ట్రాఫిక్ సిగ్నల్‌లో భార్య రీల్స్‌ .. ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకున్న భర్త | Chandigarh Police Constable Suspended After Wife Dance Reels Went Viral On Social Media, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ సిగ్నల్‌లో భార్య రీల్స్‌ .. ప్రభుత్వ ఉద్యోగం పోగొట్టుకున్న భర్త

Apr 1 2025 1:46 PM | Updated on Apr 1 2025 3:03 PM

Chandigarh Police Constable Suspended After Wife Dance Reels Viral On Social Media

ఛండీఘడ్‌ : ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఓ భార్య చేసిన అత్యుత్సాహం భర్త కొంప ముంచింది. ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండయ్యారు. దీంతో భర్త లబోదిబో మంటూ మళ్లీ తనని విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారుల్ని ప్రాధేయపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?    

లేటెస్ట్‌ ఇంటర్నెట్‌ సెన్సేషన్‌ హర్యానా సాంగ్‌ మ్యూజిక్‌ లవర్స్‌ని తెగ ఆకట్టుకుంటోంది. అందుకే సమయం ఎప్పుడైనా, సందర్భం ఏదైనా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఆ సాంగ్‌ పాడటం లేదంటే, డ్యాన్స్‌లతో అదరగొట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

ఈ తరుణంలో మార్చి 20న సాయంత్రం 4:30 గంటల సమయంలో జ్యోతి అనే మహిళ తన వదిన పూజతో కలిసి స్థానికంగా ఉండే దేవాలయానికి వెళ్లింది. దైవ దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఛండీఘడ్‌ సెక్టార్-20 గురుద్వారా చౌక్ సిగ్నల్‌లో జ్యోతి అ‍త్యుత్సాహం ప్రదర్శించింది. తన వదిన పూజ సాయంతో హర్యాన్వీ ఫోక్‌సాంగ్‌కు డ్యాన్స్‌ వేసింది. తన వదిన వీడియో తీస్తే ఆమె డ్యాన్స్‌ చేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో తెగచక్కెర్లు కొట్టాయి.

 

ఈ వీడియో వైరల్ కావడంతో, హెడ్ కానిస్టేబుల్ జస్బీర్ చండీగఢ్‌లోని సెక్టార్ 34 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై చండీగఢ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏఎస్‌ఐ బల్జిత్ సింగ్ నేతృత్వంలోని బృందం సెక్టార్ 20లోని గురుద్వారా చౌక్, సెక్టార్ 17లోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్‌లను సమీక్షించింది. సీసీటీవీ ఫుటేజీల్లో ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి నేరాల కింద డ్యాన్స్‌ చేసిన జ్యోతిపై, వీడియో తీసిన పూజపై బీఎన్‌ఎస్‌ సెక్షన్ 125, 292 3(5) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

సెక్టార్ 19 పోలీస్ స్టేషన్‌లో సీనియర్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జ్యోతి భర్త అజయ్ కుందును పదవి నుండి సస్పెండ్ చేశారు. ఎందుకంటే భార్య డ్యాన్స్‌ వీడియోను అజయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్‌ చేయడంపై అతనిపై చర్యలు తీసుకున్నారు. కేసులు నమోదు కావడంతో జ్యోతి,పూజలు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ఇద్దరికి బెయిల్‌ మంజూరు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement