కేరళ బీజేపీ చీఫ్‌గా రాజీవ్‌ చంద్రశేఖర్‌!  | BJP picks Union minister Rajeev Chandrasekhar as state President | Sakshi
Sakshi News home page

కేరళ బీజేపీ చీఫ్‌గా రాజీవ్‌ చంద్రశేఖర్‌! 

Published Mon, Mar 24 2025 4:48 AM | Last Updated on Mon, Mar 24 2025 4:48 AM

BJP picks Union minister Rajeev Chandrasekhar as state President

తిరువనంతపురం: బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌(60) కేరళ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులు కానున్నారు. ఈ పోస్టు కోసం ఆయనొక్కరే దరఖాస్తు చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 

సోమవారం జరిగే పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వెలువడనుంది. పార్టీ కేంద్ర పరిశీలకుడిగా సమావేశానికి హాజరుకానున్న ప్రహ్లాద్‌ జోషి ఈ నియామకాన్ని ధ్రువీకరించనున్నారు. పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్ష పదవి కోసం ఆదివారం రాజధాని తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయంలో రాజీవ్‌ చంద్ర శేఖర్‌ రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement