rescue
-
SLBC లో 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్
-
Uttarakhand: మంచు చరియల కిందే ఇంకా 8 మంది
ఉత్తరాఖండ్: పర్వత రాష్ట్రం ఉత్తరాఖండ్(Uttarakhand)లో భారీగా కురుస్తున్న హిమపాతం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. బద్రీనాథ్లోని మానా గ్రామం సమీపంలో సరిహద్దు రోడ్డు సంస్థ (బీఆర్ఓ) శిబిరంపై మంచు చరియలు విరిగిపడటంతో 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం సంభవించింది. ఈ దరిమిలా భారత సైన్యం, రెస్క్యూ ఆపరేషన్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. రెస్క్యూ సిబ్బంది మంచు పెళ్లల నుంచి 47 మందిని సురక్షితంగా వెలికి తీసుకువచ్చారు. మరో ఎనిమిదిమందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.రెండవ రోజున సహాయక చర్యలు తిరిగి ప్రారంభించిన భారత సైన్యం(Indian Army) మంచులో కూరుకుపోయిన మరో 14 మంది సిబ్బందిని రక్షించింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వైద్య చికిత్స అందించేందుకు హెలికాప్టర్ల ద్వారా జోషిమఠ్కు తరలించామని అధికారులు తెలిపారు. ఇంకా మంచులోనే కూరుకుపోయిన సిబ్బందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నిన్న(శుక్రవారం) రాత్రి చీకటి పడ్డాక సహాయక చర్యలను నిలిపివేశారు.హిమపాత మరింతగా పెరగడంతో మంచులో కూరుకుపోయిన కార్మికులను కనుగొనడం రెస్క్యూ సిబ్బంది(Rescue crew)కి సవాలుగా మారింది. మొదటి రోజున రెస్క్యూ బృందాలు 33 మంది కార్మికులను రక్షించగలిగాయి. ఈ ప్రాంతంలో ఏడు అడుగుల మేరకు మంచు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. ఇండో-టిబెట్ సరిహద్దులోని చివరి గ్రామమైన మానా వద్ద మంచును తొలగించే పనిలో నిమగ్నమైన 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు.సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ మంచు చరియల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి పుష్కర్ ధామి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తాజాగా ఘటనా స్థలంలో కొనసాగుతున్న పనుల గురించి తెలుసుకునేందుకు సీఎం దామికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో -
SLBC టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి ప్రత్యేక కెమెరాలు
సాక్షి,నాగర్కర్నూల్:శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు పర్యవేక్షించడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ నుంచి మంగళవారం(ఫిబ్రవరి 25) బయలుదేరారు. కాసేపట్లో ఆయన టన్నెల్ వద్దకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించి పరిస్థితిని సమీక్షించనున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కూడా టన్నెల్ వద్ద పరిస్థితిని పరిశీలించనున్నారు. టన్నెల్ వద్ద సహాయక చర్యలు రోజురోజుకు కష్టంగా మారుతున్నాయి. ఒకటో సొరంగం పైకప్పు మళ్లీ కూలడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. లోపల పేరుకుపోయిన మట్టి, శిథిలాల ఎత్తు మరో మీటరు మేర పెరిగిపోయింది. దానికితోడు నీటి ఊట ఆగకుండా కొనసాగుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ఆచూకీ కోసం అత్యాధునిక ఎండోమోడ్ కెమెరాలను లోపలికి పంపారు. 9 వేర్వేరు బృందాలుగా 600 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 72 గంటలు గడిచినా ఎనిమిది మంది ఆచూకీ దొరకకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్కసారిగా కూలిపడటంతో.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా 43.93 కిలోమీటర్ల పొడవైన భారీ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట (ఇన్లెట్) వద్ద నుంచి 13.94 కిలోమీటర్ల లోపలి వరకు తవ్వకం పూర్తయింది. అక్కడ పనులు చేస్తుండగా శనివారం ఉదయం 8.30 గంటలకు సొరంగం పైకప్పు కూలి 8 మంది కార్మికులు/ఉద్యోగులు గల్లంతయ్యారు. వారిని రక్షించడానికి ఆదివారం మధ్యాహ్నం వరకు చేసిన 3 ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. నాలుగో ప్రయత్నంగా ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంటకు సొరంగం లోపలికి వెళ్లిన రెస్క్యూ బృందం సోమవారం ఉదయం 7 గంటల సమయంలో బయటికి వచ్చింది. ఐదో ప్రయత్నంగా సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు మరో రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది. సొరంగం కూలిన ప్రాంతంలో ఆదివారంతో పోలి్చతే సోమవారం నాటికి మట్టి, శిథిలాల ఎత్తు, పరిమాణం గణనీయంగా పెరిగాయి. దీనితో అక్కడే మరోసారి సొరంగం పైకప్పు కూలి ఉంటుందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. సొరంగం లోపల 200–250 మీటర్ల మేర 15–20 అడుగుల ఎత్తులో మట్టి, శిథిలాలు పేరుకుపోయి ఉన్నట్టు చెబుతున్నారు. నేడు మరో ప్రత్యేక బృందం ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, ఇతర సిబ్బంది మొత్తం కలిపి మొత్తం 584 మంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున విపత్తుల నిర్వహణ, ఉపరితల రవాణా శాఖలకు చెందిన నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక బృందం మంగళవారం ఉదయానికల్లా టన్నెల్ వద్దకు చేరుకునే అవకాశం ఉంది. పైనుంచి రంధ్రం చేయడానికి జీఐఎస్ నో ఎల్ఎస్బీసీ సొరంగాన్ని భూగర్భంలో 400 మీటర్ల దిగువన నిర్మిస్తున్నారు. దీనితో ఆ మేరకు భూఉపరితలం నుంచి సొరంగం వరకు రంధ్రం చేసి కార్మీకులను బయటికి తీసుకువచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన జరిపింది. కానీ సొరంగాన్ని పరిశీలించిన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) నిపుణుల బృందం ఈ ఆలోచనకు నో చెప్పింది. సొరంగంపై తీవ్ర ఒత్తిడి ఉందని, భూఉపరితలం నుంచి సొరంగం దాకా రంధ్రం వేసేందుకు ప్రయత్నిస్తే మరింతగా కుప్పకూలుతుందని ఐదో రెస్క్యూ బృందంతో కలిసి లోపలికి వెళ్లి వచ్చిన జీఎస్ఐ జియాలజిస్టులు తేల్చారు. మట్టి, శిథిలాల తొలగింపుపై రెస్క్యూ బృందానికి వీరు చేసే సూచనలు కీలకంగా మారనున్నాయి. సొరంగంలోకి రాకపోకలకే 4 గంటలు.. గల్లంతైన కార్మీకుల జాడ దొరక్కపోయినా సొరంగం లోపలి పరిస్థితులపై ఇప్పుడు స్పష్టమైన అవగాహన ఏర్పడిందని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. తొలుత కేవలం లోపలి పరిస్థితిని దూరం నుంచి మాత్రమే అంచనా వేయగలిగామని.. నాలుగు, ఐదో ప్రయత్నంలో సొరంగం కూలిన చోట పేరుకున్న మట్టి, శిథిలాల సమీపం వరకు రెస్క్యూ బృందాలు చేరుకోగలిగాయని వివరించారు. లోకో ట్రైన్ ద్వారా సొరంగం లోపలికి వెళ్లిరావడానికే మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోందని వెల్లడించారు. నిరంతరం కొనసాగుతున్న నీటి ఊట సొరంగంలో నీరు నిరంతరం ఊరుతూ, కూలిన ప్రాంతాన్ని నింపేస్తోంది. ఇన్లెట్ నుంచి లోపలికి వెళ్లే నీరు గ్రా>విటీ ద్వారా అవుట్లెట్ వైపు వెళ్లేలా సొరంగాన్ని వాలుగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు తవి్వన మేరకు సొరంగం కూలిన ప్రాంతమే చివరిది కావడంతో.. ఊట నీళ్లు అక్కడే పేరుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. దీనితో నిరంతరంగా ఆ నీటిని బయటికి పంపింగ్ చేస్తున్నారు. కార్మీకుల కుటుంబాల్లో ఆందోళన.. నేడు సర్కారు కీలక ప్రకటన? ప్రమాదం జరిగి సోమవారం అర్ధరాత్రి సమయానికి సుమారు 65 గంటలు దాటింది. కానీ సొరంగంలో గల్లంతైనవారి జాడ తెలియరాలేదు. దీనితో కార్మీకుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. సోమవారం ఇద్దరు కార్మీకుల కుటుంబ సభ్యులు సొరంగం వద్ద చేరుకుని.. తమవారి సమాచారం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కార్మీకుల యోగక్షేమాలపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సొరంగం లోపలికి డ్రోన్, మినీ జేసీబీ.. నీళ్ల కింద ఉన్న వస్తువులను గుర్తించే సోనార్ టెక్నాలజీ ఆధారంగా కార్మీకుల జాడను తెలుసుకునేందుకు ఆదివారం ప్రయతి్నంచగా.. ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. నీటిలో మనుషుల రక్తం, అవశేషాలను గుర్తించే పోలీసు జాగిలాలు (స్నిఫర్ డాగ్స్)ను సొరంగంలోకి తీసుకెళ్లినా.. ప్రమాద స్థలంలో నీరు, బురద ఉండటంతో ముందుకు వెళ్లలేకపోయాయి. చివరిగా ఐదో రెస్క్యూ బృందంతో ఒక అత్యధునిక డ్రోన్, ఇద్దరు ఆపరేటర్లను సొరంగం లోపలికి పంపించారు. రెస్క్యూ బృందాలు వెళ్లలేని చోట్ల దీనితో జరిపే పరిశీలన ఆధారంగా లోపలి పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక సొరంగం కూలిన చోట పేరుకుపోయిన మట్టి, శిథిలాలను తొలగించడానికి సోమవారం లోకో ట్రైన్ సాయంతో మినీ జేసీబీని లోపలికి పంపించారు. దీనితో మట్టి, శిథిలాల తొలగింపు చర్యల్లో వేగం పెరిగే అవకాశం ఉంది. ఇక ప్రమాదంలో దెబ్బతిన్న కన్వేయర్ బెల్ట్కి సైతం మరమ్మతులు ప్రారంభించారు. మట్టి, శిథిలాలను కన్వెయర్ బెల్ట్ ద్వారా బయటికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయక చర్యల్లో ఉన్నతాధికారుల బృందం రాష్ట్ర రెవెన్యూ (విపత్తుల నిర్వహణ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ నేతృత్వంలో టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, నాగర్కర్నూల్ జిల్లా మాజీ కలెక్టర్ ఇ.శ్రీధర్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల బృందం మూడు రోజులుగా సొరంగం వద్ద మకాం వేసి నిరంతరంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, సింగరేణి రెస్క్యూ బృందాలతో నిరంతరం సమీక్షిస్తూ.. సహాయక చర్యలపై దిశానిర్దేశం చేస్తోంది. సొరంగంలోకి ‘ర్యాట్ హోల్ మైనర్స్’ సొరంగంలో సహాయక చర్యల్లో మరో ప్రయత్నంగా మరో రెస్క్యూ బృందం ‘ర్యాట్ హోల్ మైనర్స్’తో కలసి లోపలికి వెళ్లింది. ఉత్తరాఖండ్లోని సిలి్కయార సొరంగం 2023 నవంబర్లో కుప్పకూలింది. దానిలో లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను 17 రోజుల తర్వాత ర్యాట్ హోల్ మైనర్స్ బృందం బయటికి తీసుకురాగలిగింది. దీంతో ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యల కోసం ‘ర్యాట్ హోల్ మైనర్స్’ను ప్రభుత్వం రప్పించింది. ఈ బృందం సొరంగంలో, పేరుకుపోయిన మట్టిలో ఎలుక బొరియల తరహాలో రంధ్రాలు చేసి లోపలికి వెళ్లి కార్మీకులను బయటకి తీసుకువచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. అయితే సొరంగం రెండో వైపు పూర్తిగా మూతబడి ఉండటం, పెద్ద మొత్తంలో ఊట నీరు ఆ ప్రాంతాన్ని ముంచెత్తి ఉండటంతో ‘ర్యాట్ హోల్’ విధానంలో రెస్క్యూ ఆపరేషన్ శ్రేయస్కరం కాదనే భావన వ్యక్తమవుతోంది. అయితే ర్యాట్ హోల్ మైనర్లు సొరంగంలో ఏ వ్యూహాన్ని అమలు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. వారు సొరంగం నుంచి బయటికి వస్తే ఈ అంశంపై స్పష్టత రానుంది. ఇక మంగళవారం ఉదయానికల్లా మరో ‘ర్యాట్ హోల్ మైనర్స్’ బృందం టన్నెల్ వద్దకు చేరుకోంది. -
ఇలాగేనా రెస్క్యూ?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ఓ అడవిదున్న తప్పిపోయి వచ్చింది. అయితే దాన్ని సజీవంగా పట్టుకునేందుకు చేసిన రెస్క్యూ ఆపరేషన్ విఫలమైంది. పది రోజులపాటు ఈ దున్న కదలికలను ఆ జిల్లా పరిసరాల్లో అటవీశాఖ అధికారులు గుర్తించినా, జీవించి ఉండగా పట్టుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే జాతికి చెందిన ఆ అడవిదున్న (ఇండియన్ బైసన్) మృతి చెందడం పట్ల పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తంచేశారు. అరుదైన జంతువులు, వన్య›ప్రాణులను రక్షించాల్సిన అటవీశాఖ సన్నద్ధత, సంసిద్ధత, పరిమితులను ఈ ఘటన స్పష్టం చేస్తోందంటున్నారు. గతంలోనూ ఓ చిరుత, కొన్ని జంతువుల రెస్క్యూలో అటవీ అధికారులు, సిబ్బంది విఫలమైన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. రెస్క్యూలో అటవీశాఖకు ఓ స్పష్టమైన విధానం, కార్యాచరణ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ఆపదలో ఉన్న జంతువులు, వన్యప్రాణులను కాపాడేందుకు, వెంటనే స్పందించేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్టీ) ఏర్పాటు చేస్తున్నామంటూ గతంలో చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. అసలేం జరిగిందంటే..మేత, నీటికోసం వెతుక్కుంటూ దారితప్పిన దున్న చౌటుప్పల్ మండలం చిన్నకోడూరు గ్రామ సరిహద్దుల్లో కొందరికి కనిపించింది. ఎక్కడ జనవాసాల్లోకి వస్తుందోననే భయంతో దాన్ని బైక్లు, ఇతర వాహనాలపై నాలుగు గంటలపాటు వెంబడించారు. అప్పటికే ఆకలి, దప్పికతో ఉన్న దున్న పరిగెడుతూ డీ హైడ్రేషన్కు గురైంది. నోటి నుంచి నురగలు కక్కుతూ దయనీయస్థితికి చేరింది. దాన్ని రక్షించి, వైద్యం అందించి సురక్షిత ప్రాంతానికి తరలించే రెస్క్యూ టీమ్ అక్కడికి ఆలస్యంగా చేరుకుంది. వరంగల్ జూ నుంచి రెస్క్యూ టీమ్, నెహ్రూ జూపార్కు నుంచి వచ్చిన వెటరేరియన్ మత్తుమందు ఇచ్చి దున్నను నిలువరించే ప్రయత్నం చేశారు. వాహనంలోకి ఎక్కించి దానిని చికిత్స కోసం తరలిస్తున్న క్రమంలో అది అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు.ఉన్నవి రెండు బృందాలే..రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్లోని నె హ్రూ జూపార్క్, వరంగల్లోని కాకతీయ జూపార్క్లో తాత్కాలిక ఏర్పాట్లతో రెండు బృందాలు పనిచేస్తున్నాయి. వీటికి రెస్క్యూ వెహికిల్స్, వెటరేరియన్లు ఉన్నా రు. రాష్ట్రంలో ఎక్కడ వన్యప్రాణులు, అటవీ జంతువులను కాపాడాల్సి వచ్చి నా.. ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటే అక్కడి నుంచి వాహనం, సిబ్బందిని పంపిస్తున్నారు. అయితే ఈ బృందాలు పాత బడిన వాహనాలు, పరికరాలు, సామగ్రి తోపాటు ఏవో తాత్కాలిక పద్ధతులతో నెట్టుకొస్తున్నాయి. ఇప్పుడేం చేయాలి?» రాష్ట్రంలో వన్యప్రాణులు, జంతువు లకు సంబంధించి ఎక్కడైనా అనుకో ని సంఘటన లేదా ఆపద ఎదురైనా, అడవుల్లో అగ్నిప్రమాదాల వంటి ఘ టనలు జరిగినా త్వరితంగా స్పందించేలా బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలి. » పాతబడిన వాహనాలను తొలగించి, కొత్త వాహనాలను అందుబాటులోకి తేవాలి. ట్రాంకిలైజర్ గన్స్, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచాలి. » రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలి. » జంతువుల తీరుపై వెటర్నరీ డాక్టర్లకు శిక్షణ ఇచ్చి తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించాలి. -
విశాఖ చేరుకున్న షార్జా బాధితులు
-
తక్కువ ధరకు ఫుడ్.. జొమాటో కొత్త ఫీచర్
ఆహార వృధాను పూర్తిగా అరికట్టడానికి ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పూనుకుంది. ఆర్డర్ క్యాన్సిల్ కారణంగా ఉత్పన్నమయ్యే ఆహార వృధా సమస్య పరిష్కారానికి ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టినట్లు జొమాటో కోఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ప్రకటించారు.కొత్త ఫీచర్ ద్వారా కస్టమర్లు ఆర్డర్ను క్యాన్సిల్ చేసిన తర్వాత నిమిషాల వ్యవధిలో ఆ ఫుడ్ను తగ్గింపు ధరతో ఇతర కస్టమర్లు పొందవచ్చు. జొమాటోలో నెలకు సగటున దాదాపు 4 లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి. ఈ ఫుడ్ వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే ఈ కొత్త చొరవను ప్రారంభించేలా ప్రేరేపించింది."జొమాటోలో ఆర్డర్ క్యాన్సిల్ను ప్రోత్సహించము. ఎందుకంటే ఇది విపరీతమైన ఆహార వృధాకి దారి తీస్తుంది. కఠినమైన విధానాలు, క్యాన్సిల్ కోసం నో-రీఫండ్ పాలసీ ఉన్నప్పటికీ, పలు కారణాలతో కస్టమర్లు 4 లక్షలకు పైగా ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తున్నారు" అని గోయల్ ఎక్స్లో (ట్విట్టర్) పోస్ట్ చేశారు.కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే..ఒక కస్టమర్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసిన తర్వాత, ఆ ఆర్డర్ను తీసుకెళ్తున్న డెలివరీ ఎగ్జిక్యూటివ్కు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లకు అది యాప్లో పాప్ అప్ అవుతుంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ ఫుడ్ను తక్కువ ధరకు తీసుకోవచ్చు. కొత్త కస్టమర్ చెల్లించిన మొత్తాన్ని ఆర్డర్ క్యాన్సిల్ చేసిన కస్టమర్కు, రెస్టారెంట్ పార్టనర్కు షేర్ చేస్తారు. ఇందులో జొమాటో ఎలాంటి ఆదాయాన్ని తీసుకోదు. అయితే, ఐస్క్రీమ్లు, షేక్లు, స్మూతీస్ వంటి కొన్ని పదార్థాలకు మాత్రం కొత్త ఫీచర్ వర్తించదు. ఆహార వృధా సమస్య పరిష్కారానికి చొరవ చూపిన జొమాటోకు, దీపిందర్ గోయల్కు నెటిజన్ల నుంచి ప్రశంసలు కురిశాయి. ఫుడ్ రెస్క్యూ అనేది గొప్ప చొరవ, వినూత్న ఆలోచన అంటూ పలువురు మెచ్చుకున్నారు.We don't encourage order cancellation at Zomato, because it leads to a tremendous amount of food wastage.Inspite of stringent policies, and and a no-refund policy for cancellations, more than 4 lakh perfectly good orders get canceled on Zomato, for various reasons by customers.… pic.twitter.com/fGFQQNgzGJ— Deepinder Goyal (@deepigoyal) November 10, 2024 -
నేటి నుంచి సింగరేణిస్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలు
గోదావరిఖని: సింగరేణి 53వ జోనల్స్థాయి పోటీలకు మైన్స్ రెస్క్యూ పోటీలకు సర్వం సిద్ధ మైంది. గోదావరిఖనిలోని సింగరేణి మైన్స్ రెస్క్యూ స్టేషన్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో సింగరేణి సంస్థవ్యాప్తంగా ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఈ నెల 16, 17వ తేదీల్లో ఈ జట్ల మధ్య పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు ఈసారి యువ కార్మికులను ఎంపిక చేశారు. ఆర్జీవన్, ఆర్జీ–2, 3, ఏఎల్పీ, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు జట్లు పోటీల్లో పాల్గొంటాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 16 మందిని ఎంపిక చేసి డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీలకు రెండు జట్లుగా పంపించనున్నారు. కాగా, ఈ పోటీలకు సింగరేణి సీఎండీ బలరాం, డైరెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి, డీజీఎంఎస్ భూషణ్ప్రసాద్సింగ్, డీడీఎంఎస్ ఉమేశ్ ఎం.సావర్కర్ తదితరులు హాజరుకానున్నారు.పోటీలు ఇవే..రెండురోజుల పాటు ఆరు జట్ల మధ్య ప్రథమ చికిత్స, డ్రిల్ అండ్ పరేడ్, రెస్క్యూ రిలే ఈవెంట్, స్టాట్యూటరీ, థియరీలో పోటీలు ఉంటాయి. జీడీకే–7ఎల్ఈపీ భూగర్భ గనిలో రెస్క్యూ రికవరీ, మైన్స్ రెస్క్యూస్టేషన్లో మిగతా పోటీలు జరగనున్నాయి. విజయవంతం చేయాలి ఆపదకాలంలో మేమున్నామంటూ అండగా నిలిచే రెస్క్యూ జట్ల మధ్య నిర్వహించే ఈ పోటీలకు కార్మిక కుటుంబాలు హాజరై ఈ పోటీలను విజయవంతం చేయాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్, ఆర్జీ–2 జీఎం ఎల్వీ సూర్యనారాయణ, రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి కోరారు. స్థానిక రెస్క్యూ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈనెల 16న రెస్క్యూపరేడ్తో ప్రారంభమయ్యే పోటీలు ఈ నెల 17 న బహుమతి ప్రదానంతో ముగుస్తాయని తెలిపారు. సమావేశంలో అధికారులు నెహ్రూ, అనిల్కుమార్, మాధవరావు, ఎర్రన్న, మురళీకృష్ణ, ధనుంజయ్, విజయ్కుమార్, డాక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
16 ఏళ్లుగా మహిళ బందీ.. ఎముకల గూడు చూసి పోలీసులు షాక్
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఎవరి ఊహకూ అందని ఘటన చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళను పోలీసులు రక్షించిన దరిమిలా ఈ ఉదంతం వెలుగు చూసింది.జహంగీరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక మహిళను ఆమె అత్తమామలు 16 సంవత్సరాల పాటు ఇంట్లో బంధించారు. బాధితురాలు రాణి సాహుకు 2006లో వివాహం జరిగింది. మొదట్లో సంసారం బాగానే ఉన్నా 2008 నుండి అత్తామామలు ఆమెను ఒక్కసారి కూడా పుట్టింటికి పంపలేదు. తాజాగా ఆమె తండ్రి కిషన్ లాల్ సాహూ తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని, మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.2008 నుంచి తన కూతురు రాణి సాహును కలవడానికి తమను అనుమతించడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్స్టేషన్ బృందం జహంగీరాబాద్లోని కోలి ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఇంట్లోని మూడో అంతస్తులో ఒక మంచంపై రాణి సాహు హృదయవిదారక స్థితిలో పడివుండటాన్ని వారు గమనించారు. ఆమె శరీరం ఎముకల గూడుగా మారడాన్ని చూసి వారు కంగుతిన్నారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాక, ఆమె నుంచి వివరాలు సేకరించి ఆమె భర్త, అత్తమామలపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ‘జరూసలేం’గా మారిన ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’ -
మూడేళ్ల చిన్నారిని రక్షించడంలో డ్రోన్ సాయం..!
మూడేళ్ల చిన్నారి డ్రోన్ సాంకేతికతో విజయవంతంగా రక్షించారు అధికారులు. ఇలాంటి రెస్క్యూఆపరేషన్లో డ్రోన్ సాంకేతికత సమర్థవంతంగా ఉపయోగపడుతుందనే విషయం ఈ సంఘటనతో తేటతెల్లమయ్యింది.అసలేం జరిగిందంటే..యూఎస్లోని విస్కాన్సిన్లో ఆల్టోలో అనే ప్రాంతంలో మూడేళ్ల చిన్నారి దట్టమైన మొక్కజొన్న పొలంలో తప్పిపోయాడు. అదికూడా రాత్రి సమయం కావడంతో అతడి ఆచూకి కష్టతరంగా మారింది. సమాచారం పోలీసులకు అందడంతో రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభించారు. అది రాత్రి సమయం కావడం, దీనికితోడు దట్టమైన మొక్కజొన్న అడవి తదితర కారణాల వల్ల చిన్నారి జాడ కనిపెట్టడం సాధ్యం కాలేదు. దీంతో ఫాండ్ డు లాక్ కౌంటీ షెరీఫ్ పోలీసులు మొక్కజొన్న క్షేత్రాన్ని స్కాన్ చేసేందుకు థర్మల్ డ్రోన్ని మోహారించారు.దీనిలోని ఇన్ఫ్రారెడ్ కెమెరా హీట్ సిగ్నేచర్లు చిన్నారి ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఆరడగుల పొడవైన కాండాలతో నిండిన మొక్కజొన్న పొలాన్ని డ్రోన్ సర్వే చేయడంతో వీడియో తీయడం ప్రారంభించిన నలుపు తెలుపు ఆకృతి నమునాలను ఇచ్చింది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక ఆకారం మొక్కజొన్న గుండా కదలడం ప్రారంభించింది. స్క్రీన్పై ఏకరీతి నమునాకు అంతరాయం కనిపించడంతో..ఇది తప్పిపోయిన చిన్నారి కదలికలని నిర్థారణ చేశారు. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకునేలా అధికారులను అప్రమత్తం చేశారు. ఆ తర్వాత బాలుడిని సురక్షితంగా ఆ మొక్కజొన్న పొలం నుంచి రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ ఘటన సాంకేతికత ప్రాముఖ్యతను హైలెట్ చేసింది. అలాగే దట్టమైన మొక్కజొన్న పొలం, రాత్రి సమయం వల్ల చిన్నారి ఆచూకి కనిపెట్టడం అంత సులభం కాలేదు. ఒకవేళ సాంకేతిక సాయం లేనట్లయితే గంటలకొద్ది సమయం పట్టొచ్చు లేదా చిన్నారికి అనుకోని ఆపద ఏదైనా ఎదురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని అన్నారు షెరీఫ్ కార్యాలయం అధికారులు.(చదవండి: సైన్సుకే సవాలుగా శాంతి దేవి పునర్జన్మ రహస్యం: విస్తుపోయిన శాస్త్రవేత్తలు..!) -
‘పోతే నా ఒక్కడి ప్రాణం..’ ఖమ్మం రియల్ హీరో సాహసం వైరల్
ఖమ్మం, సాక్షి: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం అతలాకుతలం అయింది. మున్నేరుకు పోటెత్తిన వరదతో ఖమ్మం, ఖమ్మం రూరల్ మండలాల్లోని పరీవాహక ప్రాంత కాలనీల్లోకి నీరు చేరింది. తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న ఖమ్మం జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్భంధం అయిపోయింది. అన్నీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించిపోయింది. అయితే..శనివారం రోజు కురిసిన భారీ వర్షాలకు.. మున్నేరు వరద ప్రమాదకరంగా పొంగిపొర్లింది. భారీ వర్షం, వరద ధాటికి ప్రకాశ్నగర్ బ్రిడ్జ్ మీద నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహించింది. అనుకోకుండా.. ఈ బ్రిడ్జి మీద చిక్కుకుపోయిన తొమ్మిది మంది సాయం కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూశారు. ఈ ప్రమాదకర వరదల్లో సుభాన్ ఖాన్ అనే జేసీబీ డ్రైవర్ ప్రదర్శించిన సాహసం.. జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది. If I go, it is one life, if I return, I will save nine lives: this was the courage shown by #Subhankhan who took a JCB to bring back 9 people marooned on Prakash Nagar Bridge #Khammam from early hrs on Sept1; You can hear daughter brimming with pride #MyDaddyBravest #RealLifeHero pic.twitter.com/tbthGfUhRB— Uma Sudhir (@umasudhir) September 3, 2024వాళ్లను రక్షించేందుకు సుభాన్ ప్రయత్నిస్తుండగా అంతా వారించారు. ‘నేను అక్కడిపోతే నాది ఒక్క ప్రాణం పోవచ్చు. నేను సాహసం చేస్తే తొమ్మిది ప్రాణాలు రక్షించిన వాడిని అవుతాను’ అని జేసీబీతో వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు. వరద సహాయక కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక బీఆర్ఎస్ నేతలు, స్థానిక ప్రజలు జేసీబీ డ్రైవర్ సుభాన్ ఖాన్ చేసిన సాహసాన్ని కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సుభాన్ను ఫొన్లో అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆ రియల్ హీరో సాహసం నెట్టింట చర్చగా మారింది. -
Uttar Pradesh: కూలిన రెండు ఇళ్లు.. శిథిలాల కింద పలువురు..
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాశీ విశ్వనాథుని దేవాలయం సమీపంలో సోమవారం అర్థరాత్రి రెండు ఇళ్లు కూలిపోయాయి. చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖోయా గల్లీ కూడలి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు.సమాచారం అందుకున్న అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదం దరిమిలా కాశీ విశ్వనాథ ఆలయానికి వెళ్లే నాల్గవ నెంబరు ద్వారాన్ని మూసివేశారు. ఆలయానికి వెళ్లే సందర్శకులకు గేట్ నంబర్ వన్, గేట్ నంబర్ టూ నుంచి ప్రవేశం కల్పిస్తున్నారు. కూలిపోయిన రెండు ఇళ్లు 70 ఏళ్ల క్రితం నాటివని అధికారులు తెలిపారు. #WATCH | Kaushal Raj Sharma, Commissioner Varanasi Division says "Two houses collapsed here in which 9 people were trapped. 2 of them came out on their own and 7 others were rescued. One woman has lost her life and the remaining are under treatment. The rescue operation is almost… pic.twitter.com/YWhycEVmgZ— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 6, 2024 -
Wayanad landslide: ఆరు ప్రాణాలు నిలబెట్టారు
వయనాడ్: దట్టమైన అడవిలో అదొక కొండ గుహ.. చుట్టూ చిమ్మచీకటి.. ఒకటి నుంచి నాలుగేళ్ల వయసున్న నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఐదు రోజులపాటు అక్కడే తలదాచుకున్నారు. తాగడానికి వర్షపు నీరు తప్ప తినడానికి తిండి లేదు. ఆకలితో అలమటించిపోయారు. అటవీ సిబ్బంది 8 గంటలపాటు శ్రమించి ఆ కుటుంబాన్ని రక్షించారు. ఆరుగురి ప్రాణాలను కాపాడారు. కేరళలో వరద బీభత్సానికి సాక్షిగా నిలిచిన వయనాడ్ జిల్లాలోని అట్టమల అడవిలో జరిగిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అటవీ సిబ్బందే అసలైన హీరోలంటూ జనం ప్రశంసిస్తున్నారు.వయనాడ్లో పనియా జాతి గిరిజనులు అధికంగా ఉంటారు. ఇతర సామాజికవర్గాలకు దూరంగా జీవిస్తుంటారు. అటవీ ఉత్పత్తులను విక్రయించి జీవనోపాధి పొందుతుంటారు. అందుకోసం గిరిజన దంపతులు నలుగురు పిల్లలను వెంట తీసుకుని కొండల్లోకి వెళ్లారు. భీకర వర్షం మొదలవడంతో కొండ గుహలో తలదాచుకున్నారు. వర్షం తగ్గకపోవడం, కొండచరియలు విరిగిపడుతుండడంతో కిందికొచ్చే సాహసం చేయలేకపోయారు. ఆహారం కోసం వెతుకుతూ తల్లి ఐదు రోజుల తర్వాత కిందికి రావడంతో అధికారులు గమనించారు. గుహలో నలుగురు పిల్లలు, భర్త ఉన్నారని చెప్పడంతో అటవీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. భారీ వర్షం, అడుగడుగునా రాళ్లు, బురదలో అడుగువేయడమే కష్టమవుతున్నా గుహకు చేరుకున్నారు. ముందుగా ఆకలితో నీరసించిపోయిన చిన్నారుల కడుపు నింపారు. వాళ్లను తాళ్లతో తమ ఒంటికి కట్టుకొని జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఆ క్రమంలో కొండపై నుంచి తాళ్ల సాయంతో దిగాల్సి వచి్చంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో జనం విపరీతంగా షేర్ చేశారు.350 మందికిపైగా మృతులు! వయనాడ్ విపత్తు మృతుల సంఖ్య 350 దాటినట్లు తెలుస్తోంది. శనివారం అధికారులు మాత్రం 218 మంది చనిపోయినట్లు వెల్లడించారు. నిర్వాసితులకు సురక్షిత ప్రాంతంలో టౌన్íÙప్ ఏర్పాటుచేసి ఇళ్లు కట్టిస్తామని సీఎం పినరయి విజయన్ చెప్పారు. ప్రకటించారు. మోహన్ లాల్ రూ.3 కోట్ల విరాళం ప్రముఖ సినీ నటుడు మోహన్లాల్ శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. భారత ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్న ఆయన బాధితులను పరామర్శించారు. సహాయక సిబ్బంది సేవలను కొనియాడారు. వరద విలయానికి నామారూపాల్లేకుండాపోయిన నివాసాలను చూసి చలించిపోయారు. పునరావాస చర్యలకు రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు. -
వయనాడ్ విపత్తు: ఆ 300 మంది ఎక్కడ?
వయనాడ్/కొల్లామ్: కేరళలో కొండచరియలు పడ్డాక కాపాడండంటూ ఆర్తనాదాలు చేసిన వారిని కాపాడిన సహాయక బృందాలు ఇప్పుడు కనిపించకుండా పోయిన వారిపై ప్రధానంగా దృష్టిపెట్టాయి. ప్రకృతి వినాశక విశాల ఘటనాప్రాంతాల్లో ఇంకా వస్తున్న సెల్ఫోన్ సిగ్నళ్ల సాయంతో మనుషుల జాడను గుర్తించే అత్యాధునిక పరికరాలను తెప్పిస్తున్నారు. సెల్ఫోన్ చివరి లొకేషన్ను అత్యంత ఖచ్చితత్వంతో చూపించే గూగుల్ జీపీఎస్ కోఆర్డినేట్స్, డ్రోన్ ఏరియల్ ఫొటోల సాయంతో శిథిలాలు, కూలిన చెట్లు, బండరాళ్ల మధ్యలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేయనున్నారు. ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ కుగ్రామాల్లో మరణాల సంఖ్య తాజాగా 300 దాటింది. గుర్తు తెలియని మృతదేహాలకు సామూహిక దహనసంస్కారాలు చేస్తున్నారు.బృందాలుగా ఏర్పడి బరిలోకి..దాదాపు 300 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. కొండచరియలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. శునకాలతోపాటు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరంచేశారు. అత్తమల అరాన్మల, ముండక్కై, పుంచిరిమట్టం, వెల్లరిమల, జీవీహెచ్ఎస్ఎస్ వెల్లరిమల, నదీతీరం ఇలా కొండచరియల ప్రభావిత ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, డీఎస్జీ, కోస్ట్గార్డ్, నేవీ, స్థానిక యంత్రాంగం, కేరళ పోలీసులు, స్థానికులు, అటవీ సిబ్బంది, గజ ఈతగాళ్లు సంయుక్తంగా ఈ సంక్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్ను మొదలుపెట్టారు. డ్రోన్ ఆధారిత అత్యాధునిక రాడార్ను ఢిల్లీ నుంచి తేనున్నారు. 190 అడుగుల బేలీ తాత్కాలిక వంతెన నిర్మాణం పూర్తవంతో భారీ యంత్రాలను తెచ్చేందుకు మార్గం సుగమమైంది.కేంద్రం శ్రద్ధతో పట్టించుకోవాలి: రాహుల్గురువారం ఘటనాస్థలిని పరిశీలించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం సైతం పనులను పర్యవేక్షించారు. ‘‘ఇది పెను విషాదం. ఈ ఉదంతాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధతో పట్టించుకోవాలి. బాధిత కుటుంబాలకు వేరే ప్రాంతాల్లో శాశ్వత పునరావాసం కల్పించాలి’’ అన్నారు. వారికి కాంగ్రెస్ 100 ఇళ్లు కట్టిస్తుందన్నారు.నిక్షేపంగా ఇల్లు,కుటుంబంఇంతటి విలయం మధ్య ఒక ఇల్లు నిక్షేపంగా ఉండటం రెస్క్యూ టీమ్ను ఆశ్చర్యానికి గురిచేసింది. పడవెట్టు కున్ను ప్రాంతంలో భారీ కొండచరియలు పడినా అక్కడి ఒక ఇల్లు మాత్రం దెబ్బతినలేదు. అయితే చుట్టుప క్కల అంతా కొండచరి యలు పడిన భయానక దృశ్యాన్ని చూసిన ఆ ఇంట్లోని నలుగురు కుటుంబసభ్యులు ప్రాణభయంతో మంగళవారం నుంచి ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఫలానా ప్రాంతంలో తమ వారి జాడ తెలీడం లేదని బంధువులు ఇచ్చిన సమాచారంతో ఘట నాస్థలికి చేరుకున్న హెలికాప్టర్ బృందం సురక్షిత ప్రాంతానికి తరలించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.పరిమళించిన మానవత్వంరూ.10 వేలు దానమిచ్చిన చిరు టీస్టాల్ యజమానురాలుసర్వం కోల్పోయిన శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి చిన్నపాటి టీస్టాల్ యజమానురాలు సైతం తనవంతు సాయంచేసి దానగుణాన్ని చాటారు. రోడ్డు పక్కన టీ అమ్ముకునే వృద్ధ మహిళ సుబేదా కేరళ విలయ బాధితులకు తనవంతుగా రూ.10,000 ఇచ్చారు. ఈమె దానగుణం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. ‘‘ బ్యాంక్ రుణం కట్టేందుకే ఈ డబ్బు దాచా. టీవీలో విషాదవార్త విని మనసు చలించింది. నెలవారీ కిస్తీ(ఈఎంఐ) తర్వాత కడదాం.. ముందు వీళ్లను ఆదుకుందాం అని భర్త సైతం నాకు మద్దతు పలికారు. ఆరోగ్యం సహకరించక వయనాడ్దాకా వెళ్లి స్వయంగా ఇచ్చే ఓపికలేక కలెక్టరేట్కు వెళ్లి ముఖ్యమంత్రి విపత్తు సహాయనిధిలో జమచేశా’ అని సుబేదా చెప్పారు. వరద బాధితుల సహాయార్ధం గతంలోనూ ఈమె తన నాలుగు మేకలను అమ్మేసి వచ్చిన నగదును విరాళంగా ఇచ్చారు.మేజర్ సీతకు సలామ్కఠిన, విపత్కర, తీవ్ర ప్రతి కూల పరిస్థితుల్లో మహిళలు పనిచేయడం కష్టమనే భావనను ఒక్క ఫొటోతో చెదరగొట్టిన ఆర్మీ మేజర్ సీత అశోక్ శెల్కేకు అందరూ మెచ్చుకుంటున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నది మీదుగా 190 అడుగుల బేలీ వంతెనను నిర్మించాల్సిన బాధ్యతను మద్రాస్ ఇంజనీర్ గ్రూప్, సెంటర్ తలకెత్తుకుంది. మేజర్ సీత సారథ్యంలోని జవాన్ల బృందం రేయింబవళ్లూ పనిచేసి 31 గంటల్లోపు వంతెనను నిర్మించింది. వంతెన నిర్మాణ పనుల్లో నిమగ్నమైన మేజర్ సీత ఫొటో ప్రస్తుతం వైరల్గా మారింది. ‘ భారత సైన్యం తరఫున ఇక్కడికొచ్చి సాయ పడు తున్నందుకు నాక్కూడా గర్వంగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధి కారులకు, సాయç ³డిన స్థానికులకు నా కృతజ్ఞతలు’ అని సీత అన్నారు. సీత సొంతూరు మహారాష్ట్ర లోని అహ్మద్నగర్ దగ్గర్లోని గడిల్గావ్. -
వయనాడ్ విలయం : ఆమె సీత కాదు.. సివంగి
కేరళలోని వయనాడ్లో కొండచరియలు విరిగి పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఎవ్వరూ బతికి ఉంటే అవకాశం లేదంటూ స్వయంగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. అంతటి విపత్తు సృష్టించిన ఈ విలయం నుంచి బాధితులను రక్షించే సహాయక చర్యల్లో, రికార్డు సమయంలో 190 అడుగుల పొడవైన బ్రిడ్జ్ నిర్మించిన మేజర్ సీతా షెల్కే వార్తల్లో నిలిచారు.ఇండియన్ ఆర్మీకి చెందినమద్రాస్ ఇంజనీర్స్ గ్రూప్కు చెందిన మేజర్ సీతా షెల్కే సహాయక చర్యలలో చురుకుగ్గా పాల్గొన్నారు. మేజర్ సీతా షెల్కే, మేజర్ అనీశ్ నేతృత్వంలోని బృందం చేసిన కృషి విశేషంగా నిల్సుస్తోంది. కేరళలోని వాయనాడ్లో కేవలం16 గంటల్లో 24 టన్నుల సామర్థ్యంతో 190 అడుగుల పొడవైన వంతెనను నిర్మించి పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో వినియోగించిన సాంకేతిక నైపుణ్యం, షెల్కే చూపించిన అంకితభావం, ధైర్యసాహసాలు భారత సైన్యంలోని మహిళా అధికారుల పాత్రను గుర్తు చేసింది. ఇది మహిళా సాధికారతకు, కష్టకాలంలో సమైక్యతకు నిదర్శనమని రక్షణ శాఖ ప్రతినిధి భరత్ భూషణ్ ప్రశంసించారు. ఇంకా పలువురు సైనికాధికారులు, నెటిజన్లుఆమెకు హ్యాట్సాఫ్ అంటున్నారు. వంతెన నిర్మాణం జూలై 31న రాత్రి 9 గంటలకు ప్రారంభమై ఆగస్టు 1సాయంత్రం 5:30 గంటలకు పూర్తయింది. మేజర్ షెల్కే నాయకత్వంలో ఇంజనీర్ల బృందం అనేక సవాళ్ల మధ్య వంతెనను సకాలంలో పూర్తి చేయడానికి అవిశ్రాంతంగా పనిచేసింది. తద్వారా ప్రభావిత ప్రాంతాలకు రవాణాను సులభతరం, వేగవంతం చేసింది.Kudos to Maj Seeta Shelke & her team of #MadrasEngineersGroup of #IndianArmy who went beyond all kind of challenges & built the 190ft long bridge with 24 Ton capacity in 16 hours in #Wayanad Started at 9 pm on 31 July & completed at 5:30 pm on 1 Aug. @giridhararamane #OPMADAD pic.twitter.com/QDa6yOt6Z2— PRO Defence Trivandrum (@DefencePROTvm) August 1, 2024 -
భార్యాబిడ్డల కోసం చిరుతకే పంజా విసిరిన మొనగాడు
చిరుత పులి లేదా మచ్చలపులి ఉన్నట్టుండి మనకు ఎదురుపడితే.. దాడి చేస్తే. అమ్మో, అసలు ఆ ఊహే భయంకరంగా ఉంది కదా. కానీ ఒక వ్యక్తి మాత్రం తన భార్యా బిడ్డల్ని కాపాడుకునేందుకు ఏకంగా చిరుతపులిపైనే పంజా విసిరాడు. చేతిలో ఎలాంటి ఆయధం లేకుండానే దాని ఎదుర్కొన్నాడు. పిడిగుద్దులతో దానికి చుక్కలు చూపించాడు. శరీరం రక్తమోడుతున్నా ఏ మాత్రం భయపడలేదు. ప్రాణానికి ప్రాణమైన తన బిడ్డను, భార్యను కాపాడుకోవడమే లక్ష్యం. అందుకే ప్రాణాలకు తెగించి మరీ పోరాడి దాన్ని మట్టి కరిపించి హీరోగా నిలిచాడు కర్ణాటకకు చెందిన గోపాల్ నాయక్. వాస్తవానికి ఈ సంఘటన 2021లో జరిగింది. కర్ణాటకలోని బెంగళూరుకు 200 కి.మీ దూరంలోని అరసికెరె సమీపంలోని బెండేకెరె గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ స్టోరీ మరోసారి రౌండ్లు కొడుతుంది. మిక్కు అనే ఎక్స్ యూజర్ ఈ ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది.-Leopard attacks his daughter -He comes to the rescue -KiIIs leopard with bare hands Not a textbook hero, but a real brave 👑 pic.twitter.com/PuUpLGLDzn— Mikku 🐼 (@effucktivehumor) July 29, 2024 -
‘నాన్న అంటే జీవితం..నాన్నే ధైర్యం’ : వైరల్ వీడియో
జోరుగా కురుస్తున్న వర్షాలు, ఉప్పొంగి పారుతున్న నదులు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జలపాతం అందాలను చూసేందుకు వెళ్లిన కుటుంబంలో ప్రమాదంలో చిక్కుకుంది. పుణేలోని లోనావాలా ప్రాంతంలో అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహంలో కొట్టుకు పోయిన దృశ్యం విషాదాన్ని నింపింది. తాజాగా ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది.ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో తన బిడ్డలను అత్యంత సాహసోపేతంతో తండ్రి కాపాడుకున్న వైనం విశేషంగా నిలిచింది. ఇది ఎక్కడ, ఎలా జరిగింది అనే వివరాలు అందుబాటులో లేనప్పటికీ, ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. నాన్న పక్కనుంటే అలలైనా తలవొంచాల్సిందే అనే క్యాప్షన్తో లక్నోకు చెందిన శ్యామ్ యాదవ్ షేర్ చేశారు. దీంతో నెటిజన్లు కూడ తండ్రి గొప్పతనాన్ని ప్రశంసిస్తూ కమెంట్స్ చేశారు. తండ్రి అన్న పదం వినగానే శక్తి వస్తుంది. ప్రపంచంలో తల్లిదండ్రులను మించిన గొప్ప శక్తి లేదు అని ఒకరు వ్యాఖ్యానించారు. శక్తివంతమైన అలలు వచ్చినపుడు నాన్న అయినా ఏమీ చేయలేడు. అత్యుత్సాహ ప్రదర్శించకుండా అప్రమత్తంగా ఉండాలని మరొకరు కమెంట్ చేశారు.पिता साथ है, तो लहरों की क्या औकात pic.twitter.com/fqTjEXUZtr— Shyam Yadav (@shyamyadav2408) July 5, 2024 -
ప్రకాశం: గుంతలో చిరుత.. అధికారుల పరుగులు
ప్రకాశం, సాక్షి: ప్రకాశం జిల్లాలో గిద్దలూరు మండలం దేవనగరంలో చిరుత పులి కలకలం రేపింది. గుంతలో చిక్కుకొని ఉన్న చిరుత పులిని గ్రామస్తులు గుర్తించారు. చిరుత సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతపులిని బంధించడానికి వలలు వేసి పట్టుకోవడానికి ప్రయత్నించారు. బుధవారం రాత్రి చీకటి కావడంతో రెస్క్యూకి చర్యలకు అంతరాయం కలిగింది. ఇవాళ తిరుపతి నుంచి వచ్చిన టైగర్ రెస్కూ టీమ్.. చిరుత పులిని బంధించి అడవిలో వదలనున్నారు.ఇదిలా ఉంటే.. నంద్యాల మహానంది క్షేత్రంలో మరోసారి చిరుత సంచారం భక్తులు, స్థానికుల్లో భయాందోళనకు కారణమైంది. గోశాల, అన్నదాన సత్రం దగ్గర చిరుత సంచరించిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. -
సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
విచక్షణ లేకుండా, చేతికొచ్చినట్టు కమెంట్లు చేయడం, సూటిపోటి మాటలతో ఎదుటివారిని చిత్రవధ చేయడం సోషల్ మీడియా ట్రోలర్లకు పరిపాటిగా మారిపోయింది. ఫలితంగా పెద్ద ప్రమాదం నుంచి బిడ్డ బయటపడిందన్న సంతోషం ఒక తల్లికి ఎంతో సేపు నిలవనీయలేదు. వేధించి, వేధించి ఆమె ఉసురు తీసిన ఘటన విషాదం నింపింది.ఇటీవలి ప్రమాదవశాత్తు తల్లి చేతుల్లోంచి జారి సన్షేడ్పై పడిన పాపను రక్షించిన సంఘటన గుర్తుందా?ఎనిమిది నెలల పాపను రక్షించే రెస్క్యూ ఆపరేషన్లో స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి బిడ్డను కాపాడారు. కానీ ఇపుడా పాపకు తల్లిని దూరం చేసింది మాయదారి సోషల్ మీడియా. కోయంబత్తూర్లో పాపను రక్షించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విడియో చూసిన నెటిజన్లు "బిడ్డను చూసుకోవటం చేత కాదా?" అని ఆ తల్లిని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర డిప్రెషన్కి గురైన ఆమె కోయంబత్తూర్లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.కాగా చెన్నైలోని తిరుముల్లైవాయల్లోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నాలుగో అంతస్తులో నివసించే రమ్య, వెంకటేష్లకు ఇద్దరు పిల్లలు, నాలుగేళ్ల అబ్బాయి, ఏడు నెలల పాప ఉన్నారు. ఏప్రిల్ 28న, ఐటీ ఉద్యోగి రమ్య తన ఫ్లాట్లోని బాల్కనీలో తన పసికందుతో ఆడుకుంటూ ఉండగా, పాప ఆమె చేతుల్లోంచి జారి కింద ఉన్న తాత్కాలిక సన్షేడ్లో పడింది. దీంతో పొరుగువారు కింద దుప్పట్లు పట్టుకోగా, ఒక వ్యక్తి సన్షేడ్ నుండి పాపను పట్టుకుని సురక్షితంగా క్రిందికి తీసుకు రాగలిగాడు. ఈ ఘటన తర్వాత రమ్య తల్లిగారింటికి వెళ్లింది. అక్కడికి వెళ్లినా ఆమెకు ఉపశమనం లభించలేదు. దీంతో శనివారం కారమడైలోని తల్లిదండ్రుల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉసురు తీసుకుంది. -
గని ప్రమాదం.. 14 మంది అధికారులు సేఫ్.. ఒకరు మృతి
రాజస్థాన్లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్కు చెందిన గనిలో మంగళవారం రాత్రి చిక్కుకున్న 15 మంది అధికారులలో 14 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. ఈ ప్రమాదంలో ఒక అధికారి మరణించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. నాలుగు దశల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అధికారులు గాయపడ్డారు. వారిని జైపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గనిలో 1,875 అడుగుల లోతులో లిఫ్ట్ చైన్ తెగిపోవడంతో ప్రమాదం సంభవించింది. #WATCH झुंझुनू, राजस्थान: कोलिहान खदान में लिफ्ट गिरने से 14 लोगों के फंसे होने की आशंका है, बचाव अभियान जारी है।वीडियो आज सुबह की है। pic.twitter.com/gIuVYnRsbd— ANI_HindiNews (@AHindinews) May 15, 2024ఈ ప్రమాదంలో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఉపేంద్ర పాండే మరణించారు. అతని మృతదేహాన్ని కేసీసీ ఆస్పత్రికి తరలించారు. కాగా గనిలోని లిఫ్ట్లో ఏదో లోపం ఉందని, మరమ్మతులు చేయించాలని ఎనిమిది రోజుల క్రితం కెసిసి యాజమాన్యానికి ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ స్వయంగా దృష్టి సారించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. -
ఎలుగుబంట్లలో రకాలెన్ని? ఏ ఎలుగుబంటి ప్రమాదకరం?
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 23న ‘వరల్డ్ బేర్ డే’ అంటే ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలుగుబంట్ల జీవన విధానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎలుగుబంటి దినోత్సవాన్ని తొలిసారిగా 1992లో నిర్వహించారు. ఎలుగుబంట్ల దుస్థితిపై అవగాహన కల్పించేందుకు దీనిని ప్రారంభించారు. ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఎలుగుబంట్ల అభయారణ్యాన్ని సందర్శించడం, ఎలుగుబంటి పాత్ర ఉన్న సినిమా చూడటం, ఎలుగుబంటి వివరాలు కలిగిన పుస్తకాన్ని చదవడం లాంటి కార్యకలాపాలు చేస్తారు. ఎలుగుబంట్లు క్షీరద జాతికి చెందినవి. ఇవి మాంసాహార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎలుగుబంటి జాతులు ప్రధానంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా ఐరోపాలలో కనిపిస్తాయి. గోధుమ లేదా నలుపు రంగులో ఇవి ఉంటాయి. స్వచ్ఛమైన తెలుపు రంగులో పోలార్ ఎలుగుబంట్లు ఉంటాయి. ఎలుగుబంటి ఒంటరి జంతువు. ఎలుగుబంట్లు శీతాకాలంలో ఎక్కువసేపు నిద్రావస్థలో ఉంటాయి. ఈ కాలంలో అవి గుహలలో ఆశ్రయం పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎనిమిది రకాల ఎలుగుబంట్లు ఉన్నాయి. అమెరికన్ బ్లాక్ బేర్ అమెరికన్ బ్లాక్ బేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే ఎలుగుబంటి జాతి. ఈ రకమైన ఎలుగుబంటి ఎక్కువగా ఉత్తర అమెరికాలోని అటవీ, పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది మధ్యస్థ పరిమాణంతో ఉంటుంది. దట్టమైన నల్లని బొచ్చుతో శారీరకంగా చాలా బలంగా ఉంటుంది. ఆసియన్ బ్లాక్ బేర్ దాని పేరులో సూచించినట్లుగా ఇది ఆసియాలో కనిపించే ఎలుగుబంటి జాతి. ఇది భారతదేశం, కొరియా, ఈశాన్య చైనా, రష్యా, జపాన్, తైవాన్లలో కనిపిస్తుంది. దీనిని మూన్ బేర్ అని కూడా అంటారు. స్పెక్టాక్లెడ్ బేర్ ఇది ఛాతీ పైభాగంలో లేత గోధుమరంగు రంగును కలిగి ఉంటుంది. దీని ఆకారంలో కళ్లకు అద్దాలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నందున దీనిని స్పెక్టాక్లెడ్ బేర్ అని అంటారు. దీనిని ఆండియన్ బేర్, పర్వత ప్రాంత ఎలుగుబంటి అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ట్రెమార్క్టోస్ ఆర్నాటస్. ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. ఇవి చెట్లపై ఎక్కువ సమయం గడుపుతాయి. ఇవి ఒంటరిగా తిరుగుతాయి. జెయింట్ పాండా జెయింట్ పాండా ఎలుగుబంటికి కళ్ళ చుట్టూ నల్లటి గుర్తులు కనిపిస్తాయి. నలుపు, తెలుపు రంగుల మృదువైన బొచ్చుతో కూడిన శరీరంతో విభిన్నంగా కనిపిస్తాయి. జెయింట్ పాండా బేర్ దక్షిణ మధ్య చైనాలో కనిపిస్తుంది. జెయింట్ పాండాకు రెండు ఉపజాతులు ఉన్నాయి. సన్ బేర్ ఎలుగుబంటి జాతులలో సన్ బేర్ చిన్నగా కనిపిస్తుంది. ఇది ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల వర్షారణ్యాలలో ఉంటుంది. తేనెను విపరీతంగా ఇష్టపడే దీనిని హనీ బేర్ అని కూడా పిలుస్తారు. దాని మెడపై ప్రత్యేకమైన గుర్రపుడెక్క ఆకారంలో ఆరెంజ్ రంగు గుర్తు ఉంటుంది. సన్ ఎలుగుబంటికి రెండు ఉపజాతులు ఉన్నాయి. ఇవి అన్ని రకాల ఎలుగుబంట్లలో అత్యంత ప్రమాదకరమైనవని చెబుతారు. స్లాత్ బేర్ స్లాత్ బేర్ శాస్త్రీయ నామం మెలుర్సస్ ఉర్సినస్. ఇది ప్రధానంగా భారతదేశం, నేపాల్, శ్రీలంకలో కనిపిస్తుంది. దీని పొడవాటి దిగువ పెదవి కారణంగా దీనిని లాబియేట్ బేర్ అని కూడా అంటారు. ఈ రకమైన ఎలుగుబంట్ల చెవులు పొడవాటి జుట్టును కలిగి ఉంటాయి. ఈ ఎలుగుబంట్లు జంటగా తిరుగుతాయి. బ్రౌన్ బేర్ బ్రౌన్ బేర్ భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీనిని గ్రిజ్లీ బేర్ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ ఆర్క్టోస్. ఉత్తర యురేషియా, ఉత్తర అమెరికాలో ఇవి కనిపిస్తాయి. బ్రౌన్ బేర్ ఉపజాతులు అనేకం ఉన్నాయి. వీటి మెడ వెనుక భాగంలో పొడవైన మందపాటి బొచ్చు ఉంటుంది. బ్రౌన్ బేర్ అనేక యూరోపియన్ దేశాలకు జాతీయ జంతువు. పోలార్ బేర్ పోలార్ బేర్ అనేది భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ మారిటిమస్. ఇది ప్రధానంగా ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ కనిపిస్తుంది. దీనికి తెల్లటి బొచ్చు కింద నల్లని చర్మం ఉంటుంది. దీనికి రెండు ఉపజాతులు. అవి అమెరికన్ పోలార్ బేర్, సైబీరియన్ పోలార్ బేర్. సముద్రపు మంచు ఘనీభవించిన శీతాకాలంలో ఈ ధృవపు ఎలుగుబంట్లు మరింత చురుకుగా ఉంటాయి. ప్రాణాలు తీస్తున్న ఎలుగుబంట్లు గత రెండు దశాబ్దాలో స్లాత్ ఎలుగుబంట్లు వేలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఇవి మన దేశంలో వందల మందిని చంపాయి. భారత ప్రభుత్వం అధికారికంగా ఎలుగుబంట్ల దాడులను లెక్కించనప్పటికీ, స్లాత్ ఎలుగుబంటి మన దేశంలోని అత్యంత ప్రాణాంతక జంతువులలో ఒకటని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇతర రకాల ఎలుగుబంటి కంటే ఈ స్లాత్ ఎలుగుబంటి మనుషులపై అధికంగా దాడులు చేస్తోంది. మరోవైపు మనదేశంలో ఈ రకపు ఎలుగుబంట్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా అవి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలోని అడవులలో కేవలం 10 శాతం మాత్రమే ఎలుగుబంట్లకు అనువైనవిగా ఉన్నాయి. ఎవరైనా ఈ అడవుల్లోకి ప్రవేశించినప్పుడు లేదా అవి (ఎలుగుబంట్లు) ఆహారం, నీటి కోసం మానవ నివాసాలలోకి ప్రవేశించినప్పుడు అవి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఆగ్రాలో ఎలుగుబంట్ల రక్షిత కేంద్రం యూపీలోని ఆగ్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద రక్షిత బేర్ సెంటర్ ఉంది. ఇక్కడ 100 ఎలుగుబంట్లు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వీటి సంఖ్య 500కు పైగానే ఉండేది. వైల్డ్లైఫ్ ఎస్ఏఓస్కు చెందినప్రత్యేక బృందం ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్లో ఎలుగుబంట్లను సంరక్షిస్తోంది. తాజ్ సిటీలోని సుర్ సరోవర్ ప్రాంతంలో ఈ బేర్ కన్జర్వేషన్ సెంటర్ ఉంది. 1995లో స్థాపితమైన వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్.. ఎలుగుబంట్లతో కొందరు ఫీట్స్ చేయించడాన్ని అరికట్టేందుకు ఉద్యమించింది. యూపీలోని ‘కలందర్’ తెగ ప్రజలు ఎలుగుబంటి పిల్లలను వేటాడి, వాటి చేత గారడీ చేయించేవారు. ఈ వ్యవహారాలను వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ అరికట్టింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం జంతువులను హింసించడం చట్టవిరుద్ధం. వైల్డ్లైఫ్ సంస్థ ఇప్పటివరకూ 628 ఎలుగుబంట్లను రక్షించింది. ఈ సంస్థ నాలుగు ఎలుగుబంట్ల పునరావాస కేంద్రాలను నిర్వహిస్తోంది. వీటిలో ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ ప్రముఖమైనది. ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ సహ వ్యవస్థాపకుడు కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎలుగుబంట్లకు తాము ఉదయం వేళ పండ్లు, సాయంత్రం గంజి అందిస్తామన్నారు. వాటికి పలువిధాలుగా ఉపయోగపడేలా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశామన్నారు. -
Spain: అపార్ట్మెంట్లలో చెలరేగిన మంటలు.. నలుగురు మృతి
మాడ్రిడ్: స్పెయిన్లోని వాలెన్సియా పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండు 14 అంతస్తుల అపార్ట్మెంట్లలో చెలరేగిన మంటలు చెలరేగిన ఘటనలో నలుగురు మృతి చెందగా 13 మందికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిలో పిల్లలు, ఫైర్ సిబ్బంది ఉన్నారు. మరో 14 మంది జాడ తెలియడం లేదు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది క్రేన్ల సాయంతో అపార్ట్మెంట్లలో చిక్కుకున్నవారిని రక్షించారు. తొలుత ఒక అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు క్రమంగా పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్కు వ్యాపించాయి. భారీ అగ్ని జ్వాలలు, పొగ ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. భవన నిర్మాణంలో వాడిన సామగ్రి కారణంగానే మంటలు వేగంగా వ్యాపించినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. స్పెయిన్ ప్రధాని పెడ్రో షాంచేజ్ అగ్ని ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. BREAKING: Entire multi-storey building on fire in Valencia, Spain pic.twitter.com/sTXMm6KY4p — Insider Paper (@TheInsiderPaper) February 22, 2024 ఇదీ చదవండి.. రష్యాలోని భారతీయులకు కేంద్రం కీలక సూచన -
మంచులో చిక్కుకున్న పర్యాటకులను కాపాడిన ఆర్మీ సిబ్బంది
తూర్పు సిక్కింలోని గ్యాంగ్టక్లో భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ సైనికులు మంచులో చిక్కుకున్న పర్యాటకుల ప్రాణాలను కాపాడారు. బుధవారం అకస్మాత్తుగా భారీ హిమపాతం కురియడంతో తూర్పు సిక్కింలోని నటులాలో 500 మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు. వీరిని గమనించిన ఆర్మీ సైనికులు వెంటనే అప్రమత్తమై పర్యాటకులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అకస్మాత్తుగా కురిసిన భారీ మంచు కారణంగా 500 మంది పర్యాటకులతో పాటు దాదాపు 175 వాహనాలు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయాయి. వారిని ఆర్మీ బృందం కాపాడింది. భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ పర్యాటకులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ తెలిపింది. దీనికిముందు ఫిబ్రవరి 20న జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్లో భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన వాహనాలను తరలించడంలో సీఆర్పీఎఫ్ సైనికులు సహాయం అందించారు. భారీ వర్షం, హిమపాతం కారణంగా శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిలో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 𝐒𝐮𝐝𝐝𝐞𝐧 𝐒𝐧𝐨𝐰𝐟𝐚𝐥𝐥 𝐢𝐧 𝐄𝐚𝐬𝐭 𝐒𝐢𝐤𝐤𝐢𝐦, 𝟓𝟎𝟎 𝐒𝐭𝐫𝐚𝐧𝐝𝐞𝐝 𝐓𝐨𝐮𝐫𝐢𝐬𝐭𝐬 𝐑𝐞𝐬𝐜𝐮𝐞𝐝 𝐛𝐲 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐓𝐫𝐢𝐬𝐡𝐚𝐤𝐭𝐢 𝐂𝐨𝐫𝐩𝐬 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐀𝐫𝐦𝐲 Due to sudden heavy snowfall, approximate 175 vehicles with more than 500 tourists got… pic.twitter.com/vdQTbdQ6jJ — Trishakticorps_IA (@trishakticorps) February 21, 2024 -
అటల్ టన్నెల్లో చిక్కుకున్న పర్యాటకులు.. కాపాడిన రెస్క్యూ టీమ్!
హిమాచల్ ప్రదేశ్లో విపరీతంగా మంచు కురుస్తోంది. దీంతో ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు మురిసిపోతున్నారు. మరోవైపు విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా వారికి పలు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. మంగళవారం (జనవరి 30) హిమపాతం కారణంగా 300 మందికి పైగా పర్యాటకులు రోహ్తంగ్లోని అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకున్నారు. అయితే పోలీసులు సహాయక చర్యలు చేపట్టి, వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హిమాచల్తో పాటు దేశంలోని ఎగువ ప్రాంతాలైన కులు మనాలిలో కూడా విపరీతంగా మంచు కురుస్తోంది. ఫలితంగా చలి మరింతగా పెరిగింది. పర్యాటకులు హిమపాతాన్ని చూసి, మురిసిపోతూ, దానిలో ఆడుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో హిమపాతం కారణంగా పర్యాటకులు పలు ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అటల్ టన్నెల్లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని, సహాయ చర్యలు చేపట్టిందని సూపరింటెండెంట్ లాహౌల్ స్పితి మయాంక్ చౌదరి తెలిపారు. రాబోయే కొద్దిరోజులపాటు హిమాచల్లో వాతావరణం ఇదే తరహాలో ఉండవచ్చని వాతావరణశాఖ తెలిపింది. ఇటువంటి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటకులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే, హిమపాతాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పర్వత ప్రదేశాలకు చేరుకుంటున్నారు. సిమ్లాలోని కుఫ్రీ, మనాలిలో విపరీతంగా మంచు కురుస్తోంది. సిమ్లాలోని రిడ్జ్, మాల్ రోడ్లలో గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. -
ఇరాన్ నౌక హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’
ఇరాన్కు చెందిన ఫిషింగ్ నౌకను ఇండియన్ నేవి సిబ్బంది రక్షించించినట్లు వెల్లడించింది. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు 700 నాటికల్ మైల్స్ దూరంలో ఇరాన్ దేశానికి చెందిన ఫిషింగ్ నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవి వెంటనే అప్రమత్తమై.. ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ యుద్ధనౌక సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇరాన్ ఫిషింగ్ నౌకను సోమాలియా హైజార్ల నుంచి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ సిబ్బంది రక్షించినట్లు ఇండియన్ నేవీ పేర్కొంది. Indian Navy warship INS Sumitra is rescuing fishermen hijacked by Somali pirates 700 nautical miles west of Kochi in the Arabian Sea. The Iranian fishing vessel MV Iman with around 17 crew members was hijacked by Somali pirates: Indian Defence officials pic.twitter.com/EOEs7zgQHn — ANI (@ANI) January 29, 2024 అయితే.. సోమాలియా సముద్రపు దొంగల చేత హైజాక్కు గురైన ఇరాన్కు చెందిన ఎంవీ ఇమాన్ మత్స్యకార నౌకలో 17 మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది. ఇక.. ఇటీవల ఇటువంటి ఘటనలు ఎర్ర సముద్రంతో పాటు అరేబియా సముద్రంలో వరుసుగా జరుగుతున్న విషయం తెలిసిందే. చదవండి: వారంలోగా దేశవ్యాప్తంగా సీఏఏ అమలు.. కేంద్రమంత్రి ప్రకటన -
బిడ్డ కోసం మెట్రో ట్రాక్పై దూకిన తల్లి! అంతలోనే..
Real Hero Video: సమయస్ఫూర్తి.. ఒక్కోసారి దీని వల్ల పెను ముప్పులు తప్పుతుంటాయి. తాజాగా ఓ సెక్యూరిటీ గార్డు సమయానికి స్పందించడం వల్లే ఓ తల్లీబిడ్డ ప్రాణాలు నిలిచాయి. అందుకే అంతా ఆయన్ని హీరోగా అభినందిస్తున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్లి మూడేళ్ల పిల్లాడు మెట్రో టాక్ మీద పడిపోగా..ఆ వెంటనే అతని రక్షించేందుకు అతని తల్లి దూకేసింది. ఇది గమనించిన కొందరు అక్కడికి చేరుకుని వాళ్లను పైకి లాగే యత్నం చేశారు. ఈలోపు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ సకాలంలో స్పందించకుండా ఉంటే.. ఘోరమే జరిగేది. Heroic #PuneMetro Guard Saves 3-Year-Old's Life with Quick Thinking Read More: https://t.co/dQMGU1PHAe pic.twitter.com/YW4Q6f1wAx — Punekar News (@punekarnews) January 19, 2024 పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆయన అక్కడున్న ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. దీంతో స్టేషన్కు మరికొద్ది క్షణాల్లో చేరాల్సిన రైలు.. 30 మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఈలోపు ట్రాక్ మీద నుంచి ఆ తల్లీబిడ్డలిద్దరినీ పైకి లాగారు అక్కడున్న జనాలు. వాళ్లిద్దరికీ చిన్నపాటి గాయం కూడా కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ సెక్యూరిటీ గార్డు పేరు వికాస్ బంగర్. పుణే సివిల్ కోర్టు మెట్రో స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఇలాంటి చోట్ల పిల్లలతో వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. -
ఢిల్లీ ఎయిమ్స్లో అగ్ని ప్రమాదం
ఢిల్లీ ఎయిమ్స్లోని ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఈరోజు (గురువారం) ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఎయిమ్స్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఎయిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో చెలరేగిన మంటలకు సంబంధించిన సమాచారం అందగానే అగ్నిమాపకదళం ఏడు అగ్నిమాపక యంత్రాలతో సహా సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయి. అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (గురువారం) తెల్లవారుజామున 5:58 గంటల ప్రాంతంలో ఎయిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందింది. వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలివెళ్లాయి. ఎయిమ్స్లోని ఓ కార్యాలయంలో మంటలు చెలరేగాయి. డైరక్టర్ బిల్డింగ్ రెండో అంతస్తులోని ఆఫీసు రికార్డులు, ఫర్నీచర్, రిఫ్రిజిరేటర్లో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. #WATCH | A fire broke out in the Teaching Block of AIIMS Delhi today, which led to damage to furniture and office records; no casualty was reported, says Delhi Fire Services (Video source: Delhi Fire Services) pic.twitter.com/UmCYs7tXkQ — ANI (@ANI) January 4, 2024 -
2023లో విపత్తులకు నిలయమైన రాష్ట్రం ఏది?
2023 ఉత్తరాఖండ్కు ప్రమాదాల సంవత్సరంగా నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్లో పలు భారీ ప్రమాదాలు జరిగాయి. 2023 ప్రారంభం నుండి చివరి వరకు ఏదో ఒక విపత్తు చోటుచేసుకుంటూనే ఉంది. ఈ ఏడాది ఉత్తరాఖండ్కు అనేక చేదు అనుభవాలను మిగిల్చింది. ఏడాది ప్రారంభంలోనే జోషిమఠ్లో భూమి కుంగిపోయిన ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెట్టివేసింది. 2023 జనవరిలో చమోలి జిల్లా జోషిమఠ్లోని ఇళ్లు, రోడ్లకు అకస్మాత్తుగా భారీ పగుళ్లు కనిపించాయి. కుంగిపోతున్న జోషిమఠ్ అందరినీ కలవరానికి గురి చేసింది. ఈ వార్త దేశ విదేశాల్లో కూడా పతాక శీర్షికల్లో నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్లోని చమోలీలో నమామి గంగే ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా విద్యుదాఘాతానికి గురై 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ దుర్ఘటన నేపధ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున పరిహారం అందించారు. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఉత్తరాఖండ్లోని గంగోత్రి హైవేపై నుంచి బస్సు కాలువలో పడి ఏడుగురు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. నవంబర్లో ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మరణించారు. దీపావళి రోజున ఉత్తరకాశీలో సొరంగం కూలి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఎట్టకేలకు వారిని 17 రోజుల తరువాత ర్యాట్ హోల్ మైనర్స్ బయటకు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: అయోధ్య విమానాశ్రయం చూతము రారండి! -
టన్నెల్ టైంపాస్ పై వర్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ : ఉత్తర కాశీ టన్నెల్ నుంచి బయటపడ్డ 41 మంది కార్మికులు ఒక్కొక్కటిగా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. టన్నెల్లో ఉన్నప్పుడు వారు ఎలా టైమ్ గడిపారో చెప్తున్నారు. తాజాగా యూపీలోని మోతీపూర్కు చెందిన అంకిత్ టన్నెల్లో 17 రోజుల పాటు తాము చేసిన పనులకు సంబంధించి ఆసక్తికరర విషయాలు వెల్లడించారు. ‘టన్నెల్లో గడిపిన 17 రోజులు టైమ్ పాస్ చేసేందుకు చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఆడాం. రాజా, మంత్రి, చోర్, సిపాయి లాంటి ఆటలు ఆడుకున్నాం. టన్నెల్ చాలా పొడవుండడంతో ఎక్కువగా వాకింగ్ చేసే వాళ్లం. టన్నెల్లో పెద్దగా చలి లేదు. నిద్రపోవడానికి బ్లాంకెట్లు, జియో టెక్స్టైల్స్ వాడాం’అని అంకిత్ చెప్పాడు. ‘అయితే, టన్నెల్లో ఉన్న సమయంలో చావుకు దగ్గరగా వెళ్లొచ్చిన అనుభవం కలిగింది. కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారా అన్న కంగారుండేది. ఎందుకటే టన్నెల్లో నుంచి మేము వారితో మాట్లాడేంందుకు వీలు లేదు’అని అంకిత్ వివరించాడు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న చార్దామ్ ప్రాజెక్టు టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న 41 మంది కార్మికులు టన్నెల్లోనే చిక్కుకుపోయారు. 17 రోజులు టన్నెల్లోనే ఉండిపోయిన కార్మికులను అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. ఇదీచదవండి..బెంగళూరులో పదుల సంఖ్యలో స్కూల్స్కు బాంబు బెదిరింపులు -
ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్
ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా టన్నెల్ నుండి బయటపడిన మొత్తం 41 మంది కార్మికులను రిషికేశ్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు తరలించారు. వైద్య పరీక్షల్లో వీరంతా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారిని ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించామని ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్ మీడియాకు తెలియజేసింది. కార్మికులను క్షుణ్ణంగా పరీక్షించామని, రక్తపరీక్షలు, ఈసీజీ, ఎక్స్రే రిపోర్టులు నార్మల్గా ఉన్నాయని ఎయిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగం చైర్మన్ డాక్టర్ రవికాంత్ తెలిపారు. చార్ధామ్ యాత్ర మార్గంలో నిర్మాణంలో ఉన్న నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన ఉత్తరకాశీ టన్నెల్లో ఒక భాగం నవంబర్ 12న కూలిపోయి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ నేపధ్యంలో 17వ రోజున వారు విజయవంతంగా బయటపడ్డాడు. వెంటనే వారిని ఇంటెన్సివ్ హెల్త్ చెకప్ కోసం ఎయిమ్స్ రిషికేశ్కు చేర్చారు. డాక్టర్ రవికాంత్ మాట్లాడుతూ కార్మికులు ఇంత కాలం సొరంగంలో మగ్గిపోయారని, అందువల్ల వారికి పర్యావరణ అనుకూలత అవసరమని, ఇది కొద్ది రోజుల్లో జరుగుతుందని అన్నారు. ఇక్కడి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఇందుకోసం కార్మికుల మొబైల్ నంబర్లు తీసుకున్నట్లు తెలిపారు. కార్మికుల సొంత రాష్ట్రాలలోని వైద్య కళాశాలలు, ఆసుపత్రులకు వారికి సంబంధించిన సమాచారం అందించామన్నారు. కార్మికులు ఈరోజు లేదా రేపటిలోగా వారి ఇంటికి చేరుకుంటారని డెహ్రాడూన్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రామ్జీ శరణ్ శర్మ తెలిపారు. కాగా బాధిత కార్మికుల్లో గరిష్టంగా 15 మంది జార్ఖండ్కు చెందినవారు కాగా, ఎనిమిది మంది ఉత్తరప్రదేశ్కు చెందినవారు, ఐదుగురు ఒడిశా, బీహార్, ముగ్గురు పశ్చిమ బెంగాల్కు చెందినవారు, ఇద్దరు ఉత్తరాఖండ్, అస్సాం, ఒకరు హిమాచల్ ప్రదేశ్కు చెందినవారున్నారు. ఇది కూడా చదవండి: ఎగ్జిట్ పోల్స్పై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఏమన్నారు? -
ఉత్తర కాశీ టన్నెల్ వర్కర్స్ ఆరోగ్యంపై ఎయిమ్స్ కీలక అప్డేట్
రిషికేష్ : ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో జరిగిన టన్నెల్ ప్రమాదం నుంచి బయటపడ్డ 41 మంది కార్మికులు ఆరోగ్యపరంగా ఫిట్గా ఉన్నారని రిషికేష్ ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. వాళ్లు ఎలాంటి ఆలస్యం లేకుండా ఇళ్లకు వెళ్లిపోవచ్చని చెప్పారు. టన్నెల్ నుంచి బయటపడ్డ తర్వాత 41 మంది కార్మికులను చికిత్స నిమిత్తం రిషికేష్లోని ఎయిమ్స్కు తరలించారు. 41 మందిలో యూపీ, జార్ఖండ్, బీహార్కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ‘టన్నెల్ నుంచి బయటికి వచ్చిన కార్మికులందరికీ ఇళ్లకు వెళ్లేందుకు మెడికల్ క్లియరెన్స్ ఇచ్చాం. వారంతా వారి రాష్ట్రాల నోడల్ ఆఫీసర్లకు టచ్లో ఉంటారు. ఈ మేరకు నోడల్ అధికారులకు సమాచారమిచ్చాం’అని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. ఉత్తరకాశీలో చార్దామ్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా వద్ద నిర్మిస్తున్న టన్నెల్లో కొంత భాగం నవంబర్ 12న కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు టన్నెల్లోనే చిక్కుకుపోయి 17 రోజుల తర్వాత బయటికి వచ్చారు. ఇదీచదవండి...రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి -
అడవిలో వృద్ధుడు గల్లంతు.. 48 గంటలు గడిచాక..
అది 2023, జూలై 6.. 70 ఏళ్ల వృద్ధుడు దట్టమైన అడవిలో దారి తప్పాడు. అతనితోపాటు వచ్చినవారు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు తెలిపారు. వారు రంగంలోకి దిగి 48 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మనదేశంలోని గుజరాత్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆసక్తికర వివరాలు.. గుజరాత్లోని గిర్నార్ అడవుల ఎంతో దట్టంగా ఉంటాయి. పొరపాటున ఎవరైనా దారి తప్పారంటే ఇక అంతే సంగతులు. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లా పూప్ తాలూకాలోని కుప్రాలా గ్రామానికి చెందిన మదన్మోహన్ మురళీధర్ జైన్(72) ఈ ఏడాది జూలై 6వ తేదీన 20 మంది సభ్యుల బృందంతో పాటు జునాగఢ్లోని గిర్నార్కు విహారయాత్రకు వచ్చాడు. వారంతా గిర్నార్లోని అంబాజీ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం వారంతా అక్కడి జైన దేవాలయాన్ని సందర్శించారు. ఈ సమయంలోనే మురళీధర్.. బృంద సభ్యుల నుంచి వినిపోయాడు. ఆ సమయంలో అతనికి దాహం వేయడంతో నీటి కోసం వెదుకుతూ వెళ్లాడు. ఒకచోట ఊట నీరు తాగుతుండగా అతని కాలు జారింది. ఆ నీటిలో కొంతదూరం కొట్టుకుపోయాడు. కాస్త తేరుకుని లేచి నిలబడే సమయానికి అడవి మధ్యలోకి వచ్చేశాడు. నీటిలో కొట్టుకుపోయిన సందర్భంలో అతని పాదాలకు, తలకు ముళ్లు గుచ్చుకుని గాయాలయ్యాయి. అటువంటి దుర్భర పరిస్థితిలో మురళీధర్ తనను కాపాడమంటూ ఎనిమిది గంటల పాటు కేకలు పెట్టినా ప్రయోజనం లేకపోయింది. అతని ఆరుపులు అరణ్యరోదనగా మారాయి. కొద్దిసేపటికి మురళీధర్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి అడవి పందుల గుంపు అతనికి అతి సమీపం నుంచి వెళుతోంది. వాటిని చూసినంతనే అతనికి ప్రాణాలు పోయినంత పనయ్యింది. అయితే అవి అతనిని ఏమీ చేయకుండా విడిచిపెట్టడం విశేషం. మరోవైపు మురళీధర్ బృంద సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. 33 మంది సభ్యులు గల ఎస్డిఆర్ఎఫ్, పోలీసు, అటవీ శాఖ హోంగార్డుల బృందం అడవిలో గాలింపు చేపట్టింది. ఎట్టకేలకు 48 గంటల రెస్క్యూ ఆపరేషన్ అనంతరం వారు మురళీధర్ను గుర్తించి కాపాడారు. ఇది కూడా చదవండి: ఆ కార్మికుల ఆరోగ్యం ఎలా ఉందంటే.. -
రిషికేశ్లోని ఎయిమ్స్కు కార్మికుల తరలింపు
ఉత్తరకాశీ: సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రిషికేశ్లోని ఎయిమ్స్కు బుధవారం తరలించారు. అక్కడ కార్మికులకు అన్ని రకాల మెడికల్ చెకప్లను నిర్వహించనున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ చినూక్ హెలికాఫ్టర్లో 41 మంది కార్మికులను రిషికేశ్కు తరలించారు. గత 17 రోజులుగా సొరంగంలోనే చిక్కుకున్న నేపథ్యంలో కార్మికులకు ఏమైనా ఇన్ఫెక్షన్లు సోకాయా? అని వైద్యులు పరీక్షించనున్నారు. #WATCH | Uttarkashi tunnel rescue | IAF's transport aircraft Chinook, carrying 41 rescued workers, arrives in Rishikesh. It has been flown to AIIMS Rishikesh from Chinyalisaur for the workers' further medical examination.#Uttarakhand pic.twitter.com/hrWm1dlxsM — ANI (@ANI) November 29, 2023 కార్మికులను సొరంగం నుంచి రక్షించిన తర్వాత స్థానికంగా ఉన్న చిన్యాలిసౌర్ ఆస్పత్రికి కార్మికులను తరలించారు. బుధవారం తెల్లవారుజామున, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా కార్మికులను కలిశారు. కార్మికులంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. తదుపరి పరీక్షల కోసం ఎయిమ్స్కు తరలిస్తామని వెల్లడించారు. #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami meets and enquires about the health of rescued tunnel workers at Chinyalisaur Community Health Centre, also hands over relief cheques to them pic.twitter.com/fAT6OsF4DU — ANI (@ANI) November 29, 2023 కార్మికులను రక్షించడానికి కీలక సహాయం అందించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులను కూడా పుష్కర్ సింగ్ ధామీ కలిశారు. వారికి ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ప్రోత్సాహకం కింద ఒక్కొక్కరికి రూ.50 వేలు ఆర్దిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం కార్మికుల కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. #WATCH | Matli: Uttarakhand CM Pushkar Singh Dhami meets the ITBP personnel involved in the Uttarkashi Silkyara tunnel rescue. pic.twitter.com/tVlklz4FOl — ANI (@ANI) November 29, 2023 నవంబర్ 12న ఉత్తకాశీలోని సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 17 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ పనులు జరిగాయి. అయితే.. ర్యాట్ హోల్ కార్మికుల సాహస చర్యల అనంతరం బాధిత కార్మికులు మంగళవారం క్షేమంగా బయటపడ్డారు. ఇదీ చదవండి:41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ -
41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ
ఢిల్లీ: సిల్క్యారా సొరంగంలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన 41 మంది కార్మికులతో ప్రధాని మోదీ ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధానికి తమ అనుభవాలను కార్మికులు తెలియజేశారు. తొలిత బయపడ్డాం.. కానీ నమ్మకం కోల్పోలేదని కార్మికులు తెలిపారు. ప్రభుత్వం కాపాడుతుందనే భరోసా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్న కార్మికులనే కాపాడారని గుర్తుచేశారు. సహాయక చర్యలు పూర్తైన తర్వాత ప్రధాని మోదీ కూలీలందరితో ఫోన్లో మాట్లాడి వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. యోగా, మార్నింగ్ వాక్తోనే తమలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకున్నట్లు ఈ సందర్భంగా ఓ కూలీ ప్రధానికి తెలిపారు. మేం సొరంగంలో చిక్కుకుపోయినా చాలా ధైర్యంగా ఉన్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న భారతీయులనే కాపాడింది... దేశంలో ఉన్న మమ్మల్ని కచ్చితంగా కాపాడగలదన్న భరోసాతో ఆందోళన చెందలేదని వెల్లడించారు. ఈ 17 రోజులు మేమంతా కలిసిమెలిసి ఉన్నామని తెలిపిన కూలీలు.. యోగా, మార్నింగ్ వాక్ వంటివి చేసి మాలోని స్థైర్యాన్ని పెంచుకున్నామని ప్రధానితో అన్నారు. సొరంగంలో చిక్కుకోగానే మొదట 10-15 గంటలు భయపడ్డామని కూలీలు తెలిపారు. శ్వాసతీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగిందని తెలిపారు. కానీ అధికారులు తాము చిక్కుకున్న ప్రదేశాన్ని గుర్తించి ఓ పైపును పంపించారని వెల్లడించారు. దాని ద్వారా ఆహారం పంపించారని పేర్కొన్నారు. ఓ మైక్ను కూడా అమర్చడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగామని ప్రధానితో చెప్పారు. మోదీ భావోద్వేగం.. ఉత్తరాఖండ్లో చిక్కుకున్న కార్మికులను వెలికితీసిన సాహసకృత్యాన్ని టెలివిజన్లో ప్రధాని నరేంద్ర మోదీ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం రాత్రి కేబినెట్ భేటీ జరిగిన క్రమంలో మంత్రులతో కలిసి సిల్క్యారా సొరంగంలో కార్మికుల వెలికితీతను వీక్షించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కేబినెట్ సమావేశం జరిగిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలిపారు. ఈ సందర్భంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా బయటపడటంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఒకానొక దశలో మోదీ భావోద్వేగానికి లోనయ్యారని వెల్లడించారు. నవంబర్ 12న ఉత్తకాశీలోని సిల్క్యారా సొరంగం కూలిన ఘటనలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకురావడానికి గత 17 రోజులుగా నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ పనులు జరిగాయి. అయితే.. ర్యాట్ హోల్ కార్మికుల సాహస చర్యల అనంతరం బాధిత కార్మికులు మంగళవారం క్షేమంగా బయటపడ్డారు. సొరంగం నుంచి బయటకు తీసుకురాగానే బాధిత కార్మికులను రిషికేశ్లోని ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కార్మికులంతా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇదీ చదవండి: Uttarkashi Tunnel Collapse: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే.. -
ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే..
ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటకు వచ్చారు. వీరిని బయటకు తీసుకురావడంలో ర్యాట్ మైనర్ల బృందం విజయం సాధించింది. ఉత్తరకాశీ సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులలో ఒకరైన సుబోధ్ కుమార్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ‘తాము టన్నెల్లో ఆహారం కోసం అలమటించిపోయామని, గాలి ఆడక ఇబ్బంది పడ్డామన్నారు. తరువాత అధికారులు పైపుల ద్వారా ఆహార పదార్థాలను పంపించారన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి అనారోగ్య సమస్య లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కఠోర శ్రమ కారణంగానే తాను బయటపడగలిగానని’ తెలిపారు. మరో కార్మికుడు విశ్వజీత్ కుమార్ వర్మ మాట్లాడుతూ ‘తాము సొరంగంలో చిక్కుకున్నామని తెలుసుకున్నామని, బయట అధికారులు తమను బయటకు తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నించారు. మాకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్తో పాటు ఆహారం అందించారు. మేము టన్నెల్లో చిక్కుకున్న మొదటి 10 నుంచి 15 గంటలు సమస్యలను ఎదుర్కొన్నాం. తరువాత ఆహారాన్ని పైపుల ద్వారా అందించారు. అనంతరం మైకు అమర్చి, కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. ఇప్పుడు తామంతా సంతోషంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. నవంబర్ 12వ తేదీ తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో సొరంగంలో ప్రమాదం జరిగి 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. తరువాత వారికి అధికారులు ఒక పైపు ద్వారా మందులు, డ్రై ఫ్రూట్స్ పంపించారు. నవంబర్ 20న ఆరు అంగుళాల పైపును సొరంగంలోనికి పంపి కిచ్డీతో పాటు అరటిపండ్లు, నారింజ, డ్రైఫ్రూట్స్, బ్రెడ్, బ్రష్లు, టూత్పేస్టులు, మందులు, అవసరమైన దుస్తులను వారికి పంపించారు. ఎట్టకేలకు 17 రోజుల అనంతరం కార్మికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఇది కూడా చదవండి: సొరంగం నుంచి వచ్చిన కుమారుడుని చూడకుండానే తండ్రి మృతి -
ఇప్పుడు దీపావళి చేసుకుంటాం: ఉత్తరకాశీ కార్మికులు
ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆ కార్మికులలో యూపీలోని మీర్జాపూర్ నివాసి అఖిలేష్ కుమార్ ఒకరు. ఈయన బయటకు వస్తున్నాడని తెలియగానే అతని కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయటపడాలని కోరుకుంటూ గత 17 రోజులుగా పలు ప్రాంతాల్లో పూజలు నిర్వహించారు. ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం కార్మికులందరినీ సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చారు. కార్మికులంతా బయటకు వస్తున్నారని తెలియగానే అఖిలేష్ కుటుంబం సంతోషంలో మునిగితేలింది. ఈ సందర్భంగా అఖిలేష్ తల్లి మీడియాతో మాట్లాడుతూ ‘ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు.. మేము పగలు, రాత్రి దేవుణ్ణి ప్రార్థించాం. భగవంతుడా నా కుమారుడు బయటపడేలా చూడు అని వేడుకున్నాం’ అని తెలిపారు. కాగా ఆమె తన కుమారుడు సొరంగం నుంచి బయటపడిన సంతోషంలో ఇంటి చుట్టుపక్కల వారికి స్వీట్లు పంచారు. తన కుమారునికి పునర్జన్మ లభించిందని ఆమె కనిపించిన అందరికీ చెబుతున్నారు. ఈరోజు ఇంటిలో సంతోషకరమైన వాతావరణం నెలకొందని అఖిలేష్ తండ్రి మీడియాకు తెలిపారు. ‘గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు కరుణించి మా పిల్లలను బయటకు పంపించాడు. ఈ ప్రమాదం కారణంగా మా ఇంటిలో దీపావళి బోసిపోయింది. ఇప్పుడు మేము ఇంటిలో దీపావళి చేసుకుంటాం. క్రాకర్లు పేల్చి, స్వీట్లు పంచుకుంటాం’ అని ఆనందంగా తెలిపారు. మంగళవారం సాయంత్రం 7.50 గంటల ప్రాంతంలో మొదటి కార్మికుడిని సొరంగం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఆ తరువాత కార్మికులంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. కార్మికులందరూ పూర్తి ఆరోగ్యంతొ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కార్యకలాపాలను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కేంద్ర మంత్రి బికె సింగ్ పర్యవేక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కార్మికులతో ఫోన్లో సంభాషించారు. ఇది కూడా చదవండి: టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్ సంస్థ -
టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్ సంస్థ
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీనిలో హైదరాబాద్కు చెందిన బోరోలెక్స్ ఇండ్రస్ట్రీస్ కీలకపాత్ర పోషించింది. ఉత్తరాఖండ్లో రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్న సీనియర్ అధికారులు నవంబర్ 25న హైదరాబాద్లోని డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డిని సంప్రదించారు. టన్నెల్లో చిక్కుకున్న అగర్ డ్రిల్లింగ్ యంత్రాన్ని కట్ చేసే విషయమై సలహా అందించాలని వారు డాక్టర్ సతీష్ రెడ్డిని కోరారు. ఈ నేపధ్యంలో ఆయన ఇందుకు ఉపయోగపడే పరికరాల కోసం స్థానిక పరిశ్రమలను సంప్రదించారు. ఈ తరుణంలో బెరోలెక్స్ ఇండస్ట్రీస్కు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఇందుకు ప్లాస్మా ఆధారిత కట్టింగ్ను సూచించారు. తరువాత 800 ఎం.ఎం. పైపులైన్ వ్యాసం కంటే తక్కువ వ్యాసం కలిగిన యంత్రాల కోసం పలువురిని సంప్రదించాడు. ఒక పరిశ్రమలో అలాంటి రెండు యంత్రాలు ఉన్నాయని ఆయన తెలుసుకున్నారు. ఆ యంత్రాలను, ఇద్దరు కట్టింగ్ నిపుణులను ప్రభుత్వం ప్రత్యేక విమానంలో సంఘటనా స్థలానికి తరలించింది. వారు నవంబరు 25న బేగంపేట విమానాశ్రయం నుండి డెహ్రాడూన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సంఘటనా స్థలానికి వెళ్లారు. కొద్ది గంటల సమయంలోనే టన్నెల్లో అడ్డుపడిన అగర్ యంత్రం బ్లేడ్లను కట్ చేసే పని మొదలు పెట్టారు. తద్వారా ఇతర యంత్రాల ద్వారా డ్రిల్లింగ్కు అనువైన పరిస్థితులు కల్పించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వ సీనియర్ అధికారులు భాస్కర్ కుల్బే తదితరులు టన్నెల్ సహాయక చర్యల్లో చేయూతనందించిన బెరోలెక్స్ ఇండస్ట్రీస్కు చెందిన శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. 41 మంది సురక్షితం -
నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్ సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ దాదాపు పూర్తయింది. టన్నెల్లో అమర్చిన పైప్లైన్ ద్వారా రెస్క్యూ బృందం వారిని బయటకు తీసుకురానుంది. దాదాపు 17 రోజుల పాటు టన్నెల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులు బయటకు వస్తున్నారు. వారంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ దేవుని ముందు ప్రణమిల్లి ప్రార్థించారు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్. నవంబర్ 12న ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ రంగంలోకి దిగారు. రెస్క్యూ బృందం ప్రయత్నాలు ఫలించి బాధితులు బయటపడుతున్న వేళ ఆర్నాల్డ్ డిక్స్ మంగళవారం టన్నెల్ సైట్ సమీపంలోని చిన్న దేవాలయం వద్ద కార్మికుల క్షేమం కోసం అర్చకులతో కలిసి పూజలు చేశారు. దేవుని ముందు ప్రణమిల్లి ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా మారింది. While long awaited breakthrough in #Uttarkashi tunnel operation is achieved, visual of Prof. Arnold Dix, international tunnelling expert, bowing and praying before temple near the site is so heartwarming. Prayers for safety of all the trapped workers. pic.twitter.com/CcrkeEZZ9i — Arun Bothra 🇮🇳 (@arunbothra) November 28, 2023 -
ఉత్తరకాశీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్ సాగిందిలా..?
ఉత్తరకాశీ: ఉత్తర కాశీ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీయడానికి 17 రోజులుగా జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు విజయవంతం అయింది. 41 మందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 800 మిల్లీమీటర్ల పైపు గుండా కార్మికులను బయటకు తీసుకురావడానికి ర్యాట్ హోల్ మైనింగ్ కార్మికులు మట్టి తొలగింపు పనులను పూర్తి చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టు వదలకుండా రెస్క్యూ అపరేషన్ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇన్ని రోజుల నుంచి రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగిందంటే..? సొరంగం కూలింది ఇక్కడ ? సిల్క్యారా బెండ్ నుంచి మొదలుపెట్టి బార్కోట్ వరకు కొండ కింద 4.531 కి.మీ.ల మేర సొరంగం తవ్వుతున్నారు. సిల్క్యారా వైపు నుంచి 2.340 కి.మీ.ల మేర సొరంగం తవ్వకం, అంతర్గత నిర్మాణం పూర్తయింది. సొరంగం ముఖద్వారం నుంచి దాదాపు 205–260 మీటర్ల మార్క్ వద్ద దాదాపు 57 మీటర్ల పొడవునా సొరంగం కూలింది. అదే సమయంలో సొరంగం లోపలి వైపుగా 41 మంది కార్మికులు పనిలో ఉన్నారు. అంటే దాదాపు రెండు కిలోమీటర్ల మేర విశాలమైన ప్రాంతంలో కార్మికులు చిక్కుకుపోయారు. 57 మీటర్ల వెడల్పుమేర శిథిలాలున్నాయి. ఇంతే వెడల్పున శిథిలాల గుండా పైపును జొప్పించి వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. చిక్కుకున్న కార్మికులకు ఆహారం ఇలా.. డ్రిల్లింగ్ సమయంలో రాళ్లు కూలడం వంటి కారణాలతో కార్మికులను రక్షించడం సవాలుగా మారింది. దీంతో చిన్న చిన్న పైపుల ద్వారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులకు ఆహారం, నీరు, మెడిసిన్ అందించారు. దీంతో సొరంగంలో కార్మికులు ప్రాణాలతో ఉండగలిగారు. స్టీల్ పైపు ద్వారా చిన్న కెమెరాను లొపలికి పంపించి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ముఖాలను కూడా చూశారు. లోపలికి ల్యాండ్లైన్.. ఆహారం నీరు అందడంతో కార్మికులు క్షేమంగా ఉన్నారు. అయితే లోపల ఉన్న కార్మికుల మానసిక స్తైర్థ్యం దెబ్బతినకుండా ఉండేందుకు సహాయకంగా లూడో వంటి బోర్డ్ ఆట వస్తువులతోపాటు మొబైల్ ఫోన్లను పంపించారు. నిరంతరం మాట్లాడేందుకు వీలుగా ‘ల్యాండ్లైన్’ను పంపారు. ఘటనాస్థలిలో టెలిఫోన్ ఎక్స్ఛెంజ్ను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటుచేసింది. అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఎండోస్కోపిక్ కెమెరాను వాడారు. అనుకోని అవాంతరాలు.. సొరంగంలో మొదట సమాంతరంగా డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. కానీ ఇంకొన్ని మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకునేలోపే అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్ మెషీన్ అమర్చిన ‘వేదిక’కు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్ను ఆపేశారు. బిగించిన వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్ మెషీన్ అటుఇటూ కదులుతూ కచ్చితమైన దిశలో డ్రిల్లింగ్ సాధ్యపడదు. అప్పుడు అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందు జాగ్రత్తగా డ్రిల్లింగ్ను ఆపేశారు. Uttarakhand Tunnel Rescue:ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు వాతావరణం కూడా అడ్డంకిగా మారి.. ఉత్తరాఖండ్లో అధ్వాన్నంగా తయారైన వాతావరణం రెస్క్యూ ఆపరేషన్కు కొత్త సమస్యలను సృష్టిచింది. వర్షాలు, వడగళ్ల వాన కురిసి రెస్క్యూ ఆపరేషన్పై ప్రభావం పడింది. సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను పరిశీలించిన ప్రధాని మోదీ ప్రత్యేక కార్యదర్శి పీకే మిశ్రా, హోంశాఖ కార్యదర్శి అజయ్ కే భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధులు రెస్క్యూ సిబ్బందికి ప్రోత్సాహాన్ని అందించారు. రెస్క్యూ ఆపరేషన్కు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ కూడా తన బృందంతో ఆపరేషన్లో పాల్గొన్నారు. కొండపై నుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్.. సమాంతరంగా అవాంతరాలు ఎదురవడంతో సొరంగంలో కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు మరో ప్రణాళికను పట్టాలెక్కించాయి. శిథిలాల గుండా సమాంతరంగా చేసిన డ్రిల్లింగ్ పనులను పక్కనబెట్టేశారు. కొండ పై నుంచి నిట్టనిలువుగా 86 మీటర్ల డ్రిల్లింగ్ పనులను మొదలు పెట్టారు. ఈ క్రమంలో డ్రిల్లింగ్ కోసం అమెరికా నుంచి అధునాతన ఆగర్ మెషీన్ను ఉపయోగించారు. 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మొదలుపెట్టారు. కానీ శిథిలాల్లో ఉన్న ఇనుప కడ్డీలు డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను నాశనం చేయడంతో మళ్లీ ఆటంకం ఏర్పడింది. సొరంగం అంతర్గత నిర్మాణంలో వాడిన ఇనుప కడ్డీలు సొరంగం కూలాక శిథిలాల్లో చిందరవందరగా పడి ఆగర్ మెషీన్ ముందుకు కదలకుండా అడ్డుపడ్డాయి. దీంతో డ్రిల్లింగ్ వేళ మెషీన్ బ్లేడ్లన్నీ ధ్వంసమయ్యాయి. దీంతో మ్యాన్యువల్ పద్దతిని ఎంచుకున్నారు. చివరికి మాన్యువల్గానే డ్రిల్లింగ్.. డ్రిల్లింగ్ మిషన్ ధ్వంసం కావడంతో సాధారణంగా మనుషులతోనే తవ్వాల్సి వచ్చింది. మాన్యువల్ డ్రిల్లింగ్లో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే తవ్వడానికి వెళ్లేందుకు అవకాశం ఉంది. దీనికితోడు ఆ వ్యక్తి తనతో పాటు ఆక్సిజన్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆక్సిజన్ కూడా ఒక గంట మాత్రమే ఉంటుంది. అంటే గంటకోసారి తవ్వే వ్యక్తిని మార్చాల్సి ఉంటుంది. దీంతో తవ్వే వేగం తగ్గింది. దాదాపు 57 మీటర్ల మేర సొరంగం కూలింది. ఇందులో 47 మీటర్ల వరకు శిథిలాల గుండా ఆగర్ మెషీన్తో డ్రిల్లింగ్ చేశారు. కూలినభాగంలోని కాంక్రీట్ నిర్మాణ రాడ్లు.. డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను ముక్కలుచేశాయి. దాంతో మెషీన్ను వెనక్కి లాగారు. కానీ మెషీన్ విరిగిపోయి ముక్కలు లోపలే ఉండిపోయాయి. ప్లాస్మా, గ్యాస్ కట్టర్లతో ముక్కలను విడివిడిగా కట్చేసి బయటకు తీశారు. ముక్కలన్నీ తీసేశాక అదే మార్గంలో దూరి కార్మికులు మ్యాన్యువల్గా రంధ్రం చేశారు. భారత సైన్యంలోని మద్రాస్ యూనిట్ ఇంజనీర్లు, ట్రెంచ్లెస్ ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త బృందం మ్యాన్యువల్గా తవ్వడంలో సహాయం చేసింది. ఇందుకు ర్యాట్-హోల్ పద్దతిని ఉపయోగించారు. Uttarakhand Tunnel Collapse: ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు రంగంలోకి ‘ర్యాట్–హోల్’ మైనింగ్ కార్మికులు ఈ పని పూర్తిచేసేందుకు ‘ర్యాట్–హోల్’ మైనింగ్లో సిద్ధహస్తులైన కార్మికులను రప్పించారు. వీరు 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న పైపు గుండా లోపలికి దూరి శిథిలాలకు రంధ్రం చేస్తూ ముందుకు కదిలారు. ఇలా 12 మీటర్ల మేర డిల్లింగ్ చేయాలి. యూపీలోని ఝాన్సీకి చెందిన కార్మికులు ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఝాన్సీకి చెందిన పర్సాదీ లోధీ, విపిన్ రాజ్పుత్ తదితరులను ఈ పనికి పురమాయించారు. ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ప్రస్తుత ఘటనలో పదేళ్లుగా ఈ వృత్తిలో అనుభవం ఉన్న కార్మికులను రంగంలోకి దించారు. అయితే.. బొగ్గును వెలికితీయడం కాకుండా కార్మికులను కాపాడేందుకు ఈ పద్దతిలో పనిచేయడం ఇదే తొలిసారి. 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేసిన అనుభవం ఉన్నట్లు పేర్కొన్న కార్మికులు.. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేశారు. ఇదీ చదవండి: Uttarkashi tunnel: నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ -
ఉత్తరాఖండ్: రెస్క్యూ ఆపరేషన్కు ఎడతెగని ఆటంకాలు!
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 17 రోజులు దాటుతున్నా విముక్తి లభించలేదు. వారిని చేరుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మొదట డ్రిల్లింగ్ కోసం అమెరికా నుంచి తెచ్చిన యంత్రం చెడిపోయింది. ఇప్పుడు ప్రతికూల వాతావరణం కొత్త ఇబ్బందులను సృష్టిస్తోంది. ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను చేరుకోవడానికి అమెరికన్ ఆగర్ మెషిన్ చెడిపోవడంతో ప్రస్తుతం మాన్యువల్ డ్రిల్లింగ్ జరుగుతోంది. 86 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 36 మీటర్ల మేరకు తవ్వగలిగారు. అమెరికా నుంచి తీసుకువచ్చిన డ్రిల్లింగ్ మిషన్ బ్లేడ్లు.. బాధిత కార్మికులున్న ప్రదేశానికి 12 మీటర్ల ముందుగానే విరిగిపోయాయి. ఫలితంగా రెస్క్యూ ఆపరేషన్ను మధ్యలోనే ఆపివేసి, బ్లేడ్లను తొలగించాల్సివచ్చింది. ఉత్తరాఖండ్లో ప్రస్తుతం అధ్వాన్నంగా తయారైన వాతావరణం రెస్క్యూ ఆపరేషన్కు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని వల్ల రెస్క్యూకు సమస్యలు తలెత్తవచ్చని అధికారులు భావిస్తున్నారు. సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను పరిశీలించేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక కార్యదర్శి పీకే మిశ్రా, హోంశాఖ కార్యదర్శి అజయ్ కే భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్ఎస్ సంధు సంఘటనా స్థలానికి వచ్చారు. సొరంగంలో వర్టికల్ డ్రిల్లింగ్ శరవేగంగా జరుగుతోందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మహమూద్ అహ్మద్ తెలిపారు. ఇప్పటి వరకు 36 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ చేశారు. కార్మికులలో నిరాశానిస్పృహలు నెలకొన్న దృష్ట్యా, ఐదుగురు వైద్యుల బృందం సంఘటనా స్థలంలో ఉంటోంది. వారు సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో మాట్లాడుతూ వారికి భరోసా కల్పిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నామని, వారు కుటుంబ సభ్యులతో మాట్లాడేలా చూస్తున్నామని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ తెలిపారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు త్వరగా బయటకు రావాలని కాంక్షిస్తూ స్థానికులు సొరంగం దగ్గర హోమాలు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం! -
‘సొరంగ బాధితులు బయటకు రావాలంటే మరి కొన్ని వారాలు నిరీక్షించాల్సిందే(
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో కుప్పకూలిన సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు బయటకు రావాలంటే క్రిస్మస్ వరకు సమయం పడుతుందని తెలుస్తోంది. 800 ఎంఎం ఇనుప పైపును డ్రిల్లింగ్ చేసి, ఇన్సర్ట్ చేస్తున్న ఆగర్ మిషన్ బ్లేడ్లు శనివారం శిథిలాలలో చిక్కుకున్నాయి. దీంతో యంత్రం ధ్వంసమైంది. ఫలితంగా సొరంగానికి పైనుంచి తవ్వకాలు జరిపి, బాధితులను చేరుకునే మార్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కారణంగా కార్మికులను రక్షించడానికి కొన్ని వారాలు పట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డిఎంఎ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ మాట్లాడుతూ ఈ ఆపరేషన్కు చాలా సమయం పట్టవచ్చని అన్నారు. సంఘటనా స్థలం వద్ద ఉన్న అంతర్జాతీయ సొరంగ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ మాట్లాడుతూ క్రిస్మస్ నాటికి బాధిత కార్మికులను బయటకు తీసుకురాగలుగుతామని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మాన్యువల్ డ్రిల్లింగ్లో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే తవ్వడానికి వెళ్లేందుకు అవకాశం ఉంది. దీనికితోడు ఆ వ్యక్తి తనతో పాటు ఆక్సిజన్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ ఆక్సిజన్ కూడా ఒక గంట మాత్రమే ఉంటుంది. అంటే గంటకోసారి తవ్వే వ్యక్తిని మార్చాల్సి ఉంటుంది. దీంతో తవ్వే వేగం తగ్గుతుంది. అంతర్జాతీయ నిపుణుడు డిక్స్.. ఆగర్ యంత్రం పగిలిపోయిందని చెప్పడంతో సొరంగంలో ఇరుక్కుపోయిన ఆగర్ యంత్రం భాగాన్ని తొలగించేందుకు హైదరాబాద్ నుంచి ప్లాస్మా కట్టర్ను విమానంలో తీసుకువచ్చారు. ఆగర్ యంత్రం భాగాలను తొలగించిన అనంతరం మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: రాజస్థాన్ రాజకీయాలను శాసిస్తున్న ఓటింగ్ శాతం -
ఉత్తరకాశీలో రెస్క్యూ ఆపరేషన్కు మరో ఆటంకం?
ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంతాలలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరాఖండ్లో రాబోయే మూడు రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. దీంతో అక్కడి సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై ప్రభావం పడనుంది. మరోవైపు జమ్మూకశ్మీర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతోంది. శ్రీనగర్తో పాటు ప్రదేశాలలో కనిష్ట ఉష్ణోగ్రత గడ్డకట్టే స్థాయి కంటే తక్కువగా ఉంది. హిమాచల్లో ఆదివారం నుంచి వర్షం, మంచు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 26 నుండి ఉత్తరాఖండ్తో పాటు హిమాలయ ప్రాంతంలో మంచు కురవనుందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ బిక్రమ్ సింగ్ తెలిపారు. ఫలితంగా పర్వత ప్రాంతాలు మేఘావృతమై ఉంటాయి. సోమవారం ఉత్తరకాశీ, చమోలి, రుద్రప్రయాగ, పితోరాఘర్తో సహా 3500 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశాలు ఉన్నాయి. పహల్గామ్ కాశ్మీర్లోని అతి శీతల ప్రాంతం. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత -3.4 డిగ్రీల సెల్సియస్, శ్రీనగర్, గుల్మార్గ్లలో -1.0 డిగ్రీల సెల్సియస్. ప్రస్తుత శీతాకాలంలో శ్రీనగర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయి కంటే దిగువకు వెళ్లడం ఇది రెండోసారి. జమ్మూలో కూడా తేలికపాటి సూర్యరశ్మి ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చాలా చలిగా ఉంటుంది. పగటిపూట కాస్త ఉపశమనం కలుగుతోంది. రానున్న 24 గంటల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో 25 స్వైన్ కేసులు -
సొరంగం పైనుంచి రెస్క్యూ ఆపరేషన్?
ఉత్తరాఖండ్లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం లోపల నుంచి డ్రిల్లింగ్ పనులు సాగుతున్నా, ఆటంకాలు తలెత్తుతుండటంతో సొరంగం పైనుంచి కూడా డ్రిల్లింగ్ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని జియోఫిజికల్ నిపుణులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన నివేదికను నిపుణులు నేషనల్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్డీసీఎల్)కి సమర్పించారు. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు గత 13 రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగం లోపల నుండి బాధిత కార్మికులను చేరేందుకు మార్గం ఏర్పడని పక్షంలో సొరంగం పైనుండి కూడా డ్రిల్ చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకు కసరత్తు ప్రారంభించారు. డ్రిల్లింగ్ చేయాల్సిన స్థలాన్ని ఎంపిక చేశారు. దీనిని జియోఫిజికల్ నిపుణులు పరిశీలించారు. ఈ సందర్భంగా పార్సన్ కంపెనీకి చెందిన జియోఫిజికల్ నిపుణుడు బి భాస్కర్ మాట్లాడుతూ. ఆ స్థలాన్ని పరిశీలించామని, డ్రిల్కు ఆ ప్రాంతంలో ఎలాంటి నీటి వనరులు అడ్డురావని తేలిందన్నారు. కాగా డ్రిల్లింగ్ సమయంలో ఏదైనా నీటి వనరు అడ్డుపడితే మొత్తం ఆపరేషన్తో పాటు 41 మంది కూలీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇతర ఎంపికలలో భాగంగా సొరంగం పై నుండి డ్రిల్ చేయడానికి అతిపెద్ద డ్రిల్ యంత్రాన్ని సిద్ధం చేశారు. ఇది వివిధ భాగాలుగా తీసుకువచ్చారు. తరువాత దానిని అనుసంధానించారు. ఇతర డ్రిల్ యంత్రాలను కూడా ఇక్కడకు తీసుకువచ్చారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు -
‘ఉత్తర కాశీ’ ఆపరేషన్లో స్వల్ప ఆటంకం!
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు చివరి దశకు చేరాయి. నవంబర్ 12న ఈ ప్రమాదం జరిగింది. నేడు గురువారం ఉదయం 8 గంటలకే కార్మికులను బయటకు తీసుకురావాల్సి ఉండగా, తవ్వకాల సమయంలో శిథిలాలు అడ్డు రావడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది. రెస్క్యూ ఆపరేషన్లో ఉపయోగిస్తున్న భారీ యంత్రాలు, కంప్రెసర్ యంత్రాల యజమాని శైలేష్ గులాటీ మీడియాతో మాట్లాడారు. కార్మికుల దగ్గరకు చేరేందుకు చేస్తున్న తవ్వకాల్లో ఐదారు మీటర్ల మేరకు తవ్వాల్సి ఉండగా, ఇనుప శిధిలాలు అడ్డుపడటంతో పనులను ఆపాల్సి వచ్చిందన్నారు. శిథిలాలలో ఇనుప పైపులు, రాడ్లు ఉన్నాయన్నాయన్నారు. వీటిని తొలగించి, కార్మికుల దగ్గరకు చేరుకునేందుకు సాంకేతిక సాయాన్ని అందించేందుకు ఢిల్లీ నుంచి నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. వారి రాకతో సహాయక చర్యలు మరింత ముమ్మరం అయ్యాయి. లోపల చిక్కుకున్న కార్మికులతో మాట్లాడుతున్నామని, ఆహారం అందించడానికి అమర్చిన పైపు ద్వారానే సంభాషణ జరుగుతున్నదని శైలేష్ గులాటీ తెలిపారు. కూలీలకు పూర్తిస్థాయిలో ఆహారం అందిస్తున్నామని, ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ మాత్రమే పంపించామని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్ -
సొరంగ బాధితులకు భారీ ఉపశమనం.. రెండు రోజుల్లో బయటకు..
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గల సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ వేగంగా జరుగుతోంది. ఆరు అంగుళాల పైప్లైన్ ద్వారా కూలీలకు ఆహార పదార్థాలు, మందులను పంపిణీ చేస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న బాధితులకు లోపల రెండు కిలోమీటర్ల మేర సురక్షిత ప్రాంతం ఉంది. మరో రెండు రోజుల్లో కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువస్తామని రెస్క్యూ నిర్వహిస్తున్న అధికారులు చెబుతున్నారు. బార్కోట్ ఎండ్ నుండి రెస్క్యూ టన్నెల్ నిర్మాణాన్ని టీహెచ్డీసీ ప్రారంభించిందని, ఇందులో ఇప్పటికే రెండు పేలుళ్లు జరిగాయని, ఫలితంగా 6.4 మీటర్ల డ్రిఫ్ట్ ఏర్పడిందని జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఐడిసిఎల్) ఎండీ మహమూద్ అహ్మద్ తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో సంప్రదింపులు జరిపామని, వీడియో ద్వారా వారి పరిస్థితిని తెలుసుకున్నామని ఆయన పేర్కొన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ లక్ష్యమని ఉత్తరాఖండ్ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ నీరజ్ ఖైర్వాల్ తెలిపారు. అన్ని ఏజెన్సీలు 24 గంటలు సంఘటనా స్థలంలో పని చేస్తున్నాయన్నారు. పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయని, రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న అన్ని సంస్థలు/ఏజెన్సీలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నాయని వివరించారు. పది కిలోల కిలోల యాపిల్స్, ఆరెంజ్, సీజనల్ పండ్లు, ఐదు డజన్ల అరటిపండ్లను సొరంగం లోపలికి పంపించామన్నారు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితుల ఫొటోలను ఎండోస్కోపిక్ కెమెరా ఎలా తీసింది? -
హిమాచల్లోనూ సొరంగ ప్రమాదం.. ఎప్పుడంటే..
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి 41 మంది కూలీలు చిక్కుకున్నారు. కార్మికులంతా క్షేమంగా ఉండడం, 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్లో కార్మికులందరి ఫొటోలు బయటకు రావడం కాస్త ఊరట కలిగించింది. కాగా హిమాచల్ప్రదేశ్లో తొమ్మది ఏళ్ల క్రితం కూడా ఇటాంటి సొరంగ ప్రమాదమే చోటు చేసుకుంది. నాటి ప్రమాదంలో ఇద్దరు కూలీలు సజీవంగా బయటపడ్డారు. ఒక కూలీ మృతి చెందాడు. సొరంగంలో చిక్కుకున్న ఈ కూలీలు పది రోజుల పాటు ఆహారపానీయలు లేకుండా దయనీయ స్థితిలో కాలం గడిపారు. హిమాచల్ ప్రదేశ్లోని కిరాత్పూర్-మనాలి దగ్గరున్న సొరంగంలో 2015, సెప్టెంబరు 15న ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్లో మాదిరిగానే నాడు ఈ సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు. మొదట ఎంత మంది కార్మికులు లోపల చిక్కుకున్నారో తెలియరాలేదు. నాడు దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అప్పటి డీసీ మాన్సీ సహాయ్ నేతృత్వంలో జరిగింది. ఆయన ప్రస్తుతం హిమాచల్లో లేబర్ కమిషనర్గా ఉన్నారు. నాడు కిరాత్పూర్-మనాలి దగ్గరున్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు 211 గంటల 47 నిమిషాల సమయం పట్టింది. 42 మీటర్ల మేర సొరంగంలో డ్రిల్లింగ్ చేసిన అనంతరం రెస్క్యూ టీం ఇద్దరు కార్మికులను క్షేమంగా బయటకు తీసుకువచ్చింది. ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల! -
ఉత్తరకాశీకి అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందాలు
ఉత్తరకాశీ: నిర్మాణంలో ఉన్న సొరంగం కాస్తా కుప్పకూలడంతో అందులో తొమ్మిది రోజులుగా చిక్కుకుపోయిన కూలీలను రక్షించేందుకు ఇప్పుడు అంతర్జాతీయ బృందం ఒకటి సిద్ధమైంది. ఉత్తరకాశీలోని ఈ సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఇప్పటివరకూ జరిగిన అనేకానేక ప్రయత్నాలు విజయవంతం కాలేదు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టన్నెల్ రెస్క్యూ బృందం రంగంలోకి దిగింది. కూలీల వెలికితీతకు జరుగుతున్న ప్రయత్నాలను పర్యవేక్షించేందుకు ఇంటర్నేషనల్ టన్నెలింగ్, అండర్గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ సొరంగం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue operation | International Tunneling Expert, Arnold Dix says "We are going to get those men out. Great work is being done here. Our whole team is here and we are going to find a solution and get them out. A lot of work is being done… https://t.co/ta5cXfBRyv pic.twitter.com/Mfwkxu5UbJ — ANI (@ANI) November 20, 2023 'చిక్కుకుపోయినవారిని బయటకు తీసుకొస్తాం. పనులు బాగా జరుగుతున్నాయి. మా బృందం మొత్తం ఇక్కడే ఉంది. సమస్యకు ఏదో ఒక పరిష్కారం కచ్చితంగా కనుక్కుంటాం. ప్రస్తుతం ఇక్కడ చాలా పనులు జరుగుతున్నాయి. క్రమపద్ధతిలో పని చేసుకుపోతున్నారు. బాధితులకు ఆహారం, మందులు సరియైన విధంగా అందిస్తున్నారు' అని ఆర్నాల్డ్ డిక్స్ చెప్పారు. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడిసిఎల్) ఆధ్వర్యంలో ఈ సొరంగం నిర్మాణం జరుగుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చార్ ధామ్ ఆల్-వెదర్ రోడ్ ప్రాజెక్ట్లో భాగం. ఈ సొరంగం ఉత్తరకాశీలోని యమునోత్రి జాతీయ రహదారిపై ఉంది. అయితే.. నవంబర్ 12 అర్ధరాత్రి సమయంలో సొరంగంలో కొంతభాగం కూలిపోయింది. దీంతో 41 మంది లోపలే చిక్కుకుపోయారు. ఇదీ చదవండి: Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్ సొరంగంలో డ్రిల్లింగ్ నిలిపివేత -
ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు
ఉత్తరాఖండ్లోని ఛార్ధామ్లో సొరంగం కుప్పకూలిన ఘటనలో 40 మంది కార్మికులు నాలుగు రోజులుగా అందులో చిక్కుకుపోయారు. వీరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అయితే కొండచరియలు విరిగిపడటంతోపాటు పలు సాంకేతిక సమస్యలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. తాజాగా థాయ్ల్యాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ బృందాలను అధికారులు ఇక్కడకు రప్పించాలని నిర్ణయించారు. 2018లో థాయ్లాండ్లోని ఒక గుహలో చిక్కుకున్న పిల్లలను రక్షించడంలో థాయ్లాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ నిపుణులు విజయం సాధించారు. ఇప్పుడు వీరు ఉత్తరకాశీలోని చార్ధామ్ రహదారిపై ఉన్న ఈ గుహలో చిక్కుకున్నవారిని బయటకు తెచ్చేందుకు సహాయం అందించనున్నారు. ఈ సొరంగంలో చిక్కుకున్న 40 మందిని వెలికితెచ్చేందుకు స్థానిక అధికారులు చేసిన ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలించకపోవడంతో థాయ్లాండ్, నార్వేలకు చెందిన రెస్క్యూ నిపుణుల సాయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఉత్తర థాయ్లాండ్లోని చియాంగ్ రాయ్ ప్రావిన్స్లోని థామ్ లుయాంగ్ నాంగ్ నాన్ గుహలో చిక్కుకున్న జూనియర్ అసోసియేషన్ ఫుట్బాల్ జట్టును రక్షించడంలో థాయ్కి చెందిన ఒక రెస్క్యూ కంపెనీ విజయం సాధించింది. నాడు ఆ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసేందుకు వారం రోజులు పట్టింది. ఇది కూడా చదవండి: ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు! -
చైనాలో మరో దారుణం వెలుగులోకి: మండిపడుతున్న జనం
Cats being killed and sold as mutton or pork in china డ్రాగన్ కంట్రీ చైనాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మటన్ పేరుతో పిల్లుల మాంసాన్ని విక్రయిస్తున్న వైనం కలకలం రేపింది. దేశంలో జంతురక్షణ చట్టాలు,ఆహార భద్రత మరోసారి చర్చకు దారి తీసింది. దాదాపు 1,000 పిల్లులను కబేళాకు తరలిస్తుండగా చైనా పోలీసులు పట్టుకున్నారు. దీంతో పిల్లి మాంసాన్ని పంది మాంసం లేదా మటన్గా విక్రయించే అక్రమ వ్యాపారం గుట్టు రట్టయింది. ఈ నెల ప్రారంభంలో జంతు పరిరక్షణ కార్యకర్తల సూచన మేరకు, తూర్పు చైనీస్ ప్రావిన్స్ జియాంగ్సులోని జాంగ్జియాగాంగ్ అధికారులు దాడులు నిర్వహించారని ది పేపర్ నివేదించింది. పిల్లుల మాంసాన్ని మటన్ గా నమ్మించి దేశంలోని దక్షిణ ప్రాంతానికి సరఫరా చేస్తున్నారని తెలిపింది. దక్షిణ చైనా ప్రావిన్స్లోని గ్వాంగ్డాంగ్లో ఇంతకుముందు ఇలాంటి అక్రమ వ్యాపారాలను నిలిపివేసినట్లు జంతు సంరక్షణ ఉద్యమకర్త హాన్ జియాలీ చెప్పారు. చైనాలో ఒక్కో క్యాటీ (600 గ్రాములు) పిల్లి మాంసం ధర 4.5 యువాన్లు పలుకుతోందట. జాంగ్జియాగాంగ్ నగరంలోని కబేళాలో భారీ ఎత్తున పిల్లులను వేలాడదీసి ఉండటంతో అనుమానం వచ్చిన యానిమల్ రైట్స్ ప్రొటెక్షన్ కార్యకర్తలు నిఘా వేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఒక ట్రక్కులో అక్రమంగా రవాణా చేస్తుండగా ఈ పిల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీటిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. తాజా ఘటనతో చైనీయులలో ఆహార భద్రత పై ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. సోషల్ మీడియా సంస్థ వీబోలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఇది తిన్న మనుషులకు భయంకరమైన చావు తప్పదని ఒకరు వ్యాఖ్యానించగా, ఈ దేశంలో పిల్లులకు, కుక్కలకు జీవించే హక్కు లేదా అని మరొకరు ప్రశ్నించారు. అంతేకాదు చచ్చినా ఇకపై బార్బెక్యూ మాంసం తినను అని మరొక యూజర్ కమెంట్ చేయడం గమనార్హం. -
ఈ పోలీస్ మాములోడు కాదు.. పాముకు సీపీఆర్
మధ్యప్రదేశ్లోని నర్మదాపురంనకు చెందిన ఒక వీడియో వైరల్గా మారింది. ఒక పోలీసు కానిస్టేబుల్ తన నోటి ద్వారా పాముకు ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నిం చేశారు. ఈ విధంగా పాముకి సీపీఆర్ ఇచ్చేందుకు ప్రయత్నించడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. సెమ్రీ హర్చంద్లోని తవా కాలనీలో పాము ఉన్నట్లు పోలీసు కానిస్టేబుల్ అతుల్ శర్మకు సమాచారం అందింది. అతుల్ 2008 నుండి ఇప్పటి వరకూ 500 పాములను రక్షించారు. డిస్కవరీ ఛానెల్ చూసి, పాములను ఎలా రక్షించాలో అతుల్ నేర్చుకున్నారు. తాజా ఘటనలో నీటి పైపులైన్లో పాము ఉందని తెలుసుకున్న అతుల్ శర్మ దానిని బయటకు తెచ్చేందుకు పురుగుమందును నీటిలో కలిపి పైపులైన్లో వేయగా, ఆ పాము అపస్మారక స్థితికి చేరుకుంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో ఒక పాము అపస్మారక స్థితిలో ఉండటం, దానికి పోలీసు కానిస్టేబుల్ సీపీఆర్ ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియోను చాలా మంది షేర్ చేశారు. మరోవైపు ఈ వీడియో చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో మరికొందరు ఆ పోలీసు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఇది కూడా చదవండి: దేశంలో వీధి కుక్కలు ఎన్ని? కుక్క కాటు కేసులు ఎక్కడ అధికం? #MadhyaPradesh : ज़हरीले सांप की जान बचाने के लिए पुलिस वाले ने दिया CPR, VIDEO देख हैरत में पड़े लोग#CPR #SnakeRescue pic.twitter.com/FK8Xft2Myr — NDTV India (@ndtvindia) October 26, 2023 -
అమ్మకోసం...భళా బుడ్డోడా! వైరల్ వీడియో
కన్నతల్లితో పిల్లలకుండే ప్రేమ,ఆప్యాయతలు, సాన్నిహిత్యంగురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకరికోసం ఒకరు ప్రాణాలిచ్చుకునేంత గొప్పది వీరి అనుబంధం. అయితే సాధారణంగా అపాయంలో ఉన్న బిడ్డల్ని కాపాడుకునేందుకు ప్రాణాల్ని సైతం లెక్కచేయని వీరమాతల్ని గాథల్ని చూశాం. పెను ప్రమాదమైనా, కౄరమృగాలైనా, బిడ్డలకోసం మాతృమూర్తులు చేసే త్యాగాలకు వెలకట్టలేం. ఇలాంటి అనుభవాలు, కథనాలు చాలా విన్నాం. చూశాం. తాజాగా కష్టంలో ఉన్న అమ్మను ఆదుకునేందుకు ఒక క్యూట్ బోయ్ చేసిన పని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. యాప్ సర్కిల్ కోఫౌండర్ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఇది వ్యూస్లో 1.6 మిలియన్లు దాటేసింది. విషయం ఏమిటంటే.. నిచ్చెన సాయంతో పనిచేసుకుంటున్న మహిళ ఉన్నట్టు ఉండి ఆ నిచ్చెనపై పట్టు కోల్పోతుంది. దీంతో నిచ్చెన కాస్త కిందపడిపోతుంది. ఫలితంగా ఆ మహిళ పైనున్న ఒక దూలం లాంటిదాన్నిపట్టుకుని వేలాడుతూ ఉంటుంది. ఇది చూసిన బుడ్డోడు.. అదే మన లిటిల్ హీరో..వెంటనే రంగంలోకి దిగిపోయాడు. నిచ్చెన మెల్లిగా లేపి తల్లికి అందుబాటులోకి తీసుకొచ్చాడు. అంతేకాదు ఆమె దిగేదాకా ఆ ల్యాడర్ను జాగ్రత్తగా పట్టుకోవడం ముచ్చటగా నిలిచింది దీనిపై నెటిజన్లు లిటిల్ హీరో అంటూ అభినందిస్తున్నారు. (స్మార్ట్ఫోనే కొంపముంచిందా? పాపులర్ పబ్లిషింగ్ హౌస్ సీఈవో దుర్మరణం) తన హైట్తో పోలిస్తే అంత పెద్ద నిచ్చెన లేపడమేకాదు..చివరి వరకు ఎంత చక్కగా పట్టుకున్నాడు అంటూ ప్రశంసిస్తున్నారు. శారీరక బలం కంటే భావోద్వేగ బలం చాలా శక్తివంతమైంది అంటూ కమెంట్ చేశారు. మరికొందరు ఏమంత ఎత్తు ఉందని, ఆ పిల్లవాడిని అలా కష్టపెట్టకపోతే..దూకేయవచ్చు కదా అని కూడా కొంతమంది ట్వీట్ చేయడం గమనార్హం. (ఫ్యాన్స్కు గుడ్న్యూస్: మహీంద్ర థార్పై బంపర్ ఆఫర్) 👦🦸♂️ The little boy rescued his stuck mother, lifting the big ladder all by himself! 👏👏👏 pic.twitter.com/h9Hw2ScZ67 — Tansu YEĞEN (@TansuYegen) August 7, 2023 -
సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్తే..చివరికి ఒక్కడే సముద్రంలో..
చావు అంచులదాక వెళ్లి బతికితే మృత్యుంజయుడి అంటాం. కానీ చుట్టూ నీరు కనుచూపు మేరలో ఎవ్వరూ లేకుండా ఒక్కడే 24 గంటలు పైగా గడిపి ప్రాణాలతో బయటపడితే ఏం అనాలో చెప్పండి. వింటేనే వామ్మో అనిపిస్తుంది. బఆశలన్ని వదులుకునే స్థితిలో అదికూడా 24 గంటల పైగా అంటే మాటలు కాదుకదా. అంతటి కష్టాన్ని జయించి చివరి దాక ఆశను వదలక ప్రాణాలతో బయటపడి ఔరా! అనిపించుకున్నాడో ఓవ్యక్తి. ఈ భయానక ఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..25 ఏళ్ల చార్లెస్ గ్రెగొరీ తన బోట్పై శుక్రవారం ఫ్లోరిడా తీరానికి 12 మైళ్ల దూరంలో ప్రయాణిస్తుండగా.. సడెన్గా ఓ రాకాసి అల అతని బోట్ని గట్టిగా తాకింది. దీంతో ఒక్కసారిగా బోటు మునిగిపోపయింది. దీంతో అతడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఏకంగా 24 గంటలు పాటు అలానే సముద్రంలో ఒంటరిగా బిక్కుబిక్కమంటూ ఉన్నాడు. ఓ పక్క ఆకలితో ఉన్న సోర చేపలు, జెల్లి ఫిష్లు దగ్గర నుంచి వెళ్తుంటే..బతుకుతానా ఆహారమైపోతానా అన్నట్లు భయాందోళలనతో గడిపాడు. శనివారానికి ఓ కోస్ట్గార్డ్ గ్రెగోరి పడవ మునిగిపోవడాన్ని గుర్తించి అతన్ని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చి వైద్యసాయం అందించాడు. ఈ మేరకు సదరు కోస్ట్గార్డు నిక్ బారో మాట్టాడుతూ.. ఆ వ్యక్తి తల్లిదండ్రుల తమ కుమారుడు పడవతో వెళ్లాక తిరిగి అగస్టిన్కి తిరిగి రాకపోవడంతో భయంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాము రంగంలోకి దిగి అతన్ని రక్షించినట్లు చెప్పాడు. ఐనా ఇలా ఎప్పుడైనా ఇలా సముద్రంలోకి వెళ్లాలనుకుంటే మాత్రం లైఫ్ జాకెట్, విహెచ్బై మెరైన్ గ్రేడ్ రేడియో, సిగ్నలింగ్ పరికారాలు తోపాటు ఎలాంటి ఆపదలోనైనా చిక్కుకుంటే సమాచారం అందించ గలిగేలా ఎమర్జెన్సీ పర్సనల్ లొకేటర్ బెకన్ని తదితర రక్షణను ఏర్పాటు చేసుకుని వెళ్లాల్సిందిగా హెచ్చరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #FinalUpdate @USCG crews rescued 25YO Charles Gregory, Saturday, after he went missing on a 12-foot jon boat, 12 miles offshore of #StAugustine, #Florida. Press release: https://t.co/OGaPL6S6nS#USCG #CoastGuard #SAR pic.twitter.com/WezyZHEXB8 — USCGSoutheast (@USCGSoutheast) August 5, 2023 (చదవండి: సింపుల్ ఫుడ్ ఛాలెంజ్! కానీ అంత ఈజీ కాదు!) -
వరదలో చిక్కిన కుక్కపిల్లలు.. ఆ తల్లి ఏం చేసిందంటే..? వీడియో వైరల్..
ఆత్మీయత.. అనురాగం.. అనుబంధం.. వీటిని మించి.. అమ్మంటే అంతులేని ప్రేమ. బిడ్డలపై అమ్మ ప్రేమకు సరితూగగలదేది ఈ లోకంలో ఉండదు. తనకోసం గాక పిల్లల కోసం తమను అర్పించగల కరుణామూర్తి తల్లి. ఈ స్వభావం సృష్టిలో అన్ని జీవుల్లోనూ కనిపిస్తుంది. జంతువులు సైతం పిల్లల కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. మాతృప్రేమను చాటే ఓ ఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. వరదల్లో చిక్కుకున్న తన పిల్లల కోసం ఓ కుక్క పడే యాతన ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వర్షాలు బీబీత్సం సృష్టించాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో వరదలు సంభవించాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో సహాయక చర్యల్లో నిమగ్నమైన పోలీసుల చుట్టే ఓ కుక్క తిరిగింది. ఏదో చెప్పాలన్నట్లు ఆవేదన చెందుతూ పోలీసుల వంకే దీనంగా చూస్తూ ఏడిచింది. దీంతో పోలీసులు కుక్క ఇంతలా వెంబడించడానికి గల కారణమేంటని ఆలోచించారు. దాన్ని అనుసరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసులను ఆ కుక్క వరదల్లో మునిగిన ఓ ఇంటి వైపుకు తీసుకెళ్లింది. #APPolice rescued puppies stranded in flood water: In #NTR(D) due to massive floods loomed the puppies were trapped in a house. Cops realized the distress of mother #dog for her children. They immediately rescued them&safely brought them to their mother&showed humanity.(1/2) pic.twitter.com/UdA8KD99XD — Andhra Pradesh Police (@APPOLICE100) July 30, 2023 అక్కడే పోలీసులు ఆ కుక్క పిల్లలను గుర్తించారు. వరద నీటిలో బురదలో చిక్కుకున్న కుక్క పిల్లలు ఆ ఇంటిలో ఉన్నాయి. వెంటనే వాటిని బయటకు తీశారు. వాటికి అంటుకున్న బురదను శుభ్రపరిచి కుక్కకు అందించారు. పిల్లలను ముద్దాడిన తల్లి కుక్క పోలీసుల సహాయానికి కృతజ్ఞత చెప్పుకున్నట్లు సంతోషాన్ని వెలిబుచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు తల్లి ప్రేమను ప్రతిబింబించే సాంగ్ను జోడించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. పోలీసులు చేసిన సహాయానికి జంతుప్రేమికులు ధన్యవాదాలు తెలిపారు. జంతువుల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించిన విజయవాడ సిటీ పోలీసులను రాష్ట్ర డీజీపీ కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశంసించారు. ఇదీ చదవండి: నా కొడుకు, భర్తను చంపేశారు..కనీసం వారి శవాలనైనా ఇప్పించండి.. -
వరద బీభత్సం: ములుగు జిల్లాలో 8 మంది మృతి
సాక్షి, ములుగు జిల్లా: వరదలతో ములుగు జిల్లాలో 8 మంది మృతి చెందగా, మరో 8 మంది గల్లంతయ్యారు. జంపన్న వాగు వరద ఉధృతితో కొండాయి గ్రామం జల దిగ్భంధంలో చిక్కుకుంది. గ్రామంలోని 150 మందికి హెలికాఫ్టర్ ద్వారా ఆహారం, మెడిసిన్ సరఫరా చేశారు. వరద ఉధృతితో కొండాయి గ్రామానికి ప్రత్యేక బృందాలు వెళ్లలేకపోతున్నాయి. గుండ్లవాగు వద్ద జాతీయ రహదారిపై బిడ్జ్రి కొట్టుకుపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. రికార్డు స్థాయిలో వెంకటాపూర్ మండలంలో 70 సెం.మీ వర్షపాతం నమోదైంది. జంపన్న వాగు దాటే క్రమంలో నలుగురు గల్లంతయ్యారు. ఐదుగురిని ఎన్డీఆర్ఎఫ్ కాపాడారు. వర్షం, వరదలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు అపారనష్టం మిగిల్చింది. 14 మంది మృతి చెందగా మరో 8 మంది గల్లంతయ్యారు. అనేక గ్రామాలు, గ్రేటర్ వరంగల్ పరిధిలోని 40 కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వర్షం, వరదలు తగ్గుముఖం పట్టడంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించి బాధితులకు భరోసా కల్పించారు. గ్రేటర్ వరంగల్ లో పలు కాలనీలు నీటమునగడానికి కబ్జాలు అక్రమ నిర్మాణాలే కారణమని మంత్రి అన్నారు. చదవండి: ఎంపీ వివరాలు అడిగితే ఇవ్వకపోవడమేంటి?: హైకోర్టు గోదావరికి ఎగునున్న ప్రాజెక్టుల నుంచి ఉధృతంగా నీరు రావడంతో ఈ రోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులకు చేరే అవకాశం ఉందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక అన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని సూచిస్తున్నారు. అలాగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చెయొద్దని, అత్యవసరమైతే కంట్రోల్ రూంలకు కాల్ చేయాలన్నారు. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలని, జలాశయాల వద్దకు ప్రజలు రావద్దని సూచించారు. వరద నిలిచిన రహదారుల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లను అడ్డు పెట్టాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ ప్రియాంక. -
సాహసం శ్వాసగా.. బాధితులకు అండగా.. రెస్క్యూ బృందాలు!
భారీ వరదలు, వర్షాలు హిమాచల్ప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సుఖవిందర్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెస్క్యూ బృందాలు మ్తొతం 50 వేల మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. కాగా హిమాచల్ ప్రదేశ్లోని కరా ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న 28 మంది గొర్రెల కాపరులను, పర్యాటకులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించి, సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. #WATCH | NDRF's Joint Rescue Ops saved 28 stranded shepherds/trekkers from Kinnaur, Himachal Pradesh's Kara area. Due to rising water levels, 11 people were trapped 15 kilometres from Kafnu village. On July 10th, the NDRF team, along with ITBP and Home Guard personnel, embarked… pic.twitter.com/e8Ns5CNQ9A — ANI (@ANI) July 12, 2023 అలాగే వరద ఉధృతిలో చిక్కుకున్న మరో 15 మందిని కూడా తాళ్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో ఐటీబీపీ, హోమ్గార్డ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా రెస్క్యూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. హిమాచల్ప్రదేశ్లో వర్షాలు, వరదల కారణంగా హెచ్ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లింది. వరదల్లో సుమారు 300 బస్సులు చిక్కుకుపోయాయని సంబంధిత అధికారులు తెలిపారు.హెచ్ఆర్టీసీ బస్సులు మొత్తం 3,700 రూట్లలో తిరుగుతుండగా, ప్రస్తుతం 1200 రూట్లలో బస్సులు నడపలేని పరిస్థితి నెలకొంది. ఇది కూడా చదవండి: యుమునా ఉగ్ర రూపం.. వరద గుప్పిట్లో సీఎం కేజ్రీవాల్ నివాసం -
అపస్మారక స్థితిలోకి నాగు.. ఎలా కాపాడాడో చూసేయండి
Snake Viral Video: దప్పికతో ఆ పాము అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాసేపు అలాగే వదిలేస్తే దాని ప్రాణం పోవడం ఖాయం!. అలాంటి స్థితిలో ఓ వ్యక్తి సాయానికి ముందుకొచ్చాడు. ధైర్యంగా దాని నోటికి నీరు ఒక బాటిల్ సాయంతో అందించాడు. దీంతో అది ఓపిక తెచ్చుకుంది. ఇంటర్నెట్లో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ నాగుపాము చచ్చిన ఎలుకను మింగింది. అయితే ఆ ఎలుకలో ఉన్న ఎలుకల మందు కూడా పాము లోపలికి వెళ్లింది. దీంతో అది అపస్మారక స్థితిలోకి వెళ్లి.. విపరీతమైన దాహార్తితో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆ సమయంలో తన ఇంటి ముందు పాము అలా ఉండడాన్ని నటరాజన్ గమనించాడు. స్థానికంగా ఉండే చెల్లా అనే వ్యక్తికి సమాచారం అందింంచాడు. అయితే అది ఇంకా చనిపోలేని.. డీహైడ్రేషన్తో బాధపడతుందని గుర్తించిన చెల్లా దాని నోటికి ఓ బాటిల్తో వాటర్ అందించాడు. ఎందుకైనా మంచిదని మరో చేత్తో దాని తోకను పట్టుకున్నాడు. దాహం తీరాక అది శక్తి తెచ్చుకుని వేగంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. மயக்க நிலையில் இருந்த நாகப்பாம்புக்கு சுற்றுச்சூழல் ஆர்வலர் பாட்டிலில் இருந்து தண்ணீர் கொடுத்த வீடியோ சமூக வலைதளங்களில் வைரலாகி வருகிறது. #Cuddalore #snake #water #cobra #viral #Jayaplus pic.twitter.com/3nZ77k6vOi — Jaya Plus (@jayapluschannel) July 5, 2023 Video Source: Jaya Plus ఈలోపు జనం కంగారుపడడంతో.. ఓ ప్లాస్టిక్ డబ్బాలో దాన్ని బంధించి సమీపంలోని అడవిలో వదిలేశాడు. చెల్లా సాహసోపేతంగా ఆ పామును రకక్షించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. తమిళనాడు కడలూరు జిల్లా తిరుచోపరూర్లో ఈ ఘటన జరిగింది. ఇదీ చూసేయండి: ఇలాంటి కామాంధుల వల్లే దేశానికి చెడ్డపేరు! -
అమెజాన్ కారడవిలో పసివాళ్లను కాపాడారు ఇలా.. (ఫొటోలు)
-
ఒడిశా రైలు ప్రమాదం: ఇంకా గుర్తించని 81 మృతదేహాలు
ఒడిశాలోని బాలాసోర్లో జూన్ 2న జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగి 110 గంటలు గడిచినప్పటికీ ఇంకా 81 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. 205 మృతదేహాలను మాత్రమే గుర్తించారు. మిగిలిన మృతదేహాలను గుర్తించేందుకు భారతీయ రైల్వే వార్తాపత్రికలలో ప్రకటనల ద్వారా ప్రజల సహాయాన్ని కోరుతోంది. రైల్వే విభాగం ఒక వెబ్సైట్ లింకును ప్రకటిస్తూ దానిలో మృతదేహాల ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ సమాచారం వీలైనంతమందికి చేరితే మృతుల కుటుంబాలకు ఈ విషయం తెలుస్తుందని రైల్వేశాఖ భావిస్తోంది. భారతీయ రైల్వే www.srcodisha.nic.in వెబ్సైట్లో మృతుల ఫొటోలను ఉంచింది. ఈ మృతదేహాలను బాడీ నంబరు 1, 2, 3... 151, 152... 288లుగా పేర్కొంది. కాగా ఈ ఫొటోలలో ఘటన తాలూకా భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని మృతదేహాలు చిధ్రమైపోయిన స్థితిలో ఉన్నాయి. రైల్వే విభాగం వార్తా పత్రికలలో ప్రకటనలు ఇవ్వడంలో పాటు హెల్ప్లైన్ నంబర్లు(139, 1929, 1800-3450061) కూడా ఇచ్చింది. దీనితోపాటు ప్రమాదానికి సంబంధించిన అన్ని వివరాలను www.osdma.org అనే వెబ్సైట్లో ఉంచింది. గాయపడినవారి వివరాలను www.bmc.gov.in వెబ్సైట్లో తెలియజేసింది. ఈ ప్రమాదంలో 1100 మంది గాయపడగా, వారిలో 900 మంది చికిత్స పొందిన అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 200 మంది బాధిత ప్రయాణికులు ఇంకా వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. చదవండి: శవాల కుప్పలోంచి కుమారుని శరీరాన్ని బయటకు లాగి... -
మృతదేహాలలో నుంచి ఒక చేయి అతనిని పట్టుకోగానే...
ఒడిశా రైలు ప్రమాదం అనంతరం రెస్క్యూ నిర్వహిస్తున్న ఒక బృందంలోని ఒకరు ఆ క్షణంలో వణికిపోయారు. మృతదేహాలలో నుంచి ఒక చెయ్యి అతని కాలును పట్టుకోవడంతో అతను నిలువెల్లా కంపించిపోయారు. గత శుక్రవారం (జూన్ 2) నాడు ఒడిశాలో రైలుప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో వందలమంది మృతి చెందారు. ఆ మృతదేహాలను ఒక స్కూలుగదిలో ఉంచారు. అక్కడ రెస్క్యూ నిర్వహిస్తున్న ఒక వ్యక్తి ఆ గదిలోకి వెళ్లగానే మృతదేహాల్లో నుంచి ఒక చేయి అతని కాలు పట్టుకుంది. దీంతో మొదట అతను భయపడిపోయారు. తరువాత తేరుకుని తన కాలు పట్టుకున్న శరీరాన్ని పరిశీలనగా చూశారు. అ శరీరంలోని రెండు కాళ్లూ తెగిపోయి ఉన్నాయి. అతని చేతులు సవ్యంగానే ఉన్నాయి. ఆ చేతులతోనే అతను రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న వ్యక్తి కాళ్లు పట్టుకుని, తనను రక్షించాలంటూ వేడుకున్నాడు. దీనిని గమనించిన రెస్క్యూ సిబ్బంది వెంటనే బాధతుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితునికి తక్షణం చికిత్స ప్రారంభించారు. ఇదిలావుండగా ప్రమాదం అనంతరం అధికారుల పరిశీలన, మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్టులలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒడిశాలోని బాలాసోర్లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మొత్తం 278 మంది మృతిచెందగా, 1200 మంది గాయపడ్డారు. చదవండి: ఒక మృతదేహం కోసం ఐదుగురు వాదన -
మంచు పెళ్లలు విరిగిపడి మహిళ మృతి
ఉత్తరాఖండ్లోని అటల్కోటిలో మంచు పెళ్లలు విరిగిపడిన ఘటనలో వాటికింద కూరుకుపోయిన ఒక మహిళ మృతిచెందగా, మరో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం హేమకుండ్ సాహిబ్ యాత్రా మార్గంలోని అటల్ కోటిలో మంచు పెళ్లలు విరిగిపడిన ఘటనలో దానికింద ఆరుగురు యాత్రికుల బృందం చిక్కుకుపోయింది. రెస్క్యూ సిబ్బంది వీరిలో ఐదుగురిని కాపాడగా, మరో మహిళ ఆచూకీ లభ్యంకాలేదు. ఈ నేపధ్యంలో అసోం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు సంయుక్తంగా బాధితురాలిని వెదికే ప్రయత్నం చేశారు. వారికి సమీప ప్రాంతంలో ఒక మహిళ మృతదేహం లభ్యమయ్యింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలిని కమల్జీత్ కౌర్గా గుర్తించారు. ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ మణికాంత్ మాట్లాడుతూ ముంచు పెళ్లలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు యాత్రికులు చిక్కుకుపోయారన్నారు. ఐటీబీపీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టి, ఐదుగురు యాత్రికులను కాపాడాయన్నారు. తాజాగా జరిగిన గాలింపు చర్యల్లో ఒక మహిళా యాత్రికురాలి మృతదేహం మంచులో కూరుకుపోయిన స్థితిలో లభ్యమయ్యిందన్నారు. ఆ మృతదేహాన్ని స్థానిక పోలీసులకు అప్పగించామని తెలిపారు. దీనికి ముందు ఉత్తరాఖండ్లో హేమకుండ్ సాహిబ్యాత్రా మార్గంలో విపరీతంగా మంచుకురుస్తుండటంతో రెండురోజుల పాటు ఈ రోడ్డును మూసివేశారు. తిరిగి మే 28 రాకపోకలకు అనుమతించారు. చదవండి: బతికుండగానే కుమార్తెకు సంతాప సభ.. ఆమె చేసిన పని ఇదే.. -
సమయానికి దేవుడిలా రక్షించారు! లేదంటే ఆ చిన్నారి..
ఓ చిన్నారి ఎనిమిదో అంతస్తు కిటికి నుంచి వేలాడుతున్నాడు. ఆ చిన్నారి తల కిటికిలో ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతున్నాడు. ఏ క్షణంలో పడిపోతాడో అని నరాలు తెగే ఉత్కంఠ సాగుతుండగా.. అనూహ్యంగా ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కజికిస్తాన్లో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. ఓ మూడేళ్ల చిన్నారి అకస్మాత్తుగా ఎనిమిదో అంతస్తు కిటికీ గుండా పడిపోయాడు. ఐతే అతడి తల ఇరుక్కుపోవడంతో అలా వేలాడుతూ ఉన్నాడు. ఆ ఇంటిలోని వారు సైతం ఆ చిన్నారిని గమనించకపోవడంతో.. ఆచిన్నారి అలా చాలా సేపు ఏ చేయాలో తెలియక ఇబ్బంది పడ్డాడు. ఇంతలో కింద అంతస్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు దీన్ని గమనించారు. ఐతే ఆ కుర్రాడిని రక్షించేందుకు ఏం చేయాలో తొలుత వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ఆ పిల్లాడి తల విండోలో ఇరుక్కుపోయింది. కాబట్టి అతన్ని కిందకి లాగితే ఆ చిన్నారికి ప్రమాదం. కాబట్టి కింద ఏ స్టూలో వేసి సాయం చేసి.. ఆ చిన్నారిలో ఉత్సాహం నింపాలనుకున్నారు. అనుకున్నట్లుగానే రెండు స్టూల్స్ని ఆ చిన్నారి కాళ్ల వద్ద ఉంచారు. కానీ ఆ చిన్నారి మాత్రం స్పృహ కోల్పోయాడు. ఎంతసేపు ఆ స్టూల్పై కాళ్లు నిలబడకుండా వేలాడిపోతుంటాయి. దీంతో వారు కూడా ఆ భవనంపై స్టూల్స్ పట్టుకుని ఆ చిన్నారి స్పృహలోకి వచ్చేంత వరకు అలా నుంచొని ఉంటారు. సరిగ్గా ఇంతలో ఆ చిన్నారి పేరెంట్స్ వచ్చి కంగారుపడుతూ, అరుస్తూ.. ఆ చిన్నారిని కిటికి గుండా పైకి లాగే యత్నం చేస్తారు. దీంతో ఆ చిన్నారి స్పృహలోకి వస్తాడు. హమ్మయ్యా! ఆ చిన్నారి బతికే ఉన్నాడనుకుని ఆ ఇద్దరు వ్యక్తులు ఊపిరి పీల్చుకుంటారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరదించుతూ.. ఆ పిల్లాడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ ఇద్దర్ని రియల్ హీరోలు అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. Amazing men🙏 pic.twitter.com/WOQNoFP8ZB — Tansu YEĞEN (@TansuYegen) April 26, 2023 (చదవండి: సోనియా గాంధీ విషకన్య!: బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్) -
Turkey-Syria Earthquake: టర్కీ సహాయక చర్యల్లో అద్భుతాలు
-
ఆస్పత్రి బాత్రూమ్ డోర్లాక్.. చిన్నారిని రక్షించిన ఫైర్ సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఓ చిన్నారి తల్లిదండ్రులను, ఆస్పత్రి సిబ్బందిని కాసేపు ఉరుకులు పరుగులు పెట్టించాడు. వాష్ రూమ్లోకి వెళ్లి అనుకోకుండా లాక్ వేసేసుకున్నాడు. దీంతో అక్కడే ఇరుక్కుపోయి ఏడ్వసాగాడు. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి తల్లిదండ్రులు.. ఆస్పత్రి నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తాళాలు లేకపోవడంతో ఫైర్ సేఫ్టీ సిబ్బందికి కాల్ చేశారు. వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బాలుడిని రక్షించే యత్నం చేశారు. సుత్తి, స్క్రూడ్రైవర్తో తాళం పగులగొట్టి చిన్నారిని బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో.. 101కు డయల్ చేయాలని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ ట్విటర్ పేజీలో ఆ వీడియోను పోస్ట్ చేసింది. -
ఉత్తరప్రదేశ్ లో బోరుబావిలో పడిన బాలుడి కథ సుఖాంతం
-
చిలకలూరిపేటలో కిడ్నప్ అయిన బాలుడు క్షేమం
-
ఏజెంట్ చేతిలో మోసపోయిన వలసకార్మికులు.. ఏపీ ప్రభుత్వ సహకారంతో స్వదేశానికి రాక!
ఒమాన్ లో ఏజెంట్ చేతిలో మోసపోయిన 08 మంది వలసకార్మికులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ APNRTS సహకారంతో స్వదేశానికి రప్పించారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లాలనుకునే వారు రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెంట్ల ద్వారా సక్రమ పద్ధతిలో వెళ్లాలని ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి సూచించారు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 08 మంది వలసదారులు అక్రమ ఏజెంట్ మాయమాటలు నమ్మి ఒమాన్ కు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వీరిని రాష్ట్రానికి తీసుకురావడానికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున APNRTS ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయంతో ఇమెయిల్ ద్వారా పలుమార్లు సంప్రదించింది. వసతి, ఆహార సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న వారిని భారతదేశం పంపాలని, అక్రమ ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని APNRTS కోరింది. ఎట్టకేలకు ఏపీఎన్ఆర్టీసీ ప్రయత్నాలు ఫలించడంతో ఈ నెల 27న వాళ్లు విజయవాడకు చేరుకున్నారు. అనంతరం ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రవాసాంధ్రుల అభివృద్ధి, భద్రత, సంక్షేమమే ధ్యేయంగా ఏపీఎన్ఆర్టీఎస్ నిరంతరం పనిచేస్తోందన్నారు. స్వదేశానికి చేరుకున్న తర్వాత బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి ఏజెంట్ గా వ్యవహరిస్తూ ఒమాన్ లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఈ 08 మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వీసాలు ఏర్పాటు చేసి ఒమాన్ దేశం తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక ఏజెంట్ చెప్పిన ఉద్యోగాలు కల్పించకపోగా, సరైన వసతి, భోజనం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయంపై వారు సదరు ఏజెంట్ ని నిలదీయగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఉద్యోగాలు లేవు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని హెచ్చరించి, మమ్మల్ని రోడ్డున పడేశారని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో భారతదేశానికి రావడానికి సహాయం కొరకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ, APNRTS ను సంప్రదించారు. ఈ క్రమంలోనే పశుసంవర్ధక, మత్య్సశాఖాభివృద్ది మంత్రి డా. సీదిరి అప్పలరాజు వలసకార్మికుల క్షేమసమాచారాలు తెలుసుకోవాలని, త్వరితగతిన వారిని స్వదేశానికి రప్పించాలని APNRTS ను కోరారు. తక్షణమే స్పందించిన APNRTS బాధితుల నుంచి మరిన్ని వివరాలను సేకరించి, ఒమాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీకి వారి పరిస్థితిని వివరించారు. సదరు ఏజెంట్ పై చర్య తీసుకోవడంతో పాటు వారిని భారతదేశానికి తిరిగి రావడానికి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరింది. ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు ఈ విషయమై.. విదేశాలకు వెళ్లే వారు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికోసం APNRTS సక్రమ వలసల పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎవరూ అక్రమ ఏజెంట్ల చేతిలో మోసపోవద్దని, విదేశాంగ వ్యవహారాల శాఖ (MEA) ద్వారా ఆమోదింపబడిన రిక్రూట్మెంట్ ఏజెంట్ల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్ళాలని సూచించారు. అలాగే విదేశాలకు వెళ్ళే వారు, విదేశాల్లో ఉన్నవారు ఎవరైనా సరే మీకున్న సందేహాలు, సమస్యలు ఉంటే APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లను 0863 2340678, +91 8500027678 (వాట్సాప్) సంప్రదించగలరని తెలిపారు. -
యువకుడు సజీవ సమాధి...పోలీస్ ఎంట్రీతో తప్పిన ప్రమాదం
ఇంకా కొన్నిచోట్ల అమాయక భక్తుల నమ్మకాన్ని క్యాష్ చేసుకునేందుకు వారిచే అమానుష పనులు చేయిస్తున్నారు. మనల్ని మనం ఆత్మర్పణం చేసుకుంటే దేవుడు కనిపిస్తాడని, లేదా శరీరా భాగాలను దేవుడికి సమర్పిస్తే కనిపిస్తాడంటూ కొందరు స్వామీజీలు, బాబాలు తమ కల్లబొల్లి కబుర్లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లెందరో ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు ఒక పూజారి మాయ మాటలు నమ్మి...ఒక పిచ్చిపని చేయబోయాడు. కానీ పోలీసులు సమయానికి రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లోని తాజ్పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు పూజారులు మాయమాటలు నమ్మి ఒక యువకుడు దారుణమైన పనికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉన్నావ్లోని తాజ్పూర్లో చోటుచేసుకుంది. తాజ్పూర్ గ్రామానికి చెందిన శుభమ్ గోస్వామీ అనే యువడకుడు నవరాత్రుల సందర్భంగా ఆరడగుల గోతులో సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు యువకుడిని ఆ సమాధి నుంచి బయటకు తీసి కాపాడారు. ఆ యువకుడిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో ఆ యువకుడు..తాను ఊరుకి దూరంగా గుడిసె వేసుకుని అక్కడే ఐదారేళ్లుగా ఉంటున్నట్లు చెప్పాడు. శివకేశవ్ దీక్షిత్, మున్నాలాల్ అనే పూజారులతో గత కొంతకాలంగా పరిచయం ఏర్పడినట్లు తెలిపాడు. సజీవ సమాధి అయితే జ్ఞానోదయం అవుతుందని, ఈ పనిని దేవీనవరాత్రులు ప్రారంభానికి ముందుగా చేస్తేనే సఫలం అవుతుందని చెప్పినట్లు వెల్లడించాడు. అందుకు తాను తన తండ్రి వినీత్ గోస్వామీ మరొకందరు సాయంతో భూమి లోపల ఆరుడుగుల గోతిలో సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమైనట్లు వివరించాడు. ఐతే గ్రామంలో ఒక యువకుడు సజీవ సమాధి అయ్యాడంటూ వార్తలు గుప్పుమన్నాయని, దీంతో తాము చాలా భయందోళనలకు గురయ్యామని పోలీసులు తెలిపారు. నిందితులు మున్నాలాల్, శివ కేశవ్ దీక్షిత్ అనే ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐతే ఆ నిందితులు బాధితుడి నమ్మకాన్ని సోమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో ఇలా భూసమాధి కావాలనే కుట్రను పన్నినట్లు పేర్కొన్నారు. (చదవండి: అది రిసార్టు కాదు ..వ్యభిచార కూపం) -
వీధి కుక్కకు చికిత్స కోసం బీదర్ నుంచి సిటీకి..
సాక్షి, బంజారాహిల్స్: నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీదర్లో ఓ వీధి కుక్క నడవలేని పరిస్థితుల్లో ఉందని.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు ఇక్కడి యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ(ఏడబ్లూసీఎస్)కు ఈ నెల 21వ తేదీన ఫోన్ వచ్చింది. దీంతో ఈ సంస్థకు చెందిన షెల్టర్ నిర్వాహకులు సంతోషినాయర్, రెస్క్యూ కో ఆర్డినేటర్లు మనీష్, గణేష్ తదితరులు తమ సంస్థకు చెందిన రెస్క్యూ అంబులెన్స్లో బీదర్ చేరుకున్నారు. అక్కడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వీధి కుక్కను అంబులెన్స్లో హైదరాబాద్కు తీసుకొచ్చారు. అల్వాల్ మిలటరీ డెయిరీఫామ్ రోడ్డులో ఉన్నో ఆంచల్ ఖన్నా జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చి రెండు రోజుల పాటు వైద్యం చేయించారు. శుక్రవారం మెడలో ఇరుక్కున్న ప్లాస్టిక్ పైప్ను సర్జరీ ద్వారా తొలగించారు. జంతు ప్రేమికులు ఈ బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (చదవండి: పనసపొట్టు.. షుగర్ ఆటకట్టు) -
పాపం.. తాగునీటి కోసం వెళ్లి మరణం అంచుదాకా!
నైరోబీ: జంతువులు ఆపదలో చిక్కుకోవడం.. వాటిని మంచి మనసుతో కొందరు కాపాడడం లాంటి వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అలాంటివి చూసినప్పుడల్లా మనసుకు ఒకరకమైన సంతోషం కలుగుతుంది. అలాంటి వీడియో గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. కెన్యాలో తాజాగా ఓ శాంక్చురీలో ఈ ఘటన జరిగింది. దాహంతో నీటి కోసం అన్నీచోట్ల తిరిగి తిరిగిన రెండు ఆడ ఏనుగులు.. ఓ నీటి మడుగులో దిగి బురదలో చిక్కుకుని పోయాయి. కాలు కదిపే వీలులేక.. అందులోనే కుప్పకూలి పడిపోయాయి. ఆ బురదలో పాపం అవి అలాగే రెండురోజులకు పైనే ఉన్నాయి. వాటిని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు కొందరు. సమాచారం అందుకున్న షెల్డ్రిక్ వైల్డ్లైఫ్ ట్రస్ట్, కెన్యా వైల్డ్లైఫ్ సర్వీస్లు సంయుక్తంగా శ్రమించి.. ఆ రెండు ఏనుగులను బయటకు తీశాయి. అదృష్టవశాత్తూ అవి ప్రాణాలతో బయటపడడంతో.. కాపాడిన టీంలు సంబురాలు చేసుకున్నాయి. తీవ్ర కరువు నేపథ్యంలో ఏనుగులు ఇలా నీటి మడుగులలోకి వెళ్లి చిక్కుకుపోవడం సహజమేనని అధికారులు అంటున్నారు. View this post on Instagram A post shared by Sheldrick Wildlife Trust (@sheldricktrust) ఇదీ చదవండి: నచ్చినోడు.. తాళి కట్టేవేళ పట్టరాని సంతోషంతో.. -
సినిమాలో హీరో మాదిరి కూతురుని రక్షించుకున్న రోజువారీ కూలీ
కిడ్నాప్కి గురైతే దొరకుతారన్నగ్యారంటి ఉండకపోగా బతికే ఉంటారన్న నమ్మకమూ ఉండదు. చాలా వరకు ఇలాంటి కిడ్నాప్ కేసుల్లో బాదితులను హతమార్చడం లేదంటే అమ్మేయడం వంటివి జరుగుతుంటాయి. సరైనా అధారాలు ఉంకపోవడంతో చాలా వరకు ఇలాంటి కేసులు పెండింగ్లోనే ఉండిపోతాయి. ఐతే ఇక్కడొక తండ్రి కిడ్నాప్ అయిన కూతురుని సినిమాలో హీరో మాదిరి గాలించి రక్షించుకున్నాడు. వివరాల్లోకెళ్తే.... పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ముంబైలోని సబర్బన్ బాంద్రాలో రోజువారీ కూలీ తమ ఇంటి వద్ద 12 ఏళ్ల కూతురు కిడ్నాప్కి గరయ్యందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఐతే ఆ అమ్మాయి తండ్రి ఇరుగు పొరుగువారిని విచారించి నిందితుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఆ అమ్మాయి కిడ్నాప్కి గురయ్యిన రోజు తల్లికి ఏదో సాకుతో బయటకు వెళ్లిందనే విషయాన్ని తెలుసుకుని ఆ దిశగా తెలిసినవాళ్లందర్నీ ఆరా తీయడం మెదలు పెట్టాడు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి నిందుతుడు షాహిద్ ఖాన్(24)తో వెళ్లినట్లు తెలుసుకుంటాడు. అంతేకాదు ఆ వ్యక్తి తన ఇంటికి సమీపంలోని వస్త్రాల తయారీలో ఉద్యోగం చేస్తుస్నట్లుగా తెలుసుకుంటాడు. దీంతో ఆ తండ్రి ఆ నిందితుడు కుటుంబం అలీఘర్ సమీపంలోని ఐత్రోలి గ్రామంలో ఉంటుందని తెలుసుకుని... పోలీసులు, స్థానికుల సాయంతో తన కూతురుని రక్షించుకుంటాడు. సదరు నిందితుడు ఆ అమ్మాయిని తనతో షాపింగ్కి రావాలంటూ కుర్లాకు తీసుకువెళ్లి..అక్కడ నుంచి సూరత్కి బస్సు ఎక్కి, రైలులో ఢిల్లికి చేరుకున్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 12 కోట్లు స్వాధీనం) -
ట్రైన్ వస్తున్నా లెక్క చేయక మూగ జీవికి ప్రాణ భిక్ష!
ముంబై: రైలు పట్టాలపై ఉన్న శునకాన్ని ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్ల వైరల్గా మారాయి. ఈ సంఘటన ముంబైలోని ఓ రైల్వే స్టేషన్లో జరిగింది. ముంబై మేరీ జాన్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ప్రాణాలకు తెగించిన నిఖిల్ లోఖండేను అభినందించారు నెటిజన్లు. 4.88 లక్షల వ్యూస్, 31వేల లైకులు వచ్చాయి. వీడియోలో.. రైల్వే ట్రాక్పై ఏమీ తెలియనట్లు నడుచుకుంటూ వెళ్తోంది ఓ శునకం. ఎదురుగా ట్రైన్ వస్తోంది. కుక్కను గమనించిన నిఖిల్ లోఖండే.. ట్రైన్కు వ్యతిరేంకంగా పరుగెత్తాడు. ట్రైన్ నెమ్మదిగా వస్తున్న క్రమంలో నిలిపేయాలని సైగ చేశాడు. కుక్కను ప్లాట్ఫారమ్పై ఉన్న వారికి అందించాడు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలోని నల్లాసపోరా ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు పలువురు నెటిజన్లు తెలిపారు. శునకాన్ని కాపాడిన అఖిల్పై ప్రశంసలు కురిపించారు. View this post on Instagram A post shared by Mumbai Meri Jaan (@mumbai7merijaan) ఇదీ చదవండి: ‘2014లో మాదిరిగా 2024లో గెలుస్తారా?’.. ప్రధాని మోదీకి నితీశ్ సవాల్! -
వరదల్లో చిక్కుకున్న కారు... కానీ ఆ కారులోని కుక్క...: వీడియో వైరల్
US Police Officers Rescue Woman: అమెరికాలోని అరిజోనాలో వరదలు భీభత్సం సృష్టించాయి. దీంతో ఆ వరదల్లో ఒక ఎరుపు రంగు కారు చిక్కుకుపోయింది. ఈ మేరకు సమీపంలోని అపాచీ జంక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్(ఏజేపీడీ) సకాలంలో స్పందించి ఆ కారులో ఉన్న వాళ్లను రక్షించేందుకు సిద్ధమైంది. అపాచీ జంక్షన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆ కారు వరదల్లో కొట్టుకుపోకుండా ఉండేలా ఒక ఎల్లో టేపుతో గట్టిగా కట్టి ఉంచారు. ఆ తర్వాత ఆ కారులోని మహిళను, డ్రైవర్ను రక్షించారు పోలీసులు. ఐతే ఆమె తన కారులో ఒక పెంపుడు కుక్కు కూడా ఉందంటూ... పోలీసులను అప్రమత్తం చేసింది. కానీ దురదృష్టవశాత్తు వారికి ఆకారులో కుక్క కనిపించకపోవడంతో రక్షించలేకపోతారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఏజే పోలీస్ డిపార్ట్మెంట్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. On July 28, 2022, the Apache Junction Police Department responded to 24 different calls for service related to flooding. The incident you will see in this AJPD officer body camera is from a rescue of a motorist stranded in Weekes Wash. (1 of 5) pic.twitter.com/WXrrJMO6dp — AJ Police Department (@AJPoliceDept) July 30, 2022 (చదవండి: భగ్గుమంటున్న చైనా!...తైవాన్ పై కక్ష సాధింపు చర్యలు) -
రియల్ బాహుబలి.. ఇలా చేయాలంటే గట్స్ ఉండాలి
వైరల్: ఈ భూమ్మీద మనిషిలో మానవత్వం ఉందనే విషయాన్ని అప్పుడప్పుడు కొన్ని ఘటనలు నిరూపిస్తుంటాయి. వాటి గురించి ఎన్నిసార్లు చర్చించుకున్నా.. పెద్ద ఇబ్బందిగా అనిపించదు. ప్రాణం ఏదైనా ప్రాణమే అనుకున్న ఆ వ్యక్తి చేసిన సాహసం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. పొడి భాగం అని పొరబడి వెళ్లి.. బురదలో కూరుకుపోయింది ఓ ఇంపాలా. చాలా సేపు దానిని ఎవరూ పట్టించుకోలేదు. బయటకు రావడానికి అది ఎంతో ఇబ్బంది పడి.. గాయపడింది కూడా. ఈలోపు నేషనల్ పార్క్లో పని చేసే కొందరు దాని అవస్థలు చూశారు. సాధారణంగా అలాంటి బురదల్లో.. ఊబిలు ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే.. మొసళ్లు ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. అయినా లెక్క చేయకుండా నడుముకి తాడుకు కట్టుకుని అందులోకి దిగాడు. నడుం లోతు బురదలో కష్టంగా ముందుకు వెళ్లి చాలా సేపు శ్రమించి.. దానిని బయటకు తీసుకురాగలిగాడు. జింబాబ్వే నేషనల్ పార్క్లో చాలా ఏళ్ల కిందటే ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన ట్విటర్లో ఈ వీడియోను తన అకౌంట్లో పోస్ట్ చేయగా.. మూడున్నర మిలియన్ల వ్యూస్ దాకా చేరుకుని మరోసారి ట్రెండింగ్ వీడియోల్లోకి వచ్చేసింది. అదన్నమాట విషయం. అతను చేసిన సాహసాన్ని మీరూ ఓ లుక్కేయండి. This man risked his life to save an impala calf! ❤️️👏 pic.twitter.com/og05rsdoLq — Tansu YEĞEN (@TansuYegen) July 27, 2022 -
సాహసం చేసి ప్రాణం కాపాడాడు.. అడి కార్ అందుకున్నాడు
ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడం గొప్ప విషయం. అలాంటిది తన ప్రాణం పోతుందని తెలిసి కూడా కాపాడాలనుకోవడం సాహసమే కదా!. అలాంటి సాహస వీరుడికి ఘనంగా సన్మానం చేశారు. ఖరీదైన అడి కార్తో సత్కారం అందుకున్నాడు. కానీ, అంతకన్నా విలువైందే తనకు దక్కిందని అంటున్నాడు 20 ఏళ్ల ఆ కుర్రాడు. ఇంతకీ ఆ కుర్రాడికి దక్కిన విలువైన వస్తువు ఏంటో తెలుసా?.. ఒక ప్రాణం కాపాడాననే ఆత్మసంతృప్తి. యస్.. చికాగోకు చెందిన 20 ఏళ్ల టోనీ పెర్రీ తన ప్రాణాన్ని రిస్క్ చేసి ఓ వ్యక్తిని కాపాడాడు. అందుకే అతన్ని మెచ్చుకుంటోంది సోషల్ మీడియా. ఉమ్మి కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు తన్నుకుంటూ ఎలక్ట్రిక్ రైల్వే ట్రాక్స్ మీద పడిపోయారు. దాడికి దిగిన వ్యక్తి వెంటనే తప్పించుకోగా.. మరోవ్యక్తి మాత్రం ఎలక్ట్రిక్ ట్రాక్స్ మీద పడిపోవడంతో షాక్ కొట్టింది. 600 వోల్ట్స్ కరెంట్తో విలవిలలాడిపోయాడు అతను. ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్లంతా భయంతో అలా చూస్తూ ఉండిపోయారు. ఈ లోపు అక్కడే ఉన్న టోనీ పట్టాల మీదకు దూకి అతి జాగ్రత్త మీద ఆ వ్యక్తి పక్కకు జరిపాడు. ఆ సమయంలో అంతా టోనీని హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఒకవేళ అదే ప్లేసులో నేనుంటే?.. జనాలు నా గురించి ఏమనుకుంటారు? నన్ను రక్షిస్తారా? అలాగే వదిలేస్తారా? అనే ఆలోచన నన్ను భయపెట్టింది. అందుకే ముందు వెళ్లాను. ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతా హీరో అంటున్నారు. కానీ, నిజాయితీ అనిపిస్తోంది. టోనీని స్థానికంగా అంతా కలిసి ఘనంగా సన్మానించారు. స్థానికంగా ఉన్న ఓ వ్యాపారవేత్త ఆడి ఏ6 కార్ను టోనీకి సర్ప్రైజ్గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ కారు ప్రారంభ ధరే మన కరెన్సీలో రూ.60 లక్షలకు పైనే ఉంది. -
చిమ్మ చీకటిలో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్.. వీడియో వైరల్
Daring Midnight Rescue: జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నది మధ్యలో చిక్కుకున్న ఇద్దరు యువకులను భారత ఆర్మీ రక్షించింది. అర్ధరాత్రి చిమ్మచీకటిలో సాహసోపేతమైన రెస్క్యూ చేపట్టి మరీ వారిని రక్షించింది. వివరాల్లోకి వెళితే.. సునీల్, బబ్లూలు, జేసీబీ వాహనంలో చీనాబ్ నది దాటుతుండగా నది ప్రవాహంలో చిక్కుకుపోయారు. పైగా నీటిమట్టం క్రమంగా పెరగడంతో రక్షించేంత వరకు వాహనంపై కూర్చోవాలని అధికారులు సూచించారు. సివిల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న ఆర్మీ జవాన్లు ముమ్మరంగా రెస్క్యూ చర్యలు చేపట్టారు. ఈమేరకు ఆర్మీకి చెందిన సుమారు 17 మంది రాష్ట్రీయ రైఫిల్స్, స్థానిక పోలీసులతో కలిసి ఈ రెస్క్యూ సహాయక చర్యలో పాల్గొన్నారు. ఎట్టకేలకు అర్ధరాత్రి చిమ్మ చీకటిలోనే ఆ యువకులను రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు పౌరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందంటూ ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. #IndianArmy carried out rescue of two youth stuck in #Chenab river near village Sohal, #Kishtwar, #JammuKashmir. The water level was rising at fast pace, Soldiers rappelled across the river & rescued the youth to safety.@adgpi @Whiteknight_IA @ANI @ABPNews pic.twitter.com/aewQKQLKWJ — NORTHERN COMMAND - INDIAN ARMY (@NorthernComd_IA) May 8, 2022 (చదవండి: ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో) -
Viral: ఏరా పులి.. వాడి కంటే వరస్ట్గా ఉన్నావ్!
Tiger Viral Video: లైఫ్ ఆఫ్ పై సినిమా గుర్తుందా? ఓ పులితో పాటు యువకుడు పడవలో సాగించే ప్రయాణమే ఈ చిత్ర కథ. ఆ సినిమా క్లైమాక్స్లో ప్రధాన పాత్రదారి దేవ్పటేల్తో పాటు పడవలో ప్రయాణించిన పెద్దపులి.. చివరికి అతన్ని వీడి వెళ్లే దృశ్యం భావోద్వేగమైన ముగింపు కథకు ఇస్తుంది. అలాంటి అనుభూతి పంచే దృశ్యం ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వీడెవడో రిచర్డ్ పార్కర్(లైఫ్ ఆఫ్ పైలో పులి పాత్ర పేరు) కన్నా వరెస్ట్గా ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ఫన్ జనరేట్ అవుతోంది. ఓ రాయల్ బెంగాల్ టైగర్ను కాపాడిన అధికారులు.. దానిని సుందర్బన్స్(సుందరవనాలలో)లో విడిచిపెట్టారు. బోట్లో నుంచి బోన్ ద్వారా దానిని విడిచిపెట్టగా.. అమాంతం ఒక్క దూటున నీళ్లలో దూకేసి ఈదుకుంటూ వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. That tiger sized jump though. Old video of rescue & release of tiger from Sundarbans. pic.twitter.com/u6ls2NW7H3 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 17, 2022 ఇది లైఫ్ ఆఫ్ పై క్లైమాక్స్తో పోలుస్తూ పలువురు సరదా కామెంట్లు చేస్తున్నారు. పులి రెస్క్యూ వీడియో పాతదే అయినప్పటికీ.. సోషల్ మీడియాలో ఎక్కువగా వీడియోలు షేర్ చేసే ప్రవీణ్కుమార్ కాస్వాన్ ఐఎఫ్ఎస్ తాజాగా ఈ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో ఇలా సరదా సంభాషణ సాగుతోంది. కానీ, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. పులి అలా నీళ్లలో దూకినప్పుడు.. ఈదుకుంటూ వెళ్లినప్పుడు మాత్రం దాని రాజసం మాత్రం వేరే లెవల్లో ఉంది!. -
300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ప్రాణాలను పణంగా పెట్టి..
300 అడుగుల లోతు.. చిమ్మ చీకటి.. ఎవరు ప్రాణాలతో ఉన్నారో తెలియదు, ఎవరు చనిపోయారో తెలియదు.. ఘటనా స్థలికి చేరుకోవడం ప్రాణాలతో చెలగాటం. శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో టూరిస్టు బస్సు భాకరపేట మొదటి ఘాట్ లోయలో పడిపోయిందనే సమాచారం అందగానే జిల్లా కలెక్టర్ హరినారాయణతో పాటు పోలీసు శాఖ అప్రమత్తమైంది. అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, సీవీఎస్ఓ గోపీనాథ్జెట్టి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కుమారుడు హర్షిత్రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వీరితో పాటు స్థానికులు ప్రాణాలను ఫణంగా పెట్టి లోయలోకి దిగి క్షతగాత్రులకు సహాయక చర్యలు చేపట్టారు. సాక్షి బృందం, తిరుపతి: అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్కు చెందిన మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు(25) నిశ్చితార్థం నారాయణవనం మండలం తుంబూరుకు చెందిన అమ్మాయితో నిశ్చయించారు. ఆదివారం ఈ వేడుకను తిరుచానూరులోని రాధాకృష్ణ కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. అందులో భాగంగా శనివారం ఉద యం 11 గంటలకు టూరిస్టు బస్సులో ధర్మవరం, చుట్టుపక్క ప్రాంతాల నుంచి సుమారు 55 మంది బయలుదేరారు. అతి వేగంతో పాటు ఫిట్నెస్ లేని బస్సు కావడంతో భాకరపేట సమీపంలోని ఘాట్లో 300 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. చదవండి: చిత్తూరులో విషాదం.. లోయలో పడ్డ బస్సు రక్తసిక్తం.. బస్సు లోయలోకి పడిపోవడంతో ఆ ప్రాంతంలో హాహాకారాలు మిన్నంటాయి. క్షతగాత్రులు రక్షించండి, కాపాడండి అంటూ పెద్ద ఎత్తున రోదించారు. చెల్లాచెదురుగా పడిన మృతులు, క్షతగాత్రులతో ఆ ప్రాంతం బీతావహంగా మారిపోయింది. స్థానికులతో పాటు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేందుకు ప్రాణాలను ఫణంగా పెట్టారు. తాళ్లు, చెట్ల సాయంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. ఒకరికొకరు తోడుగా.. క్షతగాత్రులను కాపాడేందుకు ఒకరికొకరు తోడుగా లోయలోకి చేరుకున్నారు. ఒక్కో క్షతగాత్రుడిని బయటకు తీసుకొచ్చేందుకు ఆరుగురు చొప్పున అరగంట పాటు శ్రమించాల్సి వచ్చింది. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, సీవీఎస్ఓ గోపినాథ్జెట్టి స్వయంగా క్షతగాత్రులకు ప్రాథమక చికిత్సలు చేశారు. కలెక్టర్ హరినారాయణన్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. పది 108 వాహనాలు 12కు పైగా ట్రిప్పులు, ఒక ప్రయివేట్ వెహికల్, నాలుగు మినీ వ్యాన్లతో క్షతగాత్రులను రుయాకు తరలించారు. పెళ్లి కొడుక్కి తీవ్ర గాయాలు ప్రమాదంలో పెళ్లి కుమారుడు వేణుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇతని పిన్నమ్మ ఘటనా స్థలిలోనే ప్రాణాలు విడిచింది. మరో ఆరుగురు మరణించగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో మొత్తం 55 మంది ఉండగా, 48 మంది రుయాలోని అత్యవసర విభాగం, ఎంఎం వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రుల్లో 11 మందికి పైగా చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రిలో పరిస్థితిని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్రెడ్డి, ఏఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ, సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, అర్బన్ తహసీల్దార్ వెంకటరమణ తదితరులు వైద్య సేవలను దగ్గరుండి పర్యవేక్షించారు. -
Russia-Ukraine war: రెచ్చిపోతున్న రష్యా
కీవ్: నెల రోజుల యుద్ధంలో సాధించిందేమీ లేదన్న నిస్పృహతో రష్యా నానాటికీ మరింత హేయంగా ప్రవర్తిస్తోందని ఉక్రెయిన్ దుయ్యబట్టింది. నిర్బంధంతో అల్లాడుతున్న మారియుపోల్ నగరానికి బుధవారం ఆహారం తదితర అత్యవసరాలను తీసుకెళ్తున్న హ్యుమానిటేరియన్ కాన్వాయ్ని, 15 మంది రెస్క్యూ వర్కర్లను రష్యా సైన్యం నిర్బంధించిందని ఆరోపించింది. ఇరుపక్షాలూ అంగీకరించిన మానవీయ కారిడార్లను గౌరవించడం లేదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దుమ్మెత్తిపోశారు. నగరంపై భూ, గగనతల దాడులకు తోడు నావికా దాడులకూ రష్యా తెర తీసింది. అజోవ్ సముద్రం నుంచి ఏడు యుద్ధ నౌకల ద్వారా బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఐదు రోజులుగా ఐదు సెకన్లకో బాంబు చొప్పున పడుతున్నట్టు నగరం నుంచి బయటపడ్డవారు చెప్తున్నారు. కీవ్లో ప్రతిఘటన కీవ్పైనా రష్యా దాడుల తీవ్రత బుధవారం మరింత పెరిగింది. నగరం, శివార్లలో ఎటు చూసినా బాంబు, క్షిపణి దాడులు, నేలమట్టమైన నిర్మాణాలు, పొగ తప్ప మరేమీ కన్పించని పరిస్థితి. కానీ ఉక్రెయిన్ దళాల ప్రతిఘటన నేపథ్యంలో రష్యా సేనలు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉండిపోయాయని చెప్తున్నారు. ఉత్తరాది నగరం చెర్నిహివ్ను కీవ్కు కలిపే కీలక బ్రిడ్జిని రష్యా సైన్యం బాంబులతో పేల్చేసింది. దాంతో నగరానికి అత్యవసరాలను చేరేసే మార్గం మూసుకుపోయింది. తిండీ, నీరూ కూడా లేక నగరవాసుల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఉక్రెయిన్ గెరిల్లా యుద్ధం ఉక్రెయిన్ సైన్యం దూకుడు మరింతగా పెరిగిందని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ చెప్పారు. పలు నగరాల్లో రష్యా సైన్యాన్ని విజయవంతంగా నిలువరిస్తున్నట్టు చెప్పారు. వారి గెరిల్లా యుద్ధరీతులకు రష్యా సైన్యం దీటుగా బదులివ్వలేకపోతోందన్నారు. దక్షిణాదిన రష్యా ఆక్రమించిన ఖెర్సన్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఉక్రెయిన్ను రోజుల వ్యవధిలోనే ఆక్రమించేస్తామన్న అతివిశ్వాసమే రష్యాను దెబ్బ తీసిందని పాశ్చాత్య సైనిక నిపుణులు అంటున్నారు. ‘‘పరాయి దేశంలో తీవ్ర ఆహార, ఇంధన కొరతతో రష్యా సైన్యం అల్లాడుతోంది. అతి శీతల వాతావరణం సమస్యను రెట్టింపు చేస్తోంది. మంచు దెబ్బ తదితర సమస్యలతో సైనికులు నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వేలాదిమంది చనిపోయారు’’ అని చెబుతున్నారు. మొత్తమ్మీద రష్యా తన యుద్ధపాటవంలో పదో వంతు దాకా కోల్పోయిందని అమెరికా అంచనా. ఆకలికి తాళలేక రష్యా సైనికులు దుకాణాలు, ఇళ్లను లూటీ చేస్తున్నారని ఉక్రెయిన్ చెబుతోంది. చర్చల్లో పురోగతి రష్యాతో చర్చల్లో కాస్త పురోగతి ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. పలు కీలకాంశాలపై రెండువైపులా ఏకాభిప్రాయం దిశగా పరిస్థితులు సాగుతున్నాయన్నారు. పశ్చిమ దేశాలు మాత్రం రష్యా దిగొస్తున్న సూచనలేవీ ఇప్పటిదాకా కన్పించడం లేదంటున్నాయి. జీ–20 నుంచి రష్యాకు ఉద్వాసన! ఆంక్షలతో అతలాకుతలమవుతున్న రష్యాను ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక శక్తుల బృందమైన జీ–20 గ్రూప్ నుంచి తొలగించడంపై మిత్రపక్షాలతో అమెరికా చర్చలు జరుపుతోందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివన్ తెలిపారు. ‘‘ఉక్రెయిన్పై ఏకపక్షంగా అన్యాయమైన యుద్ధానికి దిగినందుకు పర్యవసానాలను రష్యా అనుభవించాల్సి ఉంటుంది. ఇకపై అది అంతర్జాతీయంగా ఏకాకిగానే మిగిలిపోతుంది’’ అన్నారు. రష్యాకు వ్యతిరేకంగా పశ్చిమ దేశాల మద్దతును మరింతగా కూడగట్టేందుకు నాలుగు రోజుల యూరప్ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం బయల్దేరారు. తొలుత బ్రెసెల్స్లో దేశాధినేతలతో ఆయన వరుస చర్చలు జరుపుతారు. నాటో అత్యవసర శిఖరాగ్ర భేటీలో, యూరోపియన్ యూనియన్, జీ–7 సమావేశాల్లో పాల్గొంటారు. శుక్రవారం పోలండ్ వెళ్లి మర్నాడు అధ్యక్షుడు ఆంద్రే డూడతో భేటీ అవుతారు. -
ఆర్కిమెడ్స్కి సూత్రమే ఆ ఏనుగుని రక్షించింది!
Elephant Saved By Using Archimedes' principle: ఇంతవరకు పలు జంతువులను ఫారెస్ట్ సిబ్బంది రక్షించిన పలు ఘటనలు గురించి విన్నాం. అయితే తాళ్ల సాయంతోనే లేక మరో విధంగానో రక్షించటం గురించి విన్నాం. కానీ ఇక్కడ ఆ ఏనుగుని రక్షించేందుకు ఆర్కిమెడ్స్కి సూత్రాన్ని ఉపయోగించాల్సి వచ్చింది. అసలు విషయంలోకెళ్తే...పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్లో ఒక ఏనేగు మురుగు కాలువలో పడిపోయింది. అయితే ఆ కాలువ కుంచెం లోతుగా ఉండటంతో ఆ ఏనుగు ఆ కాలువలో ఇరుక్కుపోయింది. దీంతో అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి ఆ ఏనుగుని తీయడానికి శత విధాల ప్రయత్నించారు. కానీ ఆ కాలువ చాలా లోతుగా ఉండటంతో తీయడం కష్టంగా అనిపించింది. దీంతో వారు ఆర్కిమెడ్క్సి సూత్రాన్ని వినియోగించి ఆ ఏనుగుని రక్షించే ప్రయత్నం మొదలు పెట్టారు. కాసేపటికి ఆ ఏనుగు నీళ్లల్లో తేలడంతో తాళ్ల సాయంతో బయటకు తీశారు. ఈ మేరకు ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. An elephant fell into a ditch in Midinapur. Now how to rescue it. By applying Archimedes' principle. Watch to believe. pic.twitter.com/1mPs3v8VjC — Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 21, 2022 (చదవండి: సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్) -
రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక...వేగంగా వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురెళ్లిన వ్యక్తి....ఐతే
Bhopal man jumps under moving train to rescue girl: ఇంతవరకు మనం తమ ప్రాణాలకు తెగించి కాపాడిన ధైర్యవంతులు గురించి విని ఉన్నాం. నిజానికి ఎవరైన తమకు వీలైనంత పరిధిలో లేదా సాథ్యమైనంత మేర వరకు సాయం చేయగలరు. కానీ మృత్యువుకి ఎదురెళ్లి మరీ అవతల వ్యక్తికి సాయం చేయడం అంటే నిజంగా మాములు విషయం కాదు. పైగా ఆ వ్యక్తిని ప్రశంసించేందుకు మాటలు కూడా సరిపోవు. అచ్చం అలాంటి సంఘటన భోపాల్లో చోటుచేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...మధ్యప్రదేశ్లోని భోపాల్లోని బర్ఖేడి ప్రాంతంలో మహ్మద్ మెహబూబ్ వృత్తిరీత్యా వడ్రంగి. అయితే మెహబూబ్ ఒక రోజు తన విధులు ముగించుకుని ఫ్యాక్టరీ నుంచి తన స్నేహితులతో కలిసి వస్తున్నాడు. ఇంతలో వెనుక వైపు నుంచి గూడ్స్ రైలు రావడంతో కాసేపు ఆగిపోయారు. అనుకోకుండా అదే సమయంలో తల్లిదండ్రులతో వస్తున్న ఒక బాలిక రైల్వే ట్రాక్పై పడిపోయింది. అయితే ఆమె రక్షించే వ్యవధి లేదు పైగా రైలు వేగంగా వచ్చేస్తుంది. దీంతో అందరూ ఆందోళనగా చూస్తుండిపోవడమే ఏంచేయలేని సంకట పరిస్థితి. అక్కడే ఉన్న మెహబూబ్ తన ప్రాణాలను లక్ష్య పెట్టక మెరుపువేగంతో రైలుకి ఎదురెళ్లాడు. ఆ రైల్వే పట్టాలపై పడి ఉన్న బాలిక చేతిని పట్టుకుని ట్రాక్ మధ్యలో కదలకుండా ఇద్దరూ పడుకుని ఉండిపోయారు. అంతేకాదు ఆమె భద్రత నిమిత్తం తల పైకెత్తనీయకుండా కిందకి ఉంచేలా పట్టుకున్నాడు. ఇంతలో గూడ్స్రైలు వేగంగా వారి మీద నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షింతంగా బయటపడ్డారు. ఈ మేరకు ఈ ఘటనకు సబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. Incredible bravery! 37 year old Mehboob was returning to his factory when he and some other pedestrians saw a goods train they stopped to let it pass a girl standing with her parents in fell on the tracks Mehboob sprinted dragged kept her head down @manishndtv @GargiRawat pic.twitter.com/IDqQiBLAv7 — Anurag Dwary (@Anurag_Dwary) February 12, 2022 -
కుక్కను రక్షించబోయి.. ఎస్సార్బీసీలో పడి యువకుడు గల్లంతు
అవుకు: శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్సార్బీసీ)లో పడిన పెంపుడు కుక్కను రక్షించబోయి ఓ యువకుడు నీళ్లలో కొట్టుకోపోయాడు. రామవరం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. రామవరం గ్రామానికి చెందిన నాగరాజు, నారాయణమ్మ కుమారుడు మాసుబాకల నరేష్ (18).. ఇంటర్ పూర్తి చేశాడు. ఇంటి వద్ద ఖాళీగా ఉండటంతో మంగళవారం గేదెలను మేపటానికి వెళ్లాడు. వెంట ఉన్న కుక్క గ్రామ శివారులోని ఎస్సార్బీసీలో పడిపోయింది. దానిని రక్షించటానికి వెళ్లిన ఆయువకుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అటుగా వెళ్తున్న ఓ బాలుడు గుర్తించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు క్రేన్ సహాయంతో ఈతగాళ్లను కాలువలోకి దించి రాత్రి వరకు గాలించారు. అయినా, యువకుడి ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాలువలో కొట్టుకుపోయి ఉంటాడని స్థానికలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు నీటిలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. -
చిరుత దళం; వాళ్లు చంపాలని.. వీరు కాపాడాలని!
చిరుతపులిని రక్షించాలా? మనిషినా? ఏ ప్రాణమూ తక్కువ విలువైనది కాదు అంటారు ఈ ఏడుగురు. అడవి నుంచి ఊళ్లలోకి వచ్చే చిరుతలను పట్టి మళ్లీ అడవిలో వదలడానికి సూరత్ సమీపాన ఉండే మాండ్వి అటవీ ప్రాంతంలో ప్రత్యేక మహిళా దళం పని చేస్తోంది. ఏడుగురు ఉండే ఈ దళం అడవిలోని చిరుతలకు రక్షకులు. కొత్త చిరుత కనిపిస్తే పట్టుకుని వాటికి ‘రేడియో ఫ్రీక్వెన్సీ’ ట్యాగ్స్ను అమర్చడం కూడా వీరి పనే. కాంక్రీట్ అరణ్యంలో తిరగడానికి జంకే కొందరు స్త్రీలు ఉన్న రోజుల్లో కీకారణ్యంలో ధైర్యంగా తిరుగుతూ స్ఫూర్తినిస్తున్నారు వీరు. విధి నిర్వహణలో చిరుత దళ సభ్యులు ప్రభుత్వం చిరుతలను అదుపు చేయడానికి చేయవలసిందంతా చేస్తోంది. ఒక్క అడవులను తెగ నరకడాన్ని సమర్ధంగా ఆపు చేయడం తప్ప. సూరత్ (గుజరాత్) జిల్లాలోని మాండ్వి అంటే భిల్లుల సామ్రాజ్యం. అటవీ ప్రాంతం. భిల్లులు, అడవి మృగాలు కలిసి జీవించిన ప్రాంతం అది ఒకప్పుడు. ఇప్పుడు అరా కొరా అడవి మిగిలింది. వాటిలోని చిరుతలు ఏం చేయాలో తెలియక ఊళ్ల మీద పడుతున్నాయి. మాండ్వి అడవిని ఒరుసుకుంటూ పారే తాపి నది ఒడ్డున ఉన్న పల్లెల్లో ఒకప్పుడు కోళ్లు, గొర్రెలు, పశువులు పెంచేవారు. ఇప్పుడు మానేశారు చిరుతల దెబ్బకు. ఒక ఊరిలో కుక్కలు మాయమయ్యాయంటే చిరుతలు తరచూ దాడి చేస్తున్నట్టు అర్థం. ఆ ప్రాంతంలో ఒకప్పుడు కనిపించిన నెమళ్లు, కోతులు, కుక్కలు అన్నీ పారిపోయాయి. మాండ్వి అడవిలో దాదాపు 50 చిరుతలు ఉన్నట్టు అంచనా. ప్రభుత్వానికి వాటిని కాపాడటం ఎంత అవసరమో మనుషుల్ని కాపాడటం కూడా అంతే అవసరం. మృగానికి మనిషికి మధ్య తకరారు వచ్చినప్పుడల్లా ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగుతుంది. అయితే చిరుత దాడి వల్ల మనిషినో, పశువునో కోల్పోయిన గ్రామస్తులు చాలా కోపంగా ఉంటారు. చిరుతను కొట్టి చంపాలని చూస్తారు. ఆ సమయంలో మగ ఫారెస్ట్ సిబ్బంది మాట వినరు. కాని మహిళా సిబ్బంది అయితే నచ్చ చెప్పే అవకాశం ఎక్కువ. అందుకే ఫారెస్ట్ ఆఫీసర్లు ఏడుగురు మహిళలతో చిరుత దళాన్ని ఏర్పాటు చేశారు. మాండ్వి ప్రాంతంలో చిరుతను పట్టుకోవాలన్నా, దూరంగా తీసుకెళ్లాలన్నా, దాడుల నుంచి కాపాడాలన్నా, వాటిని పట్టి వాటి కదలికల్ని తెలియచేసే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ అమర్చాలన్నా అదంతా ఈ ఏడుగురు మహిళా సిబ్బంది పనే. స్థానిక సమూహాల నుంచి ఈ మహిళా సిబ్బందిని తీసుకోవడం వల్ల వారికి అడవి తెలుసు. మచ్చల ఒంటితో హఠాత్తుగా ఊడి పడే చిరుతా తెలుసు. వారు భయపడరు. ‘గత సంవత్సర కాలంలో మేము 22 చిరుతలను పట్టుకుని వాటికి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ అమర్చాము’ అంటుంది ఈ దళానికి నాయకత్వం వహించే పూజా సింగ్. ‘ఇంకా కనీసం 20 లేదా 30 చిరుతలకు ఈ పని చేయాల్సి ఉంది. కాని చిరుతలు అంత సులువుగా దొరకవు. బోన్లో పడవు. వాటి కోసం వేచి ఉండాలి. అదే సమయంలో అవి ఉత్త పుణ్యానికి దాడి చేయవు’ అంటారు ఈ చిరుత దళ సభ్యులు. ‘ఒకసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించింది. మేము అదుపు చేసే పనిలో ఉన్నాం. అప్పుడు మా సమీపంగా చిరుత వచ్చింది. అలాంటి సమయంలో రెచ్చగొట్టే పనులు చేయకూడదని మేము తర్ఫీదు అయి ఉన్నాం. కనుక మేము ఏమీ చేయలేదు. అదీ ఏమీ చేయకుండా వెళ్లిపోయింది’ అంటారు ఈ సిబ్బంది. కాని అన్నిసార్లు పరిస్థితి ఇంత సులువుగా ఉండదు. విధి నిర్వహణలో చిరుత దళ సభ్యులు మధార్కుయి గ్రామంలో చిరుత దాడి చేసి ఒక నాలుగేళ్ల పాపాయిని చంపేసింది. గ్రామస్తులు అగ్గి మీద గుగ్గిలం అయ్యి చిరుత వెంట పడ్డారు. అది ఊళ్లోనే నక్కింది. చిరుత దళానికి కబురు అందింది. వీరు ఆఘమేఘాల మీద చేరుకున్నారు. గ్రామస్తులు ఆ చిరుతను చంపాలని. వీరు కాపాడాలని. ‘చివరకు గాలిలో కాల్పులు జరిపి చిరుతను ప్రాణాలతో పట్టుకున్నాం. లోపలి అడవిలో దానిని వదిలిపెట్టాం’ అన్నారు ఆ దళ సభ్యులు. మాండ్వి అడవంచు పల్లెల్లో చెరకు పంట వేస్తారు. పెరిగిన చెరకు పంట చిరుతలకు దాక్కోవడానికి అనువుగా ఉంటుంది. కనుక దాడి చేస్తాయి. మరోవైపు అడవిలో ఆహారం దొరక్కపోవడం, వేసవిలో నీటి కుంటలు ఎండిపోవడం వల్ల కూడా ఊళ్ల మీదకు వస్తాయి. ‘వేసవిలో అవి నీరు తాగే చోటుకు నీరు చేర వేసి ఆ కుంటలు నిండుగా ఉండేలా చూస్తాం’ అంటారు చిరుత దళ సిబ్బంది. వీరు చిరుతలను కాపాడటమే కాదు ఉచ్చుల్లో చిక్కుకున్న అటవీ మృగాలను, గాయపడ్డ పక్షులను కూడా కాపాడుతుంటారు. చిరుతల కోసం ఇలా ఏడుగురు స్త్రీలు ప్రాణాలకు తెగించి పని చేయడం ఈ కాలంలో స్ఫూర్తినిస్తున్న గొప్ప విశేషం. స్త్రీల చేతుల్లో అడవి క్షేమంగా ఉంటుంది అనడానికి మరో నిదర్శనం. ‘ఒకసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించింది. మేము అదుపు చేసే పనిలో ఉన్నాం. అప్పుడు మా సమీపంగా చిరుత వచ్చింది. అలాంటి సమయంలో రెచ్చగొట్టే పనులు చేయకూడదని మేము తర్ఫీదు అయి ఉన్నాం. కనుక మేము ఏమీ చేయలేదు. అదీ ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. -
విరిగిపడిన కొండచరియలు.. 70 మంది గల్లంతు
Myanmar jad Mine Landslide: ఉత్తర మయన్మార్లో కచిన్ రాష్ట్రంలోని హ్పాకాంత్ ప్రాంతంలో ఉన్న జాడే గనుల్లో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 70 మంది గల్లంతవ్వగా, ఒకరు మృతి చెందారు. రెస్క్యూ కార్యకలాపాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. (చదవండి: నరమాంస భక్షణ వల్ల బ్రైయిన్ క్యూర్ అవుతుందని నమ్మాడు...ఐతే చివరికి..!!) జాడే గనులు ప్రపంచంలోనే ప్రసిద్ధింగాంచిన అతి పెద్దగనులు. అయితే లారీల నుండి ఓపెన్ పిట్ గనులకు విసిరిన శిథిలాలు గుట్టలుగా పొంగిపొర్లడంతో కొండచరియలు విరిగిపడినట్లు భావిస్తున్నారు. ఈ గనుల్లోని ఖనిజాలు సేకరించడం అత్యంత ప్రమాదకరమైన శ్రమతో కూడిన పని. నిజానికి ప్రమాదాలు తరుచుగా సంభవించడంతో హ్పాకాంత్లో జాడే మైనింగ్ని నిషేధించారు. కానీ స్థానికులకు ఉపాధి లేకపోవడం, మరోవైపు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా దిగజారుతున్న వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. (చదవండి: అతి పెద్ద విడాకుల సెటిల్మెంట్..రూ. 5, 500 కోట్ల భరణం!) -
ఏ తల్లి కన్న బిడ్డో గానీ.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా..
గతంలో ఎవరైనా ఆపదలో ఉంటే ప్రజలు తక్షణమే స్పందించి ప్రమాదంలోని వారికి సాయం అందించేవాళ్లు. కానీ ప్రస్తుత సోషల్మీడియా సమాజంలో మాత్రం సాయం మాట అటుంచితే సెల్ఫీలు, వీడియోలు తీసి నెట్టింట షేర్చేసే నెటిజన్లకు మాత్రం కొదవలేదని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఇటీవల మనం చాలానే చూసాం. అయితే ఇంకా మానవత్వం మిగిలే ఉందని అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మనకి అనిపిస్తాయి. అసలు అంతలా ఆ వీడియోలో ఏముంది.. ఓ బాలుడు ప్రమాదకరంగా భవనంపై నుంచి వేలాడుతూ కనిపిస్తాడు. దీంతో ఎక్కడి నుంచి వచ్చాడో గానీ ఒక్కడు మాత్రం అందరిలా చోద్యం చూస్తూ, వీడియోలు ఫోటోలు తీయడం చేస్తూ సమయాన్ని వృథా చేయలేదు. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు కదిలాడు. ఆలోచన చేయలేదు, ఒక్కఉదుటున పెకెక్కి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఏ తల్లి కన్న బిడ్డవో గానీ నువ్వు చల్లగా ఉండాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు. అందరిలా చోద్యం చూస్తూ, వీడియెాలు పొటోలు తీసుకుంటు సమయాన్ని వృద్దా చేయలేదు. తన ప్రాణం గురించి ఆలోచన చేయలేదు, ఒక్క ఉదుటున పైకెక్కి ఒక మనిషి ప్రాణాన్ని కాపాడినాడు. ఏ తల్లికన్న బిడ్డవో ?నీవు చల్లగా వుండాలి సోదరా pic.twitter.com/TCPEYMaJX8— సన్న పిన్ చార్జర్ (@sannapincharger) December 7, 2021 -
మహిళ, ఇద్దరు చిన్నారులను కాపాడిన కానిస్టేబుల్..
సాక్షి, అలంపూర్(మహబూబ్నగర్): కార్తీకపౌర్ణమిని పురస్కరించుకు ని వనపర్తి జిల్లాలోని పెబ్బేరు పట్టణానికి చెందిన ఓ మహిళ, తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రానికి శుక్రవారం ఉదయం వచ్చింది. ఈ సందర్భంగా పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో స్నానాలు ఆచరిస్తుండగా ఇద్దరు చిన్నారులు మెట్లపైనున్న పాకర వల్ల జారి నీటిలో పడిపోయారు. వారిని రక్షించేందుకు తల్లి లోపలికి వెళ్లగా ఈత రాకపోవడంతో ముగ్గురూ మునిగిపోయారు. ఇది గమనించిన భక్తులు కేకలు వేయగా అక్కడే ఉన్న వనపర్తి కానిస్టేబుల్ కృష్ణసాగర్ వెంటనే స్పందించారు. జాలరుల సాయంతో ముగ్గురినీ ఒడ్డుకు చేర్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ కానిస్టేబుల్ అయ్యప్పమాలను ధరించి తోటి భక్తులతో కలిసి కార్తీకపౌర్ణమి సందర్భంగా బీచుపల్లిలోని ఆలయాలను దర్శించుకుని పూజలు చేయడం కోసం రాగా ఈ సంఘటన చోటు చేసుకుంది. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. చివరి క్షణాల్లో ఊహించని ట్విస్ట్
-
వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. చివరి క్షణాల్లో ఊహించని ట్విస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని మద్దిపాడు పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కోన విజయ్భాస్కర్రెడ్డి ఆత్మహత్యకు యత్నించారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఫోన్లో బంధువులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు బాధితుడి సోదరుడు సమాచారం ఇచ్చారు. విజయ్భాస్కర్రెడ్డి ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు.. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. -
దయచేసి ఫోన్ ఎత్తి మేము సురక్షితంగా ఉన్నాం అని చెప్పండి!
న్యూయర్క్: చాలా మంది ప్రకృతి ప్రేమికులు పర్వతాలు, అడవులు గుండా సుదీర్ఘ ప్రయాణం కాలినడకన(ట్రెక్కింగ్) చేస్తుంటారు. పైగా ఆ ప్రయాణంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఎటువంటి ఆపదల ఎదురవ్వకుండా తగిన జాగ్రత్తలతో పయనమవుతారు. ఏదైనా సమస్య ఎదురైతే రెస్య్కూ సిబ్బంది సాయంతో సురక్షితంగా బయటపడతారు. అయితే ఇలానే ఒక వ్యక్తి అమెరికాలోని కొలరాడోలోని మౌంట్ ఎల్బర్ట్ అనే పర్వతం గుండా సుదీర్ఘ ప్రయాణ నిమిత్తం ఉదయం 8 గంటలకు కాలినడకన పయనమయ్యాడు. (చదవండి: నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!) ఈ మేరకు అతను ఎంతసేపటికి రాకపోయేసరికి లేక్ కౌంటీ సెర్చ్ అండ్ రీసెర్చ్ (ఎల్సీఎస్ఏఆరర్) అతను గల్లంతైనట్లు గుర్తించి ఆ వ్యక్తి ఆచూకి నిమిత్తం ఐదుగురి రెస్కూ సిబందిని పంపించింది. ఈ క్రమలో ఆ సిబ్బంది అతని ఫోన్ కాల్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నించటానికీ చూశారు. కానీ అతను గుర్తు తెలియని నంబర్ నుంచి వస్తున్న కాల్స్ని రిసీవ్ చేసుకోకవపోవడంతో సిబ్బంది అతన్ని గాలించలేకపోయారు. దీంతో వారు వెనుకకు వచ్చి మరో ప్రాంతం గుండా గాలించడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఆ వ్యక్తి మరుసటి రోజు ఉదయమే తను బస చేస్తున్న హోటల్కి సురక్షితంగా రావడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. పైగా రెస్క్యూ టీమ్ తన కోసం వెతుకుతున్నట్లు అతనికి తెలియదు. దీంతో ఎల్సీఎస్ఏఆర్ దయచేసి ప్రయాణ ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికి గమ్యానికి తిరిగి చేరుకోలేనప్పుడు మీ ఆచూకి నిమిత్తం రెస్క్యూ బృందం వస్తుందన్న విషయాన్ని గుర్తించుకోండి అని నొక్కి చెప్పింది. ఈ మేరకు దయచేసి పదేపదే తెలియని నంబర్ నుంచి వచ్చిన కాల్స్కి సమాధానం ఇవ్వండంటూ ప్రయాణికులకు లేక్ కౌంటీ సెర్చ్ అండ్ రీసెర్చ్ విజ్ఞప్తి చేసింది. (చదవండి: బాబోయ్ ముఖం అంతా టాటులే!) -
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్నికీలలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. సెల్లార్లోని విద్యుత్ ప్యానల్ బోర్డులో షార్ట్సర్క్యూట్ కావడంతో కేబుళ్లకు మంటలు అంటుకుని క్షణాల్లో అయిదో అంతస్తుకు వరకూ విస్తరించాయి. దట్టమైన పొగతో మంటలు చెలరేగడంతో ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతోపాటు వైద్యులు, సిబ్బంది తీవ్ర భయాందోళనతో హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అధికారులతో పాటు ఆస్పత్రి ప్రాంగణంలోని ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. బయటపడి.. ఊపిరి పీల్చుకుని.. ► బుధవారం ఉదయం 7.30 గంటల సమయం. ఆస్పత్రి సెల్లార్లోని ఎలక్ట్రికల్ విభాగంలోని విద్యుత్ ప్యానల్బోర్డులో నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. ప్రతి అంతస్తుకు అనుసంధానం చేసిన విద్యుత్ తీగలు, కేబుళ్లకు మంటలు అంటుకుని నిలువుగా అయిదో అంతస్తు వరకు వ్యాపించాయి. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చిమ్మచీకట్లు అలముకున్నాయి. ► దట్టమైన పొగలను గమనించిన రోగులు, సిబ్బంది భయాందోళనతో మెట్లు, ర్యాంపు మార్గాల ద్వారా బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కొంతమంది రోగులు కిందపడి స్వల్ప గాయాల పాలయ్యారు. గ్రౌండ్ఫ్లోర్, మొదటి అంతస్తులోని గైనకాలజీ, చిన్నపిల్లల (పీడియాట్రిక్) వార్డుల్లో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, పీఐసీయూ, ఎన్ఐసీయూల్లోని శిశువులను తీసుకుని వార్డుల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. ► అగ్నిమాపక, పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది సుమారు 40 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. డీఎంఈ రమేష్రెడ్డి గాంధీ ఆస్పత్రిని సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు. చేపట్టాల్సిన చర్యలపై సూపరింటెండెంట్ రాజారావు, వైద్యులతో కలిసి సమీక్షించారు. విద్యుత్ అంతరాయంతో వైద్యసేవల్లో జాప్యం ఏర్పడింది. పలు శస్త్రచికిత్సలను వాయిదా వేశారు. పురాతన కేబుళ్లతో ప్రమాదాలు.. గాంధీఆస్పత్రి నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కేబుళ్ల వ్యవస్థ శిధిలావస్థకు చేరుకోవడంతో తరచూ షార్ట్సర్క్యూట్తో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. వైర్లు, కేబుళ్లను ఎలుకలు, పందికొక్కులు కొరికివేయడంతో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. అగ్నిప్రమాదాల కారణంగా లక్షలాది రూపాయల విలువైన వైద్యపరికరాలు దగ్ధమవు తున్నా ఆస్పత్రి పాలనా యంత్రాంగం సరైన రీతిలో స్పందించడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కరకురాని అగ్నిమాపక పరికరాలు.. గాంధీఆస్పత్రిలో ఫైర్ ఫైటింగ్ సిస్టం పూర్తిగా నిరుపయోగంగా మారింది. ఆస్పత్రి ప్రారంభినప్పుడు ఏర్పాటు చేసిన పరికరాలు తుప్పుపట్టి మూలనపడ్డాయి. ఫైర్ ఎంగ్విస్టర్లు పనిచేయడంలేదు. నూతన ఫైర్ సిస్టం ఏర్పాటు చేసేందుకు రూపొందించిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. ఆస్పత్రి పాలనా యంత్రాంగం పలుమార్లు ఈ విషయమై వైద్య ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకపోవడం గమనార్హం. ఘటనపై మంత్రి తలసాని ఆరా గాంధీఆస్పత్రిలో అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే గాంధీ సూపరింటెండెంట్ రాజారావుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరానికి చేరుకున్న వెంటనే గాంధీఆస్పత్రిని సందర్శిస్తానన్నారు. వైద్యసేవలు యథాతథం.. నార్త్బ్లాక్లోని ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులను సౌత్ బ్లాక్కు తరలించి వైద్యసేవలు అందిస్తున్నాం. అగ్ని ప్రమాదాన్ని గుర్తించి 20 నిమిషాల్లో మంటలను అదుపు చేయించాం. వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతాయి. – రాజారావు, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ అంధకారంలోనే పరిపాలనా విభాగం, వార్డులు.. ► అగ్ని ప్రమాదంతో గాంధీ ఆస్పత్రిలో చిమ్మచీకట్లు అలముకున్నాయి. సుమారు గంటన్నర సమయం తర్వాత కొన్ని బ్లాకుల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. నార్త్బ్లాక్ మొత్తం చీకట్లోనే ఉంది. విద్యుత్ అంతరాయంతో నార్త్బ్లాక్లోని ప్లాస్టిక్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. ► సూపరింటెండెంట్ పేషీ, ఆరోగ్యశ్రీ, మెడికల్ రికార్డు సెక్షన్, ఆర్ఎంఓ, నర్సింగ్ సూపరింటెండెంట్, శానిటేషన్, ఎస్టాబ్లిష్మెంట్, పరిపాలన, బయోమెట్రిక్ విభాగాల పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడనుంది. -
అదో వింతైన రంగురంగుల బల్లి.. ప్లీజ్ కాపాడండి
అమెరికా: కొన్ని సంఘటనలు చాలా విచిత్రాతి విచిత్రంగానూ హాస్యస్పదంగా కూడా కనిపిస్తాయి. అలాంటి ఘటనే కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఒకతను తన ఇంట్లోకి వింతైన రంగురంగుల బల్లి ఒకటి వచ్చిందిని ప్లీజ్ కాపాడండి అంటూ పాము పట్టే వాళ్లకు ఫోన్ చేస్తాడు. ప్రతి రోజు మా ఇంట్లోకి పాము వచ్చిందంటూ రోజుకు మూడు నాలుగు కాల్స్ వస్తుంటాయి కానీ ఇలాంటి కాల్ రావడం మొదటిసారి అని బ్రూస్ ఐర్లాండ్ అంటున్నాడు. (చదవండి: ప్రపంచంలోనే తొలి చైల్డ్ ఆర్టిస్ట్) పైగా ఆ వ్యక్తి అదోక బల్లిలా రకరకాల రంగుల్లో ఉంది ప్లీజ్ మీరు వచ్చి దాన్ని మా ఇంటి నుంచి తీసుకువెళ్లవలసిందింగా అభ్యర్థించాడు. దీంతో పాములు పట్టే నిపుణుడు బ్రూస్ ఐర్లాండ్ సదరు వ్యక్తి ఇంటికి వస్తాడు. బ్రూసి అతని ఇంట్లో ఒక ట్రైలో ఉన్న వింతైన బల్లిన చూసి ఇది అత్యంత ఆకర్షణియంగా ఉన్న రంగురంగుల ఊసరవెల్లిగా గుర్తిస్తాడు. ఇది ఏమి ప్రమాదకరమైన సరీసృపం కాదని చెబుతాడు. పైగా ఇది అత్యంత ఆకర్షణీయమైన రంగులతో ఉందని దానితో కాసేపు ఆడతాడు. అంతేకాదు బహుశా దీన్ని ఎవరో పెంచుకుంటన్నారని తప్పిపోయి ఉండోచ్చని సదరు వ్యక్తితో చెబుతాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అందమైన ఊసరవెల్లి అంటూ రకరకాలుగా ట్వీట్ చేస్తున్నారు. మీరు కూడా ఈ అందమైన వీడియోని వీక్షించండి. (చదవండి: వామ్మో...ఓవర్ హెడ్ వైర్ల ముపై పెద్ద పాము) -
ఆ ఇంట పాములు బాబోయ్ పాములు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే!
సాధారణంగా ఒకటి రెండు పాములను చూస్తేనే రన్నింగ్ రేసులో రన్నర్లా మారుతాం. అలాంటిది ఓ వ్యక్తి తన ఇంటి కింద సుమారు 100 ర్యాటిల్ స్నేక్స్ తిష్ట వేయడం చూసి ఖంగుతిన్నాడు. ఈ ఘటన యూఎస్ లోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి ఇంటో కొన్ని పాములు ఎప్పుడు వచ్చాయో తెలీదు గానీ చక్కగా అక్కడే పిల్లలను కూడా పెట్టాయి. అలా వాటి సంఖ్య సెంచరీకి చేరువైంది. కొన్ని రోజుల తర్వాత ఆ బాహుబలి సైన్యాన్ని చూసిన ఇంటి యజమాని ఆశ్చర్యపోయాడు. కాస్త భయపడ్డాడు కూడా. వెంటనే లేట్ చేయకుండా రెస్క్యూ టీంకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న సిబ్బంది.. దాదాపు 4 గంటలు కష్టపడి ఇంట్లో నుంచి సుమారు 92 ర్యాటిల్ స్నేక్స్ ను బయటికి తీశారు. అందులో కొన్ని పాము పిల్లలు కూడా ఉన్నాయి. కరువు కారణంగా బయట పాములకు తిండి దొరకక అవి ఇంట్లోకి వచ్చి ఉండే అవకాశం రెస్క్యూ టీంలో ఒకరు తెలిపారు. అదృష్టం ఏంటంటే ఆ ఇంటి యజమాని ఇంకాస్త ఆలస్యంగా చూసుంటే అవి డబుల్ ,ట్రిపుల్ సెంచరీ చేసుండేవి. పాములను వెలికి తీశాక.. వాటి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు వామ్మో.. ఇన్ని పాములా? దేవుడా.. అని కామెంట్ చేయగా, మరొకందరు.. మ్యాగీ న్యూడిల్స్లా స్నేక్ న్యూడిల్స్ లా ఉన్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: Bride Video: వరుడిని అక్కడ కొట్టేసి.. చుట్టూ పరిగెత్తి.. చివర్లో ‘ఆర్ యూ ఓకే బేబీ’ -
వామ్మో.. 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి..
గాంధీనగర్: భారీ వర్షాల కారణంగా ఒక్కొసారి అడవిలోని జంతువులు మానవ ఆవాసాల దగ్గరికి వస్తుంటాయని విషయం తెలిసిందే. తాజాగా, ఇలాంటి సంఘటన ఒకటి గుజరాత్లో చోటుచేసుకుంది. అయితే, ఇక్కడ రెండు భయంకరమైన జీవులు జనావాసాల సమీపంలోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా, వడోదరకు సమీపంలో ఒక చెరువు ఉంది. ఈ క్రమంలో, అక్కడి నుంచి 14 అడుగుల కొండ చిలువ, 6 అడుగుల మొసలి రెండు కూడా జనావాసాల్లోకి వచ్చాయి. వీటిని చూడగానే స్థానికులు భయంతో వణికిపోయారు. ఆ తర్వాత వన్యప్రాణి సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వెంటనే ఆ జీవులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. తమ సిబ్బందితో కలిసి కొండచిలువ, మొసలిని బంధించారు. ఆ తర్వాత వాటిని దగ్గరలోని అడవిలోకి వెళ్లి వదిలినట్లు ఫారెస్టు అధికారి అర్వింద్ పవార్ తెలిపారు. కాగా, ఆ జీవుల నుంచి ఎలాంటి అపాయం లేకుండా రెస్క్యూ సిబ్బంది పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: గోల చేయని భార్య! ప్చ్.. నాలుగు రోజులకే విడాకులు -
మనుషులు పట్టించుకోలేదు.. స్మార్ట్ వాచ్ బతికించింది
Apple Smart Watch Saves Singapore Man's Life: ‘మనిషి.. వాడుకోవలసిన వస్తువులను ప్రేమిస్తున్నాడు, ప్రేమించవలసిన మనుషుల్ని వాడుకుంటున్నాడు’ ఓ ఫేమస్ సిన్మా డైలాగ్ ఇది. కానీ, ఈ ఘటన చదివాక వస్తువులనే ప్రేమించడం బెటర్ ఏమో అనిపించకమానదేమో!. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే.. అటుపక్కగా వెళ్తున్న వాళ్లు ‘మనకెందుకు లే’ అనుకుంటూ వెళ్లిపోయారు. కానీ, అతని చేతికున్న స్మార్ట్ వాచ్ మాత్రం విధిగా పని చేసి అతని ప్రాణాల్ని నిలబెట్టింది. సెప్టెంబర్ 25న సింగపూర్ అంగ్ మో కియో టౌన్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మహముద్ ఫిట్రీ(24) అనే వ్యక్తి బైక్ మీద వెళ్తుండగా టౌన్లోని ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. సాయంత్రం ఏడున్నర గంటల టైంలో యాక్సిడెంట్ జరగ్గా.. జనాలు పక్కనుంచి చూస్తూ వెళ్లిపోయారే తప్ప సాయం అందించేందుకు ముందుకు రాలేదు. కనీసం ఆంబులెన్స్కు కాల్ చేయాలనే ప్రయత్నం కూడా చేయలేదు ఎవరూ(ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది). ఆ టైంలో అతని చేతికున్న వాచ్ అతని ప్రాణం కాపాడింది. ఫిట్రీ చేతికి ఉంది ఓ స్మార్ట్వాచ్. ఇందులో స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే.. కాల్స్కు, మెసేజ్లకు యూజర్ స్పందించకపోతే (కట్ చేయడం తప్పించి) ఆ వ్యక్తి ఆపదలోఉన్నట్లు గుర్తించి.. ఎమర్జెన్సీ కాంటాక్ట్లో ఉన్న నెంబర్లను అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు ప్రమాదాలకు గురైనప్పుడు, ఏదైనా బలంగా ఢీకొట్టినప్పుడు.. స్మార్ట్ వాచ్ నుంచి ‘ఫాల్ అలర్ట్’ మోగుతుంది. యూజర్ ఒకవేళ దానిని ఆఫ్ చేయకపోతే.. సదరు వ్యక్తి ఆపదలో ఉన్నట్లు నిర్ధారించుకుంటుంది ఆ వాచ్. తద్వారా అతని కాంటాక్ట్లో ఉన్న లిస్ట్కు కాల్స్, మెసేజ్లు పంపించి అప్రమత్తం చేస్తుంది. ఫిట్రీకి ప్రమాదం జరిగిన 30 నిమిషాలకు స్మార్ట్ వాచ్లోని అలర్ట్ ద్వారా సమాచారం అందుకున్న సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రమాద స్థలానికి చేరుకుంది. అతన్ని దగ్గర్లోని ఆస్పత్రికి చేర్చింది. టైంకి చికిత్స అందడంతో ఆ యువకుడి ప్రాణాలు నిలిచాయి. ఇదిలా ఉంటే యాపిల్ 4 సిరీస్ వాచ్ను ఫిట్రీకి అతని గర్ల్ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది జూన్లో నార్త్ కరోలినాకు చెందిన ఓ వృద్ధుడి ప్రాణాల్ని స్మార్ట్ వాచ్ నిలబెట్టిన సంగతి తెలిసిందే. చదవండి: స్మార్ట్వాచ్ చెప్పేవరకు తెలీదు ఆమెకు గుండెపోటు వచ్చిందని!! ఇదీ చదవండి: రన్నింగ్ కోచ్ జీవితాన్ని కాపాడిన స్మార్ట్వాచ్..! -
కడప: శభాష్ నరేంద్ర.. వరదను సైతం లెక్క చేయక
సాక్షి, వైఎస్సార్: ఖాకీలంటే నేటికి కూడా సమాజంలో చాలా మందికి ఒకలాంటి భయం.. బెరుకు. పోలీసులను చూడగానే పారిపోయే వారు నేటికి కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ నేచర్ వల్ల పోలీసులకు-జనాలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. ఇక ఖాకీలంటే కఠినంగా ఉండటమే కాదు.. ఆపదలో ఉంటే ముందుగా స్పందించేది కూడా వారే. ఇందుకు నిదర్శనంగా నిలిచిన సంఘటనలు ఎన్నో. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. భారీ వరదలో చిక్కుకుపోయిన వ్యక్తిని కొట్టుకుపోకుండా కాపాడి.. జనాల ప్రశంసలు పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్. ఆ వివరాలు.. (చదవండి: కన్నుమూస్తూ మరొకరికి పునర్జన్మ) గులాబ్ తుపాన్ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసాయి. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లాయి. వరద నీరు రోడ్లకు మీదకు చేరి ప్రజా రవాణాకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో కడప జిల్లాలో చెరువు పొంగి రోడ్డు మీదుగా ప్రవహించడం ప్రారంభించింది. దాంతో అదే రోడ్డు మార్గంలో బైక్ మీద వస్తోన ఓ వ్యక్తి వరద ధాటికి తట్టుకోలేక బండి మీద నుంచి పడిపోయాడు. రెండు క్షణాలు ఆలస్యం అయి ఉంటే అతడు కూడా వరదలో కొట్టుకుపోయేవాడు. (చదవండి: నువ్వు సూపరహే.. 67 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో అద్భుతం) ఈ ఘటన చోటు చేసుకున్న సమయంలో పోలీసు కానిస్టేబుల్ నరేంద్ర అక్కడే ఉన్నాడు. సదరు వ్యక్తి బైక్ మీద నుంచి పడగానే అప్రమత్తమైన నరేంద్ర.. వరదను లెక్క చేయకుండా వెళ్లి.. అతడు కొట్టుకుపోకుండా కాపాడాడు. వరదకు భయపడకుండా.. ప్రాణాలను పణంగా పెట్టి మరి ఆ వ్యక్తిని కాపాడినందుకు కానిస్టేబుల్ నరేంద్రను ప్రశంసించారు జనాలు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. చదవండి: తెలుగు రాష్ట్రాలను వణికించిన గులాబ్ తుపాన్ పాకిస్తాన్ వైపు -
వరద నీటిలో చిక్కుకున్న మహిళా
-
Afghan: ఆఫ్గన్ రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా బాలీవుడ్ మూవీ
ఆఫ్గానిస్తాన్ని తాలిబన్లు పూర్తి స్థాయిలో ఆక్రమించిన విషయం తెలిసిందే. ఈ నేఫథ్యంలో ఎన్నో దేశాలు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి తమ పౌరులను విమానాల్లో తరలించాయి. ఇండియా సైతం భారతీయులతోపాటు ఎంతోమంది ఆఫ్గానీయులను రెస్క్యూ చేసి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్ ఆధారంగా బాలీవుడ్లో ‘గరుడ్’ పేరుతో సినిమా తెరక్కెనుంది. జాన్ అబ్రహం హీరోగా ‘ఎటాక్’ సినిమా నిర్మాత అజయ్కపూర్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలిపాడు. చిత్ర మోషన్ పోస్టర్ని బుధవారం (సెప్టెంబర్ 15న) విడుదల చేశాడు. ఈ మూవీకి మరో నిర్మాతగా సుభాష్ కాలే వ్యవహరించనున్నారు. ఈ సినిమా డైరెక్టర్, నటీనటుల, ఇతర క్యాస్టింగ్ ఫైనలైజ్ కాలేదని, ఆ వివరాలు త్వరలోనే చెబుతామని ఆయన వెల్లడించాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ప్రత్యేక వింగ్ గరుడ్ కమాండో ఫోర్స్లోని ఓ అధికారి చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సుభాష్ కాలే కథ అందిస్తుండగా, కేజీఎఫ్ సినిమాలకు పనిచేసిన రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నారు. కాగా జాన్ అబ్రహం కథనాయకుడిగా నటిస్తున్న ఎటాక్ సినిమాని డిజిటల్ ప్లాట్ఫామ్లో కాకుండా థియేటర్స్లో విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ఇటీవల ప్రకటించింది. FILM ON AFGHAN RESCUE CRISIS... #AjayKapoor - currently producing #Attack [#JohnAbraham] - collaborates with #SubhashKale for #Garud... Based on #Afghan rescue crisis... Director + cast to be announced... Music by #RaviBasrur [#KGF, #KGF2]... 15 Aug 2022 release #IndependenceDay. pic.twitter.com/SQN7wJvKEj — taran adarsh (@taran_adarsh) September 15, 2021 -
వైరల్: అంతా మ్యాచ్లో లీనం.. ఒక్కసారిగా స్టేడియంలో..
ఇటీవల పలు చోట్ల జంతువులను కాపాడిన వీడియోలు నెట్టింట వైరల్గా మారడమే గాక నెటిజన్ల మనసును కూడా దోచుకుంటున్నాయి. అలాంటి ఘటనలోనే ఓ పిల్లిని కాపాడినందుకు కొందరు పెద్ద మొత్తంలో రివార్డును కూడా అందుకున్న సంగతి తెలిసిందే. స్టేడియంలో ఆటగాళ్లు తమ ఆటతో హైలెట్గా నిలవడం మామూలే కానీ అక్కడ ఓ పిల్లి టాక్ ఆఫ్ ది మ్యాచ్లా మారింది. ఎలా అంటారా! వివరాల్లోకి వెళితే.. మయామి హరికేన్స్ యూనివర్శిటీ, అప్పలాచియన్ స్టేట్ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు శనివారం హార్డ్ రాక్ స్టేడియంలో ఓ నాటకీయ సంఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకులంతా మ్యాచ్ని వీక్షిస్తున్నారు. అంతలో స్టేడియం ఎగువ డెక్ నుంచి ఓ పిల్లి వేలాడుతున్నట్లు వారికి కనిపించింది. ఇక అంతవరకు ఉత్సాహంగా మ్యాచ్ని ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ దృష్టి ఒక్కసారిగా పిల్లి వైపు మారింది. అంతలో మ్యాచ్ని చూడటానికి వచ్చిన క్రెయిగ్ క్రోమర్, అతని భార్య కింబర్లీ సరైన సమయంలో స్పందించారు. ఆ జంట పిల్లి తన పట్టును కోల్పోతుందని గ్రహించి, సరిగ్గా అది కింద పడే ప్రాంతలో వారి వెంట తెచ్చుకున్న జెండాను పట్టుకున్నారు. దాన్ని కాపాడటానికి అక్కడ జంటతో పాటు కొందరు ఓ రెస్క్యూ టీమ్లా ఏర్పడి పిల్లిని కింద పడకుండా పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇక ఒకే పంజాతో గోడ అంచున పట్టుకున్న ఆ పిల్లి తన పట్టును తిరిగి పొందడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. అయితే, కొంత సేపటి అనంతరం అది ఎగువ డెక్ నుంచి పడిపోయింది. అదృష్టవశాత్తూ, ఆ పిల్లికి ఎటువంటి గాయాలు కాకుండా వారు పట్టుకోగలిగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో దూసుకుపోతోంది. పిల్లిని కాపాడిన వారిని నెటిజన్లు అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. Well this may be the craziest thing I’ve seen at a college football game #HardRockCat pic.twitter.com/qfQgma23Xm — Hollywood (@DannyWQAM) September 11, 2021 చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్ దొంగతనం వైరల్ -
వైరల్ వీడియో: ‘మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నాం’
మనుషులకు, జంతువులకు ప్రధాన తేడా.. విచాక్షణా జ్ఞానం. జంతువులు ఆలోచించలేవు.. మనం ఆలోచించగల్గుతాం. అయితే ప్రస్తుతం లోకం తీరు చూస్తే ఈ వ్యాఖ్యలకు అర్థం మారినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మనిషి ఆలోచనల్లో స్వార్థం పెరుగుతుంది. కళ్లేదుటే సాటి మనిషి చావుబతుకుల్లో కొట్టుమిటాడుతన్న పట్టించుకునే తీరక, మానవత్వం కరువవుతున్నాయి. కానీ జంతువులు అలా కాదు.. తమ తోటి జీవికి కష్టం వచ్చిందని వాటికి తెలిస్తే చాలు.. కట్టకట్టుకుని వచ్చేస్తాయి. తమ సాటి ప్రాణిని కాపాడటానికి వాటికి తోచిన రీతిలో ప్రయత్నిస్తాయి. ఇప్పుడిదంతా ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. మీ నుంచి మనుషులు ఎంతో నేర్చుకోవాలి. నిస్వార్థ ప్రేమకు, మానవత్వానికి ప్రతీకగా నిలిచారు అంటూ ప్రశంసిస్తున్నారు. ఆ వివరాలు.. టర్కిష్ మహిళ ఫైజెన్ తన ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ ఏనుగు పిల్ల తల్లితో కలిసి నీటి కొలను దగ్గరకు వచ్చింది. పక్కనే మరో ఏనుగు కూడా ఉంది. అయితే ఉన్నట్లుండి పిల్ల ఏనుగు నీటిలో పడి పోతుంది. ఇది గమనించి తల్లి ఏనుగు బిడ్డను కాపాడటం కోసం ప్రయత్నిస్తుంది. ఈలోపు ఏనుగు పిల్ల పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. ఇది గమనించిన రెండు ఏనుగులు నీటిలోకి దిగి.. పిల్ల ఏనుగును ఒడ్డుకు చేర్చుతాయి. ఆ తర్వాత ఆ మూడు ఏనుగులు అక్కడ నుంచి వెళ్లిపోతాయి. (చదవండి: Viral Video: హద్దులు లేని ప్రేమ! ‘నేస్తమా.. ఇటు రా’) అయితే ఈ రెండు ఏనుగులు.. పిల్ల ఏనుగును కాపాడటం కోసం ప్రయత్నిస్తుండగా.. వాటి వెనకే ఉన్న మరో ఏనుగు ఈ దృశ్యాన్ని చూస్తుంది. అక్కడకు వెళ్లి.. వాటికి సాయం చేయాలని భావిస్తుంది. కానీ అక్కడ కంచెలాంటి నిర్మాణం అడ్డుగా ఉండటంతో రాలేక అక్కడే తచ్చాడుతుంటుంది. (చదవండి: మనిషిని అనుకరించిన ఏనుగు.. ఏకంగా తొండంతో) Awwww amazing! 💓pic.twitter.com/F9pveOMEOR — Figen.. (@TheFigen) September 8, 2021 ఈ వీడియో చూసిన నెటిజనులు మీ తోటి ప్రాణిని కాపాడటం కోసం మీ ప్రాణాలకు తెగించి మరీ సాహసం చేశారు. మీ నిస్వార్థ ప్రేమకు, మానవత్వానికి హ్యాట్సాఫ్.. మిమ్మల్ని చూసి మేం మనుషులం చాలా సిగ్గుపడాలి.. నేర్చుకోవాలి అని కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ‘‘కన్నీరాగడం లేదు.. జీవితాంతం వెంటాడుతుంది’’ -
అదృష్టం వీరికి పిల్లి రూపంలో వచ్చింది !
Pregnant Cat Saved Video: మనం చేసే మంచి పని ఏదో ఓ రూపంలో మనకి సహాయపడుతుందంటారు. సరిగ్గా అలానే ఆపదలో ఉన్న ఓ పిల్లిని కొందరు మానవత్వం కాపాడారు. అదే వాళ్లకు అదృష్ట దేవతలా మారి 10 లక్షల రివార్డు వచ్చేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు నసిర్ షిహాబ్, మహమ్మద్ రషిద్ దుబాయ్లో పని చేస్తున్నారు. నసిర్ బస్ డ్రైవర్గా పనిచేస్తుండగా.. రషిద్ కిరాణ కొట్టుతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఓ భవనం రెండో అంతస్తు నుంచి పిల్లి కింద పడిపోయే ప్రమాదం ఉన్నట్లు రషిద్ గమనించాడు. నసిర్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. ఇక వెంటనే ఆ ఇద్దరూ పిల్లిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారు పిల్లి సరిగ్గా కింద పడే ప్రాంతంలో బెడ్ షీట్ని పట్టుకుని నిలబడ్డారు. ఆ పిల్లికి పట్టు దొరకక.. రెండో అంతస్తు బాల్కనీ నుంచి నేరుగా వారి ఉంచిన ఆ బెడ్ షీట్లో పడి ప్రాణాలు దక్కించుకుంది. అయితే.. ఆ పిల్లి ప్రెగ్నెంట్గా ఉండటంతో.. దాన్ని కాపాడిన ఆ ఇద్దరు భారతీయులను, వారికి సహాయం చేసిన మరో ఇద్దరిని అక్కడి స్థానికులు మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రషిద్.. తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో దుబాయ్ సోషల్ మీడియాలో వైరల్గా మారి చివరికి ఆ దేశ రూలర్షేక్ మహమ్మద్ బిన్ రషిద్ కంట పడింది. దీంతో షేక్ మహమ్మద్.. పిల్లిని కాపాడినందుకుగాను 10 లక్షల రివార్డును ప్రకటించాడు. ఆ ఇద్దరి భారతీయులతో పాటు ఈ రెస్క్యూ ప్లాన్లో సహకరించిన పాక్ దేశస్తుడైన అతీఫ్ మెహమూద్, మొరాకో సెక్యూరిటీ గార్డు అష్రఫ్ కూడా బహుమతులు అందించాడు. Proud and happy to see such acts of kindness in our beautiful city. Whoever identifies these unsung heroes, please help us thank them. pic.twitter.com/SvSBmM7Oxe— HH Sheikh Mohammed (@HHShkMohd) August 24, 2021 చదవండి: Bride Beats Groom Viral Video: పెళ్లిలో వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు.. అంతా షాక్! -
జాడలేక 10 రోజులాయే.. సంజూ ఎక్కడున్నావ్ నాన్నా..
‘నాన్నా.. ఎక్కడున్నావు.. నీ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాం.. బుడిబుడి అడుగులతో అమ్మా అంటూ నా చీర పట్టుకుని తిరుగుతుంటే చూడాలని ఉంది బిడ్డా.. నిన్ను చూడకుండా నేనెలా బతకాలి కన్నా.. నీ కోసం మేమే కాదు.. కాలనీవాసులు, పోలీసులు రాత్రీపగలు తేడా లేకుండా వెతుకుతున్నాం.. త్వరగా కనిపించు నాన్నా..’ తప్పిపోయిన మూడేళ్ల చిన్నారి దండు సంజు తల్లిదండ్రుల ఆవేదన ఇది.. సాక్షి, నెల్లూరు: కలువాయి మండలం ఉయ్యాలపల్లి దళితవాడకు చెందిన దండు బుజ్జయ్య, లక్ష్మమ్మకు ముగ్గురు మగపిల్లలున్నారు. వారిలో సంజు రెండో బిడ్డ. బుజ్జయ్య గొర్రెలు మేపుతాడు. లక్ష్మమ్మ కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నారు. గొర్రెలు మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్తున్న బుజ్జయ్య వెంట చిన్నారి సంజు (3) వెళ్లేవాడు. కొంత దూరం వరకు వెళ్లిన చిన్నారిని తిరిగి ఇంటికి చేర్చడం నిత్యం జరుగుతుండేది. కానీ గత నెల 29వ తేదీన ఉదయం 9 గంటల సమయంలో చిన్నారి తండ్రి వెళ్లిన కాసేపటికి అటవీ ప్రాంతం వైపు వెళ్లడాన్ని స్థానికులు గుర్తించారు. అప్పటినుంచి సంజు ఆచూకీ లభించలేదు. జల్లెడ పడుతున్న పోలీసులు సంజు ఆచూకీ కోసం పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఏఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్, కలువాయి ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది రోజూ సంజు కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాలను ఉపయోగించి అడవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఉయ్యాలపల్లి తెగచర్ల పరిసర ప్రాంతాలతోపాటు, సమీప అటవీ ప్రాంతంలో పోలీస్ బృందాలు తీవ్రస్థాయిలో గాలించాయి. రెండు రోజుల క్రితం పోలీస్ జాగిలాన్ని రప్పించి అడవిలో తిప్పారు. ముందుగా బాలుడు వాడుతున్న చెప్పులను వాసన చూపించారు. జాగిలం అక్కడి నుండి రెండు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో తిరిగి ఆగిపోయింది. డాగ్ స్క్వాడ్ సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికే 10 రోజులు గడచినందున దుస్తులు తదితరాల కంటే చెప్పుల ద్వారా జాగిలాలు వాసనను బాగా పసిగట్టగలవని తెలిపారు. జాగిలం బాగా అలసిపోయిందని, విశ్రాంతినిచ్చారు. మళ్లీ గాలింపు చేపట్టనున్నారు. అలాగే కరపత్రాలు, వాల్పోస్టర్లు వేయించి రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు పంపించారు. ఎత్తుకెళ్లి ఉంటారా? సంజును ఎవరైనా అపరిచితులు ఎత్తుకెళ్లి ఉంటారేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. తల వెంట్రుకల కోసం ఊరూరా తిరిగే కొందరు అపరిచితుల వ్యక్తులు బిడ్డను అపహరించి విక్రయించుకునే అవకాశం కూడా ఉందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తప్పిపోయిన సమయంలో ఆ ప్రాంతంలోని సెల్టవర్ డంప్ ఆధారంగా దర్యాప్తు సాగుతోంది. క్షేమంగా ఉంటాడని.. సంజు ఆచూకీ లభ్యం కాకపోవడం.. పరిసర ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలో కూడా బిడ్డ ఆనవాళ్లు లేకపోవడంతో ఎక్కడో చోట క్షేమంగా ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఒకవేళ చిన్నారికి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే తప్పక ఆనవాళ్లు లభించేవని, త్వరలోనే ఆచూకీ తెలుసుకుంటామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాం చిన్నారి ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాన్ని గాలించాం..డ్రోన్ కెమెరాలతోపాటు పోలీస్ డాగ్స్క్వాడ్ను పిలిపించి గాలించాం. త్వరలోనే బిడ్డ ఆచూకీ కనుగొంటాం. – వెంకటేశ్వరరావు, డీఎస్పీ, ఆత్మకూరు -
బాలుడు సంజు కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
-
దొరకని సంజూ ఆచూకీ.. డ్రోన్ కెమెరాలతో గాలింపు
సాక్షి, నెల్లూరు: పెనుసిల అభయారణ్యంలో తప్పిపోయిన కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందిన బాలుడు సంజు కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బాలుడు ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాలతో అధికారులు జల్లెడ పడుతున్నారు. బాలుడి కోసం పోలీసు జాగిలాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 8 రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంజు అదృశ్యమైన రోజు ఆ ప్రాంతంలో తిరిగిన వారి ఫోన్ డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. -
చిత్తూరు : ఫోన్ మాట్లాడుతూ బావిలో పడ్డ వ్యక్తి ని కాపాడిన ఫైర్ సిబ్బందీ
-
వైరల్: మీనా.. గుడ్బై నేస్తమా
చిన్నముక్క బిస్కెట్, ఒక ఆప్యాయ స్పర్శ చాలు.. కుక్కను మనవైపు తిప్పుకోవడానికి. ఆ పనిని మనం వాటిని మరిచిపోయినా.. అవి మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటాయి. మనుషుల పట్ల లెక్కకట్టలేనంత విశ్వాసాన్ని కనబరిచే ఆ మూగజీవాలు.. ఇంటర్నెట్లో ఎప్పటికప్పుడు తమ చేష్టలతో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. గుజరాత్ పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న స్నిఫ్ఫర్ డాగ్ మీనా(7) అనారోగ్యంతో మృతి చెందింది. దాని అంతిమ సంస్కారాలకు ముందు అధికారులు పూలతో నివాళులు అర్పించారు. ఆ టైంలో అక్కడే ఉన్న మరో రెండు స్నిఫ్ఫర్ డాగ్స్.. మీనా భౌతికకాయం ముందు మోకరిల్లి నివాళులర్పించాయి. ఐపీఎస్ అధికారి శంషేర్ సింగ్ ఆ ఫొటోను అప్లోడ్ చేయగా.. వైరల్ అవుతున్న ఆ ఫొటోకి నెటిజన్స్ సానుకూలంగా స్పందిస్తున్నారు. Final salute to their colleague , Meena. pic.twitter.com/bYuceNlsee — Shamsher Singh IPS (@Shamsher_IPS) June 17, 2021 ఇక వర్జీనియాలో జరిగిన ఓ ఘటనలో.. యజమాని నుంచి తప్పిపోయి అడవుల్లోకి వెళ్లిన ఓ కుక్క.. వాగులో కొట్టుకుపోతున్న జింక పిల్లను ఒడ్డుకు చేర్చింది. ‘హీరో డాగ్’గా పోలీసుల నుంచి గౌరవ వందనం అందుకుంది. హర్లే అనే కుక్క ఆ జింక పిల్లను కాపాడుతున్నప్పుడు ఓ వ్యక్తి ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చదవండి: బుడగలు ఊదుతూ రిలాక్స్గా.. -
మునిగిపోతున్న నౌక నుంచి సిబ్బందిని కాపాడిన కోస్ట్ గార్డ్
-
ఓ వైపు తుపాను.. మరోవైపు పురిటి నొప్పులు
బాలాసోర్ (ఒడిషా): ఆకాశానికి చిల్లులు పడేట్టుగా కురుస్తున్న వర్షం... ఊరు మొత్తాన్ని చుట్టేసిన వరద నీరు... అప్పుడే మొదలైన పురిటి నొప్పులు.. అర్థరాత్రి.. చిమ్మచీకటి.. చెట్లు కూలిపోవడంతో అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఇక తల్లిబిడ్డల ప్రాణాలకే ప్రమాదమని అంతా భయపడుతున్న తరుణంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్ష్ ఫోర్స్ రంగంలోకి దిగింది. తక్షణ స్పందన ఒడిషాలోని బాలాసోర్ జిల్లా బహదలాపూర్ గ్రామంలో రాజా, సుకాంతి దంపతులు నివిస్తున్నారు. అయితే యాస్ తుపాను ఒడిషాలో తీరం దాటిన రోజు రాత్రే సుకాంతికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. చెట్లూ కూలిపోవడంతో కరెంటు తెగిపోయి గ్రామంలో చీకట్లు కమ్మకున్నాయి. రోడ్డుకి అడ్డంగా పడిన చెట్లతో రాకపోకలు ఆగిపోయాయి. ఆ విపత్కర పరిస్థితుల్లోనే సుకాంతి ప్రసవించినా.. తల్లిబిడ్డలకు వైద్య సాయం అత్యవసరమైంది. మరోవైపు వరద నీరు ఇంటిని చుట్టేస్తోంది. ఈ తరుణంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి రాజా ఫోన్ చేశాడు. తల్లిబిడ్డ క్షేమం వాహనాలు పోయే దారి లేకపోవడంతో కాలినడకనే ఎన్డీఆర్ఎప్ బృందం బహదలాపూర్ గ్రామానికి అర్థరాత్రి 2 గంటలకు చేరుకుంది. స్ట్రెచర్ మీదనే సుకాంతిని, నవజాత శిశువుని తీసుకుని కాలినడకన దాదాపు పది కిలోమీటర్లు ప్రయాణించి ఆస్పత్రికి చేర్చారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన వివరాలను ఎన్డీఆర్ఎఫ డీసీ సత్య నారాయన్ ప్రధాన్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. చదవండి: అలజడిలో జననం #CycloneYaasUPDATE 27/5/21@NDRFHQ 𝐑𝐄𝐒𝐂𝐔𝐄 𝐎𝐅 𝐌𝐎𝐓𝐇𝐄𝐑 & 𝐍𝐄𝐖𝐁𝐎𝐑𝐍 🔸Sukanti w/o Raja Jena 🔸& her newborn baby 🔸Bahabalapur,Balasore 🔸Rescued frm flooded village 🔸2 am night 🔸On foot w/stretcher 🔸Safe to hospital@PIBHomeAffairs @ANI @PIBBhubaneswar pic.twitter.com/FEbTUdjG8c — ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) May 27, 2021 -
బావిలో నుంచి కేకలు.. అసలు ఏం జరిగిందంటే..?
రేణిగుంట: మండలంలోని అత్తూరు గ్రామ శివారు న ఉన్న వ్యవసాయ బావిలో పడిన ఓ వృద్ధురాలిని గాజులమండ్యం పోలీసులు కాపాడారు. అత్తూరు గ్రామానికి చెందిన సుబ్బమ్మ(80) కాలకృత్యాలు తీర్చుకునేందుకు శనివారం ఉదయం గ్రామ శివారుకు వెళ్లే క్రమంలో పొరపాటున కాలు జారి వ్యవసాయ బావిలో పడి.. మోటారు పైపును పట్టుకుని కేకలు వేసింది. అటుగా వెళుతున్న స్థానికులు గాజులమండ్యం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ శ్రీనివాసులు ఆదేశాలతో కానిస్టేబుళ్లు శివకుమార్, మహేష్ ఘటన స్థలానికి చేరుకున్నారు. బావికి మెట్లు లేకపోవడంతో ఆమెను బయటకు తీసేందుకు ఓ మంచానికి తాళ్లు కట్టి బావిలోకి వదిలారు. ఆమె మంచంపైకి చేరుకోవడంతో ఆమెను మెల్లగా గట్టుకు చేర్చారు. దీంతో స్థానికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు వెంటనే స్పందించి ఈమేరకు కానిస్టేబుళ్లు శివకుమార్, మహేష్ను అభినందించి రివార్డు ప్రకటించారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: కరోనా చీకట్లో మానవత్వపు చిరు దీపం సీనియర్ జర్నలిస్టు గోపి హఠాన్మరణం -
నడి రోడ్డుపై ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా
సాక్షి, ముంబై: మానవత్వాన్ని చాటుకునేందుకు ఎక్కడ ఎలా, ఏం చేస్తున్నాం అనేది అవసరం లేదు. ఈ ప్రపంచంలో మనతోపాటు కలిసి జీవిస్తున్నచిన్ని ప్రాణులను కూడా కాపాడుకోవాల్సింది మనుషులుగా మనపై ఉంది. ఇలా రోడ్డుపై వెడుతున్న ఓ మహిళ తాబేలును ఆదుకునేందుకు స్పందించిన తీరు నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించినవీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలే మందగమని అయిన తాబేలు ఎలా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ రోడ్డుపై చిక్కుకుంది. అథ్లెట్లా చక్కటి ఫిట్నెస్తో కనిపిస్తున్న ఒకమహిళదీన్ని గమనించా తాబేలును రక్షించేందుకు ముందుకొచ్చారు. రెండు వస్త్రాల సాయంతో దాన్ని పట్టుకుని రోడ్డుమీదినుంచి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో లైక్స్, కమెంట్స్తో దూసుకు పోతోంది. హార్ట్ ఎమోజీలతో నెటిజన్లు తాబేలును రక్షించినందుకు మహిళను తెగ మెచ్చుకుంటున్నారు. -
ఉరితాడు కోసి.. ఊపిరి పోసి
బంజారాహిల్స్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సకాలంలో స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఆమెను కాపాడి పునర్జన్మనిచ్చారు. ఘటన జరుగుతున్న సమయంలో జూబ్లీహిల్స్ పోలీసుల సమయస్ఫూర్తి ఆ మహిళను కాపాడగలిగింది. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–5లోని దుర్గాభవానీనగర్ బస్తీలో నివసించే రమావత్ సిరి (45) అనే మహిళ శనివారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఇంట్లోంచి బయటికి వచ్చి ఓ ఖాళీ ప్లాటులోని చెట్టుకు ఉరేసుకుంటుండగా పక్క ప్లాటులో ఉన్న విశ్వనాథ్రెడ్డి అనే అడ్వకేట్ గమనించారు. వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నైట్డ్యూటీలో ఉన్న ఎస్ఐ శేఖర్ వెంటనే గస్తీ పోలీసులను అక్కడికి వెళ్లాల్సిందిగా పురమాయించారు. అదే సమయంలో విశ్వనాథరెడ్డిని రిక్వెస్ట్ చేసి వెంటనే అక్కడికి వెళ్లి చెట్టుకు కట్టిన తాడును తెంపేయాల్సిందిగా సూచించారు. 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. హుటాహుటిన ఎస్ఐ కూడా అక్కడికి బయల్దేరారు. అయిదు నిమిషాల వ్యవధిలోనే బ్లూకోట్స్ పోలీసులు సందీప్, బాలపెద్దన్న, అడ్వకేట్ విశ్వనాథరెడ్డి అక్కడికి వెళ్లారు. చెట్టుకు వేలాడుతున్న మహిళను కిందకు దించేందుకు తాడును కోసేశారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆమె కొట్టుమిట్టాడుతుండగా అంబులెన్స్ సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి ఆక్సిజన్ అందించి ఊపిరిపోశారు. ఆమె గంట సేపట్లోనే తేరుకుంది. పోలీసులు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఆ మహిళ ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని పోలీసులను స్థానికులు ప్రశంసించారు. ఎస్ఐ శేఖర్కు అధికారులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
భూమ్మీద నూకలుండాలి గానీ..
సిడ్నీ: భూమ్మీద నూకలుండాలిగాని ఎలాంటి ప్రమాదం నుంచైనా ప్రాణాలతో బయటపడొచ్చని మరోసారి తేలింది. ఆస్ట్రేలియాకు చెందిన 91 ఏళ్ల ఓ వృద్ధుడు పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. అంతెత్తు నుంచి సముద్రంలో పడిపోయిన ఆ పెద్దాయన స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన సిడ్నీ ఉత్తర తీరం సమీపంలో జరిగింది. ఆదివారం సాయంత్రం 6.00 గంటల సమయంలో వర్రీవుడ్ సమీపంలో పడిపోయిన తరువాత స్థానికులు అతన్ని బయటకు తీసుకువచ్చారని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది వృద్ధుడికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. వృద్ధుడి కాలికి బ్యాండేజ్ కట్టు వేసి, ప్రథమ చికిత్స చేసి పంపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
నవవధువు కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, జగిత్యాల: జిల్లాలో కలకలం రేపిన నవ వధువు కిడ్నాప్ కేసును 24 గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. పోరండ్ల గ్రామంలో సోమవారం మధ్యాహ్నం కిడ్నాపైన నవ వధువును జగిత్యాల పోలీసుల రక్షించారు. కొడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో కిడ్నాపర్ల చెరనుంచి బాధితురాలిని విడిపించారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన వేముల రాకేశ్, సారంగాపూర్ మండటం పెంబట్ల గ్రామానికి చెదిన సమత కులాంతర వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం సమత సోదరుడు సాయికుమార్తోపాటు మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన బుర్రల ప్రవీణ్ కారులో పొరండ్ల గ్రామానికి వచ్చి మరో నలుగురు రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి రాకేశ్, అతని కుటుంబ సభ్యులపై దాడిచేసి సమతను బలవంతంగా కారులో తీసుకెళ్లారు. రాకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సమతను కిడ్నాపర్ల చేర నుంచి విడిపించారు. (చదవండి: 40 లక్షల అప్పు.. బాలుడి కిడ్నాప్) -
నడుంలోతు నీళ్లు, అయినా మేం ఎక్కడకీ వెళ్లం!
సాక్షి, విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణమ ఉగ్రం రూపం దాల్చింది. విపరీతంగా కృష్ణనదిలోకి నీరు చేరడంతో ప్రజలు వణికిపోతున్నారు. వరదనీరు పోటెత్తడంతో జనజీవానం అతలాకుతలం అవుతోంది. అధిక వర్షాల కారణంగా కృష్ణలంక లోతట్టు ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. భూపేష్ గుప్తా నగర్లోకి నడుం లోతు నీరు చేరుకుంది. దీంతో అక్కడ ఉన్నవారిని ముంపు పునరావాస కేంద్రాలకు తరలించాడనికి అధికారులు ప్రత్నిస్తున్నారు. అయితే దొంగల భయంతో వారు తమ ఇళ్లను విడిచి వచ్చేందుకు ఇష్టం పడటం లేదు. వీరంతా గట్టుమీద గుడారాలు ఏర్పాటు చేసుకొని తలదాచుకుంటున్నారు. ట్యూబుల సహాయంతో ఇళ్ల నుంచి సామాన్లు తరలిస్తున్నారు. కరుణించి కాపాడమంటూ కృష్ణమ్మను వేడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. చదవండి: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ -
లోయలో పడ్డ కుక్క.. చిరు తిండి చూపించి!
సాటి మనిషి కష్టాల్లో ఉంటే అయ్యో పాపం అనే మనసు అందరికి ఉంటుంది. కానీ సాయం చేసే మంచి మనసు చాలా అరుదు. పక్కనున్న వారినే పట్టించుకోవడంలేని నేటి సమాజంలో ప్రాణం పోయే స్థితిలో ఉన్న కుక్కను రక్షించి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓవ్యక్తి. అయితే ఆ వ్యక్తి కుక్కను రక్షించిన విధానం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు. వివరాలు.. కొందరు సభ్యులతో కూడిన బృందం నార్త్ కరోలినా ప్రాంతంలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో పక్కన ఉన్న లోయలో ఓ కుక్క పడిపోయి ఉండటాన్ని గమనించారు. దాదాపు 30 అడుగుల లోతు ఉన్న లోయలో కుక్క చిక్కుకొని చాలా రోజులవుతున్నట్లు తెలుస్తోంది. (వైరల్: ఈ కుక్క పిల్ల చాలా తెలివైంది) అయితే దానిని బయటకు తీసేందుకు ఆలోచించిన బైకర్లు వెంటనే సహాయం కోసం బుర్కే కౌంటీ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాన్ని పిలిచారు. అనంతరం వారంతా కుక్క చిక్కుకున్న లోయ వద్దకు వెళ్లి దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం చూపిస్తే ఉత్సాహంతో పరుగులు పెడుతుంది అనుకొని స్క్యూవర్స్ లోయ లోపలికి వెళ్లి కుక్కకు మాంసం, స్నాక్స్ ప్యాకెట్స్ చూపించారు. తర్వాత జీను సాయంతో దానిని సురక్షితంగా బయటకు తీశారు. కుక్కు ఎలాంటి గాయాలు కాలేదని, అయితే చాలా రోజుల నుంచి ఆకలితో ఆలమటిస్తుందని వారు తెలిపారు. కుక్కను రక్షించిన విధానాన్ని రెస్క్యూవర్స్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కుక్కకు సింకర్ అని పేరు పెట్టారు. దీని యజమానులు దొరక్కపోతే ఎవరైనా కుక్కను దత్తత తీసుకోవచ్చు అని అధికారులు తెలిపారు. (ఆ సూట్కేస్ను చూడకపోతే ఏం జరిగేది?) -
13 గంటలు.. ప్రాణాలు అరచేతిలో..
నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తి పెన్నావరద నీటిలో చిక్కుకుపోయాడు. 13 గంటల పాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురుచూశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద అతడిని రక్షించారు. వివరాలు.. గూడూరు పాతబస్టాండ్ ప్రాంతానికి చెందిన రామ్బాబు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో నెల్లూరు భగత్సింగ్కాలనీ సమీపంలోని పెన్నానూతన బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. పెన్నానదిలో నీటి ప్రవాహం పెరగడంతో వెనక్కురాలేక అక్కడే నీటిలో చిక్కుకుపోయాడు. అతికష్టంపై బ్రిడ్జి పిల్లర్ను పట్టుకుని వేలాడసాగాడు. రాత్రంతా అక్కడే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపాడు. శనివారం ఉదయం బ్రిడ్జి పిల్లర్ను పట్టుకుని వెళ్లాడుతున్న అతడిని స్థానికలు గుర్తించి అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. నెల్లూరు అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో రెస్క్యూటీం రంగంలోకి దిగి అతడిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. బ్రిడ్జిపై నుంచి రోప్సహాయంతో పిల్లర్పైకి దిగారు. రాంబాబుకు లైఫ్జాకెట్ వేసి రోప్సాయంతో బ్రిడ్జిపైకి తీసుకువచ్చారు. అనంతరం 108లో బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఆపరేషన్లో లీడింగ్ ఫైర్మన్ ఎం.సుధాకర్, ఫైర్మెన్లు హజరత్, నారాయణ, శేషయ్య, డ్రైవర్ పవన్కుమార్ ఉన్నారు. -
‘శ్రీశైలం’ ఎఫ్ఐఆర్లో మార్పులు!
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది మందిని బలితీసుకున్న శ్రీశైలం దుర్ఘటన ప్రైమరీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్)లో మార్పులు జరిగాయి. గత గురువారం రాత్రి 4వ ఫేజ్లో సంభవించిన అగ్ని ప్రమాదం తొమ్మిది మంది మరణానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీనిపై స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శనివారం హైదరాబాద్ నుంచి ఈగలపెంట వెళ్లిన సీఐడీ బృందం పలు కీలక ఆధారాలు సేకరించింది. వారు గమనించిన అంశాల ఆధారంగా ఎఫ్ఐఆర్లో మార్పులు జరిగాయని సమాచారం. కేసును మలుపు తిప్పే ఆధారాలు సీఐడీ విభాగానికి లభించాయని, అందుకే, ఎఫ్ఐఆర్లో మార్పులు చేసి ఉంటారని పలువురు ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యమా? నిర్వహణ లోపమా?: ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో పోలీసులు ప్రధానంగా నిర్లక్ష్యం, కుట్ర, నిర్వహణ లోపాలపై దృష్టి సారిస్తారు. ఈ కేసులో కుట్రకు అవకాశం లేకపోవడంతో సీఐడీ అధికారులు నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలపైనే దృష్టి పెట్టారని సమాచారం. ఈ రెండు అంశాలపై లోతైన దర్యాప్తు జరపనున్నారు. ఇందులో భాగంగా సీఐడీ అధికారుల బృందం శ్రీశైలం పవర్ప్లాంట్ను ఈ వారంలోనే సందర్శించే అవకాశాలు ఉన్నాయి. సొంత రెస్క్యూ టీమ్ ఎక్కడ?: సింగరేణి భూగర్భ గనులు ఉన్న ప్రాంతాల్లోనూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక్కడ టన్నెల్ 1.2 కిలోమీటరుకుపైగా భూమి లోపలికి ఉంటే.. సింగరేణి బొగ్గు గనులు 5 కిలోమీటర్లకుపైగా ఉంటాయి. గనుల్లో ప్రమాదాలు జరిగితే కార్మికులను రక్షించేందుకు ప్రత్యేకం గా రెస్క్యూ సిబ్బంది ఉంటారు. సింగరేణిలో ఎక్కడ ప్రమాదం జరిగినా.. క్షణాల్లో వీరికి సమాచారం చేరుతుంది. కొద్ది నిమిషాల్లోనే వీరు ఘటనా స్థలానికి చేరి సహాయక చర్యలు ప్రారంభిస్తారు. కానీ, శ్రీశైలం పవర్ప్లాంట్కు ఈ తరహా ఏర్పాటు లేదు. పవర్ప్లాంట్లో రక్షణ చర్యల విషయంలో సీఐడీ అధికారులు సంతృప్తిగా లేరని సమాచారం. ప్రత్యేక రెస్క్యూ విభాగం ఉంటే ప్రాణనష్టం తక్కువగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. మంటలనార్పేందుకు ప్రస్తుతం ఉన్న వ్యవస్థపైనా అధికారులు పెదవి విరుస్తున్నారు. వందల కిలోవాట్ల మేర సామర్థ్యమున్న మెషీన్లకు అగ్నిప్రమాదం సంభవిస్తే.. ఆర్పేందుకు ధీటైన అగ్నిమాపక సదుపాయాలు లేవన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమైనట్టు సమాచారం. -
ముగ్గురమ్మల చీర.. వరదకు ఒడ్డుతాడు
అమ్మ చీర ఉయ్యాల అవుతుంది. ఆడించే ఒడి అవుతుంది. చినుకులకు గొడుగు అవుతుంది. ఉక్కపోతకు వింజామర అవుతుంది. చలిలో వెచ్చదనం అవుతుంది. తల్లీబిడ్డల బొడ్డుతాడు బంధమది. ఈ ముగ్గురమ్మల చీర.. వరదకు ‘ఒడ్డుతాడు’ అయింది! రేపటికి సరిగ్గా వారం. ఆగస్టు 6న కొట్టారై ఆనకట్ట దగ్గర ఇది జరిగింది. పన్నెండు మంది యువకులు క్రికెట్ ఆడటం కోసం ఆ సమీపంలోని సిరువచ్చూరు గ్రామం నుంచి కొట్టారై వచ్చారు. ఆడారు. ఆనకట్ట దగ్గరకు వెళ్లారు. వర్షాలకు మరుదైయారు నది కళ్ల నిండుగా ఉంది. స్నానానికి ఉబలాటపడ్డారు పిల్లలు. అంతా పదిహేనూ ఇరవై ఏళ్లలోపు వాళ్లు. నీటి మట్టం కూడా వాళ్లకు ఈడూ జోడుగా 1520 అడుగుల లోతున ఉంది. ఉద్ధృతంగా ఉంది. ఊపును, ఉత్సాహాన్నీ ఇస్తోంది. ‘‘ఆంటీ ఇక్కడ దిగొచ్చా.. స్నానానికి?!’’ వర్షాలు పడుతూ వరద మట్టం పెరుగుతుండ బట్టి ఆ ప్రశ్న అయినా అడిగారు. లేకుంటే ఆ వయసు వాళ్లను ఆపేదెవరు? ‘‘వద్దు బాబూ.. ఈ చివర్నే ఉండంyì ’’ అని చెప్పారు సెంతమిళ్ సెల్వి, ముత్తమ్మాళ్, అనంతవల్లి. ఒడ్డున బట్టలు ఉతుక్కుని వెళుతుండగా ఈ ముగ్గురికీ ఆ గుంపు కనిపించింది. అప్పటికే వాళ్లలో కొందరు కిట్లు పక్కన పడేసి చొక్కాలు తీసి నీళ్లలో మునిగేందుకు సిద్దమయ్యారు. ఆలోపే నలుగురు నదిలోకి దూకే శారు!! క్షణాల్లో అరుపులు మొదలయ్యాయి. నదిలోకి దూకిన వారివీ, ఒడ్డున ఉన్నవారివీ ఆ అరుపులు. వీళ్లను దాటుకుని వెళ్లిన ఆ ముగ్గురు మహిళలూ పరుగున వెనక్కు వచ్చారు. నీళ్లలోంచి ఎనిమిది చేతులు కొట్టుకుంటూ కనిపిస్తున్నాయి.. చిన్న ఆధారం దొరికితే పట్టుకుందామని. వాళ్లను బయటకి లాగేందుకు గజ ఈతగాళ్లే వెళ్లినా చేతులు ఎత్తేసే పరిస్థితి! ‘‘ఆంటీ.. ఆంటీ.. ’’ అంటూ.. ఒడ్డున ఉన్న పిల్లలు.. నదిలో కొట్టుకుపోతున్న స్నేహితుల్ని కాపాడమని పెద్దగా కేకలు వేస్తున్నారు. గ్రామీణులు కాబట్టి ఆ మహిళలకు ఈత వచ్చి ఉంటుందని వాళ్ల ఆశ. కానీ సెంతమిళ్ సెల్వి, ముత్తమ్మాళ్, అనంతవల్లి ఈత తెలిసినవాళ్లు కాదు. అలాగని వాళ్లను వదిలేసి వెళ్లినవాళ్లూ అవలేదు. తెగించి నీళ్లలోకి దూకారు. చేతికి అందుబాటులో ఉంటే చెయ్యిచ్చి లాగే ప్రయత్నం చేసేవారేమో! అప్పటికే చేయిదాటి పోతున్నారు వీళ్లింకేమీ ఆలోచించలేదు. సంశయించలేదు. సంకోచించలేదు. ఒంటి మీద చీరలను తీసి ఆ మునిగిపోతున్న వారివైపు విసిరారు. భయపడ్డ పిల్లాడు అమ్మ కొంగును ఇక జన్మలో వదలకూడదన్నంత గట్టిగా పట్టుకున్నట్లు గుప్పెట్లు బిగించి నలుగురిలో ఇద్దరు ఒడ్డుకు రాగలిగారు. మిగతా ఇద్దరు పెరంబలూరు జిల్లా కేంద్రం నుంచి వచ్చిన గాలింపు సిబ్బందికి విగతజీవులై దొరికారు. బతికినవాళ్లు కార్తీక్, సెంథిల్వేలన్. చనిపోయినవారు పవిత్రన్, రంజిత్. చనిపోయిన వాళ్లు ఎలా చనిపోయారన్న వార్త వెంటనే బయటికి వచ్చేసింది. బతికినవాళ్లు ఎలా బతికారన్నది ఆ టీమ్లోని వాళ్లు చెప్పుకుంటుంటే ఇన్నాళ్లకు ప్రపంచానికి తెలిసింది. స్నేహితుల మరణంతో వాళ్లెంత దుఃఖంలో ఉన్నారో, మిగతా ఇద్దరు పిల్లల్ని రక్షించలేకపోయామే అనే దుఃఖంలో ఆ ముగ్గురు తల్లులూ ఉన్నారు. వాళ్లది కొట్టారై దగ్గరి అదనురై. అక్కడికిప్పుడు ఎవరెవరో వచ్చి వాళ్లను ప్రశంసించి వెళుతున్నారు. కొందరైతే వాళ్లకు నమస్కరించడానికే వెళ్లి వస్తున్నారు. -
తెగించి ప్రాణాలు కాపాడారు
కర్ణాటక,రాయచూరు రూరల్: ఓ మహిళ అదుపు తప్పి వాగులో పడి కొట్టుకుపోతుండగా కొందరు యువకులు ధైర్యసాహసాలు ప్రదర్శించి నీటిలోకి దూకి ఆమెను కాపాడారు. వివరాలు.. మూడు రోజలుగా కురుస్తున్న భారీ వర్షాలతో యాదగిరి జిల్లా శహపుర తాలూకా పగలాపుర వద్ద కోయిలూరు వాగి పొంగి ప్రవహిస్తోంది. ఆశనాలకు చెందిన మహిళ, మరికొంతమంది కూలీలు శనివారం ఉదయం ఆటోలో పగలూరులోని పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి ఆటోలో వస్తుండగా కోయిలూరు వాగులో నీటి ఉధృతిని చూసి డ్రైవర్ ఆటోను నిలిపివేశాడు. దీంతో కూలీలు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని వాగు దాటుతుండగా నాగమ్మ(29)అనే మహిళ అదుపు తప్పి నీటిలో పడి కొట్టుకుపోయింది. దీంతో మిగతా వారు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న యువకులు వాగులోకి దూకారు. మెడలోతు వరకు నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా ఈదుకుంటూ వెళ్లి నాగమ్మను రక్షించారు. -
శభాష్ ఎమ్మెల్యే, నీటిలోకి దిగి మరీ...
-
శభాష్ ఎమ్మెల్యే, నీటిలోకి దిగి మరీ...
గువహటి: ఒకసారి ఓట్లేసి గెలిపించిన తరువాత తిరిగి ఓటర్ల ముఖం చూడని ప్రజా ప్రతినిధులను చూస్తుంటాం. ఎప్పుడో ఎన్నికల సమయంలో తప్ప ఇంకెప్పుడు వారికి ప్రజలు గుర్తు రారు. వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మాత్రం ఏదో వచ్చామా, చూశామా, వెళ్లామా అన్నట్లు ఉంటారు. అయితే అసోంలోని ఒక ఎమ్మెల్యే మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించించారు. తన నియోజక వర్గంలో వరదలో చిక్కుకున్న ప్రజలను, పశువులను స్వయంగా నీటిలోకి దిగి మరీ కాపాడారు. చదవండి: వరద బీభత్సం.. 99 గ్రామాలు జలమయం గత కొద్ది రోజులుగా అసోంను వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అసోం ఎమ్మెల్యే మృణాల్ సైకియా వరదలో చిక్కుకున్న మారుమూల ప్రాంతాలకు చెందిన ప్రజలను కాపాడే సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నారు. నీటిలోకి దిగిమరి వారిని కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో తన చేతులతో ఒక బాబును పైకి ఎత్తి పట్టుకొని, నడుము వరకు లోతున్న నీటి నుంచి ఆ బాబును కాపాడారు. ‘మా నియోజకవర్గంలో వరదలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి మేం ప్రజలను కాపాడుతున్నాం’ అని పేర్కొన్నారు. ఇక ప్రజలతో పాటు పశువులను వరద ముప్పు ప్రాంతం నుంచి తరలిస్తున్న వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. ‘మా గ్రామ ఆర్ధిక వ్యవస్థలో పశువులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వందలాది మేకలను కాపాడినందకు సంతోషంగా ఉంది’ అని ట్వీట్ చేశారు. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు మృణాల్ను ప్రశంసలతో ముంచెత్తున్నారు. ‘మీరు ఎంతో మంది ప్రజల ప్రతినిధులకు ఆదర్శం. ఇప్పటి నుంచైనా మిగిలిన వారు మీలా ఉండాలని ఆశిస్తున్నాను. ప్రజల రుణం తీర్చుకునే సమయమిది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. 27 జిల్లాలకు చెందిన 22లక్షల మంది ఈ వరదల వల్ల ప్రభావితమయ్యారు. సుమారు 85 మంది ప్రాణాలు కోల్పోయారు. -
జలపాతంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని..
కాలిఫోర్నియా: నీళ్లలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని అధికారులు రక్షించిన ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఓ యువకుడు నగరంలోని ఏంజెల్ జలపాతాన్ని ఆస్వాదిస్తూ దాన్ని దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో కాలుజారి పట్టుతప్పి అందులోనే పడిపోయాడు. దీంతో అతను వేగంగా వస్తున్న నీటి ఉధృతికి బెంబేలెత్తుతూ సాయం కోసం అర్థించాడు. అప్పటికే శరీరమంతా నీళ్లలో మునిగిపోగా తల మాత్రమే పైకి కనిపిస్తోంది. మరోవైపు నీళ్లు సెకనుకు 50 నుంచి 80 అడుగుల వేగంతో ప్రవహిస్తుండటంతో ఏ క్షణమైనా అతను కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఇతడిని గుర్తించిన డాన్లీ సహా ఇతర అధికారులు వెంటనే అతడిని రక్షించేందుకు పూనుకున్నారు. ముందుగా యువకుడికి కర్రను అందించారు. కానీ అది అతడి చేయికి అందలేదు. (దొంగ కోతి: ఏటీఎమ్ చోరీకి విశ్వ ప్రయత్నం) దీంతో డాన్లీ తన బ్యాగు పట్టీని తాడుగా ఉపయోగించి కర్రకు కట్టాడు. అనంతరం బాదితుడికి అందించగా అతను దాన్ని ఆసరాగా చేసుకుని ఒడ్డుకు వచ్చాడు. రెండు రోజుల క్రితం నాటి ఈ వీడియోను అక్కడి అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్గా మారింది. యువకుడిని ప్రాణాలతో కాపాడిన అధికారి డాన్లీని నెటిజన్లు పొగుడుతున్నారు. "నోటికి పని చెప్పకుండా మెదడుకు పని చెప్పావ"ని కీర్తిస్తున్నారు. "వీరు సాయం చేయకపోయుంటే అతని పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకోడానికే భయంకరంగా ఉంద"ని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. "ఈ సమయంలో నదులు, చెరువులకు దూరంగా ఉండండ"ని మరో నెటిజన్ సలహా ఇచ్చాడు. (అలిగి కారేసుకు వెళ్లిన ఐదేళ్ల బుడ్డోడు) -
ఇప్పటికి 325 మంది పిల్లల్ని రక్షించాం
సాక్షి, హైదరాబాద్ : ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమం చాలా మంచి ఫలితాలిస్తుందంటున్నారు సీపీ అంజనీ కుమార్. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘జనవరి1, 2019 నుంచి ‘ఆపరేష్ స్మైల్’ నిర్వహిస్తున్నాం. తప్పిపోయిన పిల్లల్ని ట్రేస్ చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. దీని కోసం అడిషనల్ సీపీ క్రైం నేతృత్వంలోని 17 బృందాలు పాల్గొన్నాయి’ అని తెలిపారు. అంతేకాక ‘‘ఆపరేషన్ స్మైల్’లో భాగంగా ఇప్పటివరకూ 325 మంది చిన్నారులను కాపాడాం. వీరిలో 11 మంది బాలికలు ఉన్నారు. ఇలా కాపాడిన పిల్లల్లో 272 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించాము. 53 మందిని రెస్క్యూ హోమ్లో చేర్పించామ’ని తెలిపారు. ‘దర్పణ్’ అనే ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా ఈ పిల్లలను కనిపెట్టగలిగినట్లుగా సీపీ చెప్పారు. అంతేకాక చిన్నారుల చేత పనులు చేయిస్తున్న 14 మంది మీద కేసులు నమోదు చేశామని తెలిపారు. ‘మా పిల్లల్ని క్షేమంగా మా వద్దకు చేర్చిన హైదరాబాద్ పోలీసులకు రుణపడి ఉంటాం. మా పిల్లల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. మాయమాటలు చెప్పి పిల్లల్ని తీసుకెళ్లి వారిని బాలకార్మికులుగా మారుస్తున్నారు. వీరిని కఠినంగా శిక్షించాలని బాధిత పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
భళా.. పోలీస్
దుండిగల్: ఆత్మహత్యకు యత్నించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తరలించి సురక్షితంగా కాపాడి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు.. వివరాల్లోకి వెళితే.. మెదక్జిల్లా, మేడికొండ తాండా కు చెందిన వినోద్కుమార్ దుండిగల్ పోలీస్స్టేషన్ పరిసరాల్లో ఉంటూ ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన వినోద్కుమార్ శుక్రవారం భార్యతో గొడవ పడి ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. దీంతో అతని భార్య స్థానికులను అప్రమత్తం చేయడంతో వినోద్కుమార్ను కిందకు దింపారు. అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి చేరుకోగా, స్థానికులు దుండిగల్ పెట్రోలింగ్ వాహనానికి సమాచారం అందించారు. క్షణాల్లో అక్కడికి చేరుకున్న హెడ్కానిస్టేబుల్ వెంకటయ్యగౌడ్, డ్రైవర్ కృష్ణారెడ్డి అతడిని పై అంతస్తు నుంచి భుజాలపై కిందకు తీసుకు వచ్చి సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వినోద్కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించి బాధితుడిని ఆస్పత్రికి రక్షించిన పోలీసులను స్థానికులు అభినందించారు. -
యాక్షన్ సీన్ను తలపించేలా..వైరల్!
-
వైరల్: అచ్చం సినిమాలా!
సాక్షి, న్యూఢిల్లీ: నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కించడం సులువే. కానీ సినిమాలోని యాక్షన్ సీన్స్ మాత్రం నిజజీవితంలో సాధ్యం కాదంటే పొరపాటే. ఢిల్లీ పోలీసులు అచ్చం సినిమా యాక్షన్ సీన్ను తలపించేలా యువజంటను కాపాడారు. ఇప్పుడా పోలీసుల రెస్య్కూ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పోలీసుల ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. అత్యంత రద్దీగా ఉండే సెంట్రల్ ఢిల్లీ దగ్గర్లోని పాహర్గంజ్లోని ఓ అపార్ట్మెంట్ రెండో అంతస్తులో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఆ అపార్టుమెంట్లో ఉండే యువజంట ప్రాణాలు కాపాడుకోవడానికై పైనుంచి దూకే ప్రయత్నం చేశారు. కానీ బాల్కనీలో చిక్కుకొని వేలాడుతూ ఉండటంతో రక్షించండంటూ కేకలు వేశారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాలుగో అంతస్తు నుంచి చిన్న నిచ్చెన వేసుకొని, చైన్లా ఏర్పడి.. అత్యంత ధైర్యసాహసాలతో వారిని సురక్షితంగా కాపాడారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. -
కేరళ వరదలు ; వెన్నును మెట్టుగా మార్చి.. వైరల్ వీడియో!
