తోటి సైనికుడిని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం | Army Officer Dies After He Jumps Into Stream Trying To Rescue Fellow Soldier, More Details Inside | Sakshi
Sakshi News home page

తోటి సైనికుడిని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం

May 24 2025 8:16 AM | Updated on May 24 2025 4:31 PM

Army Officer Dies Rescuing Soldier

న్యూఢిల్లీ: తోటి సైనికుడిని కాపాడబోయిన ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయిన విషాదరక ఘటన సిక్కిం(Sikkim)లో చోటుచేసుకుంది. తన బృందంలోని సైనికుడొకరు వాగులో పడి కొట్టుకుపోతుండగా చూసిన ఆర్మీ అధికారి అతడిని కాపాడబోయి, నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళితే గత ఏడాది డిసెంబర్‌లో నియమితులైన లెఫ్టినెంట్ శశాంక్ తివారీ(23) సిక్కింలోని వ్యూహాత్మక ఆపరేటింగ్ పెట్రోలింగ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. వీరి బృందం కీలక పోస్ట్ వైపు కదులుతుండగా, అగ్నివీర్(Agniveer) స్టీఫెన్ సుబ్బా లాగ్ వంతెనను దాటుతూ, కాలు జారి వాగులో పడిపోయారు. దీనిని గమనించిన లెఫ్టినెంట్ తివారీ నీటిలోకి దూకారు. అతనికి మరో సైనికుడు నాయక్ పుకార్ కటెల్‌ సాయం అందించారు. వారిద్దరూ అగ్నివీర్‌ సుబ్బాను రక్షించగలిగారు.

అయితే సుబ్బాను రక్షించే ప్రయత్నంలో లెఫ్టినెంట్ తివారీ(Lieutenant Tiwari) బలమైన ప్రవాహానికి కొట్టుకుపోయారు. అతని మృతదేహం 30 నిమిషాల తర్వాత 800 మీటర్ల దిగువన కనిపించింది. తివారీకి తల్లిదండ్రులు, సోదరి  ఉన్నారు. కాగా ‘చిన్న వయస్సులోనే ఎంతో తెగువ చూపిన లెఫ్టినెంట్ తివారీకున్న ధైర్యం రాబోయే తరాలకు, సైనికులకు స్ఫూర్తినిస్తుందని భారత సైన్యం పేర్కొంది. ఈ అమరుని మృతదేహం అతని స్వస్థలానికి తరలించే ముందు బెంగ్డుబి మిలిటరీ స్టేషన్‌లో లెఫ్టినెంట్ జనరల్ జుబిన్ ఎ మిన్వాల్లా పూర్తి సైనిక గౌరవాలు అందించారని సిలిగురికి చెందిన 33 కార్ప్స్ (త్రిశక్తి కార్ప్స్) ‘ఎక్స్‌’లో పేర్కొంది.

ఇది కూడా చదవండి: 43 ఏళ్ల న్యాయపోరాటం.. 104 ఏళ్ల వృద్ధునికి జైలు నుంచి విముక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement