి విందుకు హాజరవుతారు. అక్కడ నుంచి నవోటెల్కు చేరుకుంటారు. 22న ఉ.10.20కి రాష్ట్రపతికి వీడ్కోలు పలుకుతారు. అనంతరం ప్రత్యేక విమానంలో గవర్నర్ తిరిగి విజయవాడ వెళ్తారు. -
రవిదాస్ దేవాలయంలో ప్రార్థనలు చేసిన మోదీ
Modi offered prayers at Guru Ravidas Vishram Dham Mandir: ప్రధాని నరేంద్ర మోదీ గురు రవిదాస్ జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని కరోల్ బాగ్లోని రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్లో ప్రార్థనలు చేశారు. ఆయన భక్తులతో మమైకమై ఆలయంలో 'షాబాద్ కీర్తన'లో పాల్గొన్నారు. సందర్శకుల పుస్తకంలో కూడా గురు రవిదాస్ జీవితం అందరికీ ఆదర్శమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పలు ఫోటోలు, వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ట్విట్టర్లో ...."రవిదాస్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. సాధువు చూపిన మార్గాన్ని అనుసరించి సమానత్వం, సామరస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి మనమందరం సహకరిద్దాం" అని ట్వీట్ చేశారు. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా రవిదాస్ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సెలవు ప్రకటించింది. గురు రవిదాస్ 15 లేదా 16వ శతాబ్దపు భక్తి ఉద్యమకారుల్లో ఒకరు. అతని శ్లోకాలు గురు గ్రంథ్ సాహిబ్లో ప్రముఖంగా ఉంటాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ పౌర్ణమిని గురుదాస్ జయంతిగా జరుపుకుంటారు. గురు రవిదాస్ లింగ లేదా కులం ఆధారంగా చేసే విభజనను వ్యతిరేకించారు. లింగ సమానత్వం కోసం కృషి చేశారు. అంతేకాదు రవిదాస్ని ప్రముఖ భక్తి ఉద్యమ కవయిత్రి మీరా బాయికి ఆధ్యాత్మిక మార్గదర్శి అని కొందరు అంటుంటారు. Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg — Narendra Modi (@narendramodi) February 16, 2022 (చదవండి: మోడల్గా మారిన 60 ఏళ్ల కూలీ!) -
20న రాష్ట్రపతి విశాఖ రాక
సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ విశాఖ పర్యటన ఖరారైంది. ఈనెల 20 నుంచి రెండ్రోజుల పాటు విశాఖలో ఆయన పర్యటిస్తారు. 20న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.35 గంటలకు విశాఖ చేరుకుంటారు. అనంతరం నేవల్ ఎయిర్ స్టేషన్కు చేరుకుని ప్రెసిడెన్షియల్ సూట్ (చోళా సూట్)కి వెళ్తారు. అక్కడ రాష్ట్రపతి రాత్రి బస చేస్తారు. 21న ఉదయం నేవల్ డాక్యార్డుకు చేరుకుని ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. మధ్యాహ్నం పీఎఫ్ఆర్ గ్రూప్ ఫొటో కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.45గంటల వరకు రాష్ట్రపతి విందులో పాల్గొంటారు. 22వ తేదీ ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. పీఎఫ్ఆర్, మిలాన్లకు భారీ భద్రత విశాఖ వేదికగా జరగనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్), మిలాన్–2022 కార్యక్రమాలకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లుచేస్తున్నారు. దీనిపై ఆదివారం నగర పోలీస్ కమిషనరేట్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ అధ్యక్షతన నేవీ ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులుతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, పలువురు కేంద్ర మంత్రులతో పాటు ప్రముఖులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు, నిర్వాహణపై డీజీపీ చర్చించారు. ఈరెండు కార్యక్రమాలకు ఎటువంటి అవరోధాలు లేకుండా విజయవంతం చేయాలని సూచించారు. -
సమతను చాటే భవ్యక్షేత్రం
సాక్షి, హైదరాబాద్: వెయ్యేళ్ల కింద సమానత్వ భావనతో సామాజిక పరివర్తన దిశగా శ్రీరామానుజాచార్యులు వేసిన అడుగును బలోపేతం చేసే దిశగా ఆయన విరాట్మూర్తితో భవ్యక్షేత్రంగా అవతరించిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం చైతన్యం నింపుతుందని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. అత్యద్భుతంగా రూపొందించిన ఈ కేంద్రం దేశంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందని పేర్కొన్నారు. జాతి నిర్మాణంలో కీలకమైన వసుదైక కుటుంబం స్ఫూర్తిని రామానుజుల ఆలోచనలు ప్రతిబింబిస్తాయని, జాతి కల్యాణంలో ఇప్పుడు రామానుజుల స్ఫూర్తి కేంద్రం కూడా ఆ పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం ముచ్చింతల్లోని రామానుజుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 120 కిలోల బంగారంతో రూపొందిన 54 అంగుళాల శ్రీరామానుజాచార్యుల స్వర్ణమయ మూర్తిని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ లోకార్పణం చేశారు. అనంతరం రాష్ట్రపతి దంపతులు, వారి కుమార్తె తొలి పూజ నిర్వహించారు. అనంతరం ప్రవచన కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో రాష్ట్రపతి మాట్లాడుతూ రామానుజుల భవ్యక్షేత్రాన్ని అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించి చినజీయర్ స్వామి చరిత్ర సృష్టించారని కొనియాడారు. రామానుజుల స్వర్ణమయ మూర్తిని జాతికి అంకితం చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. 1035 కుండాలతో నిర్వహించిన లక్ష్మీనారాయణ హోమం, 108 దివ్యదేశాల ప్రాణప్రతిష్టతో ఈ మహా క్షేత్రానికి గొప్ప ఆధ్యాత్మిక శోభ ఏర్పడిందని అన్నారు. స్ఫూర్తికేంద్రం సమతాభూమి... సమానత్వం కోసం పరితపించిన శ్రీరామానుజాచార్యులు వెలసిన ఈ క్షేత్రాన్ని తాను భక్తి భూమి, సమతాభూమి, విశిష్టాద్వైతాన్ని సాక్షాత్కరింపజేసే భూమిగా, దేశ సంస్కారాన్ని తెలిపే భూమిగా భావిస్తున్నట్లు రాష్ట్రపతి తెలిపారు. వందేళ్లను మించిన తన జీవనయాత్రతో భారతీయ ఆధ్యాత్మిక, సామాజిక భావనకు కొత్త రూపమిచ్చిన రామానుజులు, సామాజిక భేదభావాలకు అతీతంగా దేవుడిని అందరి దరికి చేర్చి భక్తిప్రపత్తి, తాత్వికతను సామాజిక జీవన సౌందర్యంతో జోడించి కొత్త భాష్యం చెప్పారని కీర్తిం చారు. తక్కువ కులం వారుగా ముద్రపడ్డ వ్యక్తులు చేసిన రచనలను ఆయన వేదంగా గౌరవించారన్నారు. రామానుజులు దక్షిణాది నుంచి భక్తిధారను ఉత్తరాదికి ప్రవహింపజేసి ఎందరో ముక్తి పొందేలా చేశారని కోవింద్ పేర్కొన్నా రు. వారిలో ఎంతోమంది తక్కువ జాతిగా ముద్రపడ్డ వారేనని రాష్ట్రపతి తెలిపారు. రామానుజుల తత్వంతో అంబేడ్కర్... ‘రామానుజ తత్వంతో ప్రేరణ పొందిన కబీర్పంత్ను అనుసరించిన అంబేడ్కర్ కుటుంబీకులు జీవించిన మహారాష్ట్రలోని వారి గ్రామాన్ని నిన్న సందర్శించా. ఈరోజు శ్రీరామనగరంలోని ఈ క్షేత్రంలో ఉన్నా. ఈ రెండూ పవిత్ర తీర్థ స్థలాలుగానే నాకు అనిపిస్తాయి. అప్పట్లో సమత మంత్రంగా రామానుజులు పరివర్తన కోసం పరితపిస్తే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయం కోసం పనిచేశారు. రామానుజుల తత్వాన్ని అంబేడ్కర్ కూడా ప్రస్తుతించారు. మనలో ఇమిడి ఉన్న వసుదైక కుటుంబానికి ఈ సమతనే ప్రేరణ’అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. అన్ని వర్గాల పురోగతి అనే భావన రామానుజులు ప్రతిపాదించిన విశిష్టాద్వైతంలోని భక్తిభావంలో ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. రామానుజుల సమానత్వ స్ఫూర్తిని మహాత్మాగాంధీ అనుసరించారని, జైలువాసంలో ఉన్నప్పుడు ఆయన రామానుజుల చరిత్రను చదివి ఎంతో ప్రేరణ పొందారని గుర్తుచేశారు. స్వామి వివేకానందపై కూడా రామానుజుల ప్రభావం ఎంతో ఉందని, ఆయన రచనల్లో రామానుజులను గుర్తుచేశారని అన్నారు. సమతా స్ఫూర్తి కేంద్రం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. చిత్రంలో ఆయన సతీమణి సవిత, గవర్నర్ తమిళిసై, చినజీయర్ స్వామి, మంత్రి తలసాని, మైహోం రామేశ్వరరావు భారీ ప్రతిమ... దేశ ఆధ్యాత్మిక వైభవానికి చిహ్నం ఓ శ్లోక తాత్పర్యం ప్రకారం విష్ణువుకు సోదరులుగా వివిధ కాలాల్లో పుట్టిన వారి ప్రస్తావన ఉందని రాష్ట్రపతి గుర్తుచేశారు. దాని ప్రకారం తొలుత ఆదిశేషుడిగా, త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపర యుగంలో బలరాముడిగా, కలియుగంలో రామానుజులుగా అవతరించారని అందులో ఉన్నట్లు ఆయన తెలిపారు. కలియుగంలో ముక్తి మార్గాలు మూసుకుపోయినప్పుడు రామానుజులు భక్తి, ముక్గి మార్గాన్ని చూపిన తీరును అన్నమాచార్యులు పలు కీర్తనల్లో ప్రస్తావించారన్నారు. పంచ లోహాలతో రూపొందిన రామానుజుల విరాట్మూర్తిని చూస్తే అది ఒక విగ్రహం మాత్రమే కాదని, దేశ సంప్రదాయ వైభవానికి ప్రతిరూపమని, సామాజిక సమానత్వ భావనను సాకారం చేసే కలకు నిలువెత్తు రూపమని, దేశ ఆధ్యాత్మిక వైభవానికి చిహ్నమని కోవింద్ కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి దంపతులను శాలువా, రామానుజుల జ్ఞాపికతో చినజీయర్ స్వామి సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రామానుజుల సహస్రాబ్ది సమారోహం ప్రతినిధులు జూపల్లి రామేశ్వరరావు, ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముచ్చింతల్ కు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్
-
నౌకా విన్యాసాలకు సర్వం సన్నద్ధం
సాక్షి, విశాఖపట్నం: మరికొద్ది రోజుల్లో నగరంలో జరగనున్న రెండు భారీ నౌకాదళ విన్యాసాలకు విశాఖపట్నం వేదిక కాబోతోంది. ఇందుకోసం సాగర తీరం సర్వహంగులతో సన్నద్ధమవుతోంది. ఈనెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, 25 నుంచి మార్చి 4 వరకు మిలాన్–2022 అంతర్జాతీయ నావికా విన్యాసాలతో విశాఖ అంతర్జాతీయ పటంలో మరోసారి మెరుపులు మెరిపించనుంది. ఈ నేపథ్యంలో.. భారత నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే విన్యాసాల కోసం విశాఖ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఫ్లీట్ రివ్యూ ఎందుకంటే.. 1971లో పాకిస్తాన్లోని కరాచీ పోర్టుపై దాడిచేసి విజయపతాక ఎగురవేసిన చరిత్ర ఈ దళానిది. అప్పటి నుంచి భారతీయ నౌకాదళంలో ఈఎన్సీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. అందుకే ప్రధాన విన్యాసాలకు కేంద్రంగా.. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలకు వేదికగా విశాఖ నిలుస్తోంది. 2006లో మొదటిసారిగా ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ నిర్వహించి సత్తాచాటిన విశాఖ నగరం.. 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూతో ప్రపంచమంతా నగరం వైపు చూసేలా కీర్తి గడించింది. ఇప్పుడు రెండో పీఎఫ్ఆర్తో మొట్టమొదటిసారిగా మినీ ఐఎఫ్ఆర్గా పిలిచే మిలాన్–2022కి ముస్తాబవుతోంది. 20న రాష్ట్రపతి రాక ఈనెల 21న జరిగే పీఎఫ్ఆర్ కోసం 20వ తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విశాఖకు చేరుకోనున్నారు. ఆయనకు సీఎం వైఎస్ జగన్తో పాటు ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్వజిత్దాస్ గుప్తా సాదర స్వాగతం పలుకుతారు. ఈఎన్సీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రపతి బసచేస్తారు. 21న ఉ.9 గంటలకు ఫ్లీట్ రివ్యూ మొదలుకానుంది. 11.45 వరకూ జరిగే ఈ రివ్యూలో నేవీతో పాటు కోస్ట్గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన సుమారు 60 నౌకలతోపాటు సబ్ మెరైన్లు, 50కిపైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లని నాలుగు వరుసల్లో నిలుపుతారు. వీటిని త్రివిధ దళాధిపతి అయిన రాష్ట్రపతి యుద్ధనౌకలో నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షిస్తారు. చివరిగా భారతీయ నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ ఏకకాలంలో తమ గౌరవ వందనాన్ని అందజేసేందుకు పైకి ఎగురుతూ రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తాయి. అనంతరం పీఎఫ్ఆర్కు సంబంధించిన తపాలా బిళ్లని, పోస్టల్ కవర్ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. 25 నుంచి మిలాన్ మెరుపులు.. ఇక పీఎఫ్ఆర్ తర్వాత.. 25వ తేదీ నుంచి వివిధ దేశాల నౌకాదళాల మధ్య స్నేహపూర్వక సత్సంబంధాలను బలోపేతం చేసేలా మిలాన్–2022 విన్యాసాలు ప్రారంభమవుతాయి. మార్చి 4 వరకూ జరిగే ఈ విన్యాసాల్లో 46కి పైగా దేశాల నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటాయి. నిజానికి.. 1995లో మిలాన్ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2014లో 17 దేశాలు పాల్గొని అతిపెద్ద ఫ్లీట్ రివ్యూగా చరిత్రకెక్కింది. 27న ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మరోవైపు.. 25న అన్ని దేశాలకు చెందిన ప్రతినిధులు విశాఖ చేరుకుంటారు. 26న కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్సింగ్ అధికారికంగా మిలాన్ విన్యాసాల్ని ప్రారంభిస్తారు. ► 27, 28 తేదీల్లో అంతర్జాతీయ మారీటైమ్ సెమినార్ జరుగుతుంది. ఈ సదస్సులో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డా. ఎస్ జయశంకర్ హాజరవుతారు. ► 27 సా.4.45కు విశాఖ బీచ్రోడ్డులో జరిగే ఆపరేషనల్ డిమాన్స్ట్రేషన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ► ఈ సందర్భంగా యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖని సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేస్తారు. షెడ్యూలు, ఏర్పాట్లు ఇలా.. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ: ఫిబ్రవరి 21 మిలాన్–2022 ప్రారంభం: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్: ఫిబ్రవరి 27 సా.4.45 నుంచి ముఖ్య అతిథి: సీఎం వైఎస్ జగన్ పాల్గొనే దేశాలు: సుమారు 46 విదేశీ అతిథులు: 900 మంది ఆతిథ్యానికి సిద్ధంచేసిన హోటళ్లు: 15 బందోబస్తుకు సిద్ధంచేసిన పోలీస్ సిబ్బంది: 5,000 హాజరయ్యే వారు: సుమారు 2 లక్షలు కేటాయించిన మొత్తం: రూ.22.27 కోట్లు తిలకించేందుకు ఏర్పాట్లు: 25 వీడియో సిస్టమ్లు, బీచ్రోడ్లో 3 కిమీ మేర 40 ఎల్ఈడీ స్క్రీన్లు బీచ్రోడ్డులో జరిగే కార్యక్రమాలు: గరగల డ్యాన్స్, కూచిపూడి నృత్యాలు తదితర సంప్రదాయ నృత్యాలు స్టాల్స్: ఏటికొప్పాక బొమ్మలు, పొందూరు ఖద్దరుతో పాటు 13 జిల్లాల్లోని ప్రసిద్ధమైన వస్త్రాల స్టాల్స్ విదేశీ అతిథులకు తెలుగు రుచులు: ఆంధ్ర పిండి వంటలు, రాయలసీమ రుచులు, కృష్ణా గుంటూరు వంటకాలు. మాడుగుల హల్వా, నాటుకోడి కూర, గుత్తివంకాయ, రాయలసీమ రాగిసంకటి, నెల్లూరు చేపల పులుసు, రొయ్యల వేపుడు, కాకినాడ కాజాలు, బొంగు బిర్యానీ మొదలైనవి. విదేశీయులకు ఇచ్చే బహుమతులు: ఏటికొప్పాక బొమ్మలు, రాజమండ్రి రత్నం పెన్నులు, ఇతర కళాఖండాలు. -
హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు న్యాయవాదుల పేర్లను సిఫారసు చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ఆమోద ముద్ర వేశారు. కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయన సుజాతలను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం ఉదయం న్యాయమూ ర్తులుగా వీరి చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా ప్రమాణం చేయించనున్నారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 27కి చేరనుంది. మరో పది పోస్టులు ఖాళీగా ఉండగా కొన్నింటిని భర్తీ చేసేందుకు హైకోర్టు త్వరలో చర్యలు తీసుకోనుంది. న్యాయాధికారుల కోటా నుంచి కొందరి పేర్లను కొలీజియం సిఫారసు చేయనుంది. ఈ ఏడాది ముగ్గురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. ఫిబ్రవరి 11న జస్టిస్ మఠం వెంకటరమణ, జూన్ 13న జస్టిస్ మల్లవోలు సత్యనా రాయణమూర్తి, సెప్టెంబర్ 19న జస్టిస్ కొంగర విజయలక్ష్మీ పదవీ విరమణ చేయను న్నారు. ఈ ఏడాది ఆగస్టు లోపు అటు న్యాయ వాదుల కోటా, ఇటు న్యాయాధికారుల కోటా నుంచి అన్నీ ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం ఉంది. -
ఏపీ రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
► ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నిర్ణయ అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీ విభజన చట్టం అమలుపై రాజ్యసభలో కీలక ప్రశ్నలను సభ్యులు లేవనెత్తారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజధాని అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ.. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందని మరోసారి పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. ►మూడో రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభ జీరో అవర్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంశాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అత్యంత పవిత్రస్థలమని, టీటీడీ అనేక ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యాకలాపాల నిర్వహణకు భారీస్థాయిలో నిధులు అవసరం అవుతాయని తెలిపారు. విదేశాల నుంచి ప్రవాస భారతీయులు విరాళాలుగా పంపిస్తుంటారని గుర్తుచేశారు. కేంద్ర హోంశాఖ సాంకేతిక కారణాలతో ఎఫ్సీఆర్ఏ లైసెన్సును తాత్కాలికంగా నిలిపివేసిందని, తగిన పత్రాలన్నీ సమర్పించినప్పటికీ లైసెన్స్ పునరుద్ధరించలేదని కేంద్రం దృష్టికి ఎంపీ విజయసాయిరెడ్డి తీసుకువెళ్లారు. డిసెంబర్ 31 నాటికి రూ.13.04 కోట్ల నిధులు ఎఫ్సీఆర్ఏ అనుసంధాన బ్యాంకు ఖాతాలో ఉన్నాయని తెలిపారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ తరహాలో లుక్ సౌత్ పాలసీని అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు. బీజేపీని హిందూ జాతీయవాదానికి టార్చ్ బేరర్గా చెప్పుకుంటారని, తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మూడో రోజు ఉభయ సభలు కొలువుదీరాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగానికి లోక్సభ, రాజ్యసభలో సభ్యులు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి బడ్జెట్ మూలధన వ్యయాన్ని 35. 4 శాతం మేర పెంచారు. వృద్ధి ప్రణాళికలకు మద్దతుగా ఆర్థిక వ్యవస్థ వార్షిక వ్యయం పరిమాణాన్ని రూ.39.5 ట్రిలియన్కు (529 బిలియన్ డాలర్లు) పెంచాలని సీతారామన్ ప్రతిపాదించారు. -
జాతీయ జెండాను ఆవిష్కరించిన రామ్నాథ్ కోవింద్
సాక్షి, న్యూఢిల్లీ: భారత 73వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలోని రాజ్పథ్లో బుధవారం అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాలు 21 తుపాకులతో సైనిక వందనం సమర్పించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను కుదించారు. 2500 మందిని రాజ్పథ్లో పరేడ్ చూసేందుకు అనుమతించారు. 15ఏళ్లలోపువారికి అనుమతి లేదు. కరోనా నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు. ఆకట్టుకున్న సైనిక పరేడ్ రాజ్పథ్లో సైనిక పరేడ్ అదరహో అనిపించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న వేళ.. భారత సైనిక సామర్థ్యాన్ని, దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా రిపబ్లిక్ డే పరేడ్ సాగింది. 16 కవాతు విభాగాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర పారామిలటరీ దళాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సిబ్బంది మార్చ్ ఫాస్ట్లో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా.. భారతీయ వాయుసేన 75 యుద్ధవిమానాలతో గ్రాండ్ ప్లైపాస్ట్ నిర్వహించింది. రఫేల్, సుఖోయ్, జాగ్వర్, అపాచీ వంటి ఫైటర్ జెట్స్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. -
‘మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి’
న్యూఢిల్లీ: మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. బుధవారం రిపబ్లిక్ డే సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ఈరోజు రాత్రి(మంగళవారం) సందేశం ఇచ్చారు. ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలన్నారు. ‘మన ప్రజాస్వామ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి. రిపబ్లిక్ డే వేడుకల్ని జరుపుకోవడం మన ఐక్యతకు నిదర్శనం. సరికొత్త ఆర్థిక విధానాలు చేపట్టిన టాప్-50 దేశాల జాబితాలో భారత్ చోటు సంపాదించడం గర్వకారణం. ప్రస్తుతం కోవిడ్ కష్టకాలం నడుస్తోంది. దీనికి సంబంధించిన ప్రోటోకాల్ను ప్రతీ ఒక్కరూ విధిగా పాటించాలి .ప్రతీ ఒక్కరూ కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. డాక్టర్లు, హెల్త్ వర్కర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్ రోగులను రక్షించిన విషయాన్ని స్మరించుకోవాలి. కోవిడ్ మహమ్మారి వచ్చిన తొలి ఏడాదిలోనే మన హెల్త్ కేర్ సిస్టమ్ను బలోపేతం చేసుకోవడమే కాకుండా, ఆ మరుసటి ఏడాది వ్యాక్సిన్ డ్రైవ్ను సక్సెస్ఫుల్గా విజయవంతం చేయడం మన బలానికి సంకేతం’ అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. -
జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి విడత, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు మలి విడత సమావేశాలు జరుగుతాయి. పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫారసుల మేరకు రెండు విడతలుగా నిర్వహించనున్నట్టు పార్లమెంటు వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన జనవరి 31న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత అదే రోజు ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాతి రోజు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022–23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 11న తొలి విడత సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత నెల రోజుల పాటు విరామం ఉంటుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలు, పోలింగ్ ఉండడంతో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ప్రచారంలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10 వెలువడతాయి. ఫలితాలు వచ్చాక అంటే మార్చి 14 నుంచి రెండో విడత సమావేశాలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 8తో పార్లమెంటు సమావేశాలు ముగుస్తాయి. దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడం, ఇటీవల 400 మంది పార్లమెంటు సిబ్బంది కరోనా బారిన పడడంతో పార్లమెంటు నిర్వహణకు పూర్తిస్థాయిలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంపీలు, పార్లమెంటులోకి రావాలనుకునే ఇతరులు రెండు టీకా డోసులు తీసుకున్నట్లు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్తో పాటు ఆర్టీ–పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ సమర్పించాలి. లోక్సభ, రాజ్యసభ సమావేశాలు షిఫ్ట్లలో నిర్వహించే అవకాశాలున్నాయి. బడ్జెట్ రోజు మినహాయిస్తే మిగిలిన రోజుల్లో రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్సభ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. -
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో ప్రధాని మోదీ భేటీ
-
వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట
జమ్మూ: ప్రఖ్యాత వైష్ణోదేవి మందిరంలో కొత్త సంవత్సరాదిన విషాద ఘటన జరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీ మా వైష్ణో దేవి ఆలయానికి భారీగా వచ్చారు. కొత్త సంవత్సర ఘడియలు ఆరంభమైన సమయంలో అమ్మవారిని దర్శించాలన్న ఆతృతతో అధిక రద్దీ ఏర్పడింది. ఈ రద్దీ పెరిగి తొక్కిసలాటగా మారడంతో 12 మంది మరణించగా, పదహారుమంది గాయాలపాలయ్యారు. గర్భాలయానికి వెలుపల గేట్ నెంబర్ 3 వద్ద శనివారం ఉదయం 2.30– 2.45 ప్రాంతంలో భక్తుల రద్దీ పెరిగి తొక్కిసలాట ఆరంభమైంది. ఒక్కమారుగా జరిగిన ఈ ఘటనతో భీతావహ వాతావరణం నెలకొందని, ఊపిరి ఆడక పలువురు మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఏడుగురు యూపీ, ముగ్గురు ఢిల్లీకి చెందిన వారు కాగా హరియాణా, కశ్మీర్ నుంచి ఒక్కొక్కరున్నారు. గాయపడినవారికి మాతా వైష్ణోదేవి నారాయణ్ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆరుగురు డిశ్చార్జయ్యారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటుచేయాలని, వారంలో నివేదిక ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా ఆదేశించారు. తొక్కిసలాట అనంతరం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఆలయాన్ని సందర్శించారు. జమ్మూకు 50 కిలోమీటర్ల దూరంలోని త్రికూట్ పర్వతాల్లో నెలకొన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది వస్తారు. దుర్ఘటన జరిగిన గంటకు తిరిగి దర్శనాలకు అనుమతించారు. అయితే పలువురు భక్తులు ఆలయాన్ని సందర్శించకుండా వెనుదిరిగారు. ప్రముఖుల సంతాపం దుర్ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో రాజకీయపార్టీలు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిపై రాష్ట్ర యంత్రాంగంతో సంప్రదిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. జరిగిన ఘటనపై విచారం వెలిబుచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ కూడా ఘటనపై సంతాపం ప్రకటించారు. మరణించినవారికి రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆలయ బోర్డు చెల్లిస్తుంది. మరణించినవారికి రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల పరిహారాన్ని ప్రధాని ప్రకటించారు. ప్రధాని జాతీయ ఉపశమన నిధి నుంచి ఈ మొత్తాలందిస్తారు. పర్వదినాల్లో దేవాలయానికి రద్దీ పెరుగుతుందని, నూతన సంవత్సరాదిన యువత రద్దీ పెరగడం తాజా ట్రెండ్గా మారిందని, అందువల్ల ఇకమీదట న్యూఇయర్ రోజున తగిన ఏర్పాట్లు చేయాల్సిఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. మృతదేహాలను తరలిస్తున్న దృశ్యం తమ వారు మరణించడంతో రోదిస్తున్న కుటుంబసభ్యులు గత దుర్ఘటనలు ► 2003, ఆగస్టు 27: మహారాష్ట్ర నాసిక్లో జరిగిన కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట కారణంగా 39మంది మరణించగా, 140 మంది గాయపడ్డారు. ► 2005, జనవరి 25: మహారాష్ట్రలోని మంధర్ దేవీ ఆలయంలో కొబ్బరికాయలు భారీగా కొట్టడంతో ఆ ప్రాంతమంతా నీటిమయమైంది. బురదపై భక్తులు హఠాత్తుగా జారిపడి తొక్కిసలాట ఆరంభమైంది. ఈ ఘటనలో 340 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. ► 2008, ఆగస్టు 3: హిమాచల్ప్రదేశ్ నైనా దేవీ మందిరం వద్ద కొండచరియలు విరిగిపడుతున్నాయన్న పుకార్లు గందరగోళానికి దారితీసాయి. దీనివల్ల జరిగిన తోపులాటలో 162మంది మరణించగా 47మంది గాయపడ్డారు. ► 2010, మార్చి 4: యూపీలోని కృపాల్ మహరాజ్కు చెందిన రామ్ జానకీ ఆలయం వద్ద ఉచితంగా ఆహారం, దుస్తులు పంచారు. వీటికోసం జరిగిన తొక్కిసలాట 63మందిని బలి తీసుకుంది. ► 2011, నవంబర్ 8: హరిద్వార్లోని హర్ కా పౌరీ ఘాట్లో తొక్కిసలాట 20మంది మృతికి కారణమైంది. ► 2012, నవంబర్ 19: పాట్నా వద్ద ఛాత్పూజ జరిగే అదాలత్ ఘాట్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కూలి 20మంది మరణించారు. ► 2013, అక్టోబర్ 13: మధ్యప్రదేశ్లోని రత్నగిరి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నదిపై వంతెన కూలిపోతోందన్న పుకార్లు భారీ తొక్కిసలాటకు కారణమయ్యాయి. దీంతో 115మంది మరణించగా, 100మంది గాయపడ్డారు. ► 2014, అక్టోబర్ 3: పాట్నాలోని గాంధీ మైదానంలో దసరా ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆరంభమైన తోపులాట 32మం దిని బలికొంది. 26మంది గాయపడ్డారు. ► 2015, జూలై 14: ఏపీలో గోదావరి పుష్కరాల వేళ జరిగిన తొక్కిసలాటలో 29మంది చనిపోగా, 20 మంది గాయపడ్డారు. -
హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులు
సాక్షి అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ డాక్టర్ కుంభజడల మన్మధరావు, జస్టిస్ బొడ్డుపల్లి శ్రీ భానుమతి నియమితులయ్యారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. దీంతో కేంద్రం వీరి నియామకాలను నోటిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ వారంలో వీరు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. వీరిద్దరి నియామకంతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 20కి చేరనుంది. న్యాయమూర్తుల నేపథ్యం ఇది.. న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మధరావు జననం: 1966, జూన్ 30 ఊరు: ప్రకాశం జిల్లా సింగరాయకొండ విద్యాభ్యాసం: ఆంధ్రా యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ, డాక్టరేట్ ప్రస్థానం: ► 1991లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఒంగోలులో నాగిశెట్టి రంగారావు వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. ► 1999లో హైకోర్టుకు ప్రాక్టీస్ మార్చారు. ► ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రెవెన్యూ ఇంటెలిజెన్స్ వంటి కీలక సంస్థలకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా వ్యవహరించారు. ► పలు బ్యాంకులకు న్యాయ సలహాదారుగా ఉన్నారు. న్యాయమూర్తి జస్టిస్ బొడ్డుపల్లి శ్రీ భానుమతి స్వగ్రామం: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు విద్యాభ్యాసం: రాజమహేంద్రవరంలో ‘లా’ అభ్యసించారు. ప్రస్థానం: ► న్యాయాధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనిచేశారు. ► 2020 జూన్లో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్గా నియమితులయ్యారు. తొలి మహిళా రిజిస్ట్రార్ జనరల్ భానుమతి కావడం విశేషం. అప్పటి నుంచి అదే పోస్టులో కొనసాగుతున్నారు. -
మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు గవర్నర్
సాక్షి, అమరావతి: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం నుంచి మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో గురువారం నిర్వహించే గవర్నర్ల సదస్సులో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారని రాజ్భవన్ వర్గాలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపాయి. -
పద్మభూషణ్ అందుకున్న పీవీ సింధు
సాక్షి, న్యూఢిల్లీ: పలువురు ప్రముఖులకు 2020 సంవత్సరానికిగాను పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో మొత్తం 141 పద్మ అవార్డులను అందజేశారు. ఏడుగురు పద్మ విభూషణ్, 16 మంది పద్మభూషణ్, 118 మంది పద్మశ్రీ అందుకున్నారు. అవార్డులను అందుకున్న వారిలో 33 మంది మహిళలు ఉన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, ఏపీలోని మదనపల్లికి చెందిన సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాప కుడు ముంతాజ్ అలీ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్కు చెందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్రెడ్డి, తెలంగాణ సంస్కృత వాచస్పతిగా పేరొందిన భాష్యం విజయసారథి, అనంతపురం జిల్లాకు చెందిన తోలు బొమ్మలాట కళాకారుడు దళవాయి చలపతిరావు, శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడకు చెందిన నాటకరంగ కళాకారుడు యడ్ల గోపాలరావు పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు. తన సేవలను గుర్తించి అవార్డు అందించడం ఎంతో సంతోషంగా ఉందని పద్మశ్రీ పురస్కారగ్రహీత చింతల వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. -
పద్మ పురస్కారాలు.. ఏపీ నుంచి ముగ్గురు
సాక్షి, న్యూఢిల్లీ/మదనపల్లె సిటీ(చిత్తూరు జిల్లా)/రాజాం: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రకటించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం ఢిల్లీలో ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో 2020వ సంవత్సరానికి సంబంధించి మొత్తం 141 పురస్కారాలను అందజేశారు. ఏడుగురు పద్మ విభూషణ్, 16 మంది పద్మభూషణ్, 118 మంది పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు. ఇందులో మొత్తం 33 మంది మహిళలున్నారు. ఏపీ నుంచి ముగ్గురు.. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు ‘పద్మ’ అవార్డులు అందుకున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, చిత్తూరు జిల్లా మదనపల్లె వాస్తవ్యులు, సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముంతాజ్ అలీ పద్మభూషణ్ పురస్కారాలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా మందరాడకు చెందిన నాటకరంగ కళాకారుడు యడ్ల గోపాలరావు, అనంతపురం జిల్లాకు చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు దాళవాయి చలపతిరావు రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ నుంచి రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్రెడ్డి, సంస్కృత వాచస్పతిగా పేరొందిన శ్రీభాష్యం విజయసారథి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. అందరి సంతోషం కోసం.. ముంతాజ్ పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ముంతాజ్ అలీ కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. 19 ఏళ్ల వయసులోనే హిమాలయాలకు వెళ్లారు. అక్కడ మధుకర్నాథ్తో ఏర్పడిన పరిచయం ద్వారా వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకోవడంతో పాటు «ధ్యానం, క్రియా యోగాల్లో శిక్షణ తీసుకున్నారు. 1996లో చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. 2015లో వాక్ ఆఫ్ హోప్ యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు యాత్ర చేశారు. నక్కలదిన్నె సమీపంలో సత్సంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడే గిరిజన ఆశ్రమ పాఠశాల నిర్వహిస్తున్నారు. యోగా, ధ్యానంపై ప్రచారం చేస్తూ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దేశవిదేశాల్లో సత్సంగ్ ఆధ్యాత్మిక సంస్థలు పనిచేస్తున్నాయి. అందరూ సంతోషంగా ఉండాలన్న ఆశయంతో ముంతాజ్ అలీ పనిచేస్తున్నారు. కళే.. ఇంతవాడిని చేసింది పద్మశ్రీ పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది. నాకు పురస్కారాలు, సత్కారాలు వస్తాయని ఏనాడూ అనుకోలేదు. నా జీవనం కోసం కళను నమ్ముకున్నాను. ఆ కళే నన్ను ఇంతవాడిని చేసింది. నక్షత్రక పాత్రే నాకు ఇంతటి ఖ్యాతిని తెచ్చిపెట్టింది. నాలో ఉన్న నటుడిని.. నా గురువు యడ్ల సత్యంనాయుడు ప్రపంచానికి పరిచయం చేస్తే, నాకు అన్ని విధాలా నా భార్య జయమ్మ సహకరించింది. మందరాడ గ్రామ ప్రజలంతా నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. బాలభారతి కళా నాట్యమండలికి, కుటుంబీకులకు, తోటి కళాకారులకు, మందరాడ గ్రామస్తులకు ఈ పురస్కారం అంకితం. – పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్ల గోపాలరావు -
పద్మం దక్కిన వేళ.. ఆనంద హేల
2020 సంవత్సరానికి గాను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ‘పద్మ’ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం ఈ అవార్డుల ప్రదానం జరిగింది. చిత్రసీమ నుంచి తమ తమ విభాగాల్లో సేవలు అందిస్తున్న నటి కంగనా రనౌత్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్, నిర్మాత ఏక్తా కపూర్, సంగీత దర్శకుడు అద్నన్ సమి, నేపథ్య గాయకుడు సురేష్ వడ్కర్, సీనియర్ నటి సరితా జోషి ‘పద్మశ్రీ’ అవార్డులు అందుకున్నారు. పద్మం దక్కిన వేళ.. ఆనంద హేలలో పురస్కార గ్రహీతలు ఈ విధంగా స్పందించారు. ఆలస్యంగా వచ్చినా ఆనందమే – సురేష్ వాడ్కర్ ‘‘కాస్త అలస్యంగా వచ్చినప్పటికీ నా దేశం నన్ను గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఏ కళా కారుడికైనా ఈ పురస్కారం చాలా గొప్పది. సంగీత ప్రపంచంలోమరింత ముందుకు వెళ్లడానికి ఈ పురస్కారం నాకు స్ఫూర్తినిచ్చింది’’ అని 66 ఏళ్ల సురేష్ వాడ్కర్ అన్నారు. హిందీ, మరాఠీ భోజ్పురి భాషల్లో పాడారు సురేష్. ‘సద్మా’లో ‘ఏ జిందగీ గలే లగా లే’, ‘పరిందా’లో ‘తుమ్ సే మిల్కే’ , ‘ప్యాసా సావన్’లో ‘మేఘా రే.. మేఘా రే..’ వంటి పాటలు పాడారు వాడ్కర్. ఈ క్షణాలు గుర్తుండిపోతాయి – కరణ్ జోహార్ ‘‘ఈ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మా అమ్మ, నా పిల్లలు, నా ప్రొడక్షన్ కంపెనీలా నా మనసులో ఈ పురస్కారం అలా ఉండిపోతుంది’’ అని పేర్కొన్నారు కరణ్ జోహర్. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కల్ హో నా హో’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు కరణ్ జోహార్. అలాగే ‘దోస్తానా’, ‘2 స్టేట్స్’ వంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు. నమ్మలేని క్షణం – ఏక్తా కపూర్ ‘‘ఇదొక గొప్ప గౌరవం. నమ్మలేని క్షణం... అలాగే గర్వకారణం. నాకు రెండు పిల్లర్లలా నిలిచిన మా అమ్మానాన్న (శోభ, జితేంద్ర కపూర్)లకు ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నాను. వాళ్లిద్దరూ నన్ను పూర్తిగా నమ్మడంవల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. నా కుటుంబం, స్నేహితులు, మా బాలాజీ టెలీ ఫిలింస్ టీమ్, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా కలలను నిజం చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చిన ఈ దేశానికి తిరిగి ఇవ్వాలన్నది నా ఆలోచన. మరింతమంది ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తాను’’ అన్నారు ఏక్తా కపూర్. టీవీ రంగంలో దూసుకెళుతున్న ఏక్తా ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’, ‘ది డర్టీ పిక్చర్’, ‘షూట్ అవుట్ అట్ వడాలా’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆ ప్రేమవల్లే ఇంతదాకా... – అద్నన్ సమీ ‘‘నాకింత గొప్ప పురస్కారాన్ని అందించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలాగే భారతదేశ ప్రజలు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రేక్షకుల అభిమానం వల్లే నా ప్రయాణం ఇంతదాకా వచ్చింది’’ అన్నారు అద్నాన్ సమీ. హిందీలో పలు పాటలు పాడిన అద్నన్ తెలుగులో ‘శంకర్దాదా ఎంబీబీఎస్’లో ‘ఏ జిల్లా..’, ‘వర్షం’లో ‘నైజామ్ పోరి..’, ‘జులాయి’లో ‘ఓ మధు..’ వంటి పాటలు పాడారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటి సరితా జోషి (80) ఆరు దశాబ్దాలుగా గుజరాతీ, మరాఠీ, హిందీ, మర్వారీ భాషల్లో 15 వేలకు పైగా షోస్లో భాగమయ్యారు. అలాగే ‘పరివార్’, ‘గురు’, ‘సింబా’, ‘రూహీ’ తదితర చిత్రాల్లో నటించారు. ఆ నోళ్లు మూతపడతాయనుకుంటున్నాను ‘‘ఒక ఆర్టిస్టుగా నేను ఎన్నో అవార్డులు పొందగలిగాను. కానీ ఓ ఆదర్శనీయమైన పౌరురాలిగా ప్రభుత్వం నన్ను గుర్తించి ‘పద్మశ్రీ’ అందించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కంగనా రనౌత్. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ను స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు పది సంవత్సరాల వరకు నాకు సక్సెస్ రాలేదు. పెద్ద హీరోలు, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కు సంబంధించిన చిత్రాలు, స్పెషల్సాంగ్స్, సౌందర్య లేపనాల ఉత్పత్తులను గురించిన ప్రకటనలను కాదనుకున్నాను. జాతీయ అంశాలను గురించి నేను పలుసార్లు నా గొంతు విప్పాను. అందువల్ల ఎక్కువగా శత్రువులనే సంపాదించుకున్నాను. జాతీయ అంశాలను గురించి ప్రస్తావిస్తోంది అని నన్ను విమర్శించేవారి నోళ్లు ఇప్పుడు మూతపడతాయనుకుంటున్నాను’’ అన్నారు. ‘క్వీన్’, ‘తనువెడ్స్ మను’ ఫ్రాంచైజీ, ‘తలైవి’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ నిర్మాతగానూ రాణిస్తున్నారు. – కంగనా రనౌత్ -
PV Sindhu: తెలుగు తేజం పీవీ సింధుకు పద్మభూషణ్
-
పద్మభూషణ్ అవార్డు అందుకున్న పీవి సింధు..
PV Sindhu conferred with Padma Bhushan: భారత్ దేశంలో ఉన్నత పౌరసత్కారాలుగా భావించే పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్లో ఆట్టహాసంగా జరిగింది. 2020లో మొత్తంలో 119మందికి ఈ అవార్డలును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. ఈ కార్య క్రమంలో తెలుగుతేజం బ్యాడ్మంటిన్ స్టార్ షట్లర్ పీవి సింధు రాష్ట్రపతి చేతుల మీదగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గోన్నారు. చదవండి: Gautam Gambhir: త్వరలో భారత్కు టీ20 ప్రపంచకప్ తీసుకువస్తాడు -
Lakhimpur Kheri Violence: నేడు రాష్ట్రపతిని కలవనున్న రాహుల్
న్యూఢిల్లీ/లఖీమ్పూర్ ఖేరి: రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు బుధవారం రాష్ట్రపతి కోవింద్ను కలిసి లఖీమ్పూర్ఖేరి ఘటనపై వినతిపత్రం అందజేయనున్నారు. ఈ బృందంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, గులామ్ నబీ ఆజాద్, లోక్సభ పార్టీ నేత అధిర్ రంజన్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ ఉంటారు. హింసాత్మక ఘటనలపై రాష్ట్రపతికి పూర్తి వివరాలను అందజేస్తామని పార్టీ నేత వేణుగోపాల్ తెలిపారు. మంత్రి కుమారుడు రైతులపైకి వాహనం నడిపిన ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. లఖీమ్పూర్ ఖేరి ఘటనలకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృతి చెందిన ఈ ఘటనకు సంబంధించి మంత్రి కుమారుడు ఆశిష్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతిమ్ అర్దాస్లో పాల్గొన్న ప్రియాంక లఖీమ్పూర్ఖేరి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు అంతిమ ప్రార్థనలు జరిపేందుకు మంగళవారం టికోనియా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, బీకేయూ నేతలు రాకేశ్ తికాయత్, దర్శన్సింగ్ పాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహన్, ధర్మేంద్ర మాలిక్ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా పాల్గొన్నారు. హింసాత్మక ఘటనలో అసువులు బాసిన రైతుల కుటుంబసభ్యులు కార్యక్రమ ంలో పాల్గొన్నారు. ప్రకటించిన విధంగానే, వేదికపై రాజకీయ పార్టీల నేతలెవరికీ చోటు కల్పించలేదు. కార్యక్రమం జరుగుతున్న ప్రాంతంలో పోలీసులు, పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
76వ వసంతంలోకి రాష్ట్రపతి: ప్రధాని మోదీ, సీఎంలు జగన్, కేసీఆర్ విషెస్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారంతో 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలవారని, దేశానికి ఆయన జీవితం అంకితం చేశారని పేర్కొన్నారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. చదవండి: నిశ్చితార్థం అయింది.. పెళ్లికి అబ్బాయి నో అన్నాడని.. Birthday greetings to Rashtrapati Ji. Due to his humble personality, he has endeared himself to the entire nation. His focus on empowering the poor and marginalised sections of society is exemplary. May he lead a long and healthy life. @rashtrapatibhvn — Narendra Modi (@narendramodi) October 1, 2021 ఉప రాష్ట్రపతి హృదయపూర్వక శుభాకాంక్షలు ‘నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సింప్లిసిటీ, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. ఆయురారోగ్యం, సంతోషాలతో చాలా ఏళ్లు దేశానికి సేవ చేయాలని ప్రార్థిస్తున్నా’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు రాష్ట్రపతి కోవింద్కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సుదీర్ఘ కాలం పాటు దేశానికి సేవలు అందించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. Warm greetings to Hon'ble President Shri Ram Nath Kovind Ji on his birthday. May the Almighty bless him with a long & healthy life in the service of our nation. @rashtrapatibhvn — YS Jagan Mohan Reddy (@ysjagan) October 1, 2021 ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజల తరఫున శుభాకాంక్షల హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని ఏపీ రాజ్భవన్ ట్వీట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు. నిండు ఆరోగ్యంతో సుదీర్ఘ జీవితం పొందాలని.. దేశానికి ఇంకొన్నాళ్లు సేవ చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. CM Sri KCR conveyed birthday greetings to Hon'ble President Sri Ram Nath Kovind Ji on behalf of Telangana Government and its people. "May God bless Sri Ram Nath Kovind Ji with good health and long life for serving the nation for many more years", CM wished.@Rashtrapatibhvn — Telangana CMO (@TelanganaCMO) October 1, 2021 -
రాష్ట్రపతికి విజయవంతంగా కంటి శస్త్ర చికిత్స.. డిశ్చార్జ్
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు కంటి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తయింది. రాష్ట్రపతి తన రెండవ కంటికి కంటిశుక్లం శస్త్రచికిత్సను శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రెఫరల్ & రీసెర్చ్) చేయించుకున్నారు. చికిత్స విజయవంతంగా పూర్తి కావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు. అయితే ఇదివరకే ఆయన మొదటి కన్ను 2021 ఆగస్టు 19న ఆర్మీ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు. 75 ఏళ్ల కోవింద్, జూలై 25, 2017 న భారతదేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. చదవండి: ఇదేం వింత.. బాలిక ఎడమ కంటి నుంచి కన్నీళ్లతో పాటు రాళ్లు కూడా.. -
కోటి టీకాలు ‘నర్సింగ్’ అంకితభావం ఫలితమే
సాక్షి, న్యూఢిల్లీ: నర్సింగ్ సిబ్బంది అంకితభావం వల్లే దేశవ్యాప్తంగా ఒక్కరోజులో కోటి టీకాలు అందించడం సాధ్యమైందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా బుధవారం నర్సింగ్ సిబ్బందికి జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుల ప్రదాన కార్యక్రమం వర్చువల్గా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ నర్సింగ్ సిబ్బంది అవిశ్రాంత మద్దతు వల్లే కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగామని కొనియాడారు. కరోనా సమయంలో సేవలందిస్తూ చాలామంది నర్సింగ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నైటింగేల్ అవార్డు గ్రహీతల్లో ఒకరు కూడా ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ‘నర్సెస్: ఎ వాయిస్ టు లీడ్.. ఎ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్కేర్’థీమ్తో ఈ ఏడాది అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ని ర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల నుంచి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుకు ఎంపికైన వారికి వర్చువల్ ద్వారా రాష్ట్రపతి అవార్డు అందజేశారు. అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి అభినందిం చారు. అవార్డు, ధ్రువపత్రం, రూ.25 వేల నగదును అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. ఏపీ, తెలంగాణల నుంచి నలుగురుకి ఈ అవార్డు దక్కింది. ఏపీ, తెలంగాణల నుంచి నలుగురికి అవార్డులు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో 12 ఏళ్లుగా సేవలందిస్తున్న డి.రూపకళ, తిరుపతి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అములూరు పద్మజ, హైదరాబాద్లోని అఫ్జల్ సాగర్కు చెందిన అనపర్తి అరుణకుమారి, వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపురం సబ్సెంటర్కు చెందిన ఎన్వీ షుకురా ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్నారు. -
టీచర్లు విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీయాలి
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్థుల్లో దాగి ఉండే స్వాభావిక ప్రతిభను వెలికితీయడం తమ ప్రాథమిక బాధ్యతగా ఉపాధ్యాయులు పనిచేయాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. మంచి ఉపాధ్యాయుడు విద్యార్థుల వ్యక్తిత్వాన్ని నిర్మించే దార్శనికుడిగా, సమాజ నిర్మాతగా ఉంటాడని కోవింద్ పేర్కొన్నారు. ఉపాధ్యాయదినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 44 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఆదివారం వర్చువల్గా అవార్డులు అందజేసిన రాష్ట్రపతి.. 21వ శతాబ్దపు భారతదేశ గమ్యాన్ని ఉపాధ్యాయులే నిర్దేశిస్తారని అన్నారు. అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కెరమెరి మండలం సవర్ఖేడా ఎంపీపీఎస్ తాత్కాలిక ప్రధాన ఉపాధ్యాయుడు రంగయ్య కడెర్ల, సిద్దిపేటలోని ఇందిరానగర్ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు పయ్యావుల రామస్వామి, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం జిల్లా పరిషత్ హైస్కూలు ఉపాధ్యాయుడు కొణతాల ఫణి భూషణ్, చిత్తూరు జిల్లా ఎం.పైపల్లి ఈరాల జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఎస్.మునిరెడ్డి తెలుగు రాష్ట్రాలనుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో సురక్షితంగా ఉంటుంది. ప్రతివ్యక్తి జీవితంలో గురువుల పాత్ర ఎంతో ఉంటుంది. చదువుపై విద్యార్థులకు ఆసక్తిని పెంపొందించడం ఉపాధ్యాయుల విధి. ప్రతి విద్యార్థి అవసరాలను గుర్తించి ఉపాధ్యాయులు పనిచే యాలి. విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించాలి’అని అన్నారు. కాగా, దేశాభివృద్ధిలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకంగా ఉంటుందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. -
భవీనా పటేల్కు రజతం.. ప్రముఖుల ప్రశంసల వెల్లువ
ఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్లో రజతం సాధించిన భవీనాబెన్ పటేల్పై ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రధాని, రాష్ట్రపతి మొదలుకొని పలువురు సెలబ్రిటీలు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రజతం సాధించిన భవీనా పటేల్కు శుభాకాంక్షలు తెలిపారు. టోక్యో పారాలింపిక్స్ 2020 లో కృషి, పట్టుదల, సంకల్పంతో రజత పతకం సాధించిన భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భావినాబెన్ పటేల్ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. పటేల్ తన అత్యుత్తమ ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేసారన్నారు. టోక్యో పారాలింపిక్స్ క్రీడలలో టేబుల్ టెన్నిస్లో ఆమె సాధించిన రజత పతకం దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గవర్నర్ అన్నారు. చదవండి: పారాలింపిక్స్లో భవీనా కొత్త అధ్యాయం.. 12 నెలల వయసులో పోలియో బారిన పడినప్పటికీ.. ► పారాలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించిన భవీనా.. భారత బృధానికి, క్రీడాభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మీ అసాధారణ సంకల్పం, నైపుణ్యాలు భారతదేశానికి కీర్తిని తెచ్చాయి. మీకు నా అభినందనలు - రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ President Ram Nath Kovind wishes Para table tennis player #BhavinaPatel on winning a Silver medal at Tokyo Paralympics "...Your extraordinary determination and skills have brought glory to India. My congratulations to you on this exceptional achievement," he says. pic.twitter.com/E59vmq82IY — ANI (@ANI) August 29, 2021 ► భవీనా పటేల్ చరిత్ర లిఖించింది. దేశానికి ఆమె చారిత్రక సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది. ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తి. ఆమె ప్రయాణం యువతను క్రీడలవైపు ఆకర్షిస్తుంది - ప్రధాని నరేంద్ర మోదీ PM Modi congratulates Para-paddler Bhavina Patel on winning a Silver medal at Tokyo Paralympics "The remarkable Bhavina Patel has scripted history! ...Her life journey is motivating and will also draw more youngsters towards sports," he says. pic.twitter.com/CDlW1KS5d7 — ANI (@ANI) August 29, 2021 ► టోక్యో పారాలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను - ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు టోక్యో పారాలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #Paralympics pic.twitter.com/89CCkOUhR6 — Vice President of India (@VPSecretariat) August 29, 2021 -
సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు
ఢిల్లీ: సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తులు నియమితులయ్యారు. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం గెజిట్ విడుదల చేసింది. కొత్త జడ్జిలుగా జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బీవీ నాగరత్నం, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ రవికుమార్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఏఎస్ ఒకా, జస్టిస్ విక్రమ్నాథ్ నియమితులయ్యారు. కొత్తగా 9 మంది నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 18న తొమ్మిది మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, బార్ నుంచి ఒకరు ఉన్నారు. -
మణిపూర్ కొత్త గవర్నర్గా లా గణేషన్
ఇంఫాల్: మణిపూర్ కొత్త గవర్నర్గా లా గణేషన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 20న గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న నజ్మా హెప్తుల్లా స్థానంలో లా గణేషన్ ఎంపికయ్యారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన లా గణేషన్ బీజేపీ పలు కీలక పదవులు నిర్వహించారు. చదవండి: యూపీ మాజీ సీఎం కల్యాణ్సింగ్కు ప్రధాని మోదీ నివాళి President Ram Nath Kovind appoints La Ganesan as the Governor of Manipur. — ANI (@ANI) August 22, 2021 -
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రసంగం
-
ఏపీ: రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ఆమోదముద్ర వేశారు. ఒకటి ఎస్సీ కమిషన్ ఏర్పాటు బిల్లు అయితే మరొకటి విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు. వివరాలివీ.. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్ జగన్ వేర్వేరు కమిషన్లను ఏర్పాటుచేస్తూ బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2019లో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును మండలిలో టీడీపీ సభ్యులు వెనక్కి పంపించారు. దీంతో గతేడాది జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం మరోమారు బిల్లును యథాతథంగా ప్రవేశపెట్టి ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపించడంతో గత నెల 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి వీకే పట్నాయక్ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులకు పంపిన అధికారిక సమాచారం గురువారం చేరింది. దీంతో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటుచేయాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ను సీఎం నెరవేర్చినట్లయింది. ఇప్పటివరకు ఒకే కమిషన్ పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటుచేయడంవల్ల అవి మరింత సమర్థవంతంగా పనిచేసే వీలు కలుగుతుంది. ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లుకూ.. ఇక రెండోదైన ఏపీ విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు–2020కు కూడా రాష్ట్రపతి ఆమోదం లభించింది. గతేడాది డిసెంబర్ 2న ఈ బిల్లును విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దశాబ్దాల క్రితం నిర్ణయించిన విద్యుత్ సుంకంతో వస్తున్న ఇబ్బందులను అధిగమించేందుకు చట్టంలో స్వల్ప మార్పుచేసి అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఈ బిల్లు రూపొందించారు. దీంతో ఇక రాష్ట్రంలో వేర్వేరు కేటగిరీల వినియోగదారులకు, వేర్వేరు సమయాల్లో వేర్వేరుగా విద్యుత్ సుంకం విధిస్తారు. నష్టాలు తగ్గించి.. నాణ్యమైన విద్యుత్ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని రైతులకు తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అదే విధంగా పదివేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. ప్రజలకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సుంకం (సవరణ) బిల్లు–2020ను తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో అవసరానికి మించి విద్యుత్కు రేటు చెల్లించారు. కేవలం రెండు, మూడు రూపాయలకే యూనిట్ విద్యుత్ను ఇస్తామని అమ్మకందారులు ముందుకొచ్చినప్పటికీ ఉద్దేశపూర్వకంగా రూ.4.80 చెల్లించి టీడీపీ పాలకులు కొనుగోలు చేశారు. తద్వారా రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారు. దీని నుంచి బయటపడటానికి ఈ బిల్లు దోహదం చేస్తుంది. ఇప్పటివరకు యూనిట్కు 6పైసల చొప్పున సుంకం విధిస్తున్నారు. ఈ బిల్లుతో కేటగిరీల బట్టి, విద్యుత్ వాడే సమయాలను బట్టి సుంకం విధిస్తారు. -
ఏపీకి సంబంధించి 2 కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రెండు కీలక బిల్లులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి కోసం వేర్వురు కమిషన్లు ఏర్పాటు చేస్తూ.. బిల్లు తీసుకొచ్చారు. ఎస్సీ కమిషన్కు సంబంధించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ గతేడాది జనవరిలో ఆమోదించింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు శానసమండలి కొన్ని సవరణలు చేసి వెనక్కు పంపింది. అయితే ఆ సిఫార్సులు ఆమోదయోగ్యం కావన్న శాసన సభ.. బిల్లును జనవరి, 2020 లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో యథాతథంగా ఆమోదించింది. ఇప్పుడు ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో త్వరలోనే ఏపీలో ప్రత్యేక ఎస్సీ కమిషన్ అందుబాటులోకి రానుంది. -
నీరజ్.. టోక్యోలో చరిత్ర లిఖించావ్: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు ఒకేరోజు రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు చివరి రోజున నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి.. గోల్డెన్ ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇక రెజ్లింగ్లో భజరంగ్ పూనియా కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. అరంగ్రేంట్రంలోనే భజరంగ్ పూనియా కాంస్యం సాధించి.. చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా, భజరంగ్ పూనియాకులకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. నీరజ్.. టోక్యోలో చరిత్ర లిఖించావ్: మోదీ ‘‘నీరజ్ చోప్రా ఈ రోజు టోక్యోలో సాధించని విజయం ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఈ రోజు టోక్యోలో చర్రిత సృష్టించావ్. అద్భుతమైన అభిరుచితో ఆడావు.. అసమానమైన గ్రిట్ చూపించావు. స్వర్ణం గెలిచినందుకు నీకు అభినందనలు’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. History has been scripted at Tokyo! What @Neeraj_chopra1 has achieved today will be remembered forever. The young Neeraj has done exceptionally well. He played with remarkable passion and showed unparalleled grit. Congratulations to him for winning the Gold. #Tokyo2020 https://t.co/2NcGgJvfMS — Narendra Modi (@narendramodi) August 7, 2021 Delightful news from #Tokyo2020! Spectacularly fought @BajrangPunia. Congratulations to you for your accomplishment, which makes every Indian proud and happy. — Narendra Modi (@narendramodi) August 7, 2021 నీవు సాధించిన విజయం యువతకు స్ఫూర్తి: రామ్నాథ్ కోవింద్ ‘‘నీరజ్ చోప్రా సాధించిన అపూర్వ విజయం! మీరు మీ మొదటి ఒలింపిక్స్లో భారతదేశానికి మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ మెడల్ను ఇంటికి తీసుకువచ్చారు. మీ ఫీట్ మా యువతకు స్ఫూర్తినిస్తుంది. మీ విజయం పట్ల భారతదేశం ఉప్పొంగిపోతుంది! మీకు హృదయపూర్వక అభినందనలు’’ అంటూ రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు. Unprecedented win by Neeraj Chopra!Your javelin gold breaks barriers and creates history. You bring home first ever track and field medal to India in your first Olympics. Your feat will inspire our youth. India is elated! Heartiest congratulations! — President of India (@rashtrapatibhvn) August 7, 2021 A special moment for Indian wrestling! Congratulations to Bajrang Punia for winning the Bronze at #Tokyo2020. You have distinguished yourself as an outstanding wrestler with untiring efforts, consistency and tenacity over the years. Every Indian shares the joy of your success! — President of India (@rashtrapatibhvn) August 7, 2021 నీరజ్ చోప్రాకు భారీ నజరానా ప్రకటించిన హరియాణా ప్రభుత్వం చండిగఢ్: 13 ఏళ్ల తర్వాత వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణం లభించింది. హరియాణాకు చెందిన అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో బంగారు పతకం సాధించాడు. ఈ నేపథ్యంలో హరియాణా సర్కార్ నీరజ్ చోప్రాకు భారీ నజరానా ప్రకటించింది. అతడికి 6 కోట్ల రూపాయల నగదు బహుమానంతోపాటు.. క్లాస్-1 గ్రేడ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. -
బాయ్స్.. మీరు సాధించేశారు.. ఇక కేకలే!
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో గెలుపొందిన భారత పురుషుల హాకీ జట్టుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్ పతకంతో తిరిగి వస్తున్నందుకు భారతీయుల గుండెలు ఉప్పొంగిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా పలువురు ఈ విజయం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెల్డన్ బాయ్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సరికొత్త చరిత్రకు నాంది: భారత రాష్ట్రపతి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారత పురుషుల హాకీ జట్టును అభినందించారు. 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన నైపుణ్యం, ప్రతిభాపాటవాలు, అంకితభావంతో ఈ గెలుపు సాధ్యమైందని కొనియాడారు. గురువారం నాటి చారిత్రాత్మక విజయం భారత హాకీ చరిత్రలో మరో సరికొత్త యుగానికి నాంది అని, క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకునే విధంగా స్ఫూర్తినిస్తుందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Congratulations to our men's hockey team for winning an Olympic Medal in hockey after 41 years. The team showed exceptional skills, resilience & determination to win. This historic victory will start a new era in hockey and will inspire the youth to take up and excel in the sport — President of India (@rashtrapatibhvn) August 5, 2021 ప్రతి భారతీయుడి మనసులో గుర్తుండే జ్ఞాపకం ‘‘చరిత్రాత్మకం! ప్రతీ భారతీయుడి మనసులో ఈ జ్ఞాపకం ఎల్లప్పుడూ నిలిచి పోతుంది. కాంస్య పతకంతో స్వదేశానికి తిరిగి వస్తున్న భారత పురుషుల హాకీ జట్టుకు శుభాకాంక్షలు. ఈ ఘనత సాధించి జాతి మొత్తాన్ని గర్వపడేలా చేవారు. ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చారు. హాకీ జట్టు మనకు గర్వకారణం’’ ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా మన్ప్రీత్ సేనను కొనియాడారు. Historic! A day that will be etched in the memory of every Indian. Congratulations to our Men’s Hockey Team for bringing home the Bronze. With this feat, they have captured the imagination of the entire nation, especially our youth. India is proud of our Hockey team. 🏑 — Narendra Modi (@narendramodi) August 5, 2021 ఇక కామ్గా ఎలా ఉండగలం ‘‘భారత్కు శుభాకాంక్షలు. అబ్బాయిలు.. మీరు సాధించేశారు! ఇక మేం నిశ్శబ్దంగా ఎలా ఉండగలం. ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ.. ఒలింపిక్ చరిత్రలో మరోసారి భారత విజయాన్ని మరోసారి లిఖించింది పురుషుల హాకీ జట్టు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం’’ అని కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. A BILLION CHEERS for INDIA 🇮🇳! Boys, you’ve done it ! We can’t keep calm !#TeamIndia 🥉! Our Men’s Hockey Team dominated and defined their destiny in the Olympic history books today, yet again ! We are extremely proud of you!#Tokyo2020 pic.twitter.com/n78BqzcnpK — Anurag Thakur (@ianuragthakur) August 5, 2021 -
పీవీ సింధుకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు
ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించిన పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సింధు విజయం ద్వారా భారత్కు మరింత గౌరవం దక్కిందని ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ కొనియాడారు. ఈ విజయం స్ఫూర్తిగా భారత యువత క్రీడల్లో రాణించే అవకాశం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. పీవీ సింధుని ప్రశంసించారు. కాగా టోక్యో ఒలింపిక్స్కు భారీ అంచనాల నడుమ ఒలింపిక్స్కు వెళ్లిన సింధు.. దాన్ని సాకారం చేసుకుంటూ భారత్కు పతకం అందించి త్రివర్ణపతకాన్ని అంతర్జాతీయ వేదికపై మరోసారి రెపరెపలాడించింది. పీవీ సింధు 21-13, 21-15 తేడాతో బింగ్ జియావోపై గెలిచింది. -
రాష్ట్రపతిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న రామ్నాథ్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశాధినేతగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆదివారానికి నాలుగేళ్లు పూర్తయ్యాయని రాష్ట్రపతి భవన్ తెలిపింది. 2017 జూలై 25న ఆయన దేశ 14వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ నాలుగేళ్ల పాటు ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ–బుక్ ద్వారా ప్రచురించింది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిపిన పర్యటనల్లో ఆయన 780 మందిని కలుసుకొని ‘అందరి రాష్ట్రపతి’గా మారారని పేర్కొంది. ఈ నాలుగేళ్లలో ఆయన 63 బిల్లులను ఆమోదిం చారని తెలిపింది. కరోనా వారియర్లతో ఆయన సమయం గడిపి వారిలో ఉత్సాహాన్ని నింపారని పేర్కొంది. 23 దేశాధినేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి బాధ్యతలను నెరవేర్చారంది. జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి గవర్నర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించారని తెలిపింది. -
విభజన తర్వాత తొలిసారి కశ్మీర్కు రాష్ట్రపతి
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటించనున్నారు. రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జమ్ము కశ్మీర్లో త్రివిధ దళాల అధిపతిగా ఉన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కశ్మీర్లో పర్యటిస్తారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి జమ్ముకశ్మీర్, లద్దాక్లో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అందులో భాగంగా ఈ నెల 26వ తేదీన కార్గిల్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం 27వ తేదీన కశ్మీర్ విశ్వవిద్యాలయం 19వ స్నాతకోత్సవం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవంగా 2019లోనే రాష్ట్రపతి పర్యటించాల్సి ఉండగా అప్పుడు వాతావరణం సహకరించక పర్యటన రద్దయ్యింది. ఇప్పుడు ఈసారి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జమ్మూ కశ్మీర్ విభజన అనంతరం రాష్ట్రపతి తొలిసారిగా పర్యటించనుండడం విశేషం. జమ్మూ, లఢక్గా 2019లో కేంద్ర ప్రభుత్వం విభజించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణం ఏర్పడింది. -
12 సెంట్రల్ వర్సిటీలకు కొత్త వీసీలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని 12 సెంట్రల్ యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకానికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారని విద్యా శాఖ తెలిపింది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, జమ్మూ, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు, గయాలోని దక్షిణ బిహార్, మణిపూర్ విశ్వవిద్యాలయం, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం, నార్త్–ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయం, బిలాస్పూర్ గురు ఘాసిదాస్ విశ్వవిద్యాల యాలకు వీసీల నియామకం జరిగింది. కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్లర్గా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ సత్యనారాయణను నియమించారు. దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో మొత్తం 22 వైస్ ఛాన్సలర్ల పోస్టులు ఖాళీగా ఉన్నా యని, అందులో 12 పోస్టులకు నియామకాలను రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం రాజ్యసభకు తెలిపారు. అయితే ప్రస్తుతం పూర్తిస్థాయి వీసీలు లేని సెంట్రల్ యూనివర్సిటీలలో బనారస్ హిందూ యూనివర్సిటీ , ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి. కొత్త వైస్ ఛాన్స్లర్లు వీరే.. హరియాణా సెంట్రల్ యూనివర్శిటీ- ప్రొఫెసర్ (డాక్టర్) తంకేశ్వర్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ- ప్రొఫెసర్ సత్ ప్రకాష్ బన్సాల్ జమ్మూ సెంట్రల్ యూనివర్శిటీ - డాక్టర్ సంజీవ్ జైన్ జార్ఖండ్ సెంట్రల్ యూనివర్శిటీ - క్షితి భూçషణ్ దాస్ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ - ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ తమిళనాడు సెంట్రల్ యూనివర్శిటీ - ప్రొఫెసర్ ముత్తుకలింగన్ కృష్ణన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ- డాక్టర్ బసుత్కర్ జె రావు దక్షిణ బిహార్ సెంట్రల్ యూనివర్శిటీ - ప్రొఫెసర్ కామేశ్వర్నాథ్ సింగ్ నార్త్–ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ- ప్రొఫెసర్ ప్రభాశంకర్ శుక్లా గురు ఘాసిదాస్ యూనివర్సిటీ - డాక్టర్ అలోక్ కుమార్ చక్రవల్ మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ- ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్ మణిపూర్ యూనివర్సిటీ - ప్రొఫెసర్ ఎన్. లోకేంద్ర సింగ్ -
ఢిల్లీకి సీఎం స్టాలిన్.. నేడు రాష్ట్రపతితో భేటీ
సాక్షి, చైన్నై: సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాత్రి తమిళనాడు భవన్లో బస చేసి ఆయన సోమవారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలవనున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం ప్రప్రథమంగా గత నెల 17న స్టాలిన్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మిత్రపక్షాల నేతల్ని కలిసి వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం హఠాత్తుగా ఆయన ఢిల్లీ పయనం అయ్యారు. సతీమణి దుర్గా స్టాలిన్, సోదరి, ఎంపీ కనిమొళి, దయానిధి మారన్తో కలిసి చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. స్టాలిన్తో పాటు పలువురు డీఎంకే ఎంపీలు సైతం పయనం అయ్యారు. తమిళనాడు భవన్లో ఆదివారం రాత్రి బసచేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలవనున్నారు. ఈ సందర్భంగా నీట్ మినహాయింపు, రాజీవ్ హంత కుల విడుదల, మేఘదాతు వివాదాలను రాష్ట్రపతి దృష్టికి స్టాలిన్ తీసుకెళ్లనున్నట్టు తెలిసింది. కరుణ చిత్ర పటం.. సెయింట్జార్జ్ కోటలోని అసెంబ్లీ సమావేశ మందిరంలో కామరాజర్, ఎంజీఆర్, జయలలిత సహా 17 మంది నేతల చిత్ర పటాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆగస్టు 7న కరుణానిధి మూడో వర్ధంతిని పురస్కరించుకుని అసెంబ్లీలో ఆయన చిత్ర పట ఆవిష్కరణకు స్టాలిన్ నిర్ణయించినట్టు తెలిసింది.. కరుణ చిత్ర పటాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవి ష్కరణకు నిర్ణయించినట్టు సమాచారం. అందుకే రాష్ట్రపతి అనుమతి కోరడం, ఆహ్వానించేందుకే ఈ ఢిల్లీ పర్యటన అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ పర్యటనకు ముందుగా లయోలా కళాశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో తిరుచ్చికి చెందిన సామాజిక కార్యకర్త, ఇటీవల అనారోగ్యంతో ఉత్తరాది జైలులో మరణించిన స్టన్ స్వామి చిత్ర పటాన్ని స్టాలిన్ ఆవిష్కరించి నివాళులర్పించారు. ఆయన కోసం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. మైనారిటీ కమిషన్ చైర్మన్ పీటర్ అల్ఫోన్స్, ఎంపీలు కనిమొళి, దయానిధిమారన్ పాల్గొన్నారు. -
Ram Nath Kovind: రాష్ట్రపతి కోసం ట్రాఫిక్ నిలిపివేత..మహిళ మృతి
కాన్పూర్(యూపీ): రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రి కాన్పూర్లో ట్రాఫిక్ను నిలిపివేయడంతో ఆ ట్రాఫిక్లో చిక్కుకున్న ఓ మహిళ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది. అఖిలభారత పరిశ్రమల సమాఖ్య కాన్పూర్ చాప్టర్ మహిళా విభాగం చీఫ్ వందన మిశ్రా(50) ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నారు. శుక్రవారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను కాకాదేవ్లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. వారి వాహనం వెళ్తున్న గోవింద్పురీ వంతెన మార్గంలోనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వాహన శ్రేణి వెళ్తోంది. ప్రోటోకాల్లో భాగంగా ఆ మార్గంలో ట్రాఫిక్ను పోలీసులు ఆపడంతో భారీ ట్రాఫిక్జామ్ ఏర్పడింది. అందులో వందన వాహనం చిక్కుకుంది. కాన్వాయ్ వెళ్లాక వందనను ఆస్పత్రికి తరలిలించగా అప్పటికే ఆమె మరణించారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఘటనకు కారకులంటూ ఒక సబ్–ఇన్స్పెక్టర్, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు కాన్పూర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అసీమ్ అరుణ్ చెప్పారు. ఘటనపై క్షమాపణలు చెప్పారు. మృతి విషయం తెల్సి రాష్ట్రపతి కోవింద్ ఆవేదన వ్యక్తంచేశారని చెప్పారు. అంత్యక్రియలకు హాజరై రాష్ట్రపతి తరఫున సానుభూతిని పోలీస్ కమిషనర్ తెలిపారు. -
ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా : రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం-2021 సందర్భంగా రాష్టపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘వేలాది ఏళ్ల క్రితమే మన రుషులు ప్రపంచానికి యోగాను అందించారు. లక్షలాది మందికి ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం, శరీరం, మనస్సు ఐక్యత సాధనం యోగా. ఇది మానవాళికి భారతదేశం ఇచ్చిన ప్రత్యేకమైన బహుమతి. కరోనా వైరస్పై పోరులో కూడా యోగా ఎంతో సహాయపడుతుంది’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. దైనందిన జీవితంలో యోగాభ్యాసం సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం-2021 సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన సతీమణితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ ఏడాది ‘యోగాతో సంపూర్ణ ఆరోగ్యం’ అనే ఇతివృత్తంతో జరుపుకొంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాభ్యాసం చేయాలని ఆయన కోరారు. శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. చదవండి: కశ్మీర్ పార్టీల మల్లగుల్లాలు -
నిరాడంబరంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర 8వ అవతరణ దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. ప్రగతిభవన్లో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అంతకు ముందు ఆయన గన్పార్క్లోని తెలంగాణ అమర వీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో వరుసగా రెండో ఏడాది తెలంగాణ అవతరణ దినోత్సవాలు నిరాడంబరంగా జరిగాయి. ప్రగతిభవన్లో జరిగిన వేడుకల్లో సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ ఎం.మహేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లో జరిగిన ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ విప్లు, ఇతర ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉజ్వల భవిష్యత్తు ఉండాలి: రాష్ట్రపతి తెలంగాణ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేయాలన్న జాతీయ లక్ష్యాన్ని ఇప్పటికే తెలంగాణ నెరవేర్చిందని గుర్తు చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణ పురోగతి మరింతగా విస్తరించాలని కోరుకున్నారు. ఘనమైన చరిత్రకు నిలయం: ఉప రాష్ట్రపతి ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు తెలంగాణ నిలయమని ఉప రాష్ట్రపతి వెంకయ్య పేర్కొన్నారు. సహజ వనరులతో, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన పురోగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల కోసం ప్రార్థిస్తున్నా: ప్రధాని విభిన్న సంస్కృతులతో పాటు ఎన్నో రంగాల్లో విశేషంగా రాణించినటువంటిæ కష్టపడి పనిచేసే వ్యక్తులను కలిగి ఉండడం తెలంగాణకు వరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలి పారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తాను ప్రార్థిస్తున్నానన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం బీఆర్కేఆర్ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు, ఉద్యోగులకు రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. -
రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేయండి: సీఎం స్టాలిన్
చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులందరినీ జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని కోరుతూ తమిళనాడు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. ఈ విషయమై తమిళ నాడు ప్రభుత్వం 2018లో చేసిన సిఫారసు లను ఆమోదించాలని కోరారు. నిందితులు మూడు దశాబ్దాలుగా జైలు జీవితం అనుభవి స్తున్నందున వారిని ముందుగానే విడుదల చేయాలని తాము కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజాభిప్రాయం కూడా ఇదేనని తెలిపారు. ఈ నెల 19వ తేదీన రాసినట్లుగా ఉన్న ఈ లేఖ గురువారం మీడియాకు అందింది. రాజీవ్ హత్య కేసులో వి.శ్రీహరన్ అలియాస్ మురుగన్, అతని భార్య నళిని, శాంతన్, ఏజీ పెరియవాలన్, జయకుమార్, రాబర్ట్ పయాస్, రవిచంద్రన్ అనే దోషులకు విధించిన జైలు శిక్షను తగ్గించి ముందుగానే విడుదల చేయాలంటూ తమిళనాడు ప్రభుత్వం 2018 సెప్టెంబర్లో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్కు సిఫారసు చేసిందని స్టాలిన్ గుర్తు చేశారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబదూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబర్ దాడిలో అసువులు బాసిన విషయం తెలిసిందే. -
రాష్ట్రపతి ఆమోదం: 95% ఉద్యోగాలు స్థానికులకే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 95% స్థానికులతోనే ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం అయింది. అన్ని రకాల పోస్టుల్లోనూ ఓపెన్ కోటా 5 శాతం మాత్రమే ఉండనుంది. ఈ మేరకు రాష్ట్రంలో 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లతో కూడిన కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. పోలీసు విభాగం మినహా ఇతర శాఖలన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఇక ముందు కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. నిజానికి 2018లోనే కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం లభించినా.. తర్వాత ప్రభుత్వం మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది, వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్కు మార్చింది. ఈ మార్పులకు కూడా రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి రావడంతో ఇన్నాళ్లు ఆగాల్సి వచ్చింది. తాజాగా రాష్ట్రపతి ఆమోదించడంతో కొత్త జోనల్ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటిదాకా చాలా పోస్టులు ఓపెన్ రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని కేటగిరీల్లో 100 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలోనే ఉండటం గమనార్హం. గ్రూప్–1లోని డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ వంటి రాష్ట్రస్థాయి (స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరీ) పోస్టుల్లో 100 శాతం ఓపెన్ కోటానే. కొన్ని రాష్ట్రస్థాయి పోస్టుల్లో 50 శాతం ఓపెన్ కోటా కిందే ఉన్నాయి. ఈ పోస్టుల కోసం ఇక్కడివారితోపాటు ఇతర రాష్ట్రాల వారూ పోటీపడి, ఉద్యోగాలు దక్కించుకునేవారు. ఇక గ్రూప్–1 కేటగిరీలోని మిగతా పోస్టుల్లోనూ కొన్ని మల్టీజోన్, మరికొన్ని జోనల్ పోస్టులు ఉండేవి. మల్టీజోన్ పరిధిలో 40 శాతం పోస్టులు, జోనల్లో 30 శాతం, జిల్లా స్థాయిలో 20 శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉండేవి. వాటిల్లో ఇతర రాష్ట్రాల వారు, ఇతర జోన్ల వారు పోటీపడి ఉద్యోగాలు పొందేవారు. స్థానికులకు అవకాశాలు తక్కువగా ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెస్తున్న కొత్త జోనల్ విధానంతో.. ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. జిల్లా పోస్టులతోపాటు 61 కీలక విభాగాల్లోని 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కనున్నాయి. 5 శాతం పోస్టులు మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. స్టేట్ కేడర్ నుంచి మార్చడంతో.. కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 34 రకాల స్టేట్ కేడర్ (స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరీ) పోస్టులను డైరెక్టు రిక్రూట్మెంట్ విధానం నుంచి తొలగించి.. మల్టీ జోనల్ పరిధిలోకి తెచ్చింది. కొన్ని కేటగిరీల్లో కొత్త జోనల్, జిల్లా విధానం అమల్లోకి వస్తే.. ఆ ఉద్యోగాలు పొందిన వారు సర్వీసు పరంగా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియను మల్టీ జోనల్ స్థాయిలో చేసినా.. పోస్టింగ్లు మాత్రం రాష్ట్ర స్థాయి కేడర్లో ఇవ్వాలని భావిస్తోంది. తద్వారా కన్ఫర్డ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్కు ప్రమోట్ అయ్యే వారికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ మార్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల్లో అత్యధికం పదోన్నతులపైనే భర్తీ కానున్నాయి. మల్టీజోన్ పరిధిలోకి వచ్చే స్టేట్ కేడర్ పోస్టులు డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, రీజనల్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్, కోఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, లే సెక్రటరీ అండ్ గ్రేడ్–2 ట్రెజరర్, అకౌంట్స్ ఆఫీసర్; అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఎంపీడీవో, లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ డైరెక్టర్, డీఎస్పీ (కమ్యూనికేషన్స్), అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, స్టాటిస్టిక్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్, మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఆయుష్ డిపార్ట్మెంట్ లెక్చరర్స్ జోనల్ పరిధిలోకి వచ్చే గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులివీ.. గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, కో-ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, ఇండస్ట్రీస్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, హార్టికల్చర్ ఆఫీసర్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ట్యూటర్, ఫిజికల్ డైరెక్టర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్. మల్టీజోన్లు.. వాటి పరిధిలోని జోన్లు మల్టీజోన్-1: కాళేశ్వరం-1, బాసర-2, రాజన్న-3, భద్రాద్రి-4 మల్టీజోన్-2: యాదాద్రి-5, చార్మినార్-6, జోగులాంబ-7 -
ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్యం మెరుగుపడింది. ఎయిమ్స్లోని ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డులోకి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రపతి ఆరోగ్యం మెరుగుపడిందని, ఆయన కోలుకుంటున్నారని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురయిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మార్చి 27వ తేదీన సైనిక (ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్) ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆ ఆస్పత్రి వర్గాలు ఢిల్లీలోని ఎయిమ్స్కు వెళ్లాలని సూచించాయి. సాధారణ వైద్య పరీక్షల అనంతరం రామ్నాథ్ కోవింద్కు బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు రాష్ట్రపతి రామ్నాథ్కు మర్చి 30వ తేదీన బైపాస్ సర్జరీ విజయవంతంగా చేసిన విషయం తెలిసిందే. President Kovind was shifted from the ICU to a special room in the AIIMS today. His health has been improving continuously. Doctors are constantly monitoring his condition and have advised him to take rest. — President of India (@rashtrapatibhvn) April 3, 2021 చదవండి: రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్ సర్జరీ -
రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్ సర్జరీ
న్యూఢిల్లీ: ఛాతీలో నొప్పితో అనారోగ్యానికి గురయిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇటీవల ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం మంగళవారం ఆయనకు బైపాస్ సర్జరీ విజయవంతంగా చేశారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రపతి ఆరోగ్యం కుదుటగా ఉందని.. కోలుకుంటున్నారని వెల్లడించింది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ వైద్యులను ఆయన అభినందించారు. ఈనెల 27వ తేదీన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఛాతీ నొప్పితో సైనిక (ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్) ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆ ఆస్పత్రి వర్గాలు ఢిల్లీలోని ఎయిమ్స్కు వెళ్లాలని సూచించాయి. సాధారణ వైద్య పరీక్షలు రావడంతో రామ్నాథ్ కోవింద్కు బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు రాష్ట్రపతి రామ్నాథ్కు బైపాస్ సర్జరీ విజయవంతంగా ముగించారు. దీనిపై కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. ‘ఢిల్లీలోని ఎయిమ్స్లో రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్ సర్జరీ జరిగింది. విజయవంతంగా సర్జరీ చేసిన వైద్యులను అభినందిస్తున్నా. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ డైరెక్టర్తో మాట్లాడి తెలుసుకున్నా. రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని రాజ్నాథ్ సింగ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. The President of India, Shri Ramnath Kovind has undergone a successful bypass surgery at AIIMS, Delhi. I congratulate the team of Doctors for successful operation. Spoke to Director AIIMS to enquire about Rashtrapatiji’s health. Praying for his well-being and speedy recovery. — Rajnath Singh (@rajnathsingh) March 30, 2021 -
10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి..
ముంబై: మహమ్మారి వైరస్ బాధితులు ఉన్న సన్రైజ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి పది మంది మృతిచెందారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాండూప్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘క్షమించండి’ అంటూ బాధిత కుటుంబసభ్యులను సీఎం థాకరే కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో వెంటిలేటర్పై ఉన్న వారే మరణించారని చెప్పారు. ఆస్పత్రి భవనాన్ని శుక్రవారం సీఎం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన విషయం తెలుసుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులు వెంటనే కోలుకోవాలని ప్రార్థించారు. సన్ రైజ్ ఆస్పత్రిలో మొత్తం 76 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించడంతో వెంటిలేటర్పై ఉన్న వారు బయటకు వెళ్లలేని పరిస్థితి కావడంతో వారంతా అగ్నికీలల్లో చిక్కుకుపోయారు. దీంతో వారు సజీవ దహనం అయ్యి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని 23 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గతంలో రక్షణ చర్యలు లేవని ఈ ఆస్పత్రికి మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు అందించారు. అయినా కూడా ఆస్పత్రి నిర్వాహకులు, భవన యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించింది. Deeply mourn the loss of lives in a fire accident at a hospital in Bhandup, Mumbai. My thoughts and prayers are with the families of the victims of this tragedy. I pray for speedy recovery of the injured. — President of India (@rashtrapatibhvn) March 26, 2021 -
ఇదీ రైతు పోరాటమే
‘ఎకార్డింగ్ టు ది గివెన్ సర్వే నెంబర్.. దీజ్ ప్యాడీ ఫీల్డ్స్ బిలాంగ్స్ టు పటేదార్ యూ నో..’ అన్నాడు రెవిన్యూ ఆఫీసర్! అతడేమన్నాడో బసంతీబాయ్కి అర్థం కాలేదు. ‘ఈ పొలం నాది. పొలానికి వచ్చిపోయే దారులన్నీ పరమానంద్ పటేదార్, ఆయన కొడుకులు మూసేశారు. దారులు తెరిపించండి’ అని వేడుకుంది. ‘పొలం నీదైతే కావచ్చు. పొలానికి వెళ్లే ఏదారీ నీ దారి కాదు’ అన్నాడు ఆఫీసర్! పొలానికి దారి లేకుంటే బతికే దారీ లేనట్లే బసంతీబాయ్ కుటుంబానికి. పై అధికారులకు ఉత్తరం రాసింది. ఎవరూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కి లెటర్ పెట్టింది. ఆయన దగ్గర్నుంచీ ఎవరూ రాలేదు. ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించుకుంది. ఆ లేఖ చేరిందీ లేనిదీ తెలియదు. చివరికి రాష్ట్రపతి రామ్నా£Š కోవింద్కి లెటర్ రాసింది. ముందరి ఉత్తరాల్లో తన పొలానికి వెళ్లే దారులను తెరిపించండి అని రాసిన బసంతీబాయ్ రాష్ట్రపతికి రాసిన ఉత్తరంలో అలా రాయలేదు. ఎలా రాస్తే ఆయన తనను పట్టించుకుంటాడని అనుకుందో అలా రాసింది. ‘‘అయ్యా.. మా ఇంటికి కొద్ది రూరంలో ఉన్న నా పొలానికి రోజూ వెళ్లి రావడానికి నాకొక హెలికాప్టర్ అవసరం అయింది. హెలికాప్టర్ను కొనడానికి లోన్ మంజూరు చేయించండి. అలాగే హెలికాప్టర్ నడిపే లైసెన్స్ ఇప్పించండి’’ అని విన్నవించుకుంది. రాష్ట్రపతి నుంచి ఇంకా ఏమీ సమాధానం రాలేదు. వచ్చేవరకు ఆమె కుటుంబానికి పస్తులే. ఆ పొలమే ఆమె జీవనాధారం. ∙∙ షగర్ తాలూకాలోని అగర్ గ్రామ రైతు బసంతీబాయ్. మధ్యప్రదేశ్లోని మండ్సార్ జిల్లాలో ఉంది ఆ గ్రామం. అక్కడే ఓ రెండెకరాల పొలం ఉంది బసంతీబాయ్కి. అందులో పండించుకునే ధాన్యం, కూరగాయలే ఆ కుటుంబాన్ని నడుపుతున్నాయి. ఉదయం వెళ్లడం, పొలం పనులు చేసుకుని చీకటి పడే వేళకు ఇంటికి చేరడం. ఇంట్లోని పశువులు కూడా ఆమె చేతి పలుగు–పారల్లా ఆమె వెంటే పొలానికి వెళ్లివచ్చేవి. అకస్మాత్తుగా ఇప్పుడు పొలానికి దారి లేకుండా పోయింది! పొలం కన్నా దారే ఇప్పుడు ఆమె ప్రాణాధారం అన్నంతగా అయింది. ఆవుదూడ దగ్గరికి వెళ్లనివ్వకపోతే ఆవు ఎంత గింజుకుంటుందో.. ఆవులాంటి పొలం దగ్గరకి తనను వెళ్లనివ్వకుండా చేసినందుకు బసంతీ అంత విలవిల్లాడింది. పటేదార్, ఆయన కొడుకులు పొలానికి వెళ్లే దారులన్నీ మూసేశారు. అడిగితే, ఆ దారులు తమ పొలం లోనివి అన్నారు. ఆమెను అటుగా రానివ్వలేదు. తన పొలంలోకి తనను పోనివ్వడంలేదు. వాళ్లకేదో ఆలోచన ఉన్నట్లు ఆమెకు అర్థమైంది. దారుల పేరు చెప్పి పొలాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫీసులకు కాళ్లరిగేలా తిరిగితే మనం గల్లీ నుంచి ఢిల్లీకి అంటుంటాం. అక్కడివాళ్లు ‘చౌపాల్ నుంచి భోపాల్’ అంటారు. అలా అన్ని ఆఫీసులకు, అందరు ఆఫీసర్ల దగ్గరకు తిరిగి, ఎవరికీ పట్టకపోవడంతోనే సీఎంకి, ప్రధానికి, రాష్ట్రపతికి ఉత్తరాలు రాసింది బసంతీబాయ్. రాష్ట్రపతికి ఆమె రాసిన ఉత్తరం వైరల్ అవుతోంది తప్పితే.. సహాయానికెవరూ రాలేదు. ఆమె సమస్యేమిటో వెళ్లి చూడమని జిల్లా కలెక్టర్ మనోన్ పుష్ప మహరాజ్ ఒక బృందాన్నయితే పంపారు కానీ, ఆ మహరాజ్ గారి టీమ్కు బసంతీరాయ్ బాధేమిటో అర్థం కాలేదు. ‘అంతా సవ్యంగానే ఉంది. దారులన్నీ తెరిచే ఉన్నాయి’ అని కలెక్టర్కి నివేదించారు! ఉన్నదారిని మూసేయడం ఏంటని వాళ్లు అడిగి ఉంటే బాధితురాలికి న్యాయం జరిగి ఉండేదేమో. పటేదార్ ఆ టీమ్ వచ్చినప్పుడు తెరిచి ఉంచిన దారిలో పొలానికి వెళ్లొళ్చి, ‘దారి తెరిచే ఉంది’ అని రిపోర్ట్ రాశారు. ఇక సమస్యేం కనిపిస్తుంది! ఈ లోకంలో ఒక చిన్న ప్రాణి బతకడానికి ఎన్ని పెద్ద జీవాలను ఎదుర్కోవాలో బసంతీబాయ్కి తెలియంది కాదు కానీ, రాష్ట్రపతి ఏమైనా చేస్తాడా అని ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంది. రాష్ట్రపతికి రాసిన ఉత్తరాన్ని చూపుతున్న బసంతీబాయ్ -
విద్యతోనే ఉన్నత శిఖరాలు
మదనపల్లె/సదుం (చిత్తూరు జిల్లా): విద్యార్థి దశలో ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలని, విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందని రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ అన్నారు. సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, పద్మభూషణ్ ముంతాజ్ అలీ (శ్రీఎం) ఆహ్వానం మేరకు రాష్ట్రపతి కోవింద్ ఆదివారం మదనపల్లె వచ్చారు. సత్సంగ్ ఫౌండేషన్లో భారత్ యోగా విద్యాకేంద్రాన్ని ప్రారంభించి ఆవరణలో మొక్కలు నాటారు. 38 పడకల స్వస్థ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సదుం మండలం గొంగివారిపల్లెలో సత్సంగ్ ఫౌండేషన్కు చెందిన పీపుల్స్ గ్రోవ్ స్కూల్ను సందర్శించిన రాష్ట్రపతి అక్కడి విద్యార్థులతో మాట్లాడుతూ.. విద్యార్థులంతా గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యతో పాటు వ్యాయామం ఎంతో అవసరమని, ప్రతిరోజు ఉదయం యోగా చేయడాన్ని విద్యార్థులు అలవాటు చేసుకోవాలని సూచించారు. యోగా, ధ్యానం చేయడం వల్ల ఆలోచనా శక్తి మరింత మెరుగుపడుతుందని తెలిపారు. అట్టడుగు వర్గాల అభివృద్ధికి నాణ్యమైన ఉచిత విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నందుకు ఆశ్రమ నిర్వాహకులను అభినందించారు. పాఠశాలలో నూతనంగా నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్ అంతకుముందు ఆశ్రమ శివాలయంలో పూజలు నిర్వహించి హారతి స్వీకరించారు. సత్సంగ్ ఫౌండేషన్ను సందర్శించినందుకు గుర్తుగా ఆశ్రమ ఆవరణలో రావి మొక్క నాటారు. సుమారు 4 గంటలపాటు రాష్ట్రపతి పర్యటన సాగింది. విద్యార్థులతో మాట్లాడుతున్న రాష్ట్రపతి కోవింద్ గొంగివారిపల్లెలో పీపుల్స్ గ్రోవ్ స్కూల్ విద్యార్థులతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖాముఖి ఇలా సాగింది. విద్యార్థి: రాష్ట్రపతిగా మీకు అనుభవంలోకి వచ్చిన సంఘటన, నేర్చుకున్న విలువలు ఏవైనా చెప్పగలరా? రాష్ట్రపతి: ప్రతి మనిషీ జీవితాంతం నిత్య విద్యార్థే. విద్యార్థిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే.. జీవితం అనేక సవాళ్లు, ఒడిదుడుకులతో కూడుకుని ఉంటుంది. నేను నేర్చుకున్నదేమంటే.. ఏదైనా పదవి, ప్రతిష్ట వ్యక్తిగతంగా గుర్తింపులు తీసుకురావు. అనుకున్నది సాధించేందుకు కఠోర శ్రమ, నిజాయితీ, నిబద్ధత అవసరం. అవే పదవికి వన్నె తెస్తాయి. రాష్ట్రపతిగా నాకు లభించిన గొప్ప అవకాశం ప్రజలకు సేవ చేయడం. సత్సంగ్ ఫౌండేషన్లో రావిమొక్కను నాటి నీళ్లు పోస్తున్న రాష్ట్రపతి కోవింద్, సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ ఎం. విద్యార్థి: గతంలో పనిచేసిన దేశాధ్యక్షుల్లో ఎవరి నుంచైనా స్ఫూర్తి పొందారా.. ఏ లక్షణాలు మిమ్మల్ని ప్రభావితం చేశాయి? రాష్ట్రపతి: దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో నేను చేసిన ప్రతిజ్ఞను బలంగా విశ్వసిస్తాను. భారత రాజ్యాంగ విలువలను కాపాడుతానని, పార్లమెంటరీ చట్టాలను గౌరవిస్తానని, దేశరక్షణ, సమగ్రతకు పాటుపడతానన్నాను. గాంధీజీ చెప్పినట్టుగా మంచి గుణం నిజాయితీ. నాకు తెలిసిందల్లా అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా చేసుకువెళ్లడమే. ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో స్ఫూర్తిని పొందాల్సిందే. పరిసరాలు, సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది జీవితంలో ముందుకెళ్లాలి. రాష్ట్రపతి మాట్లాడుతూ.. ‘ప్రతి విద్యార్థికి నేనిచ్చే సలహా ఏమంటే.. విద్య మనిషికి జ్ఞానాన్ని ఇస్తుంది. విద్య ప్రాథమిక లక్షణం సత్యం, అహింస, సర్వమత ప్రేమ. ఇంటి నుంచే గౌరవమిచ్చే సంప్రదాయం రావాలి. పెద్దలను గౌరవించడం, పేద, ధనిక తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా, ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడాలనే భావన ప్రతి ఒక్కరిలో చిన్నప్పటి నుంచే రావాలి. ప్రతి ఒక్కరూ తరగతి గదుల్లో పాఠాలు అర్థం కాక, ట్యూషన్లను ఆశ్రయిస్తున్నారంటే విద్యా విధానంలో లోపాలు ఉన్నట్టు అంగీకరించాలి’ అని అన్నారు. స్వస్థ ఆస్పత్రి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతికి స్వాగతం పలికిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రపతి కోవింద్కు సీఎం వైఎస్ జగన్ చిప్పిలిలోని హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. కోవింద్కు పుష్పగుచ్ఛాన్ని అందజేసి దుశ్శాలువతో సత్కరించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు నవాజ్బాషా, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, వెంకటేగౌడ, సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ ఎం తదితరులు ఉన్నారు. పర్యటన ముగిసిన అనంతరం రాష్ట్రపతి బెంగళూరుకు పయనమయ్యారు. -
రాష్ట్రపతికి సీఎం జగన్ ఘన స్వాగతం ఫొటోలు
-
రాష్ట్రపతికి సీఎం జగన్ ఘన స్వాగతం
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హెలికాఫ్టర్ ద్వారా మదనపల్లెకి సమీపంలోని చిప్పిలిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మదననపల్లెలోని సత్సంగ్ ఆశ్రమానికి వెళ్లిన రామ్నాథ్ కోవింద్.. భారత్ యోగా విద్యా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆశ్రమంలో యోగా శిక్షకులు, విద్యార్థులతో రామ్నాథ్ మాట్లాడారు. యోగాభ్యాసంలో అనుభవాలను ఆశ్రమ విద్యార్థులు వివరించారు. (చదవండి: హైకోర్టులో నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాష్ట్రపతి ప్రసంగంలో విభజన హామీల ప్రస్తావన ఏదీ!
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేసిన ప్రసంగానికి సవరణలు ప్రతిపాదిస్తామని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన విభజన హామీల ప్రస్తావన రాష్ట్రపతి ప్రసంగంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మగడ్డను చంద్రబాబు చంద్రముఖిలా ఆవహించారని, టీడీపీ కమిషనర్లా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఏపీ భవన్లో వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్రెడ్డి, రెడ్డెప్ప, సత్యవతి, మాధవి, బెల్లాన చంద్రశేఖర్, అయోథ్య రామిరెడ్డి, బ్రహ్మానందరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ అంశాలేవీ.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో వైఎస్సార్సీపీ నుంచి కొన్ని సవరణలు ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నాం. ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన ప్రొవిజన్స్లో అమలుకు నోచుకోని అంశాలపై సవరణలు ప్రతిపాదిస్తాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆరు దఫాలు, హోంమంత్రి అమిత్షాను 10 దఫాలు కలిసి విజ్ఞప్తి చేశాం. అయినా అమలు కాలేదు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు అనుమతులకు నోచుకోలేదు. విశాఖపట్నం రైల్వే జోన్ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఈ మూడు అంశాలపై ప్రతిపాదనలు చేస్తాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ కనీస మద్దతు ధర కల్పించాలని కోరతాం. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. నదులను అనుసంధానం చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి రాష్ట్రాల జియోగ్రాఫికల్ ఆధారంగా నదుల్లో ప్రవాహ జలాలను విభజించి కేటాయింపులు చేయాలని కోరతాం. రైతుల కోసం జాతీయ కమిషన్ (నేషనల్ కమిషన్ ఫర్ ఫార్మర్స్) అనే ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్లమెంటుకు సమర్పించాం. దీన్ని కూడా ప్రస్తావిస్తాం. కరోనా కారణంగా పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు దెబ్బతిన్నాయి. బడ్జెట్లో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుని అభివృద్ధి దిశగా ఉండేలా కేంద్రం చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులకు ఆదాయపు పన్ను స్టాండర్డ్ డిడక్షన్ రూ.లక్షకు పెంచాలని కోరనున్నాం. మరో 13 అంశాలపై కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు పొందటం, రాష్ట్రానికి వనరులు చేకూర్చడం, సమస్యలు పరిష్కరించడం కోసం కృషి చేస్తాం. శరీరం మాత్రమే నిమ్మగడ్డది.. ఆత్మ ‘చంద్ర’ముఖిది కరోనా కేసులు లేనప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు డైరెక్షన్లో.. ప్రభుత్వానికి చెప్పకుండానే నిలిపివేసిన వ్యక్తి నిమ్మగడ్డ రమేష్. ఇప్పుడు చంద్రబాబుతో లాలూచీ పడి కరోనా తగ్గకపోయినా హఠాత్తుగా పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇంత చౌకబారుగా వ్యవహరించటం దురదృష్టకరం. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. దానికి పార్టీల గుర్తులు ఉండవు. అటువంటిది 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకు ఏవిధంగా మేనిఫెస్టో విడుదల చేస్తారు. ఆ మేనిఫెస్టోలో పైన మూడు బొమ్మలు.. కింద రెండు బొమ్మలు పెట్టారు. అందులో మొదటి బొమ్మ మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన లోకేశ్ది, రెండోది అల్లుడి చేతిలో వెన్నుపోటుకు గురై మరణించిన ఎన్టీఆర్ది. మూడోది ఆలయాల్లో దొంగతనాలు చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, దొంగతనాల సంఘానికి ఉపాధ్యక్షుడు అయిన అచ్చెన్నాయుడుది. నాలుగోది వెన్నుపోటుదారుల జాతీయ సంఘం అధ్యక్షుడు చంద్రబాబు ఫొటోను ముద్రించుకున్నారు. పార్టీల రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలను రాజకీయం చేయడం, ఈ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం చట్ట విరుద్ధం. చంద్రబాబు మీద ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిమ్మగడ్డ మతిభ్రమించిన వ్యక్తి. తక్షణం ఆయన మానసిక పరిస్థితిపై మెడికల్ బోర్డుకు రిఫర్ చేసి, ఆయన మానసిక స్థితి సరిగా ఉందా.. లేదా అనేది పరిశీలన జరపాలి. మతిభ్రమించినట్టు వ్యవహరిస్తున్న నిమ్మగడ్డను కచ్చితంగా ఎర్రగడ్డ ఆస్పత్రికి పంపించాలి. -
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
-
జమ్మికుంట సీఐకి ‘ఉత్తమ్ జీవన్ రక్ష’
సాక్షి, న్యూఢిల్లీ: సాటి మనుషుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్రం ఇచ్చే జీవన్ రక్ష పతకాల ప్రదానానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇందులో ఉత్తమ్ జీవన్ రక్ష పతకానికి ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన సీఐ కోరిపల్లి సృజన్రెడ్డి కూడా ఉన్నారు.. సర్వోత్తమ్ జీవన్ రక్ష పతకం, ఉత్తమ్ జీవన్ రక్ష పతకం, జీవన్ రక్ష పతకం విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రదానం చేస్తోంది. 2020 సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా మొత్తం 40 మందిని ఈ పతకాలకు ఎంపిక చేశారు. సర్వోత్తమ్ జీవన్ రక్ష పతకాన్ని ఒకరు, ఉత్తమ్ జీవన్ రక్ష పతకాన్ని 8 మంది, జీవన్ రక్ష పతకాన్ని 31 మంది అందుకోనున్నారు. వీరిలో కేరళకు చెందిన ముహమ్మద్ హుష్రీన్ (మరణానంతర)కు సర్వోత్తమ్ జీవన్ రక్ష పతకాన్ని కేంద్రం ప్రకటించింది. ఇద్దరిని కాపాడినందుకు.. ఇక 2019 మే 28న కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లిలో చేద బావి పూడిక కోసం బావిలోకి దిగి స్పృహ కోల్పోయిన ఇద్దరు గ్రామస్తులను జమ్మికుంట టౌన్ సీఐ సృజన్రెడ్డి కాపాడారు. ఘటనపై సత్వరమే స్పందించిన ఆయన బావిలోకి దిగి అగ్నిమాపక సిబ్బంది సాయంతో వారిని రక్షించారు. దీనిని గుర్తించిన కేంద్రం సృజన్రెడ్డిని 2020 సంవత్సరానికి గాను ఉత్తమ్ జీవన్ రక్ష పతకానికి ఎంపిక చేసింది. -
29 నుంచి బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: ఈ నెల 29వ తేదీన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారని గురువారం లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు తెలిపాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. సమావేశాలు ఏప్రిల్ 8వ తేదీ వరకు జరుగుతాయి. స్టాండింగ్ కమిటీలు వివిధ శాఖలకు కేటాయించాల్సిన గ్రాంట్ల పరిశీలన, నివేదికలను సిద్ధం చేసేందుకు ఉభయ సభలు ఫిబ్రవరి 15వ తేదీన వాయిదాపడి తిరిగి మార్చి 8వ తేదీన సమావేశమవుతాయని తెలిపింది. కోవిడ్–19 నిబంధనల దృష్ట్యా గత సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా షిఫ్టుల వారీగా రాజ్యసభ మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్సభ కార్యక్రమాలు జరుగుతాయి. లోక్సభ కార్యక్రమాలు రోజులో కనీసం ఐదు గంటలపాటు కొనసాగుతాయని లోక్సభ సెక్రటేరియట్ తెలిపింది. ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. గత సమావేశాలు తక్కువ కాలం జరగడంతో ప్రశ్నోత్తరాల సమయాన్ని తీసివేశారు. సభ్యులు ప్రైవేట్ బిల్లులను ఎప్పటిమాదిరిగానే శుక్రవారాల్లో మధ్యాహ్నం సమయంలో ప్రవేశపెట్టేందుకు కూడా ఈ దఫా అవకాశం ఇస్తున్నారు. చదవండి: కరోనా వ్యాక్సినేషన్ తొలి టీకా.. వీడియో ట్రాఫిక్ జామ్.. నెలకు రూ.2లక్షల ఆదాయం -
గవర్నర్ను వెంటనే తొలగించండి
కోల్కతా: రాజ్యాంగ పరిరక్షణలో గవర్నర్ వైఫల్యం చెందారని, తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాము సంతకాలు చేసిన మెమొరాండంను రాష్ట్రపతి భవన్కు పంపించారు. కాగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య గత కొన్నిరోజులుగా విమర్శల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాపై దాడి నేపథ్యంలో ప్రభుత్వాన్ని, పోలీసుల తీరును తప్పుబడుతూ గవర్నర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఔట్సైడర్స్ అంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి మమత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన.. పద్ధతిగా మాట్లాడాలంటూ హితవు పలికారు. అదే విధంగా పోలీసులు తీరును విమర్శిస్తూ.. ఈ ఘటనకు సంబంధించి కేంద్రానికి నివేదిక సమర్పించారు. ఇక అప్పటి నుంచి ప్రభుత్వానికి, గవర్నర్కు మధ్య మరింతగా అగాధం పెరిగింది. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడటం, అదే సమయంలో వారిని పార్టీలో చేర్చుకుని బీజేపీ బలపడటం వంటి పరిణామాలతో అధికార టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలే కాషాయ కండువా కప్పుకొన్న సువేందు అధికారి గతవారం గవర్నర్తో భేటీ అయ్యారు. రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా తనపై అక్రమ కేసులు బనాయించేందుకు మమత సర్కారు ప్రయత్నిస్తోందని, ఇందులో జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. తాను టీఎంసీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, అందుకే ప్రతీకారంగా ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదు చేశారు. (చదవండి: రౌండప్ 2020: రంగుమారిన రాజకీయం) ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ విషయంపై ఘాటుగా స్పందించిన తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ గవర్నర్ జగదీప్ ధంకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తొలగించాల్సిందిగా రాష్ట్రపతిని కోరినట్లు వెల్లడించారు. ఈ మేరకు తనతో పాటు సుదీప్ బందోపాధ్యాయ్, డెరెక్ ఒ బ్రెయిన్, కళ్యాణ్ బెనర్జీ, కకోలి ఘోష్ దస్తీదార్ తదితరులు సంతకం చేసిన మెమొరాండంను సమర్పించినట్లు పేర్కొన్నారు. ‘‘రాజ్యాంగాన్ని కాపాడటంలో గవర్నర్ వైఫల్యం చెందారు. న్యాయ వ్యవస్థ ఆమోదించిన చట్టాలను పదే పదే ఉల్లంఘిస్తున్నారు’’ అని ఆరోపించారు. -
2021 నుంచి అయినా ఫిట్గా ఉందాం : రాష్ట్రపతి
న్యూఢిల్లీ : వచ్చే సంవత్సరం నుంచైనా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కోరారు. డయ్యూలో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న ఆయన సోమవారం ఘోగ్లా బీచ్లో జాగింగ్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. ఒక కష్టతరమైన ఏడాదిని పూర్తిచేసుకొని 2021లోకి అడుగుపెడుతన్న సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి ప్రయత్నం చేద్దాం అని ట్వీట్ చేశారు. (సీఎం రావత్కు అస్వస్థత, ఎయిమ్స్కు తరలింపు ) Jogged on the pristine Ghoghla beach in Diu this morning. As we enter 2021, after a difficult year that has tested us all, let us rise together and make an endeavour to remain fit and healthy. May the coming year bring good health and prosperity in our lives. pic.twitter.com/dcQjZxB4Xk — President of India (@rashtrapatibhvn) December 28, 2020 ఆదివారం ఘోగ్లా బీచ్ను సందర్శించిన ఆయన డయ్యూలో లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా డయ్యూలో కల్చరల్ హెరిటేజ్ను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు, స్వచ్ఛత కోసం స్థానిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రామ్నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఇటీవలే నిష్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాంతానికి "బ్లూ ఫ్లాగ్" ధృవీకరణ పత్రాన్ని అందజేసిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా రామ్నాథ్ శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్తాపన చేశారు. నాలుగు రోజుల పర్యటన అనంతరం నేడు ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. (ఆ పదవిపై ఆసక్తి లేదు: శరద్ పవార్) -
కోట్లాది జీవితాలు రోడ్డున పడ్డాయి: రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. రైతుల ఉద్యమంపై రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, నాయకుల ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు విజ్ఞాపన పత్రం అందజేసింది. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి, ఆ పత్రాలను రాష్ట్రపతికి అందజేశారు. అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడూతూ.. నూతన చట్టాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనక్కి తీసుకోకపోతే దేశం ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు. ప్రధాని మోదీ రైతుల కోసం కాకుండా కార్పొరేటర్ల కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. కేవలం ఇద్దరు,ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసం దేశాన్ని కష్టాల్లోకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. మోదీ నిర్ణయాలతో కోట్లమంది జీవితాలు రోడ్డునపడుతున్నాయి విమర్శించారు. దేశంలో పెను విధ్వంసానికి దారితీసే నిర్ణయాలు మోదీ ప్రభుత్వం తీసుకుంటుదని దుయ్యబట్టారు. రైతులు తమ డిమాండ్ల కోసం చట్టబద్ధంగా పోరాడుతున్నారని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు. -
అహ్మద్ పటేల్ కన్నుమూత
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్నేత, వ్యూహకర్త అహ్మద్పటేల్(71) గుర్గావ్లో కన్నుమూశారు. నెలరోజులుగా ఆయన కరోనా సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన్ను ఈ నెల 15న ఆస్పత్రిలో చేర్చారు. అయితే చికిత్సకు అవయవాలు స్పందించని కారణంగా బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించినట్లు ఆయన కుమారుడు ఫైజల్ తెలిపారు. çపటేల్ మృతిపట్ల రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత సోనియా, రాహుల్తో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ప్రస్తుతం పటేల్ గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. మూడు పర్యాయాలు లోక్సభకు ఎన్నికైన ఆయన ఐదు దఫాలుగా రాజ్యసభకు ఎన్నికవుతూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మూడు దఫాలుగా పటేల్ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన స్వగ్రామం పిరమన్లో పటేల్ అంత్యక్రియలు జరుగనున్నాయి. ‘కాంగ్రెస్పార్టీకి జీవితాన్ని అంకింతం చేసిన ఒక కీలక నేతను కోల్పోయాము. భర్తీ చేయలేని ఒక సహచరుడు, నమ్మకస్తుడు, స్నేహితుడిని కోల్పోయాను’ అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆపదలు దాటించే అహ్మద్ భాయ్ స్నేహితులు ‘ఏపీ’ లేదా ‘బాబూ భాయ్’అని పిలుచుకునే అహ్మద్ పటేల్ సోనియాకు 2001 నుంచి రాజకీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి ఆపద వస్తే అహ్మద్వైపే అధినేత్రి చూసేవారు. కీలకాంశాల్లో పార్టీలో ఏకాభిప్రాయం సాధించే చతురుడుగా పటేల్ పేరుగాంచారు. ఏపీకి అన్ని పార్టీల్లో దోస్తులు, అభిమానులు ఉన్నారు. మూడు నెలల క్రితమే పార్టీలో తలెత్తబోయిన ఒక తిరుగుబాటును సైతం ఆయన చాకచక్యంగా సద్దుమణిగేలా చేశారు. పటేల్ ప్రస్థానం 1949 ఆగస్టులో జన్మించిన పటేల్ రాజకీయ ప్రస్థానం గుజరాత్లోని భరూచా జిల్లాల స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడంతో మొదలైంది. 1977లో 28ఏళ్ల వయసులో ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం 1993 లో రాజ్యసభకు తొలిసారి ఎన్నికయ్యారు. రాజీవ్గాంధీకి ఆయన సన్నిహితుడు. అప్పట్లో ప్రధానికి పార్లమెంట్ సెక్రటరీగా పనిచేశారు. 1985, 1992ల్లో ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా వ్యవహరించారు. 1992నుంచి మంత్రిగా ఆయన ఎప్పుడూ పదవీ బాధ్యతలు నిర్వహించలేదు. కానీ కాంగ్రెస్ తరఫున కీలక నిర్ణయాలు తీసుకునే అతికొద్దిమందిలో ఆయన ఒకరు. పటేల్కు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి కోవింద్
-
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
-
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మంగళవారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరితోపాటు రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. రాష్ట్రపతి మంగళవారం మధ్యాహ్నం తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం నుంచి బయలుదేరి క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహస్వామివారి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి అహ్వానం పలికారు. అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకస్వాములు వారికి స్వామివారి శేషవస్త్రం అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఛైర్మన్, ఈవో కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటాన్ని, 2021 క్యాలెండర్, డైరీని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా, డిఐజి క్రాంతిరాణా టాటా తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రాష్ట్రపతి కోవింద్ దంపతులు రోడ్డుమార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రాష్ట్రపతి దంపతులు 4.50 గంటలకు రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్కు వెళతారు. -
రాష్ట్రపతి తిరుమల పర్యటన
-
రేపు రాష్ట్రపతి తిరుమల పర్యటన
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేపు(మంగళవారం) తిరుమలకు రానున్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కూడా తిరుమలను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల, తిరుపతిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... రేపు రాష్ట్రపతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా కూడా ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనే సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేయించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్రపతి తిరుమల పర్యటన వివరాలు... రేపు(24.11.2020) రాష్ట్రపతి ఉదయం 6గంటలకు రాష్ట్రపతి భవన్ నుంచి బయలుదేరనున్నారు. 6:15 గంటలకు పాలం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి 9:15 గంటలకు చెన్నై విమానాశ్రయం చేరుకోనున్నారు. 10:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి 11 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత 12:15 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహంలో దిగుతారు. తర్వాత 12:50 గంటలకు తిరుమల పద్మావతి అతిధి గృహంలో విడిది చేసి అక్కడి నుంచి వరాహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. 1:05 గంటలకు శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం రాష్ట్రపతి 1: 40 గంటలకు తిరిగి పద్మావతి అతిధి గృహం చేరుకోనున్నారు. ఇక మధ్యాహ్నం భోజనం తర్వాత విరామం తీసుకున్న అనంతరం 3:40 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. -
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ రంగ రైల్వే పరీక్షలను రెండు భాషల్లోనే నిర్వహిస్తున్నారనీ, ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించేందుకు అనుమతించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. రాష్ట్రపతికి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ దేశ మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు స్మారక తపాలా స్టాంప్కు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. స్టాంప్ను హైదరాబాద్లో విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. పీవీకి భారతరత్న పురష్కారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. -
ప్రధానికి 15వ ఫైనాన్స్ కమిషన్ నివేదిక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీకి సోమవారం 15వ ఫైనాన్స్ కమిషన్ తన నివేదికను సమర్పించింది. రానున్న ఐదు సంవత్సరాల్లో (2021–22 నుంచి 2025–26) కేంద్రం–రాష్ట్రాల మధ్య పన్ను విభజనసహా పలు ఫైనాన్షియల్ సంబంధాలపై 15వ ఫైనాన్స్ కమిషన్ తన సిఫారసులను చేసింది. ‘ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్’ శీర్షికన రూపొందించిన ఈ నివేదికను మంగళవారం కమిషన్ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు కూడా సమర్పించనుంది. నవంబర్ 9న కమిషన్ తన నివేదికను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సమర్పించిన సంగతి తెలిసిందే. 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్, సభ్యులు అజయ్ నారాయన్ ఝా, అనూప్ సింగ్, అశోక్ లాహిరి, రమేశ్ చంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగం నిర్దేశిస్తున్న ప్రకారం, చర్యల నివేదికతో పాటు కమిషన్ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఉన్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం– కోవిడ్–19 నేపథ్యంలో కమిషన్ ప్రత్యేకంగా 2020–21కి సంబంధించి ఒక నివేదికను సమర్పించింది. ఐదేళ్ల కాలానికి కమిషన్ తన సిఫారసులను 2020 అక్టోబర్ 30 నాటికి సమర్పించడం తప్పనిసరి. పలు కీలక ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి సిఫారసులను ఇవ్వాలని 15వ ఫైనాన్స్ కమిషన్ను కేంద్రం కోరింది. కిందిస్థాయి వరకు పన్ను పంపిణీ, స్థానిక ప్రభుత్వ నిధులు, విపత్తు నిర్వహణ గ్రాంట్తో పాటు విద్యుత్, నగదు బదిలీ అమలు, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక రంగాలలో రాష్ట్రాలకు పనితీరు ప్రోత్సాహకాలను పరిశీలించి సిఫారసు చేయాలని కమిషన్ను కోరింది. -
ఓటీటీలపై నిఘా
సాక్షి, న్యూఢిల్లీ: ఓటీటీ(ఓవర్ ద టాప్) పేరిట అశ్లీలం నేరుగా ప్రజల నట్టింట్లోకి చేరుతోందన్న ఆందోళనలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించింది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్స్టార్ తదితర ఓటీటీ వేదికలను, ఇతర డిజిటల్ న్యూస్ వెబ్సైట్లు, కరెంట్ అఫైర్స్ కంటెంట్ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ ద్వారా ప్రసారమయ్యే డిజిటల్ కంటెంట్పై ప్రస్తుతం దేశంలో ఎలాంటి నిఘా లేదు. నియంత్రణకు విధానాలు, నిబంధనలు లేవు. నెట్లో ప్రసారమయ్యే అశ్లీల, అనుచిత అంశాలపై కన్నేసి ఉంచేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చట్టం గానీ, స్వతంత్ర సంస్థ గానీ లేవు. అందుకే కేంద్ర సర్కారు ఇలాంటి వ్యవహారాలపై నిఘా పెట్టే అధికారాన్ని సమాచార, ప్రసార శాఖకు కట్టబెట్టింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్పై రాష్ట్రపతి కోవింద్ సంతకం చేశారు. కోర్టు వివరణ కోరిన నెల రోజుల్లోపే... ఓటీటీలపై నిఘా కోసం కేంద్ర ప్రభుత్వం ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) రూల్స్–1961’లో సవరణలు చేసింది. దీన్ని ఇకపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) 357వ అమెండ్మెంట్ రూల్స్–2020గా వ్యవహరిస్తారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. అశ్లీలంపై చర్యలు తీసుకొనే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 క్లాజ్(3) ప్రకారం కేంద్రానికి సంక్రమించింది. ఆన్లైన్ వేదికలపై లభ్యమయ్యే న్యూస్, ఆడియో, విజువల్ కంటెంట్, సినిమాలకు సంబంధించిన నియంత్రణ విధానాలను రూపొందించే అధికారం సమాచార, ప్రసార శాఖకు దక్కింది. ఓటీటీలు, డిజిటల్ మీడియా వేదికలపై నియంత్రణ కోసం ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు శశాంక్ శంకర్ జా, అపూర్వ అర్హతియా ఇటీవలే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం వివరణ కోరిన నెల రోజుల్లోనే కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. -
15వ ఆర్థిక సంఘం నివేదిక రాష్ట్రపతి ముందుకు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పన్నులు ఆదాయాలలో కేంద్ర, రాష్ట్రాల వాటాలను నిర్ణయించే 15వ ఆర్థిక కమిషన్ తన తుది వేదికను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అందించింది. ఎన్కే సింగ్ నేతృత్వంలోని కమిషన్ 2022-26 వరకు సంబంధించిన సిఫారసులను సోమవారం సమర్పించింది. కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే నిధుల్లో భారీగా కోత విధించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 42 శాతం నిధుల బదలాయింపును తగ్గిస్తూ సిఫారసులు చేసింది. కోవిడ్-19 సంక్షోభం, భారీగా క్షీణించిన ఆదాయాలు నేపథ్యంలో సంఘం సిఫారసులను ప్రభావితం చేసినట్టు అంచనా. ప్రతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను లోతుగా కమిషన్ విశ్లేషించిందనీ, అలాగే ప్రధానంగా ఆఆయార రాష్ట్రాలు ఎదుర్కొంటున్న ముఖ్య సవాళ్లను పరిష్కరించేందుకు నిర్దిష్ట పరిశీలన చేసినట్టు సమాచారం. 'ఫైనాన్స్ కమిషన్ ఇన్ కోవిడ్ టైమ్స్' పేరుతో ఈ నివేదికను సమర్పించింది. అంతకుముందు 10శాతం పెంపుతో కేంద్ర పన్ను వసూళ్లలో 42 శాతం రాష్ట్రాలకు ఇవ్వాలని 14వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. అయితే 15వ ఆర్ధిక సంఘం దీనికి భిన్నంగా 2020-21సంవత్సరానికి 41 శాతం రాష్ట్రాలకు బదిలీ చేయాలని సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. అలాగే దీనికి ఒక శాతం తగ్గింపు (41 శాతం)తో కొత్తగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్, లడాఖ్కు చెల్లించాలని చెప్పింది. దీంతో నిధుల్లో తగ్గుదల వల్ల అనేక రాష్ట్రాలు చేపడుతున్న సంక్షేమ పథకాలకు గట్టి దెబ్బ పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాంప్రదాయ నిధుల కేటాయింపు సిఫారసులతోపాటు వచ్చే ఐదేళ్ళలో కేంద్రానికి ఆర్థిక ఏకీకరణ దిశగా ఒక మార్గాన్ని రూపొందించాలని కూడా కేంద్రానికి సిఫారసు చేసింది. రక్షణ, అంతర్గత భద్రతకు నిధులు సమకూర్చడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని అలాంటి, యంత్రాంగాన్ని ఎలా అమలు చేయవచ్చో కూడా పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది. 2019-20లో కేంద్రం రూ .21.6 ట్రిలియన్లు వసూలు చేస్తుందని అంచనా వేయగా, (సవరించిన అంచనాలు) కాని రాష్ట్రాల వాటా కేవలం రూ .6.6 ట్రిలియన్లుగా ఉంది. ఇది మొత్తం పన్ను మొత్తంలో కేవలం 30.3 శాతం మాత్రమే. 14 వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఇది 42 శాతంగా ఉండాలి. కేంద్రం రాష్ట్రాలు కలిపి దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) లో 2.5 శాతం ఆరోగ్య రంగానికి ఖర్చు చేయాలని కమిషన్ సిఫారసు చేసినట్టు తెలేస్తోంది. ప్రస్తుతం, వారు 0.9 శాతం మాత్రమే. 0.3 శాతం కేంద్రం నుండి 0.6 రాష్ట్రాల నుండి వెచ్చిస్తున్నాయి. అనేక ప్రత్యేకమైన, విస్తృత సమస్యలపై కమిషన్ తన సిఫారసులను ఇవ్వమని కమిషన్ కోరింది. వివిధ పన్నుల పంపిణీ, స్థానిక ప్రభుత్వ నిధులు, విపత్తు నిర్వహణ నిధులు కాకుండా, విద్యుత్ రంగం, డీబీటీ స్వీకరణ వంటి అనేక రంగాలలో రాష్ట్రాలకు పనితీరు ప్రోత్సాహకాలను పరిశీలించి సిఫారసు చేయాలని కమిషన్ కోరినట్టు తెలుస్తోంది. ఈ నివేదిక కాపీని ఈ నెలాఖరుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేస్తారు. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి సమర్పించే కేంద్ర బడ్జెట్తోపాటు, ఈ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టేవరకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. -
కేశూభాయ్ పటేల్ కన్నుమూత
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అత్యంత సీనియర్ నేత కేశూభాయ్ పటేల్(92) కన్ను మూశారు. కోవిడ్–19 బారిన పడి ఇటీవలే కోలుకున్న పటేల్ గురువారం ఉదయం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. గుజరాత్లో బీజేపీ ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహించిన కేశూభాయ్ 1995, 1998–2001 సంవత్సరాల్లో రాష్ట్ర సీఎంగా పనిచేశారు. ఆయన తర్వాత గుజరాత్లో నాడు సీఎంగా మోదీ పగ్గాలు చేపట్టారు. కేశూభాయ్ మృతికి రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్య క్రియలు జరుగుతాయని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తెలిపారు. కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ తన తండ్రి ఆరోగ్యం కొంతకాలంగా క్షీణిస్తోందని కేశూభాయ్ కుమారుడు భరత్ పటేల్ తెలిపారు. గురువారం ఉదయం రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేటు పడిపోవడంతో ఆస్పత్రికి తరలించామన్నా రు. కేశూభాయ్ గుండెపోటుతో చనిపో యారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన మృతి వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర పర్యటనలో ఉన్న రూపానీ తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. గాంధీనగర్ చేరుకుని స్వగృహంలో ఉంచిన కేశూభాయ్ మృతదేహానికి నివాళుల ర్పించారు. జునాగఢ్ జిల్లా విసవదార్ పట్టణంలో 1928లో జన్మించిన కేశూభాయ్ 1945లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో ప్రచారక్గా చేరారు. జన్సంఘ్లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ప్రఖ్యాత సోమ్నాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు. రాష్ట్ర శాసనసభకు ఆయన 6 పర్యాయాలు ఎన్నికయ్యారు. 2012లో బీజేపీ నుంచి వైదొలిగి గుజరాత్ పరివర్తన్ పేరిట పార్టీని స్థాపించారు. 2014లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. -
రాష్ట్రపతి కోవింద్కు సీఎం జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుతూ, జాతికి మరింత కాలం సేవ చేయాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ర్టపతి రామ్నాథ్ నేడు (గురువారం) 75వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. -
జశ్వంత్ సింగ్ కన్నుమూత
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జశ్వంత్ సింగ్(82) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. చాన్నాళ్లుగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మాజీ ఆర్మీ అధికారి అయిన జశ్వంత్ సింగ్ మాజీ ప్రధాని అటల్ బిçహారీ వాజ్పేయికి సన్నిహితుల్లో ఒకరు. జశ్వంత్ సింగ్ మృతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పార్టీలకతీతంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఆయన ఆర్థిక, రక్షణ, విదేశాంగ తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. 2014లో తన ఇంట్లో ఆయన కింద పడి, తీవ్రంగా గాయపడడంతో ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ వైద్యశాలలో చేర్చి చికిత్స చేశారు. ఆ తరువాత కూడా పలు అస్వస్థతలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఈ జూన్లో మరోసారి ఆస్పత్రిలో చేరారు. ‘కేంద్ర మాజీ మంత్రి, మేజర్(రిటైర్డ్) జశ్వంత్ సింగ్ సెప్టెంబర్ 27 ఉదయం 6.55 గంటలకు మరణించారు. 25 జూన్, 2020లో ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి సెప్సిస్, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్, గతంలో తలకు తగిలిన దెబ్బకు చికిత్స అందిస్తున్నాం. ఆదివారం ఉదయం తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చింది. ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు’ అని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి ఒక ప్రకటనలో వివరించింది. రాజస్తాన్లోని జోధ్పూర్లో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. జశ్వంత్ సింగ్ కుమారుడు మానవేంద్ర సింగ్ అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ సైనికుడు, సమర్థుడైన పార్లమెంటేరియన్, అద్భుతమైన నాయకుడు, మేధావి అయిన జశ్వంత్ సింగ్ మృతి తననెంతో కలచివేసిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. దేశానికి జశ్వంత్ సింగ్ ఎన్నో సేవలందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మానవేంద్ర సింగ్కు ప్రధాని ఫోన్ చేసి సంతాపం తెలిపారు. జశ్వంత్ తనకు అత్యంత సన్నిహితుడైన సహచరుడని బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ పేర్కొన్నారు. రెండు సార్లు బీజేపీ నుంచి బహిష్కరణ 1938 జనవరి 3న రాజస్తాన్లోని బార్మర్ జిల్లా, జాసోల్ గ్రామంలో జశ్వంత్ సింగ్ జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం ఆర్మీలో చేరారు. అనంతరం రాజీనామా చేసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రారంభం నుంచీ బీజేపీలో ఉన్నారు. ఎంపీగా పలు పర్యాయాలు పనిచేశారు. సభలో పదునైన గళంతో స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించేవారు. జశ్వంత్ సింగ్ రెండుసార్లు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ‘జిన్నా– ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్’ పుస్తకంలో జిన్నాను ప్రశంసించడంతో తొలిసారి 2009లో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. 2010లో మళ్లీ ఆయన బీజేపీలో చేరారు. ఆ తరువాత, పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేయడంతో 2014లో మరోసారి ఆయనను పార్టీ నుంచి తొలగించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సైనికుడి నుంచి పార్లమెంటేరియన్గా మారి దేశానికి ఎంతో సేవ చేసి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. జశ్వంత్ సింగ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. -
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : విపక్షాల వ్యతిరేకత మధ్య పార్లమెంట్ ఇటీవల ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్ 20న పార్లమెంట్ ఈ బిల్లులను ఆమోదించింది. వ్యవసాయ బిల్లులను ఆమోదించరాదని, వాటిని తిప్పిపంపాలని గతవారం విపక్షాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి అభ్యర్ధించారు. రాజ్యసభలో రాజ్యాంగవిరుద్ధంగా ప్రభుత్వం ఈ బిల్లులను ఆమోదింపచేసుకుందని విపక్షాలు ఆరోపించాయి.మరోవైపు ఈ బిల్లులు రైతు ప్రయోజనాలకు విఘాతమని రైతు సంఘాలు కొద్దిరోజులుగా ఆందోళన బాటపట్టాయి. ఇక వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ పలు రైతు సంఘాలు ఈనెల 25న భారత్ బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. హరియాణ, పంజాబ్, మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలకు దిగారు. ఈ బిల్లులతో రైతులను కార్పొరేట్ వ్యాపారులు శాసిస్తారని, మద్దతు ధర వ్యవస్థ కనుమరుగవుతుందని విపక్ష నేతలు, రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే రైతుల ప్రయోజనాలకు ఇవి ఉపకరిస్తాయని, దళారీ వ్యవస్థ దూరమై రైతులకు మేలు చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. చదవండి : ‘ఆ బిల్లులను అడ్డుకోండి’ -
విజయసాయి రెడ్డిపై అనర్హత పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై దాఖలైన అనర్హత పిటిషన్ని రాషష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సోమవారం కొట్టేశారు. ఆయనపై అనర్హత వర్తించదని కోవింద్ స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డి లాభదాయక పదవి నిర్వహిస్తున్నారంటూ దాఖలైన ఫిర్యాదుపై రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయం తీసుకున్నారు. పార్లమెంటు అనర్హత నిరోధక చట్టం, న్యాయస్థానాల తీర్పు మేరకు అనర్హత వర్తించదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈసీ అభిప్రాయం మేరకు రాష్ట్రపతి, విజయసాయి రెడ్డిపై దాఖలైన అనర్హత పిటిషన్ని కొట్టివేశారు. జీవో 75 ప్రకారం ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఎటువంటి జీతభత్యాలు తీసుకోవడం లేదని వెల్లడించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విధినిర్వహణలో, ఏపీ పర్యటనలో కేవలం రాష్ట్ర అతిథిగా మాత్రమే ఉన్నారని జీవోలో స్పష్టం చేశారు. -
తొలిసారి వర్చువల్గా క్రీడా పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పలు రంగాల్లో రాణించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేశారు. ప్రతి ఏటా ఢిల్లీలోని సాయ్ కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కరోనా కారణంగా ఈ ఏడాది తొలిసారి వర్చువల్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు హాజరయ్యారు. తన ప్రసంగంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు క్రీడా శాఖ మంత్రి. ఈ ఏదాడి కోవిడ్ కారణంగా క్రీడా కార్యక్రమాలకు అవాంతరం ఏర్పడిందన్నారు. 2028 ఒలంపిక్స్ నాటికి పతకాల సాధనలో భారత్ టాప్-10లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం దేశంలోని ప్రతిభావంతులైన అథ్లెట్లు, కోచ్లతో పాటు.. దేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న వివిధ సంస్థలను అవార్డులతో సత్కరించారు. ఈ సంవత్సరం ఖేల్ రత్న అవార్డు గ్రహీతల పేర్లను మొదట పిలిచారు, తరువాత ద్రోణాచార్య అవార్డు గ్రహీతలను ఆహ్వానించారు. (చదవండి: ఇదే నా నిరసన... ) ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పుణె, చండీగఢ్, కోల్కతా, సోనపట్ వేదికగా ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది మొత్తం 74 మందికి అవార్డులు ప్రకటించగా.. వారిలో ఐదుగురికి రాజీవ్ ఖేల్ రత్న.. 27 మందికి అర్జున అవార్డులు అందజేశారు. ఈ ఏడాది ఖేల్ రత్న అవార్డులు అందుకున్న ఐదుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. అవార్డు దక్కిన వారిలో కొందరు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వారిలో రెజ్లర్ వినేశ్ ఫోగట్, స్టార్ ఇండియన్ క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో వినేశ్ ఫోగట్ హాజరు కాలేదు. ఇక రోహిత్ శర్మ యూఏఈలోని ఐపీఎల్ కోసం సన్నద్దమవతున్నందున ఈ వేడుకకు దూరమయ్యారు. -
రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎట్ హోం కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వంది మంది వరకు అతిథులు హాజరయ్యారు. అయితే ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. -
దేశ ప్రజలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ : 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా పోరాడుతోందని, ఈ వ్యాధితో ముందుండి పోరాడుతున్న యోధులకు దేశం రుణపడిఉందని అన్నారు. కోవిడ్-19తో ప్రజల జీవనస్ధితిగతులు మారిపోయాయని చెప్పారు. ఈ విపత్కర పరిస్ధితుల్లో కేంద్రం పలు పధకాల ద్వారా ప్రజలకు సాయం చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించి స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడంతో కరోనా ప్రభావాన్ని కొంతమేర కట్టడి చేయగలిగామని చెప్పారు. వేగవంతంగా మనం తీసుకున్న చర్యలతో ఎందరో ప్రాణాలు నిలబెట్టామని, దీనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని గుర్తుచేశారు. చదవండి : అగ్నిప్రమాదం కలచివేసింది వందేభారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న పది లక్షల మంది స్వదేశానికి చేరకున్నారని తెలిపారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన మార్పులకు శ్రీకారం చుడుతోందన్నారు.ఇక గల్వాన్లో అమరులైన సైనికులకు జాతి సెల్యూట్ చేస్తోందని చెప్పారు. ప్రత్యర్ధుల దూకుడుకు దీటుగా బదులిస్తామని గల్వాన్లో మన సైనికుల ధైర్యసాహసాలు సుస్పష్టం చేశాయని అన్నారు. ప్రపంచమంతా మహమ్మారితో ఐక్యంగా పోరాడుతున్న వేళ పొరుగు దేశం తన విస్తరణ కార్యకలాపాలను చేపట్టేందుకు దుస్సాహసానికి ఒడిగట్టిందని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ మనం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నామని చెప్పారు. దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
అగ్నిప్రమాదం కలచివేసింది
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ విజయవాడ దుర్ఘటనలో పలువురు మృతి చెందారని తెలిసి ఎంతో విచారించాను. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్లో పేర్కొన్నారు. ‘‘ఈ ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ విచారం ‘‘విజయవాడలోని కోవిడ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడం కలచివేసింది. ఆప్తులను కోల్పోయిన వారి శోకంలో నేను కూడా పాలుపంచుకొంటున్నాను. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అక్కడి పరిస్థితిపై ఏపీ సీఎం వైఎస్ జగన్తో చర్చించాను. అన్ని విధాలుగాను సాయం అందిస్తామని ఆయనకు హామీ ఇచ్చాను’’ అని ట్వీట్లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. అగ్నిప్రమాద మృతులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. కేంద్రం సాయం : మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. -
విజయవాడ ఘటనపై రాష్ట్రపతి కోవింద్ దిగ్భ్రాంతి
-
రాజకీయ సంక్షోభం : రాష్ట్రపతికి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్తాన్లో నెలకొన్న తాజా రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు.. బీజేపీ కుట్ర చేస్తోందంటూ లేఖ పేర్కొంది. గవర్నర్లను పావుగా ఉపయోగించుకుంటూ ప్రభుత్వాలను ఇబ్బందులకు గురిచేస్తోందని లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. అలాగే రాజస్తాన్లో నెలకొన్న ప్రతిష్టంభన రాజకీయ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని.. వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని రాష్ట్రపతికి ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. కాగా జూలై 31న రాష్ట్ర అసెంబ్లీని సమావే పర్చాలంటూ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు ఆదివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. (ప్రధాని మోదీకి గెహ్లోత్ ఫోన్) దీనిని గవర్నర్ సోమవారం తిరస్కరించారు. దీంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన గెహ్లాత్ గవర్నర్ తీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఇటీవల రాజ్భవన్ ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సమస్య పరిష్కరానికి ముందుకు రాకపోతే రాష్ట్రపతి భవన్ ముందు ఆందోళనకు దిగుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు ఇటీవల ప్రకటించారు. దానిలో భాగంగానే ముందుగా లేఖ రాశారు. (మాయావతి విప్ : గహ్లోత్ సర్కార్కు షాక్) -
ప్రధాని ఎదుట ధర్నా చేస్తాం
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించాలని రాష్ట్రపతిని కలిసి కోరతామనీ, అవసరమైతే ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నాకు దిగుతామని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్ను కోరాలని రాష్ట్ర కేబినెట్ శనివారం తీర్మానించింది. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ శ్రేణులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతం జైపూర్లోని ఓ హోటల్లో మకాం వేసిన తమ విధేయ ఎమ్మెల్యేలతో సీఎం గహ్లోత్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గహ్లోత్.. రాష్ట్రంలో సంక్షోభం సమసిపోయేందుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కలిసి కోరుతామనీ, అవసరమైతే ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేపడతామన్నారని పార్టీకి చెందిన ఓ నేత వెల్లడించారు. హోటల్లో కనీసం మరో 21 రోజులు మకాం కొనసాగించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఎమ్మెల్యేలను కోరారన్నారు. మెజారిటీ సభ్యుల బలం తమకు ఉన్నందున బీజేపీ కుట్రలేవీ సాగవని తెలిపారన్నారు. రాజ్యాంగాన్ని లోబడి నడుచుకుంటున్నాననీ, తనపై ఎటువంటి ఒత్తిడులు లేవని గవర్నర్ మిశ్రా చెప్పడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం రాత్రి రాజ్భవన్ ఎదుట ఆందోళనకు విరమించారు. అయితే.. ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఏ మేరకు ఉంది, ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ సభను సత్వరమే సమావేశ పరచాలనే డిమాండ్కు కారణం తదితర ఆరు అంశాలపై స్పష్టతనివ్వాలని సీఎం గహ్లోత్ను గవర్నర్ కోరారు. దీంతో శనివారం సీఎం గహ్లోత్ నేతృత్వంలో కేబినెట్ సమావేశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈనెల 31వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్ను కోరాలని నిర్ణయించింది. అయితే, గవర్నర్తో ముఖ్యమంత్రి గహ్లోత్ భేటీపై తుది నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపన్నిందంటూ కాంగ్రెస్ శ్రేణులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు జైపూర్తోపాటు జిల్లా కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలని గవర్నర్ను డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశం జరగకుండా బీజేపీ ప్రయత్నిస్తోందని పీసీసీ అధ్యక్షుడు గోవింద్æ ఆరోపించారు. అరాచక వాతావరణం సృష్టించింది: బీజేపీ రాజస్తాన్లో అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక వాతావరణం సృష్టించిందని బీజేపీ ఆరోపించింది. అసెంబ్లీని సమావేశపరిచేందుకు ఆదేశాలు ఇవ్వాలనే డిమాండ్తో గవర్నర్ కార్యాలయాన్ని భయపెట్టేందుకే రాజ్భవన్ ఎదుట గహ్లోత్ ఆందోళన చేపట్టారని ఆరోపించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా నేతృత్వంలోని 15 మంది సభ్యుల బృందం శనివారం గవర్నర్ మిశ్రాను కలిసివినతి పత్రం అందజేసింది. అనంతరం బీజేపీ శాసనసభా పక్షనేత గులాబ్ చంద్ కటారియా మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ హక్కు పేరుతో రాజ్భవన్ వద్ద కాంగ్రెస్ ఆడిన డ్రామా దురదృష్టకరం. ఏ ఎజెండా లేకుండానే శాసనసభను సమావేశపరచాలని ప్రభుత్వం గవర్నర్ను కోరింది. ఇలా గవర్నర్పై ఒత్తిడి తేవడం రాజ్యాంగ విలువలను అగౌరవపరచడమే’ అని ఆయన అన్నారు. ï రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని గవర్నర్ను కోరారా? అని మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారు. -
రాష్ట్రపతితో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. వారిరువురు ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ అంశాలను చర్చించారని రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు. తూర్పు లద్దాఖ్లో సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు నెలకొనడం, తాజాగా, శుక్రవారం లేహ్ వెళ్లిన ప్రధాని, అక్కడ బలగాలను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేయడం.. తదితర కీలక ఘటనల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
రాష్ట్రపతితో ప్రధాని మోదీ భేటీ
-
పెట్రో ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై 20 రోజులుగా పెట్రోల్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మరింత భారాన్ని మోపుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.నియంతలా పాలిస్తున్న మోదీ ప్రభుత్వం సామాన్యుల గోడు పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని, దేశంలో పెట్రో ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవిందుకు సోమవారం ఆయన లేఖ రాశారు.‘ కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఉపాధి లేక వలస కార్మికులు ,పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇంత దుర్భర జీవితాన్ని ఎదుర్కొంటున్న సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే విచిత్రంగా మనదేశంలో పెట్రోల్ ,డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2014లో క్రూడాయిల్ ధర 108 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ ధర లీటర్ రూ 71.40 డీజిల్ రూ. 59.59 ఉంది. 2020 లో క్రూడాయిల్ ధర 43.41 డాలర్లకు అంటే సుమారు 60 శాతం తగ్గితే పెట్రోల్ లీటర్ కి రూ 20.68 ఉండాలి కానీ రూ 82.96 ఉంది. మోదీ ప్రభుత్వం ఒక నియంతలాగ పాలిస్తోంది. ఇష్టానుసారంగా ఎక్సైజ్ డ్యూటీ పెంచుతోంది. గత ఆరేళ్లుగా ఈ రూపంలో సుమారు రూ. 18 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని, వారిశ్రమను చార్జీల రూపంలో లాగేసింది. వెంటనే జోక్యం చేసుకుని ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోండి.’ అని ఆ లేఖలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. -
మోదీ కొత్త విమానం ఎప్పుడు వస్తుందో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానాల లిస్ట్లో మరో రెండు అత్యాధునిక విమానాలు చేరనున్నాయి. ప్రధాని సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న రెండు బోయింగ్-777 విమానాలను ఏర్పాటు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రయాణిండం కోసం కూడా ఈ విమానాలను ప్రభుత్వం వినియోగించనుంది. ఈ ఏడాది జూలై నుంచి ఇవి అందుబాటులోకి రావాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ విమానాల డెలివరీ ఆలస్యం అయ్యింది. దీంతో ఈ విమానాలు సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విమానాలు అందుబాటులోకి వస్తే ప్రధాని నరేంద్రమోదీ ఇక నుంచి అమెరికా బోయింగ్ సంస్థ రూపొందించిన బోయింగ్ 777 ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణించనున్నారు. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత వారిదే..) ఇప్పటి వరకు ప్రధాని ప్రయాణించే విమానం బోయింగ్ 747 ను ఎయిర్ఇండియా ఫైలట్లు నడుపుతుండగా బోయింగ్ 777 విమానాలను మాత్రం ఎయిర్ఫోర్స్కు చెందిన ఫైలెట్లు నడపనున్నారు. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఆరుగురు పైలట్లకు B777 విమానం నడపడంపై శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా వస్తున్న ఈ విమానాల మెయింటెయినెన్స్ను ఎయిరిండియాకు అనుబంధ సంస్థగా ఉన్న ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ తీసుకుంటుంది. ఇక ఈ విమానం ప్రత్యేకతల విషయానికి వస్తే ఇందులో మిస్సైల్ వ్యవస్థ ఉంది. ప్రధాన మంత్రికి మరింత రక్షణను ఇచ్చేలా లార్జ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ ఉన్నాయని అమెరికా బోయింగ్ సంస్థ తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్లను 190 మిలియన్ డాలర్లకు భారత్కు అమ్మేందుకు అమెరికాతో ఒప్పందం జరిగింది. (‘6 రోజులుగా అక్కడ ఒక్కరు మరణించలేదు’) -
రాష్ట్రపతి వేతనంలో 30 శాతం స్వచ్ఛందంగా
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎంకేర్స్ ప్రత్యేక నిధికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఇప్పటికే ఒక నెల జీతాన్ని విరాళంగా అందచేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన వేతనంలో 30 శాతాన్ని ఏడాది పాటు పీఎం కేర్స్ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు గురువారం రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన చేసింది. కాగా కరోనా నియంత్రణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంపీలు, కేంద్రమంత్రుల జీతాల్లో కోత విధించిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు స్వచ్ఛందంగా విరాళం ఇస్తున్నారు. (శ్రామిక్ రైళ్లలో స్వస్థలాలకు 10 లక్షల మంది కార్మికులు) అంతేకాకుండా ‘సెల్ఫ్ రిలయంట్ ఇండియా’ ఉద్యమానికి రాష్ట్రపతి భవన్ మద్దతు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వీలైనంతవరకూ రాష్ట్రపతి భవన్ తన ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశీయ పర్యటనలు తగ్గించుకోనుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో భౌతిక దూరాన్ని విధిగా పాటించేలా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాంకేతికత ద్వారా ప్రజలకు చేరువ కానుంది. ఈ చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రపతి భవన్ బడ్జెట్లో దాదాపు 20 శాతం ఆదా అవుతాయని అంచనా. (వినూత్న పద్దతిలో భౌతిక దూరం) -
హైకోర్టులో ముగ్గురు జడ్జిల నియామకం
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్రెడ్డి, కన్నెగంటి లలితకుమారిలు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం ఆమోదముద్ర వేస్తూ నియామక ఉత్తర్వులిచ్చారు. దీంతో వీరి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. వీరు శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణం చేయించనున్నారు. ఈ ముగ్గురి నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరుకోనుంది. వాస్తవానికి హైకోర్టు కొలీజియం మొత్తం ఆరుగురు న్యాయవాదుల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. హైకోర్టు పంపిన కృష్ణమోహన్, సురేష్రెడ్డి, లలితకుమారి, వి.మహేశ్వర్రెడ్డి, జీఎల్ నర్సింహారావు, కె.మన్మథరావుల పేర్లలో సుప్రీంకోర్టు కొలీజియం కృష్ణమోహన్, సురేష్రెడ్డి, లలితకుమారి పేర్లను మాత్రమే కేంద్రానికి పంపింది. ఈ ముగ్గురిలో లలిత పిన్న వయస్కురాలు. ప్రస్తుతం ఆమె వయస్సు 48 సంవత్సరాల, 11 నెలలు. ఈమె 2033 మే 4న, కృష్ణమోహన్ 2027, ఫిబ్రవరి 4న, సురేశ్రెడ్డి 2026, డిసెంబర్ 6న హైకోర్టు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేస్తారు. -
పాజిటివ్ కేసులు 21వేలు, మృతుల సంఖ్య 681
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 21 వేలు దాటిపోయాయి. ఇప్పటివరకు 21,393 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 681 మంది మృతి చెందగా.. 4,257 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే అత్యధిక పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,710 చేరింది. కరోనా బారిన పడి ఇప్పటివరకూ 269మంది చనిపోయారు. గత 24 గంటల్లో 18 మంది వైరస్ బారినపడి మరణించగా, వారిలో పదిమంది ముంబైకి చెందినవారే ఉన్నారు. అలాగే 789మంది కోలుకున్నారు. ఇక కరోనా కేసులతో గుజరాత్ రెండు, ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 26లక్షల మంది కరోనా మహమ్మారి బారిన పడగా, లక్షా, ఎనభైమూడు లక్షల మంది మృత్యువాత పడ్డారు. (27న సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్) ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఆమోద ముద్ర కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బంది రక్షణ నిమిత్తం కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించేందుకు వీలు కల్పించే ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ నిన్న (బుధవారం) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ ఆర్డినెన్స్ను కేంద్రం రాష్ట్రపతికి పంపగా, ఆయన వెంటనే ఆర్డినెన్స్కు ఆమోద ముద్రవేసి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఈ ఆర్డినెన్స్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. మామూలు దాడులకు మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు జరిమానా ఉంటుంది. ఒకవేళ దాడి తీవ్రస్థాయిలో జరిగి, బాధిత వైద్య సిబ్బందికి గాయాలు తీవ్రంగా ఉంటే.. ఏడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా ఉంటుంది. (కరోనా: నోట్లను ముట్టుకుంటే ఒట్టు) -
కనికా ఎఫెక్ట్: నిర్బంధంలోకి ఎంపీలు, మాజీ సీఎం
న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రముఖ గాయని కనికా కపూర్ వహించిన నిర్లక్ష్యం దేశాన్ని భయపెట్టిస్తోంది. ఆమెకు కరోనా వైరస్ సోకినట్లు శుక్రవారం వైద్యులు నిర్థారించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీకి హాజరైన వాళ్లంతా భయాందోళనకు గురవుతున్నారు. కనికా పార్టీకి హాజరైన వాళ్లలో బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, ఆయన తల్లి రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేతో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. వీరంతా వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రాజస్తాన్ ఎంపీ అయిన దుష్యంత్ సింగ్ పార్టీకీ అనంతరం రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో సహా పలువురు మంత్రులతో కలిసి విందులకు, సమావేశాలకు కూడా హాజరైయ్యారు. పార్లమెంటులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్, ఎంపీ అనుప్రియా పటేల్లతో సన్నిహితంగా మెలిగారు. దీంతో ఆయన్ని కలుసుకున్న వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. (ప్రముఖ బాలీవుడ్ సింగర్కు కరోనా పాజిటివ్) కనికాకు కరోనా : కేసు నమోదు ఎంపీ ఎవరెవరిని కలిసిశారంటే.. రెండు రోజుల క్రితం దుష్యంత్ సింగ్ ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ ఎంపీలతో కలిసి రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో అల్పహార విందులో పాల్గొన్నారు. ఈ విందులో కేంద్ర మాజీ మంత్రి రాజవర్థన్ రాథోడ్, మధుర ఎంపీ హేమమాలిని, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కాంగ్రెస్ నేత కుమారి సెల్జాతో పాటు బాక్సార్, ఎంపీ మేరీ కోమ్ కూడా ఉన్నారు. అంతేగాక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ కూడా రెండు రోజుల క్రితం రవాణా స్టాండింగ్ కమిటీ సమావేశంలో దుష్యంత్ సింగ్తో రెండున్నర గంటలకు పైగా సంభాషించినట్లు ఆయన చెప్పారు. అదే విధంగా ఆమ్ఆద్మీ నేత సంజయ్ సింగ్, కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ హూడా కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. (కరోనా మరణ మృదంగం: మృతుల సంఖ్య 11వేలు) అపాయింట్మెంట్స్ రద్దు చేసుకున్న రాష్టపతి ‘కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇతరులకు దూరంగా ఉండాల్సిన సమయం ఇది. సెల్ఫ్ ఐసోలేషన్ అనేది వైద్య పరంగా తప్పనిసరి’ అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు. కాగా లక్నోలో జరిగిన ఆ పార్టీకి హాజరైన తర్వాత దుష్యంత్ సింగ్ కలిసిన ప్రతి ఒక్కరినీ ఆరోగ్య శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వసుంధర రాజే ట్వీట్.. దీనిపై దుష్యంత్ సింగ్ తల్లి వసుంధర రాజే ట్వీట్ చేస్తూ.. లక్నోలో ఉన్నప్పుడు నా కొడుకు దుష్యంత్ సింగ్ తన అత్తమామలతో పాటు విందుకు హాజరయ్యాను. అక్కడికి సింగర్ కనికా కపూర్ కూడా అతిథిగా హాజరయ్యారు. తనకు వైరస్ సోకినట్లు తెలిసిన వెంటనే నేను, దుష్యంత్ స్వీయ నిర్భంధంలోకి వెళ్లాము. అలాగే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము’’ అని చెప్పారు. కాగా వసుంధర రాజే, ఎంపీ దుష్యంత్లు ఇంతవరకూ ఎలాంటి వైద్య పరీక్షలు కానీ కరోనా వైరస్ పరీక్షలు కానీ చేయుంచుకోలేదని వారి వైద్యులు తెలిపారు. అయితే వ్యాధి లక్షణాలు కనిపిస్తే తప్ప వైద్య పరీక్షలు నిర్వహించలేమని వైద్యులు పేర్కొన్నారు. చదవండి: క్వారంటైన్లో ఉండలేం -
నా ప్రమాణం తర్వాత మాట్లాడతా
న్యూఢిల్లీ/గువాహటి: రాజ్యసభ సభ్యుడిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజ్యసభ నామినేషన్ గురించి మాట్లాడతానని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అన్నారు. ఆయన రాజ్యసభకు నామినేట్ అవడంపై పలు పార్టీలు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ఈమేరకు స్పందించారు. మంగళవారం గువాహటిలోని తన నివాసంలో గొగోయ్ విలేకరులతో మాట్లాడుతూ తాను బుధవారం ఢిల్లీకి వెళ్తానని చెప్పారు. ‘ముందు నన్ను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేయనివ్వండి. తర్వాత ఈ నామినేషన్ను ఎందుకు అంగీకరించానో వివరంగా చెప్తాను’అని అన్నారు. రాజ్యసభ నామినేటెడ్ సభ్యుల్లో ఒకరు పదవీ విరమణ చేయడంతో ఆ స్థానంలో రంజన్గొగోయ్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పలు రాజకీయ పార్టీలు గొగోయ్ నామినేషన్పై దుమారం రేపాయి. కాగా, రంజన్ గొగోయ్ 13 నెలల పాటు సీజేఐగా తన సేవలందించిన అనంతరం గతేడాది నవంబర్లో పదవీ విరమణ పొందారు. తన నామినేషన్పై వచ్చిన విమర్శలపై గొగోయ్ స్పందిస్తూ ‘దేశ అభివృద్ధి కోసం శాసన, న్యాయ వ్యవస్థలు ఏదో ఒక సమయంలో కలిసి పనిచేయాల్సిన అవసరముందనే నమ్మకంతోనే నేను రాజ్యసభ నామినేషన్ను అంగీకరించాను’అని తెలిపారు. కాగా, గొగోయ్ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ‘గొగోయ్ను రాజ్యసభకు నామినేట్ చేసే ముందు ప్రధాని మోదీ.. దివంగత, మాజీ న్యాయ మంత్రి అరుణ్ జైట్లీ సలహాను పరిగణలోకి తీసుకున్నారా?’అని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా ట్విట్టర్లో ప్రశ్నించారు. న్యాయ స్వతంత్రతను అణగదొక్కడమే రంజన్ గొగోయ్ను రాజ్యసభకు నామినేట్ చేయడం ఒక పనికి మాలిన చర్య అని, ఇది న్యాయ స్వతంత్రతను అణగదొక్కేలా ఉందని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. న్యాయ అధికారులు, ఉన్నత ప్రభుత్వ పదవుల్లో పనిచేసిన వారు పదవీ విరమణ పొందిన తర్వాత లాభం పొందే ఎలాంటి పోస్టులోకి వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించాలని సీపీఐ డిమాండ్చేసింది. న్యాయవ్యవస్థ, స్వతంత్రతను తుంగలో తొక్కారు నిష్పక్షపాత న్యాయ వ్యవస్థ, స్వతంత్రత వంటి ఉన్నత విలువలను రంజన్ గొగోయ్ తుంగలో తొక్కారని మాజీ సుప్రీంకోర్టు జడ్జి కురియన్ జోసెఫ్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ఒక సాధారణ పౌరుడికి ఉన్న నమ్మకాన్ని రాజ్యసభ నామినేషన్ను అంగీకరించడం ద్వారా గొగోయ్ వమ్ము చేశారని ఆరోపించారు. -
15 మందికి నారీ శక్తి పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: పోడు వ్యవసాయంలోనూ, గ్రామీణ మహిళల వికాసంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్కు చెందిన పడాల భూదేవి, 93 ఏళ్ల వయసులో కెరీర్ ఆరంభించి చండీగఢ్ అద్భుతంగా పేరు సంపాదించి, ఎన్నో అవార్డులు రివార్డులు సాధించిన శతాధిక వృద్ధ అథ్లెట్, మష్రూమ్ మహిళ, జార్ఖండ్ లేడీ టార్జాన్ సహా 15 మంది 2019 సంవత్సరానికిగాను నారీ శక్తి పురస్కారాలను గెలుచుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఈ అవార్డులను వారికి ప్రదానం చేశారు. మహిళా సాధికారత, సామాజిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సమాజంలో సానుకూల మార్పుల్ని తీసుకువచ్చే మహిళలకు ఏటా మహిళా శక్తి పురస్కారాలు అందజేస్తారు. బహుమతి గ్రహీతల్లో శ్రీకాకుళంకు చెందిన పడాల భూదేవితో పాటు వీణా దేవి (40–బీహార్), అరిఫా జాన్ (33–శ్రీనగర్, జమ్మూ కశ్మీర్), చారి ముర్ము (47–జార్ఖండ్), నిలజా వాంగ్మో (40–లేహ్), రష్మీ ఊర్థర్దేశ్ (60–పుణే, మహారాష్ట్ర), మాన్ కౌర్ (103–పాటియాలా, పంజాబ్), కళావతీ దేవీ (68–కాన్పూర్, ఉత్తరప్రదేశ్), తాషి, నుంగ్షీ (కవలలు) (28– డెహ్రాడూన్ – ఉత్తరాఖండ్), కౌషికి చక్రవర్తి (38–కోల్కతా, పశ్చిమబెంగాల్), అవని చతుర్వేది, భావనాకాంత్, మోహనాసింగ్ (వాయుసేన మొదటి మహిళా పైలెట్లు), భగీరథి అమ్మా (105)– కాత్యాయని(98) (అలప్పుజ–కేరళ)లు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు. పౌష్టికాహార లోపాల్ని నివారించండి: ప్రధాని నారీశక్తి అవార్డు పొందిన 15 మందిలో 14 మందితో ప్రధాని మోదీ తన నివాసంలో ముచ్చటించారు. పిల్లల్లో, మహిళల్లో ఉన్న పౌష్టికాహార లోపాల్ని నివారించడం, నీటిని బొట్టు బొట్టు సంరక్షించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నారీ మణులు సాధించిన లక్ష్యాలు కేసు స్టడీలుగా యూనివర్సిటీలకు ఉపయోగపడతాయని కొనియాడారు. అవార్డు గ్రహీతల్లో కశ్మీర్కు చెందిన ఆరిఫా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటర్నెట్పై నిషేధం తమ వ్యాపారాన్ని దెబ్బ తీస్తోందని ప్రధాని దృష్టికి తెచ్చారు. భూదేవి విజయగాథ ముగ్గురు ఆడపిల్లల తల్లినని తాను ఏనాడూ చింతించ లేదని భర్త వదలి వేస్తే కన్న వారింటిలో ఉండి గ్రామీణ, గిరిజన మహిళల వికాసానికి నడుం కట్టానని నారీశక్తి అవార్డు గ్రహీత పడాల భూదేవి అన్నారు. ఆమె అవార్డు అందుకున్న అనంతరం ప్రధాని మోదీ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో తన అనుభవాలను వివరించారు. గిరిజనుల్లో సవర తెగకు చెందిన తనకు చిరుప్రాయంలోనే వివాహమైతే ముగ్గురూ ఆడపిల్లలనే కన్నానని మెట్టినింటి వారు బయటకు పంపేశారన్నారు. తండ్రి చాటు బిడ్డగా పొలం పనిని నేర్చుకున్నానని, తనలాంటి వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నానన్నారు. 1–70 గిరిజన చట్టంలోని హక్కులు, మహిళా హక్కులను గురించి సభల్లో తెలుసుకున్నానని ఆ చట్టం కింద మహిళలను పెద్ద సంఖ్యలో సమీకరించి కొన్ని వేల ఎకరాల పోడు భూమిని సేకరించి చిరుధాన్యాల సాగుకు పూనుకున్నామన్నారు. పంటను మార్కెట్కు పంపితే డబ్బులు వస్తాయి కానీ పౌష్టికాహారం అందదు, అందుకే వాల్యూ అడిషన్ను చేకూర్చాలని నిర్ణయించాము. కంపెనీలను ఏర్పాటు చేసి చిరుధాన్యాలను పొడిగా మార్చి మార్కెటింగ్ చేయడం, బిస్కెట్లుగా తయారు చేయడం వంటివి మొదలు పెట్టాము. ఈరోజు తాము 15,000 మంది ఐసీడీఎస్ పథకం కింద ఉన్న బాలబాలికలకు (3–4 ఏళ్లలోపు) బిస్కెట్లు సరఫరా చేసి పౌష్టికాహారం అందజేయగలుగుతున్నాము. కలెక్టర్ సహకారంతో పంటలను మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాము. రైతుల అభివృద్ధే దేశాభివృద్ధి అని ఆమె వివరిస్తుండగా ప్రధాని అభినందించారు. భూదేవి తాను ప్రసంగించేటపుడు తనకు హిందీ రాదని అయినా హిందీలోనే చెప్పడానికి ప్రయత్నిస్తాననన్నారు. ఆమె చక్కగా హిందీ , కొన్ని ఇంగ్లీషు పదాలతో కలగలిపి చేసిన ప్రసంగం ప్రధానిని హత్తుకుంది. మీరు హిందీ చాలా బాగా మాట్లాడారు. మాట్లాడలేననే చింత వద్దు అని అన్నారు. -
ప్రధాన సమాచార కమిషనర్గా బిమల్
న్యూఢిల్లీ: ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ప్రస్తుత సమాచార కమిషనర్ (ఐసీ) అయిన బిమల్ జుల్కా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జుల్కా చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సమాచార కమిషనర్గా అమిత పండోవే బాధ్యతలు స్వీకరించారు. ఆమె చేత సీఐసీ జుల్కా ప్రమాణ స్వీకారం చేయించారు. అమిత సమాచార కమిషనర్ కావడంతో కేంద్ర సమాచార కమిషన్లో మొత్తం కమిషనర్ల సంఖ్య (సీఐసీతో కలిపి) 7కు చేరుకుంది. మాజీ సీఐసీ సుధీర్ భార్గవ జనవరి 11న పదవీ విరమణ చేసినప్పటి నుంచి సీఐసీ పోస్టు ఖాళీగానే ఉంది. సీఐసీ కాకుండా 10 మంది కమిషనర్లు ఉండాల్సిన కేంద్ర సమాచార కమిషన్లో కేవలం 6 మందే కమిషనర్లు ఉన్నారు. ప్రస్తుతం అమిత పండోవే నియామకం తర్వాత మరో 4 సమాచార కమిషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత నెలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ గతంలో సమాచార, ప్రసారశాఖ కార్యదర్శిగా పనిచేసిన జుల్కా పేరును సీఐసీ పదవికి, అమిత పండోవేను సమాచార కమిషనర్ పదవికి సూచించింది. -
మన శాస్త్రవేత్తల నైపుణ్యం గొప్పది
న్యూఢిల్లీ: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ భారతీయ శాస్త్రవేత్తల నైపుణ్యాన్ని ప్రశంసించారు. ‘మన శాస్త్రవేత్తల వినూత్న ఆలోచనలు, పరిశోధనల పట్ల వారి మార్గదర్శకాలు దేశానితోపాటు ప్రపంచానికి ఎనలేని కీర్తిని తెస్తాయి’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో భారత్ శాస్త్ర, సాంకేతిక రంగం వృద్ధిలో కొనసాగడమే కాక.. యువతకు సైన్స్ పట్ల ఉత్సుకతను పెంపొందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ‘మన శాస్త్రవేత్తలను గౌరవించుకునేందుకు జాతీయ సైన్స్ దినోత్సవం ఒక మంచి సందర్భం’అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా భారత్లో పరిశోధన, ఆవిష్కరణల్లో అనుకూల వాతావరణాన్ని కల్పించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుందన్నారు. పరిశోధనల్లో మహిళలు 15 శాతమే: కోవింద్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలు తక్కువ సంఖ్యలో ఉన్నారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో మహిళలు 15 శాతానికే పరిమితం అయ్యారని పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. దేశంలోని పరిశోధన, అభివృద్ధి సంస్థల్లో లింగ సమానత్వం, అభివృద్ధికి సంబంధించి మూడు కార్యక్రమాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. -
రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లోని అశోకా హాల్లో ఏర్పాటు చేసిన విందు సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన విందు భేటీలో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఈ విందు సమావేశానికి అతిథులుగా ఆహ్వానించగా ఆ జాబితాలో కేసీఆర్ కూడా ఉన్నారు.(సీఎన్ఎన్ X ట్రంప్) డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ ప్రథమ పౌరురాలు మెలానియా ట్రంప్ అతిథులను పరిచయం చేసుకుంటూ వారితో ముచ్చటిస్తూ ముందుకు సాగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో కరచాలనం చేసి తనను పరిచయం చేసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ వెంట రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉష, ప్రధాని నరేంద్ర మోదీ అతిథులను పలకరిస్తూ ముందుకు సాగారు. ట్రంప్కు సంబంధించి పూర్తి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఢిల్లీలో పోలింగ్ 61%
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య శనివారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రానికి 61.46% పోలింగ్ నమోదైంది. ఢిల్లీలోని 11 జిల్లాలకు గాను ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 65.24% పోలింగ్ నమోదు కాగా, న్యూఢిల్లీలో 56.10%, ఆగ్నేయ ఢిల్లీలో అత్యల్పంగా 54.89% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. సీఎం కేజ్రీవాల్ బరిలో ఉన్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో 42% మంది ఓటేశారు. కొన్ని పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నందున పోలింగ్ శాతం పెరిగే చాన్సుందని అధికారులు తెలిపారు. గత 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47% పోలింగ్ నమోదు కాగా, గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో 60.60% పోలింగ్ నమోదైంది. పెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీములు కలిపి 60వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు ఈ నెల 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓటేసిన రాష్ట్రపతి కోవింద్ దంపతులు పోలింగ్ సరళి ఇలా.. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా మొదటి మూడు గంటల్లో కేవలం 14.5% మాత్రమే పోలింగ్ జరిగింది. ఆ తర్వాత కొద్దిగా పుంజుకుని, మధ్యాహ్నం 3 గంటలకు 41.5%కు చేరుకుంది. పోలింగ్ ముగిసే 6 గంటల సమయానికి ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ముస్తాఫాబాద్లో 66.29%, మతియామహల్ 65.62%, సీలాంపూర్లో 64.92% పోలింగ్ నమోదైంది. షహీన్బాగ్లాంటి కొన్ని చోట్ల ఓటర్ల క్యూలు కొనసాగుతున్నందున పోలింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి రణ్బీర్ సింగ్ తెలిపారు. వీవీప్యాట్ స్లిప్పులో తన ఫొటో, పేరు కనిపించలేదంటూ న్యూఢిల్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ సభర్వాల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొద్దిసేపు పోలింగ్కు అంతరాయం కలిగింది. అధికారులు వెంటనే ఆ వీవీప్యాట్ మిషన్ స్థానంలో మరొకటి ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో వీవీప్యాట్ వైఫల్యం కేవలం ఒక్క శాతమేనని సీఈవో తెలిపారు. శతాధిక వృద్ధులు 60 మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఓటేసిన ప్రముఖులు రాష్ట్రపతి కోవింద్, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజ్పూర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పోలింగ్ కేంద్రంలో తల్లిదండ్రులతోపాటు భార్య సునీత, కొడుకు పుల్కిత్తో కలిసి వచ్చి ఓటు వేశారు. ముందుగా ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రియాంకా గాంధీ కొడుకు రెహాన్, కేజ్రీవాల్ కొడుకు పుల్కిత్ మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. కేజ్రీవాల్ మళ్లీ సీఎం అవుతారని భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా ప్రజలు ఎవరికి ఓటేస్తే వారే ఢిల్లీ సీఎం అవుతారని పుల్కిత్ బదులిచ్చాడు. పోలింగ్ కేంద్రం వద్ద సోనియా, ప్రియాంక కేజ్రీవాల్, స్మృతి ఇరానీ ట్విట్టర్ వార్ ఓటు ఎవరికి వేయాలనే విషయంలో మగవారిని సంప్రదించాలంటూ ఢిల్లీ మహిళలకు ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘మీరంతా తప్పకుండా ఓట్లేయండి. ముఖ్యంగా మహిళలకు ఓ విన్నపం. కుటుంబంతోపాటు దేశం, ఢిల్లీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో మీ ఇంట్లో మగవారితోనూ చర్చించండి’ అంటూ పోలింగ్కు ముందు కేజ్రీవాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ..ఎవరికి ఓట్లేయాలో తెలియని స్థితిలో మహిళలున్నట్లు కేజ్రీవాల్ భావిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు కేజ్రీవాల్ బదులిస్తూ..ఇంటి బాధ్యతలు మోసే ఢిల్లీ మహిళలు తమ కుటుంబం ఎవరికి ఓటేయాలో కూడా ఈసారి నిర్ణయించారని వ్యాఖ్యానించారు. షహీన్బాగ్లో ఆగని నిరసనలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని షహీన్బాగ్లో పోలింగ్ రోజూ నిరసనలు ఆగలేదు. నిరసనలు కొనసాగేందుకు వీలుగా అందులోని మహిళలు కొందరు మధ్యాహ్నం, కొందరు సాయంత్రం పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటేశారు. ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైన పోలింగ్ ప్రక్రియలో తామూ భాగస్వాములయ్యామని నిరసనల్లో పాల్గొంటున్న జెహ్రా షేక్ తెలిపారు. బిర్యానీ కోసమే నిరసనల్లో పాల్గొంటున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు తప్పని రుజువు చేసేందుకు ఓట్లు వేశామని మొహమ్మద్ అయూబ్ అన్నారు. ఏ పార్టీ వారు కూడా తమకు బిర్యానీ సరఫరా చేయడం లేదన్నారు. షహీన్బాగ్లో నిరసనకారులకు ఢిల్లీ సీఎం బిర్యానీ అందజేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు యూపీ సీఎం యోగికి ఈసీ నోటీసులు పంపింది. సిరా గుర్తుతో ఎంపీ గౌతం గంభీర్ దంపతులు. 9నెలల పాపతో క్లాసికల్ డ్యాన్సర్ అరణ్యని ఓటేసిన 111ఏళ్ల కలితార మండల్ -
మన ఆధ్యాత్మికత ప్రపంచానికి బహుమతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆందోళనలు, అనిశ్చితి, అభద్రతాభావం, శత్రుత్వా లతో నిండిన ప్రపంచంలో రామ చంద్ర మిషన్ వంటి సంస్థల బాధ్య తలు చాలా రెట్లు పెరిగాయని రాష్ట్ర పతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. కాన్హా శాంతివనం సంపూర్ణ జీవనానికి నమూనా వంటిదని ప్రశంసించారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ ధ్యాన కేంద్రం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి గొప్ప ప్రదేశమని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో విస్తరించిన ఈ మిషన్ బలమైన ఆధ్యాత్మిక శక్తిగా మారిందని చెప్పారు. రామచంద్ర మిషన్ వ్యక్తిగత, సామాజిక మార్పును ప్రోత్సహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాజయోగ ధ్యానా నికి గల ప్రాచీన సంప్ర దాయాన్ని ఆధునిక ప్రపంచంలో మిషన్ ప్రోత్సహిస్తోందన్నారు. భారత ఆధ్యాత్మికత ప్రపంచానికి అత్యంత విలువైన బహుమతి వంటిదన్నారు. నంది గామ మండలంలోని కాన్హా శాంతివనాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సందర్శించారు. వనం గ్లోబల్ హెడ్క్వార్టర్ని రాష్ట్రపతి ప్రారంభించారు. మిషన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసు కున్న సందర్భంగా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ఇక్కడ నిర్మించారు. ఇక్కడ నిర్వాహకులు 5 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా చివరి మొక్కను రాష్ట్ర పతి నాటి కేంద్రాన్ని పరిశీలించారు. అనంత రం అభ్యాసీలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలు, రైతులు, చేతి వృత్తిదారులు, ప్రయోజనాలకు చేపట్టిన కార్యకలాపాలు, పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు తీసు కుంటున్న చర్యలు ప్రశంసనీయమని, 5 లక్షల మొక్కలతో ఈ క్యాంపస్ ఆకు పచ్చని పరిసరాలతో అలరారుతోందన్నారు. సమున్నతులుగా తీర్చిదిద్దడానికి.. తమను తాము సమున్నతులుగా తీర్చిదిద్దు కోవాలన్న వారి కోరికను ఈ మిషన్ నెరవే ర్చుతుందని రాష్ట్రపతి తెలిపారు. మిషన్కు చెందిన అంతర్జాతీయ సమాజం భూమండ లాన్ని మెరుగైన ప్రాంతంగా తీర్చిదిద్దగలదని ఆకాంక్షించారు. సంతోషం, సంపూర్ణ సాను కూల శక్తియుక్తులతో అలరారే దిశగా మాన వాళిని పరివర్తన చెందించగలదన్న విశ్వా సాన్ని వెలిబుచ్చారు. ‘దాజీ వివరించిన ‘డిజై నింగ్ డెస్టినీ’లోని 5 సూత్రాలలో ఒకదాన్ని ఇక్కడ తప్పక నేను ప్రస్తావించాలి. మాన వత్వ గమ్యాన్ని రూపొందించాలి. ఇది మొదటగా మనతోనే ప్రారంభంకావాలి. ఆ తర్వాత ఇతరులకు విస్తరించాలి. అందరం కలిసి పనిచేస్తే మానవత్వ దిశను మార్చేం దుకు ఒకరోజు కచ్చితంగా వస్తుంది. ఇందుకు యువత సహకారం తీసుకుని మెరుగైన ప్రపంచాన్ని నిర్మించే ప్రయత్నాల్లో వారిని నిమగ్నం చేయాలి’అని పిలుపు నిచ్చారు. శాంతివనం.. ఓర్పుకు నిదర్శనం కాన్హా శాంతివనం మానవ ఓర్పుకు నిదర్శ నమని గురూజీ కమ్లేష్ డీ పటేల్(దాజీ) అన్నారు. ఐదేళ్లలో శాంతివనంలో ప్రపంచం లోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం నిర్మించడం వేలాది మంది అభ్యాసీకుల నిరంతర కృషి తోనే సాధ్యపడిందన్నారు. 1,400 ఎకరాల్లో శాంతి వనంలో నిర్మించిన ఐకానిక్ ధ్యాన కేంద్రం మానవాళి పరివర్తనకు కేంద్రంగా రూపాంతరం చెందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 75 వసంతాలు పూర్తి చేసు కున్న సందర్భంగా ధ్యాన శిబిరాలను గత నెల 28 నుంచి ఈ నెల 9 వరకు 3 విడతలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్లు తమిళిసై, బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతికి ఘన వీడ్కోలు.. హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీ బయలుదేరిన రాష్ట్రపతి కోవింద్కు బేగంపేట విమానాశ్రయంలో గవ ర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు. -
కాన్హా శాంతివనాన్ని సందర్శించిన రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్ : వ్యక్తిగత, సామాజిక పరివర్తనకు రామచంద్ర మిషన్ కృషి చేస్తోందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని రామచంద్ర మిషన్ 75 వ వార్షికోత్సవ ఉత్సవాలకు రామ్నాథ్ కోవింద్ ఆదివారం హాజరయ్యారు. కాన్హా శాంతివనంలోని ధ్యాన కేంద్రాన్ని ఆయన హార్ట్ఫుల్నెస్ సంస్థ గ్లోబల్ హెడ్ క్వార్టర్గా ప్రకటించారు. దాదాపు 1,400 ఎకరాల్లో విస్తరించి ఉన్న కాన్హా శాంతివనాన్ని రాష్ట్రపతి గతంలో ఒకసారి సందర్శించారు. ప్రపంచంలోని 130 దేశాల్లో విస్తరించి ఉన్న కాన్హా ఆశ్రమానికి సంబంధించి అయిదు వేలకు పైగా ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అన్నింటికన్నా మిన్నగా నిర్మించిన కాన్హా శాంతివనాన్ని గ్లోబల్ హెడ్ క్వార్టర్గా రాష్ట్రపతి ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరంగా పేరుపొందిన దీనిలో ఒకేసారి లక్షమంది ధ్యానం చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్, గవర్నర్లు తమిళిసై సౌందరరాజన్, దత్తాత్రేయను రామచంద్ర మిషన్ చైర్మన్ దాజీ కమలేష్ పటేల్ ఘనంగా సన్మానించారు. కాగా ఆదివారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి దంపతులు హెలికాప్టర్ ద్వారా కాన్హా ఆశ్రమానికి చేరుకున్నారు. సుమారు రెండు గంటల పాటు ఆయన కాన్హాలో గడిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, మహబూబ్ నగర్ కలెక్టర్ రొనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు. (అతిపెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం) -
నిర్భయ కేసు : వినయ్ శర్మ పిటిషన్ తిరస్కరణ
సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం తిరస్కరించారు. ఇక నిర్భయ దోషులైన పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, ముకేశ్ సింగ్ల ఉరిశిక్ష అమలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. చట్టపరంగా తమలో కొందరికి మిగిలి ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని దోషుల విఙ్ఞప్తి మేరకు.. ఉరిశిక్ష అమలు వాయిదా వేయాలంటూ అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా శుక్రవారం ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శిక్షను అమలు చేయొద్దని స్పష్టం చేశారు. (చదవండి : ‘నిర్భయ’ దోషుల ఉరి మళ్లీ వాయిదా) నిబంధనలకు విరుద్ధం..! దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, ముకేశ్ కుమార్ సింగ్లను ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలంటూ కోర్టు జనవరి 17వ తేదీన ఆదేశించారు. అయితే, వినయ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి కోవింద్ వద్ద పెండింగ్లో ఉండటం.. మిగతా ఇద్దరు (అక్షయ్, పవన్) చట్టపరమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉరి శిక్ష అమలును వాయిదా వేయాలంటూ వారి తరఫున లాయర్ ఏపీ సింగ్ గురువారం అడిషనల్ సెషన్స్ కోర్టులో వాదనలు వినిపించారు. నలుగురిలో ఏ ఒక్కరి పిటిషన్ పెండింగ్లో ఉన్నా మిగతా వారిని ఉరి తీయడం నిబంధనలకు విరుద్ధమని దోషుల తరఫు న్యాయవాది వాదించారు. ఏకీభవించిన న్యాయమూర్తి డెత్ వారెంట్లను వాయిదా వేస్తూ ఆదేశాలిచ్చారు. (చదవండి : అందుకే నిర్భయ దోషుల ఉరిశిక్షపై స్టే: జడ్జి) -
సీఏఏ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కలగదు
-
'ఈ దశాబ్ధం భారత్కు ఎంతో కీలకం'
న్యూఢిల్లీ : దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని,ఈ దశాబ్దం భారత్కు ఎంతో కీలకంగా మారనుందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం పార్లమెంట్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నవభారత్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని కొత్త పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ వల్ల మైనార్టీ మహిళలకు న్యాయం జరిగిందని వెల్లడించారు. ట్రాన్స్ జెండర్ హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. వివాదాస్పద రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం దేశ ప్రజలు ఐక్యతగా వ్యవహరించడం హర్షణీయమని పేర్కొన్నారు.హింస వల్ల దేశ ప్రతిష్ట దిగజారుతుందని పేర్కొన్నారు.(కొనుగోలు శక్తి పెంపే బడ్జెట్ లక్ష్యం) ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చారిత్రాత్మకం ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం చారిత్రాత్మకమని, ఈ నిర్ణయం వల్ల జమ్మూ, కశ్మీర్, లఢక్ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయని, దేశంలో అమలయ్యే ప్రభుత్వ పథకాలన్నీ ఇప్పుడు కశ్మీర్కు కూడా వర్తిస్తున్నాయని వెల్లడించారు. సబ్కా సాత్.. సబ్కా వికాస్ నినాదంతో ప్రభుత్వం ముందుకెళుతుందని, అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం నిధులు భారీగా కేటాయించారని, అక్కడ రైల్వే వ్యవస్థను మరింత మెరుగుపరచనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే బోడో సమస్యను పరిస్కరించారని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగించారని రాష్ట్రపతి వివరించారు. గత ఐదేళ్లలో దేశంలో చేపట్టిన కార్యక్రమాల వల్ల భారత్కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, బ్యాంకింగ్ రంగంలో భారత్ గణనీయమైన అభివృద్ది సాధించిందని పేర్నొన్నారు. (అన్ని వర్గాలకు బడ్జెట్లో ప్రాధాన్యం: మోదీ) సీఏఏ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం కలగదు పౌరసత్వ సవరణ చట్టంపై మాట్లాడుతూ.. గాంధీ స్పూర్తితో పాకిస్తాన్లో ఉన్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులకు పౌరసత్వం ఇస్తున్నామని, ఇది మన కర్తవ్యమని తెలిపారు. సీఏఏ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదని, అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కోవింద్ వెల్లడించారు. పాలనా విభాగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, ప్రభుత్వ సేవలను వేగవంతంగా ప్రజలకు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో తోడ్పడుతుందని కోవింద్ స్పష్టం చేశారు. దేశంలో ఉన్న రైతుల సంక్షేమమే మా ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. మహిళా, శిశు సంక్షేమానికి భారీగా నిధులు వెచ్చించారని తెలిపారు.దేశంలో 27వేల ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గంగా ప్రక్షాలన మంచి ఫలితాన్నిస్తోందన్నారు. భారత్లో విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగిందని, గుజరాత్లో ఏర్పాటు చేసిన స్టాట్యు ఆఫ్ యునిటీని(సర్దార్ వల్లబాయ్పటేల్ విగ్రహం) చూసేందుకు వేల సంఖ్యంలో విదేశీయులు వస్తున్నారని కోవింద్ తెలిపారు. విదేశీ పెట్టుబడుల సంఖ్య గణనీయంగా పెరిగింది జీఎస్టీ విధానం వల్ల ఆర్థిక రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, ఈ విధానం అమలు వల్ల రాష్ట్రాలు కూడా పలు ప్రయోజనాలు పొందుతున్నాయని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చినా భారత్ బలంగానే ఉందని, దేశంలో విదేశీ పెట్టుబడుల సంఖ్య గణనీయంగా పెరిగిందని రామ్నాథ్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తుందని కోవింద్ వెల్లడించారు. అంతరిక్ష పరిశోధనల్లో గణనీయమైన ప్రగతి సాధించామని కోవింద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 విఫలమైనా అంతరిక్షంపై దేశ ప్రజల్లో ఆసక్తి పెరిగిందని, చంద్రయాన్-3కి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తుచేశారు.దేశ అంతర్గత భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రామ్నాథ్ కోవింద్ వెల్లడించారు. ఇతర దేశాలతో సత్సంభాదాలు కొనసాగిస్తూనే దేశ సైనిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు సైనిక విభాగంలో భారీ మార్పులు తీసుకొచ్చామని, వారికి అత్యాధునిక ఆయుధాలను అందించామని రామ్నాథ్ కోవింద్ వెల్లడించారు రామ్నాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టారు.కాగా నల్ల బ్యాడ్జీలు ధరించి విపక్షాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. -
ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
ప్రధాని మోదీతో భేటీ అయిన బ్రెజిల్ అధ్యక్షుడు
ఢిల్లీ : బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో నాలుగురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్కు చేరుకున్న సంగతి తెలిసిందే. 71వ గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చిన విషయం విదితమే. ఈ సందర్భంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో జైర్ బొల్సొనారో అధికారికంగా బేటీ అయ్యారు. కాగా ఈ పర్యటనలో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో 15 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఆయిల్, గ్యాస్, మైనింగ్, సైబర్ భద్రత ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు రాష్ట్రపతిభవన్ వద్ద ఘన స్వాగతం లభించింది.ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ఆయనతో కరచాలనం చేసి ఆహ్వానించారు.అనంతరం త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి ఢిల్లీలోని రాజ్ఘాట్కు వెళ్లిన జైర్ బొల్సొనారో మహాత్మగాంధీకి ఘనమైన నివాళులు అర్పించారు. -
సాయి జన్మభూమి ఏది?
షిర్డీ సాయినాథుని పేరు వింటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మదిప రవశమైపోతుంది. ఏటా లక్షలాది మం ది దేశవిదేశాల నుంచి వచ్చే భక్తులు షిర్డీని సందర్శించుకుంటారు,. జీవితంలో ఒక్కసారైనా షిర్డీ సాయిబాబాను దర్శించుకోవాలని కోరుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు. నిజానికి మతాలకతీతంగా సాయిబాబాను పూ జిస్తారు. అయితే తాజాగా సాయిబాబా జన్మస్థలం ఏదనేది చర్చనీయాంశమైం ది. ఊరు పేరునే తన పేరులో ఇముడ్చుకున్న సాయినాథుడి జన్మస్థలం అసలు షిర్డీయా? లేక పర్బనీ జిల్లాలోని పత్రియా? అనే మీమాంస భక్తగణంలో నెలకొంది. భారత ప్రజల ఆధునిక ఆరాధ్య దైవం షిర్డీ సాయిబాబా జన్మస్థలంపై తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో షిర్డీ సాయినాథుని దేవాలయాన్ని మూసివేస్తామని బెదిరింపులకు దిగేస్థాయికి చేరింది. ఇదే ఇప్పుడు భక్తుల్లో కలకలం రేపుతోంది. వివాదానికి కారణం.. నిజానికి మహారాష్ట్రలోని పర్బనీ జిల్లా లో ఉన్న పత్రిని కూడా ఏటా వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. అయితే ఈ పట్టణం పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదు. పత్రి సాయినాథుడి దేవాలయాన్ని ఇటీవల సందర్శించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈ పట్టణాభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అయితే అహ్మద్నగర్ జిల్లాలోని షిర్డీ ప్రజానీకం దీనిపై అభ్యంతరం తెలిపారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోన్న షిర్డీ ఆలయ ప్రాధాన్యం తగ్గుతుందేమోననేది వారి ఆందోళనగా భావిస్తున్నారు. ఎవరీ సాయినాథుడు? షిర్డీ సాయిబాబా 1835, సెప్టెంబర్ 28న బ్రిటిష్ ఇండియాలో ని నిజాం రాష్ట్రంలోని పత్రిలో బ్రాహ్మణ దంపతులకు జన్మించారనీ, ఐదేళ్ల బాలుడిగా ఉండగా సాయిబాబాని ఓ ఫకీర్కి పిల్ల లు లేని కారణంగా పెంచుకోవడానికి ఇచ్చేసినట్టు సత్యసాయి బాబా (పుట్టపర్తి) చెప్పినట్టు చరిత్రకారులు దాస్గణు మహా రాజ్, గోవింద్ దబోల్కర్లు తమ పుస్తకంలో ప్రస్తావించారు. మత సహన ప్రతీక.. ఆ రోజుల్లో హిందూ ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉండేది. ఆ సందర్భంలో సాయిబాబా హిందూ దేవాలయాల్లోకి వెళ్లి ముస్లిం మత ప్రార్థనలు చేసేవారట. అలాగే ముస్లిం దేవాలయాల్లో హిందూ దేవతలను స్తు తిస్తూ గీతాలాలపించేవారట. దీంతో ఇరుమతాల వారు బాలుడిపై ఫకీరు భార్యకి ఫిర్యాదు చేసేవారు. ఈ బాలుడిని పెంచడం కష్టంగా భావించిన ఫకీరు భార్య సాయిబాబాని తమ పొరుగింట్లో ఉండే వెంకుశ అనే వ్యక్తికి అప్పగించారు. 1839 నుంచి 1851 వరకు ఈ బాలుడు వెంకుశ ఆశ్రమంలోనే గడిపాడు. సాయిబాబా 16 ఏళ్ల వయస్సులో షిర్డీకి వచ్చినట్టు చెబుతారు. దాడులకు వెరవని ధీశాలి.. తనపై అనేక దాడులు జరిగినా చలించకుండా ఉండడం సాయి సహనానికి ప్రతీకగా భావిస్తారు. చిన్న వయస్సులోనే ఆహారం, నీరు లేకుండా రోజుల తరబడి వేపచెట్టుకింద కూర్చుని ధ్యానం చేస్తోంటే జనం విస్తుపోయేవారని అంటారు. ప్రజలపై ఆయనకున్న ప్రేమ, ఔదార్యం, ఆయన భాష్యాలూ జనాన్ని ఎంతగానో ఆకర్షించేవి. క్రమంగా హిందూ ముస్లింలకు సాయిబాబా ఆరాధ్యులుగా మారారు. కర్మభూమి షిర్డీ.. జన్మభూమి పత్రి మరణానంతరం సాయిబాబాకు షిర్డీలోని బూటి వాడాలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, పత్రియే సాయి జన్మస్థలమ నేందుకు ఆధారాలున్నాయని ఎన్సీపీ నాయకులు వాదిస్తున్నా రు. రామ్నాథ్ కోవింద్ సైతం ఇదే విషయాన్ని అంగీకరించినట్టు చెప్పుకొస్తున్నారు. పత్రిలోని సాయిబాబా దేవాలయాన్నీ, ఆ పట్టణాన్నీ అభివృద్ధి పరిస్తే, షిర్డీ ప్రాశస్త్యం తగ్గుతుందన్న ఆందోళనే ఈ వివాదానికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. -
ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు
న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషుల ఉరికి రంగం సిద్ధమైంది. 2012 నాటి నిర్భయ అత్యాచార కేసు దోషి ముఖేష్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించడం.. తీహార్ జైలు అధికారుల అభ్యర్థన మేరకు ఢిల్లీ కోర్టు నలుగురు దోషులపై మరోసారి డెత్వారెంట్లు జారీ చేయడంతో ఫిబ్రవరి 1న ఉదయం ఆరుగంటలకు వారి ఉరితీత ఖరారైంది. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 22నే నిర్భయ దోషులకు ఉరిపడాల్సి ఉండగా.. ముఖేష్ సింగ్ అనే దోషి తనను క్షమించాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ సమర్పించారు. ఢిల్లీ ప్రభుత్వం ద్వారా అందిన పిటిషన్ను కేంద్ర హోంశాఖ శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవనానికి పంపింది. ఆ వెంటనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిటిషన్ను పరిశీలించడంతోపాటు తిరస్కరిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. దీంతో తీహార్ జైలు అధికారులు తాజా డెత్ వారెంట్లు కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించడం, కోర్టు వెంటనే వాటిని జారీ చేయడం చకచక జరిగిపోయాయి. నిర్భయ తండ్రి హర్షం.. తన కూతురిపై అత్యాచారానికి పాల్పడినవారిలో ఒకరైన ముఖేష్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి తిరస్కరించడంపై నిర్భయ తండ్రి శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ‘‘వాళ్లకు ఉరిపడటం దాదాపుగా ఖాయమైనందుకు సంతోషంగా ఉంది. క్షమాభిక్ష పెట్టిన వెంటనే తిరస్కరిస్తారని మాకు భరోసా ఇచ్చారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 22న జరగాల్సిన ఉరితీత వాయిదా పడటం నిరాశకు గురిచేసిందని, తాజా పరిణామాలతో మళ్లీ ఆశలు చిగురించాయన్నారు. నిర్భయ ఘటన.. 2012 డిసెంబర్లో నిర్భయపై ముఖేష్, వినయ్, అక్షయ్, పవన్ అనే నలుగురితోపాటు మరికొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడటం, ఈ క్రమంలో అయిన తీవ్ర గాయాలకు చికిత్స పొందుతూ నిర్భయ కొన్ని రోజుల తరువాత సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో మరణించడం మనకు తెలిసిన విషయమే. ఈ ఘోర సంఘటనకు స్పందనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 2013 మార్చిలో ఐదుగురు నిందితులపై కేసు విచారణ మొదలైంది ఈలోపుగా ప్రధాన నిందితుడైన రామ్సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుల్లో మరొకరు జువెనైల్ కావడంతో అతడిని మూడేళ్లపాటు జువెనైల్ హోంలో ఉంచి ఆ తరువాత విడుదల చేశారు.మిగిలిన నలుగురి నిందితుల విచారణ తరువాత 2013 సెప్టెంబర్లోనే న్యాయస్థానం దోషులు నలుగురికీ ఉరిశిక్ష ఖరారు చేసింది. మైనర్నంటూ సుప్రీంకోర్టుకు.. నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా.. నేరం జరిగిన సమయంలో తాను మైనర్నంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గతంలో ఇదే పిటిషన్ను ఢిల్లీ హైకోర్టులో దరఖాస్తు చేయగా, దాన్ని హైకోర్టు కొట్టేసింది. విచారణ సమయంలో దోషి తరఫు న్యాయవాది హాజరుకాక పోవడంతో అతనిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే వ్యవహారంపై పవన్ కుమార్ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. -
అడుక్కుంటున్నా.. నిర్భయ తల్లి భావోద్వేగం
న్యూఢిల్లీ: ‘చేతులు జోడించి అడుక్కుంటున్నా.. ఆ నలుగురికి వెంటనే ఉరిశిక్ష అమలు చేయండి’ అంటూ నిర్భయ తల్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విఙ్ఞప్తి చేశారు. తన కూతురి మరణాన్ని అపహాస్యం చేయవద్దని కన్నీళ్లతో రాజకీయ పార్టీలను వేడుకున్నారు. ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేసేలా డెత్వారెంట్లు జారీ అయిన విషయం తెలిసిందే. అయితే.. మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకు వారు అన్ని విధాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆఖరి ప్రయత్నంగా క్షమాభిక్ష ప్రసాదించాలంటూ దోషుల్లో ఒకడైన ముఖేశ్ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో నిర్భయ దోషుల్ని ఉరి తీయడానికి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోందని బీజేపీ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. 2017లోనే సుప్రీం కోర్టు వారికి ఉరిశిక్ష ఖరారు చేసినప్పటికీ ఆప్ ప్రభుత్వం ఉరి అమలును ఎందుకు నానుస్తోందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించగా.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆయన విమర్శలను తిప్పికొట్టారు. ఈ క్రమంలో నిర్భయ తల్లి గురువారం మీడియాతో మాట్లాడారు.(నిర్భయ దోషుల ఉరిశిక్షకు లైన్ క్లియర్!) ‘‘ నా కూతురిని చంపిన వారికి వేలకొద్దీ అవకాశాలు లభిస్తున్నాయి. కానీ మాకు ఏ హక్కులు లేవా? ఇన్నేళ్లలో నేను ఇంతవరకు రాజకీయాల గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అయితే ఒక్క విషయం.. 2012లో ఎవరైతే నా కూతురి కోసం వీధుల్లోకి వచ్చి నిరసనలు చేశారో.. ఈ రోజు వాళ్లే నా కూతురి చావును అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారు. 2014లో అధికారంలోకి వస్తే మహిళలపై దాడులు జరగవని చెప్పారు. రెండోసారి కూడా అధికారం చేపట్టి వేల కొద్దీ పనులు చేశారు. ట్రిపుల్ తలాక్ వంటి కీలక అంశాల్లో నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నా కూతురి విషయంలో కూడా త్వరగా నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకోండి. చేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను’’ అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇక నిర్భయ తల్లి ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.(ఉరితాడుతో తాళి బొట్టు) చదవండి: నిర్భయ కేసు సంబంధిత కథనాలు తనను రక్తపు మడుగులో చూశా.. బండరాయిని ‘నా కూతురు బతికిలేదు.. చాలా సంతోషం’ సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్ వద్ద ఇంకా.. -
నిర్భయ దోషుల ఉరి అమలుకు లైన్ క్లియర్!
న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. దీంతో నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు మార్గం సుగమమైంది. ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఉదంతంలో నలుగురు దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేసేలా డెత్వారెంట్లు జారీ అయిన విషయం తెలిసిందే. అయితే.. మరణశిక్ష నుంచి తప్పించుకునేందుకు వారు అన్ని విధాలుగా ప్రయత్నించారు. ఈ క్రమంలో వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఆఖరి ప్రయత్నంగా... క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ముఖేశ్ రాష్ట్రపతికి మూడు రోజుల క్రితమే విజ్ఞప్తి చేశాడు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం.. తొలుత దోషి క్షమాభిక్ష అర్జీ ఢిల్లీ ప్రభుత్వానికి చేరగా... క్షమాభిక్షను తిరస్కరించాలని ఆప్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్కు విన్నవించింది. ఆ తర్వాత క్షమాభిక్ష పిటిషన్ను కేంద్ర హోం శాఖకు పంపించారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర హోం శాఖ... ముఖేశ్ పిటిషన్ను తిరస్కరించాలని విఙ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపింది. ఈ నేపథ్యంలో తన అభీష్టం మేరకు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా రావు రఘునందన్రావు, బట్టు దేవానంద్, దొనడి రమేశ్, నైనాల జయసూర్య నియమితులయ్యారు. వీరి నియామకానికి శుక్రవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 19కి చేరుకోనుంది. న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం గతేడాది జూలై 25న కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ నలుగురు న్యాయమూర్తులతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సోమవారం ప్రమాణం చేయించనున్నారు. రావు రఘునందన్రావు ఈయన 1964 జూన్ 30న రావు చిన్నారావు, విలసిత కుమారి దంపతులకు జన్మించారు. పాఠశాల విద్య హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సాగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1988లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అదే ఏడాది న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. సీనియర్ న్యాయవాది ఎస్.రవి వద్ద జూనియర్ న్యాయవాదిగా కెరీర్ను ఆరంభించారు. 1993 నుంచి 94 వరకు ప్రభుత్వ సహాయ న్యాయవాది (ఏజీపీ)గా, 1995లో అడ్వొకేట్ జనరల్కు సహకరించేందుకు స్పెషల్ ఏజీపీగా నియమితులయ్యారు. 1996 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. అనతి కాలంలోనే సివిల్, వాణిజ్య, రాజ్యాంగపరమైన కేసుల్లో మంచి పట్టు సాధించారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లకు న్యాయవాదిగా ఉన్నారు. ఏపీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ సీనియర్ న్యాయవాదుల ప్యానెల్లో చోటు దక్కించుకున్నారు. ఉమ్మడి హైకోర్టు రఘునందన్రావుకు సీనియర్ న్యాయవాది హోదానిచ్చి గౌరవించింది. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బట్టు దేవానంద్ 1966 ఏప్రిల్ 14న కృష్ణా జిల్లా, గుడివాడ చౌదరిపేటలో వెంకటరత్నం, మనోరంజితం దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులు. గుడివాడ ఏజీకే పాఠశాలలో ఎస్ఎస్సీ, ఏఎన్ఆర్ కాలేజీలో ఇంటర్, బీఏ, ఆంధ్రా యూనివర్సిటీలో బీఎల్ చదివారు. గుడివాడ కళాశాలలో చదివేటప్పుడు విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. 1989లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. విశాఖపట్నంలో సీనియర్ న్యాయవాది ఎం.కె.సీతారామయ్య వద్ద 1989 నుంచి 1992 వరకు జూనియర్గా పనిచేస్తూ వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 1993 నుంచి స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1996 నుంచి 2000 వరకు హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశారు. 2004 నుంచి బీఎస్ఎన్ఎల్కు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. పలు ఇన్సూరెన్స్ కంపెనీలకు సైతం న్యాయవాదిగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు. నైనాల జయసూర్య పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 1968లో జన్మించారు. తల్లిదండ్రులు.. ఎన్వీవీ కృష్ణారావు, ఇందిరా దేవి. తండ్రి.. కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. జయసూర్య.. తణుకులో ఎస్ఎస్సీ, రాజమండ్రి ఏకేసీ జూనియర్ కాలేజీలో ఇంటర్, ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, విజయవాడలోని వెలగపూడి దుర్గాబాయి సిద్ధార్థ కాలేజీ ఆఫ్ లాలో ఎల్ఎల్బీ చదివారు. 1992లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సీనియర్ న్యాయవాది, మాజీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) తలారి అనంతబాబు వద్ద జూనియర్గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. 2003–04లో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించారు. 2009–14 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీఎస్టీసీ, ఎస్టీసీ, హుడా తదితర ప్రభుత్వ రంగ సంస్థల తరఫున కేసులు వాదించారు. బీహెచ్ఈఎల్, ఆప్కో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్యానల్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు. దొనడి రమేశ్ 1965 జూన్ 27న చిత్తూరు జిల్లా సోమల మండలం కామనపల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు.. డీవీ నారాయణ నాయుడు, అన్నపూర్ణ. నంజంపేటలో ఎస్ఎస్సీ, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్, బీకాం, నెల్లూరు వీఆర్ లా కాలేజీలో బీఎల్ చదివారు. 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నారాయణ వద్ద జూనియర్గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. కొంతకాలం తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఎక్కువగా పరిపాలనా ట్రిబ్యునల్లో కేసులు వాదించారు. 2000–2004 మధ్య హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2006–13 మధ్య కాలంలో హైకోర్టులో రాజీవ్ విద్యా మిషన్, సర్వ శిక్షాఅభియాన్కు న్యాయవాదిగా వ్యవహరించారు. 2014 నుంచి 2019 వరకు హైకోర్టులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు నిర్వర్తించారు. -
పెళ్లి ఆగకుండా కాపాడిన రాష్ట్రపతి
పెళ్లి అనగానే ఎక్కడాలేని హడావిడీ చేస్తారు. వివాహం ఇంకా నెల రోజులు ఉందనగానే పనులను ప్రారంభిస్తారు. ఏ ఫంక్షన్హల్లో చేయాలి. ఎలాంటి విందు పెట్టాలి.. ఎవరెవరినీ ఆహ్వనించాలి. ఇలా ఎన్ని పనులుంటాయి కదా.. అచ్చం ఇలాగే ఆలోచించారు ఓ కుటుంబం. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా పెళ్లి రెండు రోజులు ఉంది అనగా వారికి షాక్ తగిలింది. అదేంటంటే... యూఎస్కు చెందిన ఆశ్లే హల్ అనే మహిళ కేరళలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 7న(మంగళవారం)తేదిని ఫిక్స్ చేయడంతో నెల రోజుల ముందే కొచ్చిలోని తాజ్ హోటల్లో హాల్ను రిజర్వ్ చేసుకున్నారు. అయితే అదే రోజున రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొచ్చి పర్యటనకు రానున్నారని తెలిసింది. దీంతో హోటల్లో పెళ్లికి అనుమతిస్తే రాష్ట్రపతికి భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన హోటల్ సిబ్బంది వివాహా తేదిని మార్చుకోవాలని వారికి సూచించారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఇలా ఉన్నపాటున చెబితే ఎలా మార్చుకోవాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పెళ్లి ఆగిపోతుందని నిరాశ చెందిన వధువు ఓ ఆలోచన చేసింది. ఏకంగా రాష్ట్రపతి భవన్కు ట్విటర్ అకౌంట్కు ట్వీట్ చేసింది. తన పెళ్లి సవ్యంగా జరగడానికి సహాయం కావాలని కోరింది.. Hey @rashtrapatibhvn- anything you can do to help us with your security team so that we don’t have to move our wedding from the @Taj_Cochin in under 48 hours? https://t.co/0S5y9az9Hk — Ashley Hall (@hall_ash) January 5, 2020 దీనిపై స్పందించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పెళ్లికి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెళ్లి తేదిని మార్చాల్సిన అవసరం లేదని.. అనుకున్న తేదికే ఆమె వివాహం జరగాలని ఆదేశించారు. ఇందుకు ఆయన భద్రతా బలగాలను తగ్గించాలని సూచించారు. కాగా ఆధికారులు స్థానికంగా పరిస్థితిని విశ్లేషించి రాష్ట్రపతి పర్యటనకు, పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. సమస్య పరిష్కరమైనందుకు సంతోషంగా ఉందని తెలిపిన రాష్ట్రపతి నూతన వధువరులను ఆశీర్వదించి... శుభాకాంక్షలు తెలిపారు.కాగా కేరళ పర్యటన నిమిత్తం సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్నాథ్ కొచ్చికి చేరుకున్నారు. అనంతరం తాజ్ హోటల్లో బస చేసిన ఆయన మంగళవారం లక్షద్వీప్కు చేరుకోనున్నారు. We are glad the issues have been resolved. President Kovind conveys his best wishes to you on this joyous occasion — President of India (@rashtrapatibhvn) January 5, 2020 -
అమరావతి రాజధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సోమవారం లేఖ రాశారు. రాజ్యాంగం సూచించిన సూత్రాల మేరకు పరిపాలన వ్యవహారాలు సాగాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్ణయించడంతోపాటు ఇతర అంశాలను అధ్యయనం చేసేందుకు శివరామకృష్ణన్ కమిటీని నియమించిందన్నారు. అయితే గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా వారి పార్టీ నాయకులతో కమిటీని వేసి అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రీ–ఆర్గనైజేషన్ యాక్ట్–14 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. రాజధాని విషయంలో అధికారికంగా గెజిట్ ద్వారా నోటిఫై చేయలేదని తెలిపారు. రాజ్యాంగ సంస్థలు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లో పనిచేయలేదని, వాటిని వేరే చోటుకు మార్చేశారని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ సైతం ఒకేచోట పెద్ద పట్టణాన్ని రాజధానిగా ఏర్పాటు చేయడం కంటే వికేంద్రీకరణను సూచించడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజధాని ఒకేచోట ఏర్పాటు చేయాలనుకున్నా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో ఏర్పాటు చేయవద్దని నిపుణుల కమిటీ స్పష్టంగా పేర్కొన్నా దానిని తుంగలో తొక్కారన్నారు. వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ, మరో ప్రైవేటు సంస్థ ఇచ్చిన నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఏర్పడుతుందని తెలిపారు. ఇటువంటి నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని ఆయన లేఖలో కోరారు. -
‘ఫాల్కే’ అందుకున్న బిగ్బీ
న్యూఢిల్లీ: బాలీవుడ్ మెగాస్టార్, బిగ్బీ అమితాబ్ బచ్చన్ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో కోవింద్ ఈ అవార్డును ప్రదానం చేశారు. వాస్తవంగా బిగ్బీ ఈ అవార్డును కొద్ది రోజుల క్రితమే అందుకోవాల్సి ఉన్నా అనారోగ్య కారణాల రీత్యా కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. దీంతో ఆదివారం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో బిగ్బీకి అవార్డు అందిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల ప్రకటించారు. జాతీయ సినీ పురస్కారాలు అందుకున్న నటులకు రాష్ట్రపతి తన నివాసంలో ఆదివారం తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమితాబ్కు అవార్డు అందజేశారు. భారతీయ సినీ రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు గానూ.. బిగ్బీకి ఈ పురస్కారం లభించింది. భారతీయ సినిమాలో ఇది అత్యున్నత పురస్కారం. ఈ అవార్డు కింద రూ.10 లక్షలతో పాటు స్వర్ణ కమలం అందజేస్తారు. కాగా.. ఈ అవార్డుకు అర్హుడిగా తనను ఎంపిక చేసిన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ సభ్యులకు, కేంద్ర ప్రభుత్వం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలకు అమితాబ్ కృతజ్ఞతలు తెలిపారు. తనతో సినిమాలు తీసిన నిర్మాతలు, దర్శకులు, తోటి కళాకారులు, తనను ఆరాధిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ సతీమణి, ఎంపీ జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ సినిమా పితామహుడు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే పేరు మీదుగా 1969 నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందజేస్తున్నారు. అదే ఏడాది అమితాబ్ ‘సాత్ హిందుస్తానీ’అనే హిందీ సినిమాతో అరంగేట్రం చేశారు. -
రాష్ట్రపతి నిలయంలో ఎట్హోమ్
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కో సం ఈ నెల 20న హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్హోం’కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గవర్నర్ తమిళిసై, సీఎం కె.చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. ఎట్హోం కార్యక్రమానికి వచ్చిన అతిథులకు రాష్ట్రపతి కోవింద్ దంపతులు అభివాదం చేసి పేరు పేరునా పలకరించారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు శ్రీనివాస్గౌడ్, వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను సీఎం కేసీఆర్ రాష్ట్రపతి కోవింద్కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారంతా రాష్ట్రపతి దంపతులతో గ్రూప్ ఫొటో దిగారు. -
సుజనాకు రాష్ట్రపతి షాక్
-
సుజనా ఆర్థిక నేరాలపై స్పందించిన రాష్ట్రపతి
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి) ఆర్థిక నేరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి సెప్టెంబర్ 26న రాసిన లేఖ పట్ల రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ స్పందించారు. ఈ లేఖ రాష్ట్రపతి సచివాలయం నుంచి నవంబర్ 6న కేంద్ర హోం శాఖకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ విజయసాయిరెడ్డి రాసిన లేఖను, రాష్ట్రపతి కార్యాలయం నోట్తో వచి్చన లేఖను కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శికి, కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శికి పంపింది. తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరింది. ఈ మేరకు హోంశాఖ అండర్ సెక్రెటరీ అశోక్ కుమార్ పాల్ విజయసాయిరెడ్డికి ఒక లేఖ పంపారు. దీంతో సుజనా చౌదరి అక్రమాలపై సంబంధిత శాఖలు విచారణకు సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుజనా చౌదరి అంతర్జాతీయ స్కామ్స్టర్, మానీలాండరర్, మోసపూరిత కంపెనీలను సృష్టించడంలో ఆరితేరిన వ్యక్తి అని విజయసాయిరెడ్డి తన లేఖలో ఆరోపించారు. సుజనా చౌదరిపై ఉన్న ఆరోపణలను రాష్ట్రపతికి రాసిన లేఖలో వి.విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. సుజనా చౌదరి మోసాలివీ... ►సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా టవర్స్తోపాటు మరో 102 కంపెనీలు ఉన్నాయి. వీటిలో ఒకటైన బార్ర్టోనిక్స్ పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీ. 8 కంపెనీలు తప్ప మిగిలినవన్నీ షెల్(డొల్ల) కంపెనీలే. ఇవి సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్డింగ్, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలతో సంబంధం ఉన్నవి. ►ఈ 8 కంపెనీల్లో 50 శాతం వ్యాపారం భారత్లోని షెల్ కంపెనీల ద్వారా జరుగుతున్నదే. మరో 20–25 శాతం వ్యాపారం సుజనా గ్రూపు పరోక్షంగా నిర్వహిస్తున్న విదేశీ షెల్ కంపెనీల ద్వారా జరుగుతోంది. ►సుజనా గ్రూపు ప్రస్తుతం వివిధ బ్యాంకులు, ఆరి్థక సంస్థలకు రూ.8 వేల కోట్లకుపైగా చెల్లించాల్సి ఉండగా, మార్కెట్లో ఆ గ్రూపు ఆస్తుల విలువ రూ.132 కోట్లు కూడా లేదు. ఫలితంగా ఈ గ్రూపు కంపెనీల షేర్లు కొన్నవారు భారీగా నష్టపోయారు. ►సుజనా గ్రూపునకు చెందిన బిగ్ బ్రదర్స్గా పిలిచే రెండు ప్రధాన కంపెనీలు (సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్, సుజనా టవర్స్) కలిపి రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులకు(సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా) రూ.920 కోట్లు మేర రుణాలు ఎగవేశాయి. ►ఈ రెండు కంపెనీలతోపాటు సుజనా గ్రూపు నడుపుతున్న మరో పెద్ద సంస్థ సుజనా మెటల్ ప్రొడక్టŠస్. ఈ సంస్థ 2014 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.38 కోట్ల నష్టాన్ని చూపగా, సుజనా యూనివర్సల్ రూ.6.3 కోట్ల నష్టాన్ని చూపింది. సుజనా టవర్స్ మాత్రం రూ.1.8 కోట్ల స్వల్ప నికర లాభం చూపింది. ►2011–2014 ఆరి్థక సంవత్సరాల మధ్య సుజనా టవర్స్ రుణ భారం రూ.565 కోట్ల నుంచి రూ.1,750 కోట్లకు చేరినట్టుగా పుస్తకాల్లో చూపారు. అదే సమయంలో మార్కెట్ కాపిటలైజేషన్ రూ.1,534 కోట్ల నుంచి రూ.37 కోట్లకు తరిగిపోయింది. సింగపూర్ కేంద్రంగా అవినీతి బాగోతం సుజనా చౌదరికి చెందిన గ్రూపు ప్రస్తుతం సింగపూర్ కేంద్రంగా ‘ఇంట్రాసియా’ పేరుతో అంతర్జాతీయ కంపెనీల గ్రూపును నిర్వహిస్తోంది. ఈ గ్రూపు కింద బిస్ట్రోలియా అసియా, మ్యాగ్నమ్ ఎంటర్ప్రైజస్, సన్ ట్రేడింగ్ లిమిటెడ్, మైక్రోపార్ట్ ఇంటర్నేషనల్, బీజింగ్ గ్రేట్ ఫారŠూచ్యన్ ఇంటర్నేషనల్, రోడియం రీసోర్సస్, పీఏసీ వెంచర్స్ పీటీఈ లిమిటెడ్, ఏపీఐఈఎస్ వెంచర్స్ పీటీఈ లిమిటెడ్, స్కైవెల్ గ్రూప్, పోలిలక్స్ ఇంటర్నేషనల్, మాంటన్ రిసోర్సస్ పీటీఈ లిమిటెడ్, ట్రయంప్ అగ్రి పీటీఈ లిమిటెడ్, అగ్రిట్రేడ్ ఇంటర్నేషనల్ పీటీఈ లిమిటెడ్, దీప్ పోకెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో పలు కంపెనీలను నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీలను కేవలం రికార్డుల్లో చూపిస్తూ అంతర్జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, అనంతరం సుజనా చౌదరికి చెందిన ఇతర కంపెనీలకు నిధులు మళ్లించడమే లక్ష్యంగా వ్యవహారాలు సాగించారు. అందుకోసం సింగపూర్ కేంద్రంగా పక్కా పన్నాగం అమలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార లావాదేవీలు సాగించినట్లు రికార్డుల్లో చూపించాయి. అనంతరం ఆ కంపెనీలన్నీ తమ వ్యాపారాలను బీమా చేయించుకున్నాయి. ఈ బీమాను చూపించి అంతర్జాతీయ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందాయి. అనంతరం ఆ నిధులను సుజనా చౌదరి వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారు. అలా అటు అంతర్జాతీయ ఇన్సూరెన్స్ కంపెనీలను, ఇటు అంతర్జాతీయ బ్యాంకులను సుజనా చౌదరి మోసగించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రుణం సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన హెస్టియా హోల్డిండ్ లిమిటెడ్, నువాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థలు మారిషస్ కమర్షియల్ బ్యాంకుల నుంచి రూ.107 కోట్ల రుణం తీసుకుని.. తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేశాయి. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు పిటిషన్ దాఖలు చేసింది. ►సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన నువాన్స్ హోల్డింగ్స్తో(హాంకాంగ్) సంబంధం ఉన్న సెలెన్ హోల్డింగ్స్ ఏఎఫ్ఆర్ ఆసియా బ్యాంకు నుంచి 5 మిలియన్ డాలర్లును 2011న జూలైలో రుణంగా తీసుకుంది. ఆ తర్వాత స్టాండర్డ్ బ్యాంక్–మారిషస్ నుంచి 12 మిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. ►బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టŠస్ లిమిటెడ్ పేరుతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.304 కోట్ల రుణం తీసుకోవడానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సుజానా గ్రూపు సమర్చించడంపై సీబీఐకి ఆ బ్యాంకు తాజాగా ఫిర్యాదు చేసింది. ►సుజనా గ్రూపు సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్సుల రూపంలో రూ.962 కోట్లు చెల్లించకుండా ఎగ్గొట్టడంపై కేసుల విచారణ వివిధ దశల్లో ఉంది. -
సుజనా అక్రమాలపై విచారణకు రంగం సిద్ధం!
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించారు. విజయసాయిరెడ్డి లేఖకు బదులిస్తూ రాష్ట్రపతి కార్యాలయం.. ఆ లేఖను హోం మంత్రిత్వ శాఖకు పంపింది. ఈ క్రమంలో హోం మంత్రిత్వ శాఖ సదరు లేఖను సంబంధిత శాఖలకు పంపించింది. దీంతో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి వ్యవహారాలపై ఏ క్షణంలోనైనా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. కాగా వివిధ బ్యాంకులకు కోట్ల రూపాయల మేర నష్టం చేకూర్చినట్లు సుజనా చౌదరిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయనకు చెందిన విలువైన ఆస్తులను ఈడీ ఇప్పటికే జప్తు చేసింది. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, ఆయన అక్రమ కంపెనీలు, మనీ లాండరింగ్ వ్యవహారాలు, వ్యాపార కుంభకోణాలపై విచారణ జరపాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సుజనా చౌదరి టీడీపీని వీడి.. బీజేపీలో చేరడంతో స్వప్రయోజనాల కోసమే ఆయన బీజేపీలో చేరారంటూ విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
కోవింద్కు ఘన స్వాగతం
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం శుక్రవారం నగరానికి చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయంకు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో సత్కరించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను రాష్ట్రపతికి కేసీఆర్ పరిచయం చేశారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, హరీశ్రావు, ఈటల, ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లితో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి రాకముందుకు హకీంపేట ఎయిర్పోర్టులో గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ కొద్దిసేపు ముచ్చటించారు. స్వాగత కార్యక్రమం తర్వాత గవర్నర్, హోం మంత్రి వెంటరాగా రాష్ట్రపతి దంపతులు శీతాకాల విడిది బొల్లారంలోని రాష్ట్ర పతి నిలయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘గవర్నర్గా వంద రోజులు’నివేదికతో పాటు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ రాజ్భవన్ ముద్రించిన ‘బతుకమ్మ తెలంగాణ ఫ్లోరల్ ఫెస్టివల్’పుస్తకాన్ని రాష్ట్రపతికి తమిళిసై అందజేశారు. మీరేంటి ఇక్కడ.. స్వాగతం సందర్భంగా గుత్తా సుఖేందర్రెడ్డిని రాష్ట్రపతికి కేసీఆర్ పరిచయం చేశారు. మీరేంటి ఇక్కడ.. ఇటువైపు వచ్చారెందుకు.. అని గుత్తాను ఉద్దేశించి రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. గతంలో కోవింద్ రాజ్యసభ సభ్యుడిగా, తాను లోక్సభ సభ్యుడిగా పార్లమెంట్ ఎనర్జీ కమిటీలో సభ్యులుగా పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. గుత్తా తనకు పాత స్నేహితుడని రాష్ట్రపతి చెప్పగా, తనకూ పాత స్నేహితుడే అని సీఎం సరదాగా అనడంతో నవ్వులు విరిశాయి. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి కోవింద్ ఈ నెల 28 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. -
‘మోదీ సర్కార్ ప్రజల గొంతు నొక్కేస్తుంది ’
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ప్రజలు శాంతి యుతంగా చేస్తున్న నిరసనను పోలీసులు హింసాత్మకంగా మారుస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. మంగళవారం ఆమె అఖిలపక్ష నాయకులతో కలిసి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో..చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతిని కోరారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజల గొంతును నొక్కేస్తుందని విమర్శించారు. ఢిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై కనికరం లేకుండా పోలీసులు దాడి చేశారని మండిపడ్డారు. (చదవండి : ‘హింసాత్మక నిరసనలు వద్దు’) పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్యరాష్ట్రాల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు దేశం మొత్తం వ్యాపిస్తున్నాయని, ముందుముందు భయానక పరిస్థితులు ఏర్పడుతాయేమోనని సోనియాగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుత పద్దతిలో చేస్తున్న నిరసనలను పోలీసులు హింసాత్మకంగా చేస్తున్నారని, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్న పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని రాష్ట్రపతిని కోరారు. ప్రస్తుత పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సోనియాగాంధీకి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. (చదవండి : ‘అది మరో జలియన్ వాలాబాగ్’) కాగా, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జఫ్రాబాద్ ప్రాంతంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. విద్యార్ధుల నిరసన ప్రదర్శన నేపథ్యంలో సీలంపూర్ నుంచి జఫ్రాబాద్ రహదారిపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మరోవైపు వెల్కం, జఫ్రాబాద్, మౌజ్పూర్-బబర్పూర్ మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేశారు. -
హేయమైన ఘటనల మధ్య హక్కులెలా !
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మహిళలపై పెరిగిపోతున్న నేర ఘటనలపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సమానహక్కులు అన్న సార్వత్రిక లక్ష్యం సఫలతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మానవ హక్కుల దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (యూడీహెచ్ఆర్)ను ఆమోదించగా.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ 10వ తేదీని మానవ హక్కుల దినంగా పాటిస్తున్నారు.యూడీహెచ్ఆర్ రూపకల్పనలో భారత్కు చెందిన సంఘసంస్కర్త, విద్యావేత్త హన్సా జీవ్రాజ్మెహతా కీలకపాత్ర పోషించారని, ఆ ప్రకటనలోని ఆర్టికల్ 1 ముసాయిదాలో ‘ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఫ్రీ అండ్ ఈక్వల్’ అన్న వాక్యాన్ని హన్సా ‘ఆల్ హ్యూమన్స్...’గా మార్చడానికి కృషి చేసి విజయం సాధించారని రాష్ట్రపతి గుర్తు చేశారు. అయితే స్త్రీ, పురుష సమానత్వం, మానవ హక్కుల విషయంలో హన్సా లాంటి దార్శనికుల స్వప్నాలను సాకారం చేసేందుకు చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని రాష్ట్రపతి అన్నారు. సమాన హక్కులు, గౌరవమన్న విషయాల్లో మనల్ని మనం ప్రశ్నించుకోవడం ద్వారా ఈ దిశగా తొలి అడుగు వేయాలని సూచించారు. జాతిపిత చెప్పిందీ అదే.. దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస సంఘటనలు మనల్ని పునరాలోచనలో పడేస్తున్నాయని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని, ఇది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రపంచమంతా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆత్మశోధన చేసుకోవాలి’అని ఆయన అన్నారు. దీంతోపాటు యూడీహెచ్ఆర్ను సమీక్షించి మానవ హక్కులను పునః నిర్వచించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పిల్లలు, వెట్టిచాకిరీలో మగ్గుతున్న వారు, స్వల్ప నేరాలకు గాను దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న వారిపట్ల సానుభూతి చూపాల్సిన అవసరముందని, వీరి హక్కుల విషయంలో మరింతగా ఆలోచన చేయాల్సి ఉందని వివరించారు. మానవ హక్కుల విషయంలో ఆత్మశోధన ఎంత అవసరమో, సమాజం, తన హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడమూ అంతే అవసరమని రాష్ట్రపతి తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ సైతం మానవ హక్కులు, పౌర విధులు ఒకే నాణేనికి రెండు పార్శా్వల వంటివని చెప్పారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, భారత్లో ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కో ఆర్డినేటర్ రెనెటా లోక్ డెస్సాలియన్ తదితరులు పాల్గొన్నారు. -
క్షమాభిక్ష అడగలేదు: నిర్భయ కేసు దోషి
సాక్షి, న్యూఢిల్లీ: 2012లో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన నిర్భయ కేసులో నేరస్తుడు వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్కు రాసిన లేఖలో సంచలన విషయం వెల్లడించాడు. అసలు తాను క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోలేదని ఢిల్లీలోని నిర్భయ సామూహిక హత్యాచార ఘటనలో మరణ శిక్ష పడిన వినయ్ శర్మ పేర్కొన్నాడు. ఆ పిటిషన్పై తాను సంతకం చేయలేదని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో తన మెర్సీ పిటిషన్ను ఉపసంహరించుకునే అవకాశం కల్పించాలని తన న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా అభ్యర్థించాడు. అంతేకాదు హోం మంత్రిత్వ శాఖ పంపించిన క్షమాభిక్ష పిటిషన్పై సంతకం తనది కాదని స్పష్టం చేశాడు. తను ఇంకా ఎలాంటి క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయకముందే ఏదో కుట్ర జరిగిందని ఆరోపించాడు. కాగా వినయ్ శర్మ పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్ను ఢిల్లీ ప్రభుత్వం తిరస్కరించగా, దీన్ని రాష్ట్రపతికి పంపిన హోంశాఖకు పంపించిన సంగతి తెలిసిందే. ఈకేసులో వినయ్ శర్మ సహా మొత్తం దోషులుగా తేలినవారు ఆరుగురు. వీరిలో రామ్సింగ్ 2013 మార్చిలో జైల్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా మరొక నిందితుడు మైనర్ కావడంతో అతడికి బాలనేరస్తుల కోర్టు మూడేళ్ళ శిక్ష విధించి అనంతరం విడుదల చేసింది. ఇక మిగిలిన నలుగురు నిందితులు పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ముఖేశ్ సింగ్, వినయ్ శర్మలకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసలు తాను క్షమాభిక్ష కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని వినయ్ శర్మ చెబుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
శ్రీలంకకు 3,230 కోట్ల సాయం
న్యూఢిల్లీ: శ్రీలంక నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్సతో ప్రధాని మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం, దౌత్య సంబంధాలను బలపరుచుకోవాల్సిన ఆవశ్యకతపై ఇరువురూ చర్చించారు. ఈ సమావేశం అనంతరం లంక ప్రభుత్వానికి సుమారు రూ.3,230 కోట్ల రుణ సహాయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. గోతబయ రాజపక్స మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం భారత్కి వచ్చారు. శ్రీలంకలోని మైనారిటీ తమిళుల ఆకాంక్షలూ, భద్రతాంశాలూ, వ్యాపార ఒప్పందాలూ, మత్స్యకారుల సమస్యలపై ఈ సమావేశం దృష్టిసారించింది. ఈ సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడుతూ... శ్రీలంక సత్వరాభివృద్ధి పథంలో పయనించేందుకు భారత్ సంపూర్ణ మద్దతునిస్తుందని చెప్పారు. శ్రీలంక అభివృద్ధికి, ఉగ్రవాదం అణచివేతకు రూ.3,230 కోట్ల సాయాన్ని ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు శ్రీలంక పోలీసు అధికారులు భారత్లో శిక్షణ పొందుతున్నట్టు ప్రధాని వెల్లడించారు. లంక అధ్యక్షుడు గోతబయ మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య చర్చలు ఫలవంతమయ్యాయనీ, ఆర్థిక సహకారం అంశాన్ని కూడా భారత ప్రధానితో చర్చించానని చెప్పారు. రాజపక్సకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్భవన్లో ఘనంగా స్వాగతం పలికారు. -
రాజ్యాంగ విలువలకు కట్టుబడదాం
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. రాజ్యాంగ రచనకు 70 ఏళ్లయిన సందర్భంగా మంగళవారం ఢిల్లీలో ఏర్పాటైన పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ఏర్పరచిన మూడు (న్యాయ, శాసన, కార్యనిర్వాహక) వ్యవస్థలు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు, పౌర సమాజ సభ్యులు, పౌరులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. రాజ్యాంగ విలువల ప్రాముఖ్యాన్ని నొక్కి చెప్పిన డాక్టర్ అంబేడ్కర్.. రాజ్యాంగాన్ని అత్యున్నతంగా భావించాలని తెలిపారన్నారు. హక్కులు, విధులు నాణేనికి రెండు పార్శా్వల వంటివి అంటూ బాధ్యతలు నెరవేర్చడం ద్వారానే హక్కులు సిద్ధిస్తాయన్న మహాత్ముని మాటలను రాష్ట్రపతి గుర్తు చేశారు. బాధ్యతలపై దృష్టిపెట్టాల్సిన సమయం హక్కుల కోసం కాకుండా.. విధులు, బాధ్యతలపై ప్రజలు దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సంయుక్త సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రజల హక్కులతోపాటు, బాధ్యతలనూ సుస్పష్టం చేయడం మన రాజ్యాంగం ప్రత్యేకతన్నారు. బాధ్యతలను నిర్వర్తించకుండా హక్కులను కాపాడటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అవగాహన కల్పించాలి: వెంకయ్య పౌరుల ప్రాథమిక బాధ్యతల వివరాలను పాఠ్యాంశాల్లో చేర్చడంతోపాటు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించి పౌరులకు అవగాహన కల్పించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. మాతృభాషకు గౌరవం ఇవ్వడం ఎంతో అవసరమన్న ఉపరాష్ట్రపతి.. మాతృభాష మన దృష్టిలాంటిదైతే, ఇతర భాషలు కళ్లజోడు లాంటివని అభివర్ణించారు. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ పార్లమెంటు సభ్యులు∙విధులను సమర్థంగా నిర్వర్తించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ 250వ సమావేశాలను పురస్కరించుకుని రూ.250 నాణేన్ని, రూ.5 విలువైన పోస్టల్ స్టాంపును రాష్ట్రపతి విడుదల చేశారు. ‘భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజ్యసభ పాత్ర’అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి తొలి ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు. బహిష్కరించిన ప్రతిపక్షం మహారాష్ట్రలో బీజేపీ అనుసరించిన వైఖరిని నిరస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని బహిష్కరించాయి. మొట్టమొదటి సారిగా శివసేన కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలకు మద్దతుగా నిలిచింది. ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం నిరసన తెలిపారు. -
జ్యోతిగౌడ్కు ‘బెస్ట్ బ్రెయిలీ’ అవార్డు
సనత్నగర్: బేగంపేట మయూరీ మార్గ్లోని ‘దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్’ కరస్పాండెంట్ ఎ.జ్యోతిగౌడ్కు ‘బెస్ట్ బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్ ఇన్ ది కంట్రీ–2019’ అవార్డు దక్కింది. అంధ విద్యార్థుల కోసం ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుతో సత్కరించనుంది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3న ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆమె అవార్డును అందుకో నున్నారు. సాధారణ చిన్నారులతో సమానంగా అంధ విద్యార్థులు ఉన్నతంగా రాణించాలనే ఉద్దేశంతో బ్రెయిలీ లిపిలో ఆమె వేల సంఖ్యలో పుస్తకాల ప్రచురణ చేశారు. గత 27 ఏళ్లుగా పాఠ్యపుస్తకాలతోపాటు ఆధ్యాత్మిక గ్రంథాలు, సందేశాత్మక, మహనీయుల చరిత్రలనూ బ్రెయిల్ లిపిలో అందించారు. తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అంధు లకు ఈ పుస్తకాలను ఉచితంగా అందించారు. రామాయణం, మహాభారతం, భగవద్గీత, బైబిల్, ఖురాన్, జనరల్ నాలెడ్జ్ బుక్స్, కథల పుస్తకాలు, సర్దార్ వల్లబ్భాయ్ పటేల్, వివేకానంద వంటి మహనీయుల చరిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇంగ్లిష్ భాషలో బ్రెయిలీ లిపిలో పుస్తకాలను ప్రచురించి దేశవ్యాప్తంగా లైబ్రరీలకు అందించారు. ఆమె ‘సాక్షి’తో మాట్లా డుతూ.. అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. సాధారణ విద్యార్థులతో పోటీపడేలా అంధ విద్యార్థులను చూడాలన్నదే తమ అభిమతమని చెప్పారు. -
ఉక్కుమనిషికి ఘన నివాళి..
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్కుమనిషి, దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గుజరాత్లోని నర్మదా నది తీరాన గల పటేల్ విగ్రహం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున సాంస్క్రతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీలోని ఆయన స్మారకం వద్ద రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్, హోంమంత్రి అమిత్ షా నివాళి అర్పించారు. పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జాతీయ మైదానంలో అమిత్ షా సమైక్యత పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం పటేల్ను స్మరించుకున్నారు. ‘సంఘటితత్త్వంతోనే శాంతి, అభివృద్ధి సాధ్యమని నమ్మి 565 గణరాజ్యాలను ఒక్కటి చేసి సువిశాల భారతదేశాన్ని నిర్మించిన ఆధునిక భారతదేశ రూపశిల్పి, ఐక్య భారత నిర్మాత సర్దార్ వల్లభ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ ఉక్కు మనిషి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. -
మహిళా పోలీసు పట్ల రాష్ట్రపతి ఔదార్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు చాలా హుందాగా, గంభీరంగా వ్యవహరిస్తారు. ప్రోటోకాల్ను పాటిస్తూ తమ విధులను నిర్వర్తిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో అవేవి పట్టించుకోకుండా మానవతా దృక్పథంతో వ్యవహరిస్తారు. ఇలాంటి సన్నివేశాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. మంగళవారం కూడా అటువంటి సన్నివేశం ఒకటి రాష్ట్రపతి సమావేశంలో జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం మొదటి జాతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యత పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, సహాయ ఆర్థిక మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు. వారంతా వేదికపై నిలబడి జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. అదే సమయంలో వేదిక ముందు మొదటి వరుసలో నిల్చున్న ఓ మహిళా పోలీసు అధికారి కాలి మడమ మెలికపడి కుప్పకూలి పడిపోయారు. జాతీయ గీతాలాపన పూర్తి కాగానే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అక్కడే ఉన్న మంత్రి సీతారామన్, అనురాగ్ ఠాకూర్తో మాట్లాడి, వేదిక నుంచి దిగి, కుప్పకూలిన మహిళా పోలీసు అధికారి వద్దకు వెళ్ళి, పరామర్శించారు. ఆమె ప్రమాదమేమి లేదని నిర్థారించుకున్న తర్వాత వారంతా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ప్రోటోకాల్ని పక్కకు పెట్టి ఓ పోలీసు అధికారిని పరామార్శించిన రాష్ట్రపతిని అందరూ ప్రశంసిస్తున్నారు.