తిరువనంతపురం : భారీ వర్షాలకు కేరళ చివురుటాకులా వణికిపోతున్న సంగతి తెలిసిందే. వరద బాధితులను రక్షించడానికి సహాయక బృందాలు శక్తికి మించి కృషి చేస్తున్నాయి. సహాయక చర్యలో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ బలగాలకు పలువురు మత్య్సకారులు తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. వెంగర ప్రాంతంలో దాదాపు 600 మంది స్థానిక మత్స్యకారులు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సహాయక శిబిరాలు చేర్చేందుకు తమ వంతు కృషిచేస్తున్నారు. అలా సహాయక చర్యల్లో పాలు పంచుకున్న కేపీ జైస్వాల్ అనే మత్య్సకారుడు రియల్ హీరోగా నిలిచాడు. వరదల్లో చిక్కుకున్న మహిళలను, చిన్నారులను బోట్లోకి ఎక్కించడానికి అతను నీటిలో వంగి తన వెన్నును మెట్టుగా మార్చాడు. అలా మహిళలు, చిన్నారులు బోటు ఎక్కడానికి సహాయపడ్డాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతంలోకి చేరుకోవడం కష్టంగా మారడంతో.. వారి వద్ద నుంచి బోట్లను తీసుకుని వరదల్లో చిక్కుకున్న వారిని తామే సహాయక శిబిరాలకు చేరవేస్తున్నట్టు జైస్వాల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మరింది. జైస్వాల్ చర్యను నెటిజన్లు అభినందిస్తున్నారు. అతన్ని రియల్ హీరో అంటు నెటిజన్లు కొనియాడుతున్నారు. కాగా, కేరళ ప్రజలను ఆదుకోవడానికి ఇతర రాష్ట్రాలతో పాటు, దేశ నలుమూలల నుంచి పలువురు తమకు తోచిన సహాయాన్ని అందజేస్తున్నారు. ఇతర దేశాలు కూడా కేరళ వరదల్లో చిక్కుకున్న వారికి ఆపన్న హస్తం అందించడానికి ముందుకొస్తున్నాయి. -
కేరళ వరదలు ; వెన్నును మెట్టుగా మార్చాడు
-
నోటితో శ్వాస అందించి.. ప్రాణం పోసిన యువతి
బీజింగ్ : చైనాలో ఓ యువతి సమయస్పూర్తి ఓ మనిషి ప్రాణాలను కాపాడగలిగింది. చైనాలోని జింజూ సమీపంలోని రైల్వే స్టేషన్లో 81 ఏళ్ల వృద్ధుడు స్పృహ తప్పి పడిపోయాడు. అదే సమయంలో అటుగా వెళుతోన్న ఓ యువతి వెంటనే స్పందించింది. వృద్ధుడిని పడుకోబెట్టి, అతని పై మోకాళ్ల మీద కూర్చుని రెండుచేతులనూ కలిపి బలంగా అతని ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కింది. ఒకవైపు ఇలా చేస్తూనే మరో వైపు నోటి ద్వారా శ్వాస అందించింది. ఇలా అరగంట పాటూ ఈ ప్రక్రియను కొనసాగించింది. సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిసస్సీటేషన్) ప్రక్రియ ద్వారా కుప్పకూలిన మనిషికి తిరిగి ప్రాణం పోసింది. వృద్ధుడికి సీపీఆర్ విధానం ద్వారా ప్రాణం పోసిన యువతిని జింజూలోని మెడికల్ కాలేజీ స్టూడెంట్ డింగ్ హుయ్గా గుర్తించారు. వృద్ధుడి ప్రాణాలను కాపాడే పనిలో నిమగ్నమైన డింగ్ హుయ్ ఇంటికి వెళ్లాల్సిన ట్రైన్ని కూడా మిస్సయింది. యువతి చూపిన చొరవకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇక మనదేశంలో సంభవిస్తున్న గుండెపోటు మరణాల్లో సగం కేవలం ప్రథమచికిత్స అందకే సంభవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గుండెపోటును గుర్తించగానే తక్షణ ప్రథమచికిత్సగా సీపీఆర్ చేయాలి. సీపీఆర్ కేవలం వైద్యులు లేక పారామెడికల్ సిబ్బంది మాత్రమే కాకుండా కొద్దిపాటి శిక్షణ పొందిన ఎవరైనా చేయొచ్చు. సీపీఆర్ వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, అది మెదడుకు చేరి అవయవాలకు తగిన సంకేతాలనివ్వటంతో బాధితుడు వేగంగా ప్రమాదం నుంచి బయటపడతాడు. ఇలా చేయాలి.. ముందుగా గుండెపోటుతో పడిపోయిన బాధితుడిని పడుకోబెట్టాలి. అతని పక్కనే ఎవరైనా మోకాళ్ల మీద కూర్చుని.. రెండుచేతులనూ కలిపి.. బలంగా బాధితుడి ఛాతీ ఎముక మీద లయబద్ధంగా నొక్కుతుండాలి. ఇలా నొక్కినప్పుడు గుండె పంపింగ్ జరిగి.. రక్తప్రసారం మెరుగవుతుంది. ఒకవైపు ఇలా చేస్తూనే మరో వైపు నోటి ద్వారా శ్వాస అందించాలి. ఒకరి కంటే ఇద్దరు సీపీఆర్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జాగ్రత్తలు ► సీపీఆర్ కు ముందు బాధితుడు సృహలో ఉన్నాడా లేదా అని గమనించాలి. ఆ వ్యక్తి స్పందించకపోతే పెద్దగా అరవాలి. ► సీపీఆర్ చేసేటప్పుడు భుజాన్ని అటూ ఇటూ కదిలిస్తూ అతనికి ధైర్యం చెప్పాలి. ప్రమాదం లేదని హామీ ఇవ్వాలి. ► బాధితుడికి గాలి ఆడకుండా చుట్టూ జనాలు మూగితే వారిని పక్కకు వెళ్లేలా చూడాలి. ► ఒకవేళ అప్పటికే బాధితుడు సృహ కోల్పోయి స్పందించకపోతే వెంటనే అంబులెన్స్కి సమాచారం ఇవ్వాలి. అవసరం మేరకు 'ఎఇడి' సీపీఆర్ తో చెప్పుకోదగ్గ ఫలితం లేని కేసుల్లో ఎఇడి (ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిల్లేటర్) తప్పనిసరి. ఎఇడి పరికరంలో రెండు ప్యాడ్లను బాధితుడి ఛాతి మీద పెట్టి విద్యుత్ షాక్ ఇస్తారు. ‘షాక్ ఇవ్వండి, ఆపండి’ అంటూ పరికరం చేసే సూచనలను పాటిస్తూ చేయాలి. పెద్ద పెద్ద కార్యాలయాలు, అపార్టుమెంట్లు, సమావేశ మందిరాల వద్ద తప్పనిసరిగా వీటిని అందుబాటులో ఉంచగలిగితే ఇప్పుడు సంభవించే మరణాల్లో 30 నుంచి 50శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
ఓ మనిషికి ప్రాణం పోసిన యువతి
-
సాహస వీరులు
-
థాయ్లాండ్ గుహలో చిక్కుకున్న వారి కోసం..
మే సాయ్ : థాయ్లాండ్లోని తామ్ లువాంగ్ గుహలో చిక్కుకున్నవారి కోసం చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం 12 గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్లో నలుగురు విద్యార్థులు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే కోచ్తో పాటు మిగిలిన 8 మంది విద్యార్థుల్ని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీరి ఆపరేషన్కు సాయంగా టెక్ పారిశ్రామిక వేత్త ఇలాన్ మస్క్ ఓ మినీ-సబ్మెరైన్ను రూపొందించారు. లాస్ ఎంజెల్స్లోని స్విమ్మింగ్ పూల్లో దీన్ని పరీక్షించిన వీడియోను సైతం ఆయన ట్విటర్లో షేర్ చేశారు. ‘బహుషా.. ఇది థాయ్ ఆపరేషన్కు ఉపయోగపడుతుందనుకుంటున్నా.’ అని ఆ వీడియోకు క్యాప్షన్గా పేర్కొన్నారు. ఆ గుహలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఈ చిన్న సైజు సబ్మెరైన్ ఉపయోగపడనుంది. ఇలాన్ తెలిపిన సమయం ప్రకారం ఇది ఇప్పటికే థాయ్లాండ్కు చేరి ఉంటుంది. ఇక ఇది రక్షణదళాలు ఉపయోగించే సబ్మెరైన్ను పోలీ ఉండే ఈ మినీ సబ్మెరైన్ ద్వారా ఆక్సిజన్, ఆహారం తీసుకెళ్లడంతో పాటు.. దీని సహాయంతో నీటీ నుంచి సులవుగా బయటకు రావచ్చు. సహాయక కోచ్ ఎకపాల్(25)తో కలసి12 మంది విద్యార్థులు గత జూన్ 23న తామ్ లువాంగ్ గుహలోకి ప్రవేశించారు, వరదనీటితో ప్రవేశద్వారం మునిగిపోవడంతో వీరంతా లోపల ఇరుక్కున్న విషయం తెలిసిందే. చదవండి: ఆపరేషన్ ‘థాయ్’ సక్సెస్ -
థాయ్ ఆపరేషన్కు చిన్న సైజు సబ్మెరైన్
-
మహిళను కాపాడిన లెక్చరర్
కావలిరూరల్: అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మహిళను ప్రాణాలకు తెగించి ఓ అధ్యాపకుడు కాపాడారు. పట్టణంలోని జనతాపేటకు చెందిన మాదవరపు మహేష్ కో ఆపరేటీవ్ కళాశాలలోని తన గురువు విశ్రాంత ప్రిన్సిపల్ రత్నజోసెఫ్ ఇంటికి వచారు. ఆ సమయంలో రత్నజోసెఫ్ ఇంటి ఎదురుగా మిద్దెపైన ఉన్న మందా వెంకటేశ్వరరావు ఇంటి నుంచి కేకలు వినిపిస్తున్నాయి. వీధిలోని వారంతా అక్కడ గుమికూడి చూడగా వంట గదిలో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయి. వెంకటేశ్వరరావు భార్య అన్నపూర్ణ మంటలను దాటుకొని బయటకు రాలేక భయంతో కేకలు వేస్తూంది. అక్కడికి చేరుకున్న వారు అగ్నిమాపకశాఖ వారికి సమాచారమందించి చూస్తూ నిలబడిపోయారు. అయితే ప్రమాదాన్ని గ్రహించిన మహేష్ వెంటనే మిద్దె మీదకు వెళ్లి తలుపులు నెట్టివేసి లోనికి వెళ్లాడు. అయితే మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఫ్రిజ్కు అంటుకుంటున్నాయి. అత్యంత వేగంగా అన్నపూర్ణను చాకచక్యంగా పక్కకు తప్పించి గ్యాస్ సిలిండర్ను నెట్టేయడంతో అది పక్కకు పడిపోయింది. బెడ్షీటును తడిపి గ్యాస్ సిలిండర్పై వేయడంతో మంటలు ఆరిపోయాయి. గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ను ఆఫ్ చేసి సిలిండర్ కిందకి తీసుకువెళ్లాడు. అగ్నిమాపక శాఖ సిబ్బంది గ్యాస్ సిలిండర్ను పరిశీలించి పూర్తిగా ప్రమాదం తప్పిందని నిర్ధారించారు. మహేష్ ప్రాణాలకు తెగించి ఈ సాహసం చేసి అన్నపూర్ణను కాపాడటతో పలువురు అభినందించారు. -
స్నేహితురాలిని కాపాడబోయి యువతి మృతి
పోలవరం: గోదావరిలో ప్రమాదవశాత్తు పడి మునిగిపోతున్న స్నేహితురాలిని కాపాడబోయి ఓ యువతి మరణించింది. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన ర్యాలి సాయిరమ్య(18) గూటాల పంచాయతీ కొత్తపట్టిసీమ గ్రామం వద్ద ఆదివారం గోదావరిలో మునిగిపోయి మరణించింది. కొవ్వూరులోని ఏబీఎన్పీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రమ్య స్నేహితులతో కలసి కొత్తపట్టిసీమలోని మరో స్నేహితురాలైన వలవల శ్రీవల్లి ఇంటికి శనివారం సాయంత్రం వచ్చింది. పోలవరం ప్రాజెక్టు చూడాలని రాత్రి వారంతా అక్కడే ఉన్నారు. ఆదివారం ఉదయం స్నేహితులైన శ్రీవల్లి, ఊనగట్లకు చెందిన గూడపాటి సాయిభవాని, కొవ్వూరుకు చెందిన ప్రత్యూషలతో కలిసి గోదావరినదికి స్నానానికి వెళ్లింది. నది ఒడ్డున నిలబడి సెల్ఫీలు తీసుకుంటుండగా, సాయిభవాని తలపై నీళ్లు చల్లుకునేందుకు నదిలోకి వంగింది. ఆమె నిలబడిన రాళ్లు నాచుపట్టి ఉండటంతో నదిలోకి జారిపడింది. ఆమెను కాపాడేందుకు సాయిరమ్య ప్రయత్నించగా, ఇద్దరూ నదిలో మునిగిపోయారు. కేకలు వేయటంతో దగ్గరలో ఉన్న యువకులు వచ్చి సాయిభవానీని కాపాడారు. ఈమె పోలవరం వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకుంది. సాయిరమ్య మృతి చెందింది. పోలవరం ఎస్సై కె.శ్రీహరిరావు స్బిబందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దొమ్మేరులో విషాదఛాయలు కొవ్వూరులో విషాదఛాయలు సాయిరమ్య మృతితో ఆమె స్వగ్రామం దొమ్మేరులో విషాదఛాయలు అలముకున్నాయి. ర్యాలి శ్రీనివాసరావు ప్రథమ కుమార్తె ఆమె. అపురూపంగా చూసుకునే రమ్య మృతితో కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. సర్పంచ్ ముదునూరి జ్ఞానేశ్వరి, వైఎస్సార్సీపీ నాయకుడు ముదునూరి నాగరాజు సాయిరమ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న సాయిరమ్య మృతి ఆ కుటుంబానికి తీరని లోటని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. -
దారి తప్పిన పెద్దపులి
-
ముగ్గురు భారతీయ యువతులకు విముక్తి
న్యూఢిల్లీ: ముగ్గురు భారతీయ యువతులతో పాటు మరో ఏడుగురు నేపాలీ యువతులకు భారత ప్రభుత్వం విముక్తి కల్పించింది. ఉపాధి నిమిత్తం వెళ్లిన యువతులు కెన్యా దేశంలోని మొంబాసా నగరంలో మోసపోయారు. వారి పాస్పోర్టులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నగరంలోని ఓ ఇంట్లో బంధించారు. భారత హైకమిషన్ అధికారులు స్పందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానిక కెన్యా పోలీసుల సహకారంతో వారిని విడిపించారు. వారిని విడిపించేందుకు శతవిధాలా ప్రయత్నం చేసిన కెన్యాలో భారత హైకమిషనర్ అధికారిణి సుచిత్రా దురై, కరణ్ యాదవ్లను విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అభినందించారు. అలాగే కెన్యా పోలీసుల సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. యువతుల అక్రమ రవాణాకు పాల్పడిన ఏజెంట్లపై కేసు నమోదు చేయాలని పంజాబ్ ప్రభుత్వానికి సుష్మాస్వరాజ్ వివరాలు పంపారు. ఈ విషయాలన్నీ ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. -
ప్రాణం కోసం పోరాటం..బతికాడా? లేదా?
-
ప్రాణం కోసం పోరాటం.. బతికాడా? లేదా?
బీజింగ్ : చావు ఎదురుగా ఉన్నప్పుడు దాని నుంచి తప్పించుకోవాలని తపనపడే మనిషికి.. ఎంతకైనా తెగించాలనే ధైర్యం కూడా ఖచ్ఛితంగా వస్తుంది. తాజాగా చైనాలో ఓ వ్యక్తి అగ్ని కీలల నుంచి తప్పించుకునే క్రమంలో చేసిన సాహసం వైరల్ అవుతోంది. యాహూ న్యూస్ కథనం ప్రకారం.. డిసెంబర్ 13వ తేదీన చోంగ్క్వింగ్ నగరంలోని ఓ బహుళాంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ప్రమాదం జరిగిన అంతస్థు నుంచి బయటపడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో 23వ అంతస్థు నుంచి కిందికి వేలాడాడు. తన ఎదురుగా ఉన్న అద్దాలు పగలకొట్టి, ఆ ఫ్లోర్లోకి దూకేందుకు తీవ్రంగా యత్నించాడు. పై నుంచి అగ్ని కీలలు పడుతున్నా అతను పట్టు విడవలేదు. దూరం నుంచి ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయ్యింది. అయితే చివరకు అతను బతికాడా? లేదా? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగగా.. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అద్దాలను పగల కొట్టి అతన్ని లోపలికి లాగి రక్షించినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న గాయాలతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రాణం కోసం పోరాటం.. బతికాడా? లేదా? -
30 అడుగుల బావిలో చిరుత
గువహటి: అసోం రాజధాని గువహటిలో ఓ చిరుత బావిలో పడిపోయింది. అటవీ ప్రాంతం నుంచి నివాస ప్రాంతాల్లోకి వచ్చిన చిరుతపులి స్థానిక గోకుల్ నగర్లోని సూమారు 30 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయింది. బావిలో పడిన చిరుత అరుపులు విని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుతను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు సుమారు రెండు గంటల పాటు కష్టపడ్డారు. బావిలో పడిన చిరుతను చూడటానికి స్థానికులు భారీగా గుమిగూడారు. రెస్క్యూ అనంతరం చిరుతను అధికారులు రాష్ట్ర జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, ఇటీవల చిరుతలు జనావాసాల్లోకి ఎక్కువగా వస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఈ నెలలోనే నివాస ప్రాంతాల్లోకి వచ్చిన చిరుత ఓ మహిళపై దాడి చేసిందని తెలిపారు. -
బ్లూ వేల్ దెబ్బ.. అమ్మాయిలు పారిపోయారుగా...
సాక్షి, భోపాల్: మోస్ట్ డేంజరస్ గేమ్ బ్లూవేల్ మరోసారి భారత్లో తన ప్రభావాన్ని చూపించింది. అయితే ఈసారి అదృష్టవశాత్తూ ప్రాణాలు మాత్రం పోలేదు. పోలీసులు అప్రమత్తం కావటంతో ఇద్దరు యువతులు సురక్షితంగా బయటపడ్డారు. ఆగ్రాలో తొమ్మిదో తరగతి ఇద్దరు విద్యార్థినిలు (14 ఏళ్లు) గత కొంతకాలంగా బ్లూవేల్ ఛాలెంజ్కు బానిసలయ్యారు. ఇప్పటికే రెండు లెవెల్స్ పూర్తి చేసిన ఆ ఇద్దరు.. తరువాతి లెవల్లో ఇచ్చిన టాస్క్ను పూర్తి చేసేందుకు సిద్ధపడ్డారు. అదే ఇంటి నుంచి పారిపోవటం. మంగళవారం ఇద్దరు ఎంచక్కా తమ బ్యాగులు సర్దుకుని ఉదయం 8 గంటలకు పంజాబ్ మెయిల్ ఎక్స్ప్రెస్ ను ఎక్కేశారు. సెల్ ఫోన్ ట్రేస్ చేయటానికి వీల్లేకుండా స్విచ్ఛాఫ్ చేసేసుకున్నారు. సాయంత్రం స్కూల్ సమయం ముగియటంతో తల్లిదండ్రులు కంగారుపడిపోతారని భావించిన ఓ యువతి తన ఫోన్ ను ఆన్ చేసి సోదరుడికి అసలు విషయం చెప్పేసింది. వెంటనే అతను వారిద్దరిని తర్వాతి స్టేషన్లో దిగిపోవాలని సూచించాడు. దీంతో ఇద్దరు బాలికలు మధ్యప్రదేశ్ లోని హోషంగబాద్ రైల్వే స్టేషన్లో దిగి, అక్కడే ఎదురుచూడసాగారు. ఇంతలో వారిని గమనించిన రైల్వే భద్రతా సిబ్బంది చైల్డ్ హెల్ప్ లైన్కి సమాచారం అందించారు. వెంటనే శిశు సంరక్షణ కమిటీ సభ్యులు అక్కడికి చేరుకుని వారిని తమ వెంట తీసుకెళ్లి అసలు విషయాలను ఆరాతీశారు. పిల్లల తల్లిదండ్రులు వచ్చాక వారి సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేస్తామని సీడబ్యూసీ సీనియర్ సభ్యుడు ఒకరు తెలిపారు. గత నెలలో జైపూర్కు చెందిన ఇలాగే బ్లూవేల్ దెబ్బకు ఇంటి నుంచి పారిపోగా.. అతని సెల్ ఫోన్ ఆధారంగా ముంబై పోలీసులు అతన్ని రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించిన విషయం తెలిసిందే. -
ఉత్తర ప్రదేశ్లో మోగ్లీ పాప
-
రెస్యూటీమ్ ప్రత్యేక శిక్షణ
కాకినాడ యాంకరేజ్ పోర్టులో ప్రత్యేక స్విమ్మింగ్ సెంటర్ తొలిబ్యాచ్కు ముగిసిన శిక్షణ కాకినాడ రూరల్: జాతీయ విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలైన తుపాను, వరదల సమయంలో ఆపదలో ఉన్న ప్రజలను, మత్స్యకారులను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపీఎస్పీఎఫ్) సిబ్బంది సముద్రంలో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. మంగళగిరిలోని నేషనల్ డిజాస్టర్ రెస్పెన్స్ ఫోర్సులో (ఎన్డీఆర్ఎఫ్)లో శిక్షణ పొంది వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువకులతో ప్రత్యేక రెస్కూ ్య టీమ్ను తయారు చేశారు. వారిలో 17 మంది వారం రోజులపాటు కాకినాడ యాంకరేజ్ పోర్టు కస్టమ్స్ కార్యాలయంలో శిక్షణ పొందారు. వారు గురువారం తాము నేర్చుకున్న అంశాలను ప్రత్యేకంగా సముద్రంలో చేసి చూపించారు. ఏపీ ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పర్యవేక్షణలో ఎస్పీఎఫ్ కమాండెంట్ డీఎన్ఏ భాషా ఆధ్వర్యంలో ప్రత్యేక కోచ్ బి. మదన్మోహన్రావు వీరికి డిసెంబర్ 28 నుంచి జనవరి 5వ తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. రెస్కూ ్య పవర్బోట్స్ (రబ్బర్ ఇంజన్ బోటు)ను ఉపయోగించి వారు సహాయ చర్యలు చేపడతారు. ఒక్కొక్క బోటుపై ఐదుగురు ఉంటూ ఆపద సంభవిస్తే బాధితులను రక్షించేందుకు సిద్ధంగా ఉండేలా వారికి శిక్షణ ఇచ్చారు. బోటులో ఉండే వారికి ప్రత్యేక లైఫ్ జాకెట్లు, చేపలా ఈదేందుకు వీలుగా కాళ్లకు ప్రత్యేక బూట్లు, కళ్లద్దాలు, సముద్రంలో మునిగిపోతున్న వారిని రక్షించేందుకు వీలుగా ప్రత్యేక ఆక్సిజెన్ సిలెండర్ వంటివి బోటుల్లో ఉన్నాయి. శిక్షణ ముగింపు సందర్భంగా వారు ఆపదలో ఉన్న వ్యక్తులను ఎలా రక్షించేదీ చేసి చూపించారు. దీన్ని ప్రత్యేక స్విమ్మింగ్ సెంటర్గా రూపొందిస్తూ ఒక టీముకు శిక్షణ పూర్తయిన తరువాత మరో టీముకు ఈ అంశాల్లో శిక్షణ ఇస్తామని కమాండెంట్ బాషా తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్ కేవీ రవిచంద్ర, ఎస్సై ఈశ్వర్ పాల్గొన్నారు. -
22 మంది బాల కార్మికులకు విముక్తి
హైదరాబాద్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడలో మంగళవారం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో పలు బిస్కెట్ కంపెనీల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జయ ఫుడ్స్ కంపెనీలో పనిచేస్తున్న 22 మంది బాల బాలికలను వారు గుర్తించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలలను తమ వెంట తీసుకెళ్లారు. -
శాస్త్రవేత్తలను రక్షించేందుకు సాహసం...
అనారోగ్యంతో ఉన్న ఇద్దరు సైంటిస్టుల ప్రాణాలు కాపాడేందుకు దక్షిణ ధృవానికి అత్యంత క్లిష్టతరమైన పరిస్థితుల్లో ప్రయోగాత్మకంగా రెండు చిన్న విమానాలు బయల్దేరాయి. అంటార్కిటికాలో శీతాకాలం నడుస్తున్న సమయంలో ఇటువంటి ప్రయోగం నిజంగా సాహసమేనని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ పోలార్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ కెల్లీ ఫాల్కనర్ తెలిపారు. దక్షిణ ధృవానికి వెళ్ళిన ఇద్దరు శాస్త్రవేత్తలకు కొన్ని అనుకోని కారణాలవల్ల అనారోగ్యం సంభవించిందని, అయితే వారిప్రాణాలు రక్షించేందుకు కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కెల్లీ పాల్కనర్ వివరించారు. ప్రతియేటా 50 మంది శాస్త్రవేత్తల బృదం శీతాకాలానికి ముందే దక్షిణ ధృవానికి చేరుకుని అక్కడే దాదాపు ఆరునెలలు ఉంటారు. శీతాకాలం సమయంలో అక్కడినుంచీ వారు ఎట్టిపరిస్థితిలో బయటకు వచ్చే అవకాశం ఉండదని, రేడియో కాంట్రాక్టుద్వారా అమెరికా, రష్యాల్లోని కమాండింగ్ సెంటర్లకు సమాచారం పంపుతుంటారు. అయితే ఈ సీజన్ లో ఇద్దరు శాస్త్రవేత్తలకు అనుకోకుండా అనారోగ్యం సంభవించినట్లు సమాచారం అందిందని, ప్రయోగాత్మకంగా వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పాల్కనర్ తెలిపారు. అయితే వారికి అందించే మెడికల్ హెల్ప్ కు సంబంధించిన మిగిలిన వివరాలను మాత్రం గోప్యతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు. నేషనల్ సైన్స్ ఫౌండేషన్, లాక్ హీడ్ మార్టిన్ లు కలసి ప్రతి సంవత్సరం దక్షిణ ధృవానికి వెళ్ళే ఈ బృందాన్ని ఎంపిక చేస్తుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తాము అన్ని నిర్ణయాలు సమతుల్యంగా ఉండేట్లు ప్రయత్నిస్తున్నామని పాల్కనర్ చెప్తున్నారు. ఈ సమయంలో రోగుల పరిస్థితి, విమాన సిబ్బంది భద్రత తో పాటు అముంద్సేన్ స్కాట్ లోని మిగిలిన 48 మంది శాస్త్రవేత్తల అసవసరాలను కూడ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అయితే 60 సంవత్సరాల సౌత్ పోల్ రీసెర్స్ సెంటర్ చరిత్రలో ఈ తరహా రెస్క్యూ ఆపరేషన్లు రెండు మాత్రమే జరిగాయని, ఇటువంటివి ఆసాధారణంగా ఉంటాయని, శీతాకాలంలో అత్యంత మంచుతోను, చీకటిగాను ఉన్నసమయంలో అక్కడ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ వంటి వాటికి ఎంతమాత్రం అనుకూలంగా ఉండదని అంటున్నారు. 1999 లో, ఓ డాక్టర్ తన ఛాతీభాగంలో క్యాన్సర్ కణతిని గుర్తించి, తనకు తానే శస్త్రచికిత్స చేసుకొని, అనంతరం కీమో థెరపీ చేసుకోగా, ఆమెను బయటకు తెచ్చేందుకు శీతాకాలం ముగిసే సమయంలో బృందం వెళ్ళింది. పదేళ్ళ తర్వాత 2001 ఆగస్టులో ఓ మేనేజర్ గుండెపోటుకు గురికాగా, ఓ వైమానిక బృదం రిస్క్ తీసుకొని మరీ అక్కడకు వెళ్ళి ఆయన్ను క్షేమంగా బయటకు తెచ్చింది. కాగా ప్రస్తుతం దక్షిణ ధృవంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు అనారోగ్యం సంభవించడంతో నేషనల్ ఫౌండేషన్ అధికారులు వారిని క్షేమంగా బయటకు తెచ్చే సాహసోపేత ప్రయత్నం చేస్తున్నారు. -
మైనింగ్ గనిలో చరియలు విరిగిపడి..
యాంగన్: గనుల్లో పనికి వెళ్లి ల్యాండ్ స్లైడింగ్ వల్ల 11 మంది మృతి చెందిన ఘటన ఉత్తర మయన్మార్ లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. ఇప్పటివరకు 11 మృతదేహలను బయటకు తీసిన అధికారులు శిథిలాల కింద ఎక్కువ మంది ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటిలానే జేడ్ మైనింగ్ రీజియన్లో తవ్వకాలు ప్రారంభించేందుకు కూలీలందరూ చేరుకున్నారు. పని ప్రారంభించిన కొద్ది సేపటికి మైనింగ్ చేస్తున్న కొండ చరియలు విరిగిపడటంతో వారంతా ఆచూకీ లేకుండా పోయారు. వెంటనే స్పందించిన అధికారులు హూటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ ల సాయంతో చరియలను పక్కకు తీస్తున్న అధికారులు ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 50 మందికిపైగా మృతులు ఉండే అవకాశాలు ఉన్నాయని వివరించారు. -
బిడ్డ కోసం చిరుతతోనే పోరాడిన తల్లి
లక్నో: అమ్మ అంటే నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడమే కాదు.. కలకాలం వెన్నంటి కాపాడే అమృతమూర్తి. కాలయముడే ముందు నిలబడినా బిడ్డల కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి పోరాడే దేవత.. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ మాతృమూర్తి ఈ విషయాలను మరోసారి రుజువు చేసింది. అకస్మాత్తుగా దాడిచేసి తన బిడ్డను నోట కరుచుకొని పోతున్న చిరుతతో ధైర్యంగా పోరాడింది. అత్యంత సాహసంగా వ్యవహరించి క్రూర జంతువు సైతం తోక ముడిచేలా చేసింది. కాట్రాయన్ ఘాట్ గ్రామానికి చెందిన ఫూల్మతి (30) తన ఇద్దరు ఆడబిడ్డల్ని తీసుకుని పొలానికి బయలుదేరింది. అంతలో అక్కడకు దగ్గర్లో ఉన్న వన్యప్రాణుల అభయారణ్యం లోంచి వచ్చిన చిరుత వాళ్లపై దాడిచేసి, నాలుగేళ్ల గుడియాను ఈడ్చుకుంటూ పారిపోవడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా షాకైన ఫూల్మతి.. క్షణం ఆలస్యం చేయకుండా.. సాయం కోసం బిగ్గరగా అరవడం మొదలుపెట్టింది. పొద్దునే కావడంతో ఆ చుట్టుపక్కల ఎవరూ స్పందించలేదు. అయినా పెద్దగా కేకలు వేస్తూ.. చేతికి దొరికిన రాళ్లు, కర్రలతో చిరుతను కొట్టడం మొదలుపెట్టింది. దాదాపు అరగంటపాటు ఆ చిరుతపై ఒంటరి పోరాటం చేసింది. తర్వాత ఆమె కుటుంబసభ్యులు ఆమెకు తోడయ్యారు. చివరకు చిరుత బారినుంచి ఆ పాపను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా, మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. -
ఐకమత్యమే కాపాడింది!
ఐకమత్యమే మహా బలము అనే సామెత మనకు తెలిసిందే. సౌతాఫ్రికాలోని క్రుగేర్ నేషనల్ పార్క్ లో జరిగిన ఘటన ఇప్పుడా ఆ సామెతను నిజం చేస్తోంది. కలిసి పనిచేయగలగడం (టీమ్ వర్క్) సత్ఫలితాలనిస్తుందన్న విషయాన్ని మరోసారి రుజువు చేసింది. పార్క్ లో సుమారు రెండు, మూడు నెలల వయసున్న ఏనుగు పిల్ల బురద మట్టిలో ఇరుక్కుంది. చిన్న వయసు కావడంతో ఎంత ప్రయత్నించినా బుజ్జి గున్న పైకి రాలేకపోయింది. తన బిడ్డను రక్షించుకునేందుకు తల్లి ఏనుగు తొండంతో, రెండు కాళ్ళతో లాగుతూ, ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆ తల్లీ బిడ్డల కష్టాన్ని ఏనుగుల మందలోని మరో గజరాజు గమనించింది. సహాయం చేసేందుకు సంఘటనా స్థలానికి పరుగున వచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న పెద్ద ఏనుగుతోపాటు రెండు ఏనుగులూ కలసి తొండాలను చుట్టి ఎట్టకేలకు చిన్నారి ఏనుగును బురద నుంచి సురక్షితంగా బయటకు లాగాయి. క్రుగేర్ పార్క్ లో కనిపించిన ఈ దృశ్యం... ఇప్పుడు సంఘటిత శక్తి సత్ఫలితాలనిస్తుందన్న మాటను నిరూపిస్తోంది. తల్లి ప్రేమనూ ప్రత్యక్షంగా ప్రతిబింబించింది. -
ఓ పెళ్లి కూతురి సాహసం
మరికాసేపట్లో వరుడి చేయి అందుకోవాల్సిన ఓ అందమైన యువతి... మరో వ్యక్తి ప్రాణాలను రక్షించడానికి వేగంగా ముందుకు కదిలింది. చైనాకు చెందిన గూ యాన్ యాన్.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. దీంతో ఆమె ఇపుడు "అత్యంత అందమైన పెళ్లికూతురి' గా సోషల్ మీడియాలో ప్రశంసలందుకుంటోంది. ఇంత సమయస్ఫూర్తిగా వ్యవహరించిన యాన్ స్థానిక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. వివరాల్లోకి వెళితే యాన్ పెళ్లికూతురు దుస్తుల్లో అందంగా మెరిసిపోతోంది. అంతే అందంగా మురిసిపోతూ సముద్రతీరంలో ఫొటోలకు పోజులిస్తోంది. ఉన్నట్లుండి ఆమెకు.. సముద్రంలో మునిగిపోతున్న ఓ వ్యక్తి కనిపించాడు. స్విమ్మింగ్ చేస్తున్న అతనికి గుండెపోటు రావడంతో అచేతనంగా మారిపోవడాన్ని ఆమె గమనించింది. అంతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడకు చేరుకుని నిమిషాల మీద అతన్ని ఒడ్డుకు చేర్చింది. కానీ అప్పటికే గుండె స్పందన ఆగిపోయింది. వెంటనే ఆమె సీపీఆర్ థెరపీ (గుండెకు కృత్రిమంగా స్పందనలు అందించే ప్రక్రియ) ప్రారంభించింది. కానీ అంత ప్రయత్నించినా అతడి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయింది. దీనికి సంబంధించి స్థానిక మీడియా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో గూ యాన్ యాన్ పొగడ్తలతో ముంచెత్తేశారు. అందమైన పెళ్లికూతురంటూ వారి భాషలో కొనియాడారు. అంతేనా....స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఆమెను పెళ్లి చేసుకోబోతున్న వరుడు లీ చాంగ్ కూడా తన ఫియాన్సీ సాహసానికి మురిసిపోయాడట. ''నాకు చాలా గర్వంగా ఉంది... నా కంటే వేగంగా పరిగెత్తి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసింది'' అంటూ మురిసిపోయాడట అతగాడు. -
వాట్పాప్ సందేశమే ఆదుకుంటోంది..
షిమ్లా: జమ్ము కశ్మీర్ పర్వతాల్లో చిక్కుకున్న ఓ పర్వతాహకుడ్ని వాట్సాప్ సందేశం ఆదుకుంది. ఆపద నుంచి కాపాడబోతోంది. కార్గిల్ సమీపంలో జానస్కార్ లోని ఉమాసి పాస్ పరిసర ప్రాంతంలో చిక్కుకుపోయిన టెక్కర్ రిజుల్ గిల్ రక్షించేందుకు ప్రభుత్వం, సైన్యం పాటుపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే హిమాచల్ ప్రదేశ్ లోని చంబా ప్రాంతానికి చెందిన గిల్ అనే పర్వతారోహకుడు అనూహ్యంగా ఆపదలో ఇరుక్కున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు అరుణ్ శర్మకి సమాచారం అందించాడు. దీంతో అరుణ్ దీన్ని వాట్సాప్ ద్వారా పోలీసులకు తెలిపాడు. వాట్సాప్ గ్రూప్ ద్వారా టెక్కర్ రిజుల్ గిల్ ప్రమాదంలో చిక్కుకున్నట్టు సమాచారం అందిందని డిప్యూటీ కమిషనర్ రాజేష్ కన్వార్ తెలిపారు. తీవ్ర గాయాలపాలయ్యాడన్న సమాచారంతో వెంటనే అలర్ట్ అయ్యామని, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, సైన్యం సహాయంతో అతన్ని అక్కణ్నించి రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రెక్కర్ ను కాపాడేందుకు వీలుగా హెలికాప్టర్ కోసం కార్గిల్ అధికారులు భారతీయ సైన్యానికి విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత తొందర్లోనే అతణ్ని వెనక్కి తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే తన మిత్రుడు ప్రమాదంలో చిక్కుకొని ఇప్పటికే నాలుగురోజులైందని, ఇక రెండు రోజులకు సరపడా ఆహారం మాత్రమే అతడి దగ్గర ఉందని గిల్ స్నేహితుడు అరుణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొందరగా రక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
74మంది బాలకార్మికులకు విముక్తి
-
74మంది బాలకార్మికులకు విముక్తి
హైదరాబాద్ : వైజాగ్ నుంచి సికింద్రాబాద్ వచ్చిన జన్మభూమి ఎక్స్ప్రెస్ లో 74మంది బాల కార్మికులను గుర్తించిన పోలీసులు వారికి విముక్తి కలిగించారు. అక్రమంగా బాల కార్మికులను తరలిస్తున్నారంటూ అందిన సమాచారం మేరకు పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, అసోం తదితర ప్రాంతాలకు చెందిన బాలకార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని రెస్క్యూ హోంకు తరలించారు. వారిలో 24మంది బాల కార్మికులు కాగా, మరికొంతమంది వెట్టిచాకిరీ కార్మికులు. కాగా వీరిని తరలించిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సముద్రంలో చిక్కుకున్న నావ..
ముంబై: భారత నౌకాదళానికి చెందిన జిందాల్ కామాక్షి నౌక సముద్రంలో చిక్కుకుపోయింది. అయితే తక్షణమే రంగంలోకి దిగిన రక్షకదళాలు సహాయక చర్యలు చేపట్టి సిబ్బందిని కాపాడాయి ఇరవైమంది సిబ్బందితో ఉన్న నౌక ముంబై నౌకాశ్రయానికి నలభై నాటికల్ మైళ్లదూరంలో ప్రమాదంలో పడింది. బలమైన గాలుల కారణంగా పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో సిబ్బంది కలవరపడ్డారు. దాదాపు ఒక పక్కకు ఒరిగిపోతూ మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తక్షణమే తమని రక్షించాలని కోరుతూ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే నావీకి చెందిన కింగ్ సీ 42 సీ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. ఆదివారం రాత్రికి 19 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. వాతావరణం అనుకూలించకపోవడంతో తరలింపు చర్యలను నిలిపివేశారు. అయితే ఓడలోనే ఉండిపోయిన మాస్టర్ను సోమవారం ఉదయం తరలించడంతో మొత్తం సిబ్బంది ప్రమాదం నుంచి బైటపడ్డారు. కాగా ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రవాణా వ్యవస్థలు స్థంభించి, జనజీవనం అప్తవ్యస్తమైన సంగతి తెలిసిందే